Tuesday, June 29, 2010

Withered Rectification Campaign of CPM: Vanam Jwala Narasimha Rao

Withered Rectification Campaign of CPM

Vanam Jwala Narasimha Rao
National Information Services

The Polit Bureau and the Central Committee of the Communist Party of India (Marxist), is all set to discuss the implementation of “rectification process” for the PB and the CC. Similar exercise involving the state committees, district committees and the lower committees is also to be done. The time frame for the implementation of the up-dated 1996 rectification document is end of June 2010 according to the CPI (M) official publication, “The Marxist, January–March 2010” issue. The rectification is meant to unify and strengthen the Party on correct principles. How far the objective could be achieved and how far the campaign peculated down below the cadre in its true spirit is yet to be known. Document on the rectification campaign was prepared by the Central Committee in October 2009 consequent to the poor performance of the party in the 15th general elections. As against 42 parliament seats won in 2004, the CPM could manage to win just 16 in 2009. Meanwhile the West Bengal Unit too had a setback in the municipal elections.

After India's Independence, a series of events like Sino-Soviet split and Sino-Indian war led to the split in the Communist Party of India, in 1964. The breakaway Communist Party of India (Marxist) emerged stronger both in terms of membership and performance in the Indian Elections. Thus the Communist Party of India, encouraged by Lenin and founded on 17 October 1920 by MN Roy in Tashkent faced the first ever split. Even after the party split, Communist Party of India (Marxist) and Communist Party cadres remained unified in the All India Trade Union Congress. After the short-lived coexistence the trade union wing also split. The parting of ways either in the party or in the trade union was however on ideological issues, though personalities were involved.

The issue whether to support Congress or not bedeviled the undivided Communist Party right from the year of independence, 1947. Around the time of independence the CPI was sending confusing signals-from left to centrist to right. General Secretary Joshi was advocating unity with the Indian National Congress under the leadership of Jawaharlal Nehru. By the end of 1947, P.C. Joshi found himself in the minority. His line was challenged by radicals like B.T. Ranadive. In 1948, Joshi who advocated collaboration with Congress was sidelined, and Ranadive became the General Secretary. To herald in the Indian revolution, Telangana Armed Struggle was one the main pillar of Ranadive strategy.

The Communist Party of India (Marxist) has a glorious record in conducting class and mass struggles. The CPI (M) is the biggest contingent of the Left. It is heading Left-led governments in three states. Not-withstanding the fact that the 35 year CPIM rule in West Bengal has been threatened by Mamata Banerjee in the recently concluded Municipal Elections, it still continues to be a force to reckon-with. But certainly party cannot take it for granted!

According to “The Marxist”, to achieve its revolutionary goals, it is necessary for the Marxist Communist Party to overcome its political and ideological weaknesses and organizational shortcomings. In a class divided society the ruling classes control the State and their ideology dominates society. The CC feels that in such a society, as it existed now, the Communist Party becomes a continuous target for the penetration of alien ideologies. Rectification has to be a continuous process and not a one-off effort in order to protect the revolutionary character of the Party.

At the start of 1950s, the CPI was bitterly divided over the manner in which political power in India should be captured. The militants advocated the 'Chinese path', or capture of power through violent means and the other group was for the 'Indian path' or capture power within the constraints of Indian Constitution. Ch. Rajeswara Rao, who advocated Chinese Path, did not sail with CPIM after the split. Makineni Basavapunnaiah who advocated Chinese Path along with Rajeswara Rao, became a politburo member of the Communist Party of India (Marxist) after the split in 1964. There were no personal interests involved in their choosing either CPI or CPM. However, Sundarayya in his letter to the party Polit Bureau and Central Committee Members in August 1975 offering his resignation as party General Secretary criticized Basavapunnayya for limiting his role to giving advice and opinion but actually not fighting for his line.

Puchalapalli Sundarayya was a founding member of the Communist Party of India (Marxist) and a leader of the peasant revolt in the Telengana Rebellion. Fired by Communist ideals and egalitarian values, he changed his name from Sundararami Reddy by dropping his caste suffix, reddy. He was so dedicated to the up-liftment of the poor and downtrodden that he and his spouse chose not to have children, for the purpose of social service. In 1936, Sundarayya became a member of the Central Committee of the undivided Communist Party of India. He went underground between 1948 and 1952. He was re-elected to the Central Committee in 1952. He was also elected to the Polit Bureau, the highest forum in the Party. When the Party leadership was in favor of supporting the Government at the time of the Sino-Indian War, Sundarayya resigned his positions protesting against the policies of the dominant leadership of the Party. He was arrested and imprisoned during November 1962 at the time of India-China border war. After the split Sundarayya was elected as its General Secretary. Sundarayya continuously remained Party’s General Secretary till 1976. In that year, which fell during the Emergency, he resigned from the General Secretary Ship and Polit bureau membership, for what he called the 'revisionist habits' acquired by the Party.

Sundarayya in his resignation pointed out among others, about CPM joint actions with Jana Sangh; Polit Bureau’s failure to concretize party’s tactical line; Trade Union wing’s functioning bypassing the party; non-seriousness on agrarian resolution in practice; ignoring building of secret part of party’s organization; PB not functioning as a collective body (Members like Basavapunnayya not actually carrying out responsibilities) and his differences with Ranadive; CPM Polit Bureau without homogeneous political and organizational outlook and so on. He even felt like demanding of holding party congress to decide the political line and elect a new CC, PB and General Secretary. Such was the commitment of leadership of his caliber. Had the Party taken serious note of his anguish, there would have been no necessity of “Rectification Campaigns”. At the time of his death, he was holding party’s state Secretary Post in Andhra Pradesh and was member, Central Committee of the Party. He could have very well compromised like the present day leadership to hold on to General Secretary post irrespective of he had a say or no. But he did not do it.

Whether it was Sundarayya or Basavapunnayya or Chandra Rajeswara Rao or Moturi Hanumatha Rao or less known leaders like Chirravuri Laxminarayana or Manchikanti Ramakishan Rao or to that matter any of the yester years Communist Leaders, all of them either sailed or separated from one path or other on pure ideological grounds that they believed right. None of them were blamed for personal interests. None of them needed any “Rectification Campaign”. Incidentally barring the Marxist–Leninist faction in whatever form and name they function, all of them in one form or other, though followed the parliamentary line, none of them were attracted to “pure parliamentary outlook and electoral opportunism”. They sacrificed all that they inherited. Today’s party leadership and cadre instead of sacrificing prefer to amass wealth through parliamentary outlook and electoral opportunism!

The 19th CPM Party Congress held during March 29 to April 3, 2008 at Coimbatore called for a rectification campaign against wrong trends in the Party. It had directed the Central Committee to update the rectification campaign document of 1996 for this purpose. Though certain problems pointed out in the 1996 document were taken up for correction and implementation in the past 12-14 years, desired results could not be achieved. Another weakness in the earlier campaign was that the rectification process was not adopted from the top, from the PB and the CC.

Factors cited in the 1996 document are still relevant today. Some of the factors have got further consolidated and their impact has deepened. For instance, two decades have passed since liberalization and the adoption of neo-liberal policies. There is no doubt that alien values and ideas are affecting CPM Party leaders and cadres much more than before according to CC of CPIM. Along with the concentration of wealth, the creation of business-politician nexus at all levels is intertwining between corporate and business interests and the political system. CC observed that the role of money power has increased to an unprecedented level in politics, particularly in elections and CPIM cadre is no exception to it.

The association with bourgeois parties at various levels, particularly through electoral understandings has been continuing during the past 12-14 years since the 1996 rectification document. With the rise of the business-political nexus, there is a corresponding rise in use of money and other bourgeois practices. These have corrosive effect on CPM cadres.

At present forty per cent of the Party membership is constituted by those who have joined the Party after 2001. The majority of these new entrants are still to acquire the basic outlook of the Party and they are yet to be grounded in the class and mass struggles. Such a situation leads to all sorts of feudal, bourgeois and petty bourgeois trends emerging within the Party.

An analysis of the class composition of the Party shows that 75 per cent of the membership comes from the working class, poor peasants and agricultural workers. But, the party top leadership noted that, in the leading committees of the Party only around 30 per cent belong to these classes. 70 per cent come from the middle classes and other sections. This provided the basis for alien class influences. The replies of the state committees to the questionnaire from the Polit Bureau revealed that there has been a growth in the wrong trends within the Party. Further new problems like violation of communist norms have also arisen.

Party while accepting the fact that India is a country where the parliamentary democratic system has struck deep roots and has become a basic feature of the political system, felt that, the Party can advance only by integrating the parliamentary and extra parliamentary work. However, leadership is of the opinion that as against this correct perspective of parliamentary work, the trend of parliamentary outlook and electoral opportunism which is harmful to the basic approach of the Party is on the increase. Organizing mass movements, launching struggles and building the Party is being neglected due to the parliamentary outlook.

The experience of the past decade shows that the problem has got magnified. There has been distinct increase in parliamentary opportunism among CPM cadre. Increased numbers of individual comrades resorted to revolting when refused party ticket. Andhra Pradesh saw such instances in a glaring form during the recent assembly and parliament elections which led to two state committee members having to be expelled. Earlier three MPs had to be expelled for deserting the Party. Two of them quit as they were not being re-nominated.

The penetration of alien bourgeois influences finds one manifestation in the form of parliamentary opportunism. The growth of parliamentary outlook is also connected to the desire for acquiring more material positions and a better life style. Since the salaries and perks of MPs and MLAs are much more than what cadres can get as Party functionaries, there is a hankering and desire to be in such positions observed Central Committee. In many states, the Party does not take the bulk of the salaries and allowances of MLAs. There is the problem of the elected representative not integrating his or her work with the Party and mass organizations.

The use of money, liquor and other corrupt practices has grown in the party. The money used in elections has reached an unprecedented level in states like Andhra Pradesh. Alliances with bourgeois parties for elections lead to their methods and practices being copied by some of CPM candidates and Party committees. There is also the tendency to demand that only local candidates be fielded in assembly and parliament elections. Some of them get sucked into the institutionalized corruption and malpractices. The 1996 document had noted the existence of unhealthy trends, factionalism, careerism, individualism and absence of collective functioning-all harmful to the progress of democratic centralism. Instances of comrades putting their individual interests above Party interests are there.

The party feels threatened when some leaders and cadres fail to live up to the communist standards and values as there is danger of the image of the Party getting blurred and it being seen as no different from bourgeois parties. The penetration of alien bourgeois and petty bourgeois values is manifested in a lavish lifestyle, building houses which are far above the minimum needs required, spending large amounts on weddings of children, organizing festivities on a lavish scale. There are examples of comrades who have acquired assets and incur expenses disproportionate to their known sources of income. Even when complaints are made against them, there is hesitation on the part of the Party committees to entertain them and enquire into the matter.

Earlier, members of leading committees used to seek permission from the Party for constructing houses, acquiring a car or other assets. This is not followed in most places now. There are cases of Party leaders running NGOs with no check or accountability about the funds being used. Real estate promoters, contractors and liquor contractors seek to establish connections with CPM cadre and those in elected positions. The tendency to collect big amounts of money from individuals and affluent sections, instead of mass collection, has increased especially to meet election expenses. Accounts for these are not properly maintained and submitted to the respective committees. Often the Party committees are unable to initiate action due to various reasons such as factional trends, liberalism and reluctance to antagonize an important Party cadre.

As part of rectification guidelines issued by the Central Committee, the trends of parliamentary and electoral opportunism would be exposed; principle of two or three terms for elected representatives to be adhered; regulations about proper utilization of party funds, maintenance of accounts to be regularized; and all members of the Central Committee, state committee, district committees (and zonal/area and local committees in the bigger states) should file their income and assets statement annually to the concerned party committee.

Going by the track record of CPIM functioning in Andhra Pradesh in general and particularly with reference to the developments in Red-Fort districts like Khammam, causing irreparable damage to the party, the rectification campaign is all that is needed minimum in the state. Reluctance to antagonize an important Party Cadre may one-day damage the entire cadre and hence rectification campaign is the need of the hour. (End)

Sunday, June 27, 2010

X-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-10) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-10
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు

వనం జ్వాలా నరసింహారావు

రామలింగ రాజు, తాను తలపెట్టిన, మహత్తరమైన "బృహత్తర ప్రాణ రక్షణ యజ్ఞం" నిర్వహించగల సమర్థుడైన "ఋత్విజుడు" కొరకు అన్వేషిస్తున్న సమయంలో, జర్మనీకి చెందిన ఒక బహుళ జాతీయ సంస్థలో, చెన్నై ప్రధాన కార్యాలయంగా, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న వెంకట్ చంగవల్లి తారస పడ్డారు. అలా తారసపడ్డ వెంకట్ పుట్టు-పూర్వోత్తరాల గురించి, నైపుణ్యం-అర్హతల గురించి, తనతో పాటు యజ్ఞాన్ని నిర్వహించగల సత్తా వున్న తోటి "ఋత్విక్కులను" నియామకం చేసుకోగల సామర్థ్యం గురించి ఇంతకు ముందే కొంత తెలుసుకున్నాం. ఋత్విజుడుగా యజ్ఞ భారాన్ని మోయడమే కాకుండా, కష్ట కాలంలో తోటి ఋత్విక్కులలో స్థయిర్యాన్ని పెంపొందించేందుకు వెంకట్ చేసిన కృషి ముందు ముందు తెలుసుకుందాం. వెంకట్ 108-అత్యవసర సహాయ సేవల సంస్థ సిఇఓ గా పనిచేసిన-చేస్తున్న కాలాన్ని నాలుగై దు ప్రధాన దశలుగా విభజించి చూడాలి. ఆయా దశల్లో, ఆయన నిర్వహించిన పాత్ర, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఎదుగలకు ఎంత మేరకు తోడ్పడింది-ఒడిదుడుకులకు ఏ మోతాదులో కారణమైంది, విశ్లేషణ చేయడానికి, ఆ దశలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మొదటి దశ: సంస్థ సిఇఓ గా వెంకట్ ఏప్రిల్ 15, 2005 న బాధ్యతలు చేపట్టడానికి పూర్వం; రెండవ దశ: బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆగస్టు 15, 2005 న అత్యవసర సహాయ సేవలను లాంఛనంగా హైదరాబాద్ నగరంలో ఆరంభించడం వరకు; మూడవ దశ: ఆగస్టు 15, 2005 నుంచి జులై-ఆగస్టు 2006 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇ.ఎం.ఆర్.ఐ తో గ్రామీణ ప్రాంతాలలో సేవలందించడానికి ఒప్పందం కుదుర్చుకునేందుకు చొరవ చూపించడం వరకు-ఆ తర్వాత; నాలుగవ దశ: రామలింగ రాజు జనవరి 8, 2009 న చైర్మన్ గా తప్పుకోవడం-తదనంతర పరిస్థితులు, దరిమిలా మే నెల 26, 2009 న (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతో జీవికే సంస్థ యాజమాన్య బాధ్యతలు స్వీకరించే వరకు; ఐదవ దశ: వర్తమాన-భవిష్యత్ కాల పరిస్థితులలో ఆయన పాత్ర. ఆయా దశల్లో వెంకట్ నిర్వహించిన పాత్ర, ఆయన పట్ల అలనాటి రాజు గారికి-ఈ నాటి డాక్టర్ జీ. వి. కె. రెడ్డి గారికి వున్న అపారమైన విశ్వాసం పూర్వాపరాలు పలు రకాలుగా ఆసక్తికరమైన వనే అనాలి.

మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సదస్సుకు సంబంధించిన అంశాలను చర్చించడానికి, జనవరి 21, 2005 ఉదయాన, చెన్నైలో రాజు బసచేస్తున్న హోటల్ లో ఆయనతో "బ్రేక్ ఫాస్ట్" సమావేశమయ్యారు వెంకట్ తొలుత. ఆ నాడు జరుగనున్న సదస్సులో రాజు గారికి ఇష్టమైన "బియాండ్ క్రియేటింగ్ వేల్యూ" అన్న అంశంపైన చర్చ జరుగనుంది. అత్యవసర సహాయ సేవల పేరుతో "అపారమైన విలువను" తాను సృష్టించగలడు గాని, ఆ విలువకు తగ్గ మూల్యానికి అతీతంగా-అవధులకు మించి, ఆ సేవల ఫలితాలను కావల్సినవారికి అందచేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన అనుకుంటున్న సమయంలోనే, దానికి సంబంధించిన అంశంపై సదస్సులో చర్చించబోవడం రాజు గారికి అనుకోని అవకాశంగా కలిసి వచ్చింది. నిర్వహణ బాధ్యతలను అప్ప చెప్పేందుకు నాయకత్వ పటిమగల వ్యక్తిగా వెంకట్ ఆయనకి కనిపించారు. ఆయన అనుభవం, విధి నిర్వహణ దక్షత, సంబంధ-బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోగల నేర్పరితనం, నిబద్ధత, నైపుణ్యం, విశ్వసనీయత లాంటి అంశాలను కాసేపట్లోనే నిశితంగా గమనించారు రాజు. సదస్సు నిర్వహిస్తున్న సమయంలో మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ చైర్మన్ మహాపాత్ర, వెంకట్ గురించి-ఆయన "వినయ-విధేయతల" గురించి రాజు తో గొప్పగా చెప్పారు. హైదరాబాద్ తిరిగొస్తూనే రాజు తన సంస్థలో పనిచేస్తున్న ఉమ్మడి స్నేహితుడి ద్వారా వెంకట్ ను కదిపారు. వెంకట్ తక్షణ స్పందన రాజు ప్రతిపాదనకు అనుకూలంగా రాలేదు. తన సహోద్యోగులను, తండ్రిని సంప్రదించిన తర్వాత వెంకట్ లో మార్పు రాసాగింది. అమెరికా 911 స్థాయిలో అత్యవసర సహాయ సేవల నిర్వహణ గురించి, లాభాపేక్ష లేని సంస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి వెంకట్ లాంటి వారి అవసరాన్ని గురించి, ఆయన నిర్వహణా దక్షత గురించి పదే పదే ప్రస్తావించసాగారు రాజు. "మీరు తెలుగు వారు. విజయవంతంగా ఇతర ప్రాంతాలలో తెలుగే తర సంస్థలలో పని చేస్తున్నవారు. ప్రాణ రక్షణకు ప్రారంభిస్తున్న అత్యవసర సహాయ సేవల నిర్వహణను చేపట్టండి" అని అనేవారు. సూత్రప్రాయంగా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సారధ్యం వహించడానికి అంగీకరించి, ఫిబ్రవరి 3, 2005 న రాజు ఆహ్వానం మేరకు భార్యా సమేతంగా హైదరాబాద్ వచ్చి కలిశారు వెంకట్. "వివరించనలవి కాని ఆకర్షణ శక్తి" వుంది రాజుగారిలో అంటారు వెంకట్. అతిథి మర్యాదల విషయంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఒకరోజు ముందర హైదరాబాద్ చేరుకున్న వెంకట్ దంపతులకు విమానాశ్రయంలో స్వాగతం ఏర్పాటు చేసిన పద్ధతి, వాహనం పంపిన విధానం, సరాసరి సత్యం సంస్థకు తీసుకెళ్ళడం, అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు.... లాంటివి.... వెంకట్ ను ఆకట్టుకున్నాయి.

రాజు-వెంకట్ మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. మర్నాడు వెంకట్ దంపతులను తమ ఇంటికి సాదరంగా ఆహ్వానించిన రాజు దంపతులు (రామలింగ రాజు, నందిని) హైదరాబాద్ లో వారెక్కడ వుండ దల్చుకుంది అడిగి తెలుసుకున్నారు. వారు కోరినట్లే జూబ్లీ హిల్స్ లో ఆకర్షణీయమైన భవనంలో అద్దె కుండే ఏర్పాటు స్వయంగా చేశారు రాజు. ఇక అప్పటినుంచి, ఉద్యోగంలో చేరేవరకు వారం-వారం (ఆ తర్వాత ప్రతిరోజు-ప్రతి గంట-ప్రతి నిమిషం) ప్రాజెక్ట్ గురించి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో దానిని నిర్వహించడం గురించి ఫోన్లో మాట్లాడే వారు రాజు. ఆయన సంస్థకు సిఇఓ గా వస్తున్న సంగతి చేరేంతవరకు గోప్యంగా వుంచాలని కూడా అనేవారు. ఫిబ్రవరి 10, 2005 న వెంకట్ పెళ్లి రోజు సందర్భంగా, తిరుపతికి కారులో పోతున్న ఆయనకు శుభా కాంక్షలు తెలిపిన రాజు, పనిలో పనిగా, జీత-భత్యాల విషయంలో ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కేవలం ఒక్క రూపాయి జీతానికే పని చేస్తానని, మిగతా విషయాలు రాజుగారికే వదిలేస్తున్నానని జవాబిచ్చారు వెంకట్. అయితే జర్మనీకి చెందిన బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్న వెంకట్ జీతం-బోనస్ కలిపి అప్పటికే సుమారు కోటి రూపాయల వర కుంది. 2003 నుంచి ఆయన పనిచేస్తున్న సంస్థలోనే 2007 వరకు కొన సాగినట్లయితే, షేర్ల రూపంలో వెంకట్ గారికి కనీసం మూడు కోట్ల రూపాయలకు పైగా లభించేది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాజు గారు, ఒక లాభాపేక్ష సంస్థలో పనిచేసేందుకు ఎంత మేరకు వీలవుతుందో, అంత మేరకు వెంకట్ జీత-భత్యంగా ఏర్పాటు చేశారు.

ఆ కమిట్ మెంట్ ను రాజు స్థానంలో వచ్చిన డాక్టర్ జీ. వీ. కే. రెడ్డి కూడా అమలు పరిచారు. కాకపోతే, 34 కోట్ల రూపాయలను సమకూర్చి, మరో 42 కోట్ల రూపాయల బాంక్ రుణం తీసుకుని సంస్థను నడిపిన రాజు, సంస్థ చైర్మన్ గా రాజీనామా చేసినప్పుడు ఎలా అయితే సుమారు 120 కోట్ల లోటును మిగిల్చారో, అలానే వెంకట్ గారికి ఇస్తానన్న "కాంపన్సేషన్" విషయంలోను కొంత బకాయి పడి వుండవచ్చు. రాజు ఎంత ఇస్తానన్నారు-ఎంత ఇచ్చారు, భవిష్యత్ లో ప్రస్తుత యాజమాన్యం ఎంత ఇస్తుంది, అన్న విషయాలు ప్రాధాన్యత సంచరించుకున్నవే అయినప్పటికీ, అవేవీ, వెంకట్ కమిట్ మెంటుకు, ప్రతిబంధకాలు కాలేదు. 2005 లో ఇ. ఎం.ఆర్.ఐ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 2009 సంక్షోభం వరకు, ఆ తర్వాత సంక్షోభం కొనసాగుతున్నప్పుడు, తీవ్ర ఇబ్బందులను అధిగమించి ఐదారు నెలల తర్వాత యాజమాన్యం మార్పిడి జరిగిన తర్వాత సంస్థ నిర్వహణ పట్ల-నిధులను సమకూరుస్తున్న ప్రభుత్వాల పట్ల వెంకట్ వైఖరిలో మార్పు లేదు. కాకపోతే, అలనాటి రాజు మార్గదర్శకత్వానికి, ఈ నాటి రెడ్డి గారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా కొన్ని సందర్భాలలో ఆయన నిర్వహించిన-నిర్వహిస్తున్న "ఉద్యోగపరమైన బాధ్యత" లో అపశృతులు దొర్లి వుండవచ్చు. ఆ అపశృతులు ఒడిదుడుకులకు దారి తీసి వుండవచ్చు. అలానే ప్రభుత్వంలో వున్న వారితో సంబంధ బాంధవ్యాల విషయంలోనూ జరిగుండాలి. బహు జాగరూకతతో ఆయన నియమించిన "లీడర్సులో కొందరు" సంబంధ బాంధవ్యాల విషయంలో చేసిన పొర పాట్లు సరిద్దిద్దడంలో జాగు జరిగుండాలి. ఆ జాగు ఒడిదుడుకులకు దారి తీసి వుండాలి.

అత్యవసర సహాయ సేవలను సంబంధిత ప్రభుత్వ-ప్రయివేట్ పరమైన ఇతర ఆరోగ్య-వైద్య సేవలతో సంఘటిత పరిచే విషయంలో గాని, దశల వారీగా దేశ వ్యాప్తంగా విస్తరింప చేసే విషయంలో గాని, నాణ్యత విషయంలో గాని, సహచరుల విధి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలో గాని, వేగవంతంగా సహాయ సేవల కల్పన విషయంలో గాని వెంకట్ దృక్ఫదం అప్పుడు-ఇప్పుడూ ఒకే మాదిరిగా వుందనాలి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోట్లాది రూపాయలు నిర్వహణ-మూలధనం వ్యయం కింద పొందుతున్నప్పటికీ, ఒక్క నాడు కూడా, అలా పొందడానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. అధికార-అనధికారులెవరు కూడా వెంకట్ ని కాని-ఆయన సహచరులను కాని ఈ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు. ఇ.ఎం.ఆర్.ఐ లో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలను గిరించి కదిపినప్పుడు, ఆవిర్భావ కాలం నాటి విలువలను అప్పటి యాజమాన్యం ఎలా గౌరవించేదో, ఇప్పటి యాజమాన్యం కూడా అలానే గౌరవిస్తున్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సిఇఓ వెంకట్. విధి నిర్వహణలో వెంకట్, గతంలో మాదిరి "స్వతంత్రంగా వ్యవహరించ లేకపోతున్నాడన్న" కొందరి అభిప్రాయం సరైంది కాదని, జీ. వి. కే ప్రయివేట్ భాగస్వామిగా ప్రవేశించిన కొత్తలో సంస్థకు సంబంధించిన కొందరు వ్యక్తుల అనవసర జోక్యం తనను ఇబ్బందికి గురిచేసినప్పటికీ, క్రమేపీ అది తగ్గిందని అంటారు వెంకట్.

జర్మనీకి చెందిన బహుళజాతి సంస్థలో నిర్వహిస్తున్న పదవికి రాజీనామాచేసిన వెంకట్ కు 31, 2005 న సింగపూరులో వీడ్కోలు ఏర్పాటు చేశారు సహచరులు. ఏప్రిల్ 2, 2005 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటున్నందున, ఆ రోజు కల్లా హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా వెంకట్ ను రామలింగ రాజు కోరారు. వీడ్కోలయితే ఇచ్చారు గాని, ఏప్రిల్ 15, 2005 వరకు బాధ్యతలు నిర్వహించాల్సిందిగా సంస్థ యాజమాన్యం కోరడంతో, హైదరాబాద్ రావడంలో ఇబ్బంది వున్నా వెంటనే బయల్దేరి మొదటి తేదీ కల్లా వచ్చారు. దాదాపు ఇక ఆ రోజునుంచే అనధికారికంగా ఇ.ఎం.ఆర్.ఐ బరువు-బాధ్యతలు వెంకట్ కు అప్పగించారు రాజు. సత్యం టెక్నాలజీ కేంద్రంలో అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ లో సీనియర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అనిల్ జంపాల, వై.ఎన్.ఎస్. కిశోర్, వారణాసి సుధాకర్ ప్రభృతులను వెంకట్ కు పరిచయం చేశారు రాజు. ఆయన సంస్థ కొత్త కార్య నిర్వహణాధికారి అని కూడా చెప్పారు. మర్నాడు, ఏప్రిల్ 2, 2005 న, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సమక్షంలో, మొదటి ఎంఓయు పై ప్రభుత్వం పక్షాన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమీషనర్ ఆసుతోష్ మిశ్రా-ఇ.ఎం.ఆర్.ఐ పక్షాన వారణాసి సుధాకర్ సంతకాలు చేశారు. రామలింగ రాజు తన సమీప బంధువులను, కొందరు స్నేహితులను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాబోయే సిఇఓ గా వెంకట్ ను ముఖ్యమంత్రికి రాజు పరిచయం చేయగానే, "మన రాష్ట్రానికి ఇలాంటి తరహా సేవలందించడానికి మీ లాంటి వాళ్లు ఎందరో రావాలి" అని ఆప్యాయంగా అన్నారని వెంకట్ ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. తన జీవితంలో కలిసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారని కూడా అంటాడాయన. ఆ తర్వాత ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రారంభించేంతవరకు ముఖ్యమంత్రిని కలవలేదని, అప్పటి నుంచి ఎన్నో పర్యాయాలు కలవడం జరిగిందని, ప్రతి కలయికలోను "అత్యవసర సహాయ సేవల కార్యక్రమం సామాన్యుడికి ఎంతగా తోడ్పడుతుందనే" విషయం గురించే ప్రస్తావించే వాడని, మాటల్లోను-చేతల్లోను త్రి కరణ శుద్ధిగా కార్యక్రమం అమలుకు ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకున్నారని కూడా అంటారు వెంకట్. ఎంఓయు పై సంతకం చేసిన నాడే, ఆగస్ట్ 15, 2005 న సేవలు ఆరంబించుతామని ముఖ్యమంత్రికి వాగ్దానం చేశారు రాజు. ఆ దిశగా కార్యాచరణ పథకాన్ని రూపొందించమని కోరారు వెంకట్ ను.

వెంకట్ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ఏప్రిల్ 15, 2005 చేరడానికి పది రోజుల ముందర, ఒక సారి హైదరాబాద్ వచ్చి, ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను ప్రారంభించడానికి, అవసరమైన కనీస సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టారు. ఉద్యోగంలో చేరిన మరుక్షణం నుంచే, చైర్మన్ రాజు-సిఇఓ వెంకట్ ల మధ్య ముఖాముఖి సమావేశాలు గాని, సంస్థకు సంబంధమున్న ఇతరులతో కూడిన సమావేశాలు గాని క్రమం తప్పకుండా జరిగేవి. వాస్తవానికి ఆ తరహా సమావేశాలు, సత్యం కుంభకోణం వెలుగులోకి రావడానికి పక్షం రోజుల క్రితం వరకు కొనసాగాయనే అనాలి. అయితే, ఏ సమావేశంలోను, నిధుల ప్రస్తావన "స్పష్టంగా" వచ్చేది కాదు. అంబులెన్సులు ఎన్ని వుండబోతున్నాయన్న విషయంలోను అసందిగ్ధత వుండేది. ఎంత సేపు "ఉత్తర ధృవం" (నార్త్ స్టార్) గురించి, ఆరు "పి" లు-ఐదు "ఆర్" ల గురించి, అంతర్జాతీయ ప్రమాణాల గురించి-విధానాల గురించి, భారత దేశంలోని ఇతర ప్రాంతాలలో సంబంధిత సేవల అమలు-ఆచరణల గురించి మాట్లాడుతుండేవారు రాజు. "ధృవ తార"-నార్త్ స్టార్ (North Star), సిక్స్ పి-ఫైవ్ ఆర్ (Six "P" s and Five "R" s) ల గురించి వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాం. వాస్తవానికి రాజుగారు ప్రారంభించి ప్రపంచంలోనే అగ్రగామి కంప్యూటర్ సంస్థల సరసన నిలిపిన "సత్యం కంప్యూటర్స్" నిర్వహణా విధానం "సత్యం పంథా" (Satyam Way) అనే పేరుతో పేర్కొనేవారు. ఈ అంశాలలో "నిష్ణాతుడు", అత్యవసర సహాయ సేవల ఆలోచన చేసినప్పుడు రాజు గారికి తన వంతు సూచనలు-సలహాలు ఇచ్చిన డాక్టర్ బాలాజి దగ్గర, వాటిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోమని వెంకట్ కు చెప్పారు రాజు. సత్యం కంప్యూటర్స్ సంస్థ మాదిరిగానే, ఇ.ఎం.ఆర్.ఐ లో కూడా ఆ పంథానే అనుసరించి, సహాయ సేవల నిర్వహణ-అమలు విషయంలో ముందుకు సాగేవారు యాజమాన్య-ఇతర సిబ్బంది.

అప్పట్లో, చైర్మన్ సమీక్షా సమావేశాల్లో, వెంకట్ తో పాటు తప్పనిసరిగా, డాక్టర్ అనిల్ జంపాల, వై ఎన్ ఎస్ కిశోర్, వారణాసి సుధాకర్, డాక్టర్ ఎ పి రంగారావు, శ్రీనివాసరావు ప్రభృతులు హాజరయ్యేవారు. ఆఫీస్ కార్యకలాపాలన్నీ జూబ్లీ హిల్స్ కార్యాలయం నుంచే జరిగేవి. జులై 29, 2005 న ప్రస్తుతం వుంటున్న మేడ్చల్ రోడ్ లోని కార్యాలయంలోకి మారారు. సమావేశాలు సాధారణంగా ఉదయం తొమ్మిది గంటలకు మొదలై, మూడు గంటల పాటు జరిగేవి. డాక్టర్ అనిల్ జంపాల నిస్వార్థంగా సంస్థ పురోగతికి కృషి చేసే తరహా వ్యక్తని, అపారమైన నిబద్ధతతో పని చేసేవాడని, అనుభవజ్ఞుడని, ఎటువంటి పరిస్థితుల్లోను ఎవరినీ కించపరిచే స్వభావం లేనివాడని అనిల్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వెంకట్ అంటుంటారు. ఏ పనైనా, ఏదో విధంగా సాధించగల నేర్పరితనం కిశోర్ కుందని కూడా అనేవారు వెంకట్. వారణాసి సుధాకర్ పట్ల వ్యక్తిగతంగా గౌరవం వ్యక్త పరిచేవారు వెంకట్. సుధాకర్ ఏర్పాటు చేసిన "టెక్నాలజీ టీం"-దాని లీడర్ రంగనాథం గురించి, ఆ బృందంలోని శ్రీకాంత్ - మరో ముప్పైమంది గురించి, వారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను నెలకొల్పిన తీరు గురించి, అత్యంత గర్వంగా-గౌరవంగా ప్రస్తావించేవారు వెంకట్. అనుకున్న ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను ప్రారంభించడానికి టెక్నాలజీ టీమ్ తో పాటు అహర్నిశలు కృషి చేసిన మరికొందరిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే వుంటారు వెంకట్. మెడికల్ ప్రోటోకాల్స్, ఎమర్జెన్సీల గుర్తింపు విధానం, గ్రామీణ ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విధానం లాంటి విషయాలను డాక్టర్ రంగారావు చూసేవారు. ప్రాజెక్ట్ ప్రణాళిక, సిబ్బంది నియామకం, అంబులెన్స్ డిజైన్, 108 నంబర్ కేటాయింపు లాంటి విషయాలను కిశోర్ చూసుకునేవారు. ఎంఓయు కు సంబంధించిన అంశాలు, ప్రభుత్వ సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు-విధానాలు అనిల్ పర్యవేక్షణలో జరిగేవి. ఇ.ఎం.ఆర్.ఐ-వివిధ అంతర్జాతీయ సంస్థల మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలన్నీ అనిల్ చొరవతోనే జరిగాయి. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులతో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కృషి చేసేవారు. ఉన్న కొద్ది మంది సిబ్బందిలో స్థైర్యాన్ని-అత్యవసర సేవలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే దిశగా వెంకట్ వారికి అధ్యయన తరగతులు నిర్వహించేవారు. ఉదాహరణకు ఒకసారి ఆయన అంబులెన్సుకు సంబంధించిన అధ్యయన తరగతి నిర్వహించారు. 108- అంబులెన్సులో "స్ట్రెచ్చర్" విషయంలో రాజీ మార్గానికి తావులేదన్న విషయం, ఇతర అంబులెన్సులకు-108 అంబులెన్సులకు తేడా వుండే పరికరాల ఆవశ్యకత అంశం, "కుయ్-కుయ్" ధ్వని అమర్చడం లాంటి వాటిపై అవగాహన కలిగించారు వెంకట్. సత్యం సంస్థలో పనిచేసే డిజైన్ బృందం 108-అంబులెన్స్ ను డిజైన్ చేశారు.

ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన కేంద్రాలలో ప్రారంభించేందుకు ఏప్రిల్-ఆగస్ట్ నెలల మధ్య, డాక్టర్ రంగారావు తోడ్పాటుతో-ఆయన తోడుండగా, పలువురు ప్రముఖులను కలిశారు వెంకట్. అనిల్ జంపాల కూడా వీరితో పాటే వుండేవారు. చిత్తూరు కలెక్టర్ రావత్ ను, కృష్ణా కలెక్టర్ నవీన్ మిట్టల్ ను, వైజాగ్ కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ ను, వరంగల్ కలెక్టర్ బెన్హర్ దత్ ఎక్కాను కలిశారు. విజయవాడ పోలీస్ కమీషనర్ ఉమేష్ ను, వైజాగ్ కమీషనర్ కౌముదిని ని, చిత్తూరు- వరంగల్ ఎస్పీలను కూడా కలిశారు. వెళ్ళిన ప్రతి చోట, డాక్టర్ రంగారావు స్థానిక ప్రభుత్వ-ప్రయివేట్ డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసేవారు. రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాను, డిజిపి స్వరణ్‌జిత్ సేన్ ను, సీనియర్ పోలీస్ అధికారులైన ఏ కే ఖాన్ ను-మహేందర్ రెడ్డి ని-దినేష్ రెడ్డిని, డిజాస్ట్రర్ మేనేజ్‌మెంట్ శాఖ కార్యదర్శి-కమీషనర్ అశుతోశ్ మిశ్రాను, ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఐ వి సుబ్బారావు ను, కుటుంబ నియంత్రణ కమీషనర్ సీ బి ఎస్ వెంకటరమణ ను కలిశారు. భవిష్యత్ లో వీరు కలిసిన ప్రతి అధికారి, సంస్థ ఎదుగలకు ఎంతగానో తోడ్పడ్డారు. వెంకట్ గారి ఇ.ఎం.ఆర్.ఐ సిబ్బంది అప్పట్లో వేళ్లమీద లెక్కించ తగినంత మంది మాత్రమే వుండేవారు. వారిలో డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, జ్యోతి, స్వరూప్, శాస్త్రి, గురు రాజ్ లు ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు. ఢిల్లీ స్థాయిలో కలిసిన వారుకూడా వున్నారు. (దివంగత) ముఖ్యమంత్రి లేఖ సహాయంతో 108 టోల్ ఫ్రీ నంబర్ కొరకు రాష్ట్ర కాడర్ ఐఏఎస్ అధికారి శ్రీధర శర్మను, ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దయానిధి మారన్ ను కూడా కలిశారు.

ఇదిలా వుండగా, అనుకున్న నాడు అంబులెన్సు సేవలను ఆరంభించాలంటే, అవి తయారు కావాలి. అంబులెన్స్ డిజైన్ లో, వైద్య పరమైన జాగ్రత్తలన్నీ డాక్టర్ రంగారావు-ఆయన సహచర వైద్యుల బృందం తీసుకుంది. తొలుత ప్రవేశపెట్ట దల్చిన 30 ఎ ఎల్ ఎస్ (అడ్వాన్స్ లైఫ్ సపోర్టింగ్) తరహా అంబులెన్సులై వుండాలని డాక్టర్ రంగారావు సూచన మేరకు, వెంకట్ చేసిన ప్రతిపాదనకు చైర్మన్ రాజు అంగీకరించారు. మరో తరహా అంబులెన్సులను బి ఎల్ ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్టింగ్) అంబులెన్సులంటారు. వీటికి సంబంధించిన వివరాలు మరో సందర్భంలో తెలుసుకుందాం. రెండింటికి తేడా వుంది. ఎ ఎల్ ఎస్ తరహాలో ఏ ఇ డి, వెంటిలేటర్ పరికరాలు అదనంగా అమర్చుతారు. వీటి ఉపయోగం ప్రతి ఎమర్జెన్సీలోను వుండక పోయినప్పటికీ, వాటి అత్యవసర ప్రాధాన్యత దృష్ట్యా అవి అమర్చడం అభిలషణీయమని నిపుణుల అభిప్రాయం. కాకపోతే ఈ రెండు పరికరాల విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు కావడంతో, ఎ ఎల్ ఎస్ అంబులెన్సు ధర రు. 21.5 లక్షలు కాగా, బి ఎల్ ఎస్ అంబులెన్స్ ధర రు. 15.5 లక్షలే అయిందప్పుడు. మామూలు బజాజ్ టెంపో ట్రావెలర్ వాహనం ఆరున్నర లక్షల బేసిక్ ధరకు కొనుగోలు చేసి, తొమ్మిది లక్షల రూపాయలు ఫాబ్రికేషన్-వైద్య పరికరాల కొరకు వ్యయం చేసి, రు. 15.5 లక్షలకు అంబులెన్సును రూపొందించారు మొదట్లో. నాణ్యత పరంగా ఏ మాత్రం రాజీ పడకుండా, దరిమిలా, అదే బి ఎల్ ఎస్ అంబులెన్స్ ధరను రు. 9.75 లక్షలకు స్థిర పరిచింది ఇ.ఎం.ఆర్.ఐ. ఒకప్పుడు అంబులెన్స్ అంటే, ఇంగ్లీషు అక్షరాలను తిప్పి వాహనం ముందర రాస్తే సరిపోయేది. ఎప్పుడైతే 108-అంబులెన్స్ డిజైన్ మార్కెట్లోకి వచ్చిందో, ఇక అప్పటినుంచి, ఇంచుమించుగా అందరూ, ఆ మోడల్ నే అనుకరిస్తున్నారు. అంబులెన్స్ సేవలను ఆరంభించడానికి పక్షం రోజుల ముందర, జులై 29, 2005 న మేడ్చల్ రోడ్ లో వున్న ఒకనాటి సత్యం పబ్లిక్ స్కూల్ ఆవరణలోకి ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం మారింది. మరో నెల రోజులకు, ఆగస్ట్ 29, 2005 న నూతన కార్యాలయ భవనాలకు భూమి పూజ జరగడం, ఏడు నెలల రికార్డ్ సమయంలో సమస్త హంగులతో తయారైన భవనంలోకి మార్చ్ 31, 2006 న మారడం జరిగింది.

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్, గౌరవ అతిథిగా (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కూడా వచ్చారు. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్ లో భారీ సంఖ్యలో హాజరయిన ఆహుతుల సమక్షంలో, ఆగస్ట్ 15, 2005 న, ఆద్య తన భవిష్యత్ లో, లక్షలాది ప్రాణాలను కాపాడనున్న అత్యవసర ఆరోగ్య, వైద్య-పోలీసు-అగ్నిమాపక దళ సహాయ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేవలం పదిహేను అంబులెన్సులతో ఆరంభమయిన ఆ సేవలు, అచిర కాలంలోనే, "ఇంతై-ఇంతితై-వటుడింతై" అన్న చందాన దేశంలోని పది రాష్ట్రాలలో సుమారు మూడు వేలకు పైగా అంబులెన్సులను ప్రవేశ పెట్టడానికి దారితీసింది.

Saturday, June 19, 2010

IX-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-9) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-9
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2009 న మీడియా అభివర్ణించిన "సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణం" వ్యవహారంలో, చైర్మన్ రామ లింగరాజు తాను "దోషి" నని, "తప్పుచేసానని" బహిర్గతం చేయడానికి అర గంట ముందు, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ కు ఫోన్ చేసి, మరి కాసేపట్లో తానొక "సంచలనాత్మక" ప్రకటన చేయబోతున్నానని, ఆ ప్రకటన ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని చెప్పారు. అయినప్పటికీ, తనకు అత్యంత గౌరవ ప్రదమైన-ప్రీతిపాత్రమైన-హృదయానికి చేరువైన 108-అత్యవసర సహాయ సేవలను "ఎన్ని కష్ట నష్టాలెదురైనా" నిరాటంకంగా కొనసాగించాలని కోరారు (అభ్యర్థించారు?). సుమారు రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి, బాలాజి-వారణాసి-రంగారావు లాంటి వారి తోడ్పాటుతో లాభాపేక్ష లేని ఇ.ఎం.ఆర్.ఐ సంస్థగా నెలకొల్పి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టి, (దివంగత) ముఖ్యమంత్రి సమక్షంలో దానికి అనుగుణమైన అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయించి, అపారమైన అనుభవజ్ఞుడు వెంకట్ ను సీ.ఇ.ఓ గా నియమించి, లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆగస్టు 15, 2005 న ప్రారంభించడానికి రామ లింగరాజు చేసిన కృషిని ఏనాడో-ఒకనాడు ఆయన మాటల్లోనే తెలుసుకోవాలి గాని, ఇతరులకు వర్ణించడం సాధ్య పడదు.

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న వారు చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ఇలాంటి వాటికి సమాధానం రాజు గారే ఏనాడో ఒకనాడు ఇవ్వాలి తప్ప ఇతరులకు జవాబు వెతకడం సాధ్య పడేది కాదు. కాకపోతే, ఊహాజనిత సమాధానాలు అన్వేషించి 108-అత్యవసర సహాయ సేవల "ఒడిదుడుకులకు" వాస్తవ కారణాలను అంచనా వేయొచ్చు. ఆ ప్రయత్నమే ఇది.

ఈ నేపధ్యంలో రాజు గారి ఆందోళనను అర్థం చేసుకోవాలి. సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు గారు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజు గారిపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన "భవిష్యత్ దర్శనం-విజన్" కు అనుగుణంగా సేవలు వ్యాపించడంతో ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. దాన్ని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

కొత్తగా సహాయ సేవలను కోరుకునే ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. తాత్కాలిక అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసింది. నాకు గుర్తున్నంతవరకు అప్పట్లో, అంత భారీ మొత్తంలో ఒకే దఫాగా బయట నుంచి నిధులు రావడం, అదే మొదటిసారి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతవరకు, అంత మొత్తానికి, ఒకే చెక్కును ఇవ్వడం జరగలేదు. ఇతర రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పై అంత విశ్వాసంతో-నమ్మకంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన నాడే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. గుజరాత్ రాష్ట్రాన్ని పొందడానికి మేం ఆ ప్రభుత్వం వెంట పడితే, ఇతర రాష్ట్రాలు మా ద్వారా అత్యవసర సహాయ సేవలు పొందడానికి మా వెంట పడసాగాయి ఆ తర్వాత. తిరిగి కొంతకాలానికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది అనేక కారణాలవల్ల. ఎంఓయు నిబంధనల ప్రకారం ఆ నిధులను, ఆ రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు ప్రధానంగా ఉపయోగించాలి. క్రమేపీ నెలకొంటున్న సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. ఒక రాష్ట్రంతో-కొద్ది మొత్తంతో ఆరంభమయిన ఆ సాంప్రదాయం "ఇంతై-ఇంతింతై- వటుడింతై" అన్న చందాన రాజుగారు నిష్క్రమించేనాటికి రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. ఇప్పుడా రుణ భారం మోసేదెవరన్నది "మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా" మిగిలిపోయింది. జవాబు దొరికేలోపుల రాజు గారి స్థానంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జీ.వీ.కె. రెడ్డి తన జీ. వి. కె సంస్థ నుంచి (మీడియాలో సీ.ఇ.ఓ వెంకట్ చెప్పిన లెక్కల ప్రకారం) రు. 50 కోట్లకు పైగా సమకూర్చినట్లు తెలుస్తోంది.

ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి కారకులైన వారు, కనీసం ఒక్క విషయంలో నన్నా తక్షణ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని-అంతగా అత్యవసరం లేని-ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. అలా చేసిన ఖర్చు "ఆస్తుల సంపాదన" కిందకు వస్తుంది. ఇ.ఎం.ఆర్.ఐ ఎదుర్కుంటున్న "ఆర్థిక పరమైన ఒడిదుడుకులను" విశ్లేషించడానికి కేవలం దానికున్న రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని-సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని-అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని)ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది. "ఆలస్యం అమృతం విషం" అన్నారు పెద్దలు.

ఇంతకూ ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న నిధులను ఇ.ఎం.ఆర్.ఐ ఆయా రాష్ట్రాల అవసరాలకు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ అవసరాలకు వాడి వుండే ఆస్కారం వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టమేమీ కాదు. బాంక్ దగ్గర్నుంచి తెచ్చిన రుణం-ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం ఖర్చయ్యాక, ప్రతి రాష్ట్ర సహాయ సేవల నిర్వహణ వ్యయంలో భరించాల్సిన 5% వాటా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు కావాల్సిన అదనపు మూలధనం ఖర్చు, పాలనా పరమైన వ్యయం, శిక్షణా సంబంధమైన వ్యయం (మౌలిక సదుపాయాలతో కలిపి), సీనియర్ ఉద్యోగుల జీత భత్యాలు, సాంకేతిక సంబంధమైన మూల ధన వ్యయం లాంటివన్నీ ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడాల్సిన అవసరం కలిగింది. తెలిసో-తెలియకో, సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతికి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. ఇలాంటి అనుమానాలను మీడియా అప్పట్లో వ్యక్తం చేసింది కూడా. అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ఎవరిదో వారు వివరించాల్సిందే.

కష్టాలన్నీ ఒక్క సారే వస్తాయన్నది ఇ.ఎం.ఆర్.ఐ విషయంలోనూ జరిగింది. రాజు గారి నిష్క్రమణం కన్నా ముందే "అంబులెన్స్ యాక్సెస్ ఫౌండేషన్", "ట్రాన్స్ పరెన్సీ ఇన్ కాంట్రాక్ట్స్" అనే రెండు సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇ.ఎం.ఆర్.ఐ తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల పూర్వ రంగంలో అవకతవకలు జరిగాయని-ఇ.ఎం.ఆర్.ఐ ని నోడల్ ఏజన్సీగా గుర్తించే విషయంలో పోటీ పద్ధతిని పాటించలేదని ఆరోపిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాయి. అవి తమ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను, కౌంటర్ అఫిడవిట్లలో వివిధ రాష్ట్రాలు వాటికిచ్చిన సమాధానాలను, సుప్రీం కోర్ట్ నోటీసుకు సంబంధించిన అంశాలను మరో సందర్భంలో వివరంగా తెలుసుకుందాం. ఇ.ఎం.ఆర్.ఐ ని ఉపయోగించుకుని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నారన్న ఆరోపణతో ఒక "చోరీ కేసును" కూడా రామ లింగరాజు పై పెట్టడం జరిగింది అదే రోజుల్లో. ఈ ఆరోపణలను ఖండిస్తూ కూడా సమాధానం ఇచ్చింది సంస్థ. అదే రోజుల్లో న్యూ ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న "నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి)", ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పక్షాన, ఏప్రిల్ 2009 లో నిర్వహించిన అధ్యయనంలో, అధిక శాతం ఇ.ఎం.ఆర్.ఐ సేవలను కొనియాడుతూనే సంస్థా పరమైన లోటుపాటులను కూడా ఎత్తి చూపింది. ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి చెప్పిన మంచిని మరిచిపోయిన మీడియా ఎత్తి చూపిన లోటుపాటులను మాత్రం భూతద్దంలో ప్రదర్శించి మరీ కథనాలు ప్రచురించింది. అధ్యయన కమిటీ చెప్పిన విషయాలను వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాం.

వీటి వల్ల లాభం-నష్టం ఎంతవరకు జరిగిందో-జరగబోతుందో ఏమో కాని, మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ వార్తలొచ్చాయి. ఫలితంగా సీ.ఇ.ఓ వెంకట్ జనవరి 18, 2009 న పాత్రికేయులను ఆహ్వానించి సమగ్రమైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన వివరణతో సమస్య చాలావరకు తాత్కాలికంగా సమసి పోయినా అనుమానాలు పూర్తిగా వీడలేదు. కష్టాలన్నీ ఒక్క సారే వచ్చినా వెంకట్ గారు ధైర్యాన్ని-స్థైర్యాన్ని కోల్పోలేదు. జనవరి 8, 2009 నుంచి, మే 26, 2009 వరకు ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకున్న పటిష్టమైన కార్యాచరణ పథకం ప్రకారమే ఆయన ముందుకు సాగారు. తనతో పనిచేస్తున్న సీనియర్ ఇ.ఎం.ఆర్.ఐ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితులుండడంతో, భవిష్యత్ పై వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు నిరంతరం పాటుపడేవారాయన. అందులో భాగంగా మార్చ్ నెల 25, 2009 న, ప్రొఫెసర్ రంజన్ దాస్ తో చక్కటి శిక్షణా సంబంధమైన ఉపన్యాసాన్ని సీనియర్లకు ఇప్పించారు వెంకట్. ఆయనా పాల్గొన్నారందులో. భవిష్యత్ లో ఇ.ఎం.ఆర్.ఐ లో పనిచేస్తున్న ప్రతి "లీడర్" ఎలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి, ఎలా సంస్థకు నిధుల సమీకరణలో తోడ్పడాలి, ఒక లక్ష్యంతో-ధ్యేయంతో ముందుకెలా సాగాలి అన్న సందేశం ఆ శిక్షణా కార్యక్రమానికి హాజరైన మా అందరిలో బలీయంగా నాటుకు పోయింది. "వ్యూహం అంటే ఏమిటి-వ్యూహ రచన ఎలా వుండాలి-పోటీని ఎలా ఎదుర్కోవాలి" లాంటి అంశాలపై రంజన్ దాస్ విశ్లేషణను మరో సందర్బంలో తెలుసుకుందాం.

వెంకట్ ఎదుర్కొన్న కష్టాల్లో అతి కీలకమైంది, "ప్రయివేట్ భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన వ్యక్తుల-సంస్థల అన్వేషణ". అదంత తేలికయిన విషయం కాదు. ఒక వైపు మాజీ చైర్మన్ పై పలు ఆరోపణలు, ఇంకో వైపు సుప్రీం కోర్టులో కేసు, మరో వైపు మీడియా వ్యతిరేక ప్రచారం, మధ్యలో అకౌంట్ స్థంబింప చేసిన యాక్సెస్ బాంక్, ఒక్కోసారి కింది స్థాయి ఉద్యోగులకు కూడా విశ్వ ప్రయత్నం చేసినా సరైన సమయంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పుల వాళ్ల బాధలు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత... వెరసి అన్నీ కష్టాలే. ప్రయివేట్ భాగస్వామిని పొందే ప్రయత్నంలో భాగంగా కనీసం పదికి పైగా సంస్థలను తడిమి చూశారు వెంకట్. అందులో చాలామంది, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో సరైన పారదర్శకత లేదని, కార్పొరేట్ గవర్నెన్సుకు ప్రాధాన్యత లేదని... ఇలా అసందిగ్ధమైన ఆరోపణలు చేసి తప్పుకున్నారు. మరికొందరిని "ఇంటి వాసాలు లెక్క పెట్టే తరహా మనుషులు" పనిగట్టుకుని మరీ తప్పు దోవ పట్టించారు. వెంకట్ గారు తలుపు తట్టిన సంస్థల్లో బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్, వారెన్ బఫర్ ఫౌండేషన్ లాంటివి కూడా వున్నాయి. బహుశా ఆయన "ఎక్కని-దిగని గడప లేదే మో !". పిరమల్, జీ.వి.కె సంస్థలు మాత్రమే చివరి దాకా ఆసక్తి కనబరిచాయి. ఇ.ఎం.ఆర్.ఐ ని దక్కించుకోలేక పోవడం పిరమల్ సంస్థ దురదృష్టమా, లేక, దక్కించుకోవడం జీ.వి.కె అదృష్టమా భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.

ఇక్కడొక విషయం చెప్పాలి. జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడి వుండవచ్చు గాని తన వారసులెవరైతే బాగుంటుందన్న విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. నాకు అర్థమయినంతవరకు-అర్థం చేసుకున్నంతవరకు, రాజు గారి కుటుంబ సభ్యులకు పిరమల్-జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వున్నట్లు లేదు మొదట్లో. కాకపోతే, ఎంత కాదనుకున్నా వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు వెంకట్ గారు. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డి గారిపై మనసు మళ్లి వుండవచ్చు. ఆ విషయం సూచన ప్రాయంగా వెంకట్ కు చేరి వుండాలి. జనవరి 21, 2009 న తాజ్ కృష్ణా హోటల్ లో వెంకట్ గారితో నేను కూడా వెళ్ళి డాక్టర్. జీ.వి.కె. రెడ్డి గారిని కలిశాం. పరిస్థితి వివరించి సంస్థను గట్టెక్కించమని కోరాం. నేను డాక్టర్. మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పౌర సంబంధాల అధికారిగా పనిచేశానని, ఆ సమయంలో చాలా సందర్భాల్లో డాక్టర్. జీ.వి.కె. రెడ్డి గారిని కలిశానని ఆయనకు గుర్తుచేశాను. ఆయన జ్ఞాపక శక్తికి నిజంగా జోహార్లు. అప్పటి సంగతులు ఆయన చాలా గుర్తుకు చేసుకోవడమే కాకుండా, చెన్నారెడ్డి గారిని బాగా పొగిడారు. జీ.వీ.కె మా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. జనవరి 24, 2009 న ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు కూడా.

ఇంతలో, మళ్ళీ ఏమైందో గాని, రాజుగారి కుటుంబం దృష్టి మరో మారు పిరమల్ వైపు మళ్లింది. స్వయంగా వారి కుటుంబ ప్రతినిధి పిరమల్ ను కలుసుకొని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రప్పించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారుగాని, ఆయన హైదరాబాద్ లో లేనందున కుదర లేదు. ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య గారిని ఉదయమే వెళ్లి కలిశాం. పిరమల్, ఆయన కుమారుడు, వెంకట్, నేను కలిసి వెళ్లాం. సుమారు అర్థ గంట పైగా సమావేశం జరిగింది. సంస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు రోశయ్య గారు. వారి ఆసక్తిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు. అంతా సవ్యంగా వుందనుకుంటుండగానే, సరిగ్గా మే 23, 2009 న వెంకట్ కు ఫోన్ చేసి, "పారదర్శకత-కార్పొరేట్ గవర్నెన్సుకు సంబంధించిన అస్పష్ట అంశాలను" పేర్కొని, ఆ నెపం మీద తమ నిరాసక్తతను వ్యక్త పరిచారు పిరమల్ అధినేత. ఇక ఆ తర్వాత మే 26, 2009 న ముఖ్యమంత్రి చొరవతో జీ.వీ.కె. రెడ్డి గారు ఇ.ఎం.ఆర్.ఐ బరువు బాధ్యతలు స్వీకరించారు.

పిరమల్ అధినేత, ఆయన కుమారుడు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య గారిని కలిసినప్పుడు, (బహుశా) ఫోన్లో డాక్టర్ జీ.వీ.కె. రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో (ఆయన జరిపిన చివరి సమీక్షా సమావేశంలో) మాట్లాడినప్పుడు లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి. ఈ కీలకమైన అంశం గురించి వివరంగా ముందు-ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Sunday, June 13, 2010

గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల (మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?:వనం జ్వాలా నరసింహా రావు

గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల
(మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?
వనం జ్వాలా నరసింహా రావు

ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు తాను నియమించి-శాఖలను కేటాయించిన నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, పరిణితి చెందిన 86 గ్రామాల సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వం చేసే ప్రతి పని గవర్నర్ పేరు మీదే జరగడం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఆ ప్రకరణను కొంచెం విస్తరించి, బహుశా రాష్ట్ర గవర్నర్, ఇక నుంచి కేవలం నామ మాత్రంగా తన పేరుమీద కాకుండా, తానే-తన పర్యవేక్షణలోనే, ప్రజా సంక్షేమం గురించి స్వయంగా పర్యటనలు చేయబోతున్నారన్న అర్థం ఆయన మాటల్లో గోచరిస్తున్న ది. గవర్నర్ పేరుపై సాగే దే రాష్ట్రంలోని పాలనని, నెలకు మూడు రోజులు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తానని, సర్పంచులు పంచాయితీలను దత్తత తీసుకోవాలనీ, నిర్మల్ పురస్కార గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దాలనీ అనడమే కాకుండా, ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒక ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ కూడా చేశారు నరసింహన్. ఆయన ఉద్దేశం సమాంతర ప్రభుత్వం నడపడమో, లేక, "తన ప్రభుత్వం" నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు "అనుబంధంగా-అభినందనగా" (సప్లిమెంటరి-కాంప్లిమెంటరి) మరో మార్గంలో ప్రజల క్షేమం పట్టించుకోవడమో అయ్యుండాలి. రెండు పద్ధతులూ, రాజ్యాంగ పరిమితులకు-సాంప్రదాయాలకు లోబడి వున్నంతవరకు, అభిలషణీయమే.

కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍ గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. ఆ కాలంలో నాలుగు సంవత్సరాల పాటు చేతనకు నేను అడ్మినిస్ట్ర్రేటివ్ అధికారిగా-ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసాను. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

గత సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు ముఖ్యమంత్రి రోశయ్యా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి రోశయ్యను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? రోశయ్యకు సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం. రాజ్యాంగం రీత్యా ముఖ్యమంత్రిని-ఆయన మంత్రివర్గ సహచరులను నియమించిన గవర్నర్ కు, పాలనా సంబంధమైన కొన్ని లోపాలు కలవర పడే విధంగా వుండి ఉండాలి ! అలాంటప్పుడు, పరిపాలనా వ్యవహారాలలో ఎదురవుతున్న అనేకానేక ఇబ్బందుల జోలికి పోకుండా, కేవలం, ముఖ్యమంత్రి అధికారాలేంటి ? గవర్నర్ అధికారాలకు పరిమితులేంటి? గవర్నర్ పాత్ర ఏంటి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ విమర్శించ తగునా? అన్న విషయాలనే పదే-పదే ప్రస్తావించి, కొందరు రాజకీయ నాయకులు వారి పరిమిత దృష్టిని ప్రదర్శిస్తున్నారు ఇటీవల. కొంతకాలం క్రితం గవర్నర్ కేంద్రానికి రహస్యంగా నివేదిక పంపించారని (ధృవీకరించుకోకుండానే) ఆయన మీద నిప్పులు చెరిగారు. అలా పంపించడం ఆనవాయితీగా జరిగేదేనని, అందులో వింతేమీ లేదని తెలిసిన మేధావులు కూడా గవర్నర్ నరసింహన్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ నాయకులై తే మరీ రెచ్చిపోయారు. ప్రతి పక్షాల వారే మో, ఆయన రహస్య నివేదికను బహిర్గతం చేయాల్సిందేనని డిమాండు చేశారు. చివరకు కొన్నాళ్లకు సమస్య సమసిపోయింది.

పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! కాకపోతే, 1995 లో అలాంటిదే జరిగినప్పుడు, ఆ పనిచేసిన నాటి గవర్నర్ కృష్ణకాంత్ కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు సహకరించారు. గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.

కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు నెల కొన్న ప్రత్యేక పరిస్థితులు, తనను ప్రజల వద్దకు తరచుగా పోయేందుకు ప్రేరేపిస్తున్నాయని గవర్నర్ భావిస్తుండవచ్చు. ఆలానే, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని కూడా గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో రాష్ట్రంలో పర్యటిస్తే తప్పేంటి?

గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. (గవర్నర్) ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు సంబంధించిన వివరాలు, గవర్నర్ కు తెలిసి వుండాల్సిన అవసరం వుంది. దాని మూలాన, ఆయనకు రాష్ట్రంతో పరిచయం పెంచుకోవడం తేలికవుతుంది. రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు తన చేతనైన సహాయం చేసే వీలుకూడా కలుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో, రాజకీయ అస్థిరత్వం ఏర్పడి (ఇప్పుడు ఏర్పడనున్నదని ఉద్దేశం కాదు !), రాష్ట్రపతి పాలన విధించి, గవర్నర్ పాలనా యంత్రాంగాన్ని నడపాల్సి వస్తే ఆ పరిచయం తోడ్పడుతుంది. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. అమలవుతుందో, లేదో, వేచి చూడాలి. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.

రాజ్యాంగం సంక్రమింప చేసిన అధికారాలను-బాధ్యతలను, అనేక సందర్భాల్లో, కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అనిపిస్తోంది. "ఆర్థిక అత్యయిక పరిస్థితిని" కొన్ని రాష్ట్రాలలో అమలు చేయాల్సిన సందర్భంలో కూడా మౌనం వహించింది ప్రభుత్వం. అలా చేయడం వల్ల, కొన్ని రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్ ?) యధేఛ్చగా, ఆర్థిక దోషాలకు పాలపడుతున్నాయి. వాస్తవానికి కొన్ని రాష్ట్రాలలో ఆర్థిక ప్రగతికి అవరోధం కూడా ఏర్పడుతుందనాలి. గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నెల రోజుల క్రితం "రహస్య నివేదిక" పంపడం వాస్తవమైతే, ఆ చర్యను విమర్శించకుండా, ఆయనను రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడానికి వీలు కలిగేలా చేయాలి. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు. కాకపోతే, "నేను మంచి గవర్నర్ ను కాను.. చెడ్డ గవర్నర్ ను" అని అనకుండా వుండాల్సింది గవర్నర్ నరసింహన్. మంచి-చెడులు ప్రజలే నిర్ణయిస్తారు.(End)

Thursday, June 10, 2010

బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి స్టాలిన్ జోస్యం-భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు విప్లవ పాఠాలు : వనం జ్వాలా నరసింహారావు

(జూన్ నెల 12, 13, 14 తేదీలలో
సీపీఐ జాతీయ సమితి సమావేశాలు
హైదరాబాద్ లో జరుపుకున్న నేపధ్యంలో)

వనం జ్వాలా నరసింహారావు

భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టడానికి వీలు కావచ్చునని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్ ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్పష్టం చేశారు స్టాలిన్. చి యాంగ్‌కై-షేక్ తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్.

హైదరాబాద్ లో మూడు రోజులు జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి సమావేశాలలో సమకాలీన జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు, పార్టీ భవిష్యత్ లో అవలంబించాల్సిన వైఖరికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి. యూపీఏ వైఫల్యాలను ఎండగట్టడంలో వామ పక్షాలు విఫలమయ్యాయని, పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి వామ పక్షాలకు పెద్ద ఎదురుదెబ్బని-పరాజయంగా భావించాలని, బెంగాల్ అనుభవం దృష్ట్యా కమ్యూనిస్ట్ పార్టీ విధాన-రాజకీయ వైఖరులను సమీక్షించుకోవాల్సిన అవసరముందని సమావేశాలను ప్రారంభించిన జాతీయ కార్యదర్శి బర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా, మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి సుమారు అరవై ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగల దా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.

ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, పలు దేశాలను కలవర పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో కార్మికుల సమ్మెలు సుదీర్ఘంగా సాగాయి. ఆ కాలంలోనే, భారత దేశంలో కూడా కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. అదే రోజుల్లో, 1917 నాటి రష్యన్ విప్లవ తదనంతర రాజకీయ-సామాజిక పరిణామాలు ఎన్నో దేశాలపై ప్రభావం చూప సాగాయి. 1919 లో మాస్కోలో ఆవిర్భవించిన మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ-కోమిన్టార్న్, ప్రపంచవ్యాప్తంగా, బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా, అన్ని రకాల పోరాటాలు సలిపి, అంతర్జాతీయ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఎం ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920 న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. భారత దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, దేశంలోని వామ పక్ష భావాలున్న వారిపై కూడా కోమిన్టకర్న్ ప్రభావం పడే ప్రమాదం వుందని భావించి, పలువురి పై తప్పుడు కుట్ర కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నాలు చేసింది. "కోమిన్టిర్న్" సంస్థకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎం ఎన్ రాయ్, వామ పక్ష భావాలకు ఆకర్షితులైన డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త, షౌకత్ ఉస్మాని, సింగరవేలు చెట్టియార్, గులాం హుస్సేన్ లాంటి పలువురు కమ్యూనిస్ట్ భావాల నాయకులపై "కాన్పూర్ కుట్ర కేసు" పెట్టి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. మార్చ్ 17, 1924 న బనాయించిన చారిత్రాత్మక కాన్పూర్ కుట్ర కేసు, పరోక్షంగా, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దోహద పడిందనాలి.

వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, తమ పట్ల బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, డిసెంబర్ 1925 లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. ఇదిలా వుండగా, వారి పురోగతిని అడ్డుకునేందుకు, వారందరి పైనా "మీరట్ కుట్ర కేసు" పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. కాకపోతే, ప్రభుత్వం అంచనాలకు విరుద్ధంగా, ఆ కేసు విచారణ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కార్మికుల్లో అభిమానాన్ని పెంచ సాగింది. జనవరి 1933 లో, "బోల్షవిక్కులని" ప్రభుత్వం ముద్ర వేసిన కేసులోని నిందితులందరి కీ కఠిన శిక్షలు పడ్డాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన న్యాయస్థానం విచారణను, కమ్యూనిజం సందేశం ప్రజల్లోకి పంపే ఆయుధంగా ఉపయోగించుకున్నారు నిందితులు. కమ్యూనిజం ఉద్యమంగా బలపడ సాగింది.

స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో, మరి కొన్నాళ్లలో, స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జోషి మితవాద వైఖరిని, అతివాద భావాల రణదివే అనుచరులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 1948 లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, "స్వతంత్ర భారతదేశం" అంటే, "బ్రిటీష్ సామ్రాజ్య వాదుల పాక్షిక వలస ప్రాంతం" గా పేర్కొని, మితవాదిగా ముద్రవేసిన జోషిని తప్పించి, రణదివే ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది.

మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది అంటారు. ఆ జీవన్మరణ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి.

చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్ఘోనష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్ ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో. ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.

"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్కైు-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

అప్పటివరకు అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే, గోవిందన్ నాయర్, ముజఫర్ అహ్మద్ ల నాయకత్వం, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ఒకప్పుడు అదే జోషి నెహ్రూకు అనుకూలంగా మాట్లాడినప్పుడు ఆయనను తప్పుబట్టింది పార్టీ. డాంగే వర్గం లేవనెత్తిన "జాతీయ వాదన" కు అనుకోకుండా లోక్ సభలో పార్టీ ఉప నాయకుడు ఏ కే గోపాలన్ నుంచి మద్దతు లభించడం ఆశ్చర్యకరమైన విషయం. నెహ్రూ చర్యకు తమ పూర్తి మద్దతుంటుందని గోపాలన్ ప్రకటించారు. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపిఐ సెక్రెటేరియట్ లోని ఎనిమిది మంది సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే-గోపాలన్-ముజఫర్ అహ్మద్ లు నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తులు" గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్ (అంతకు ముందు లేని పదవి) గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్ గా నియమించింది.

అదే సమయంలో, భారత-చైనా యుద్ధం నేపధ్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన "చైనా అనుకూల వాదులు" గా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. డాంగే, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో, మధ్యే మార్గంలో, అతివాద-మితవాద వర్గాలకు సమాన దూరంలో వున్న నంబూద్రిపాద్ లాంటి వారు, అతివాదుల వైపు మొగ్గడానికి దారితీసింది. క్రమేపీ సంభవించిన కొన్ని పరిణామాలు పార్టీ చీలిక దిశగా తీసుకెళ్లాయి. చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964 లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో.

కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. మే నెల 1981 లో కారణాలేమైనప్పటికి, భారత కమ్యూనిస్ట్ పార్టీ పరోక్ష వ్యవస్థాపకుల్లో ఒకరైన డాంగేను, ప్రపంచ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న డాంగేను భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు. డాంగేను ఆయన కూతురు సారధ్యంలో ఆవిర్భవించిన "అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీకి" ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత. ఆ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల సాధ్య పడకపోవడంతో, మోహిత్ సేన్ నాయకత్వంలో పనిచేస్తున్న "ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ" తో కలిసిపోయి "యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ" తో విలీనమయింది. మరోవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పరిస్థితీ అంతే అనాలి. అఖిల భారత స్థాయిలో సోమనాథ్ ఛటర్జీ స్థాయి నాయకులనుంచి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్ట బడ్డ పలువురిని పార్టీ వదిలించుకుంది. మరోవైపు ఆ పార్టీ నుంచి నక్సల్బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన తీవ్రవాదులు, మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నారింకా.

ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి (ఉభయ) కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ రూపు రేఖలే మారిపోయాయి. చైనా పార్టీలోను మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీల వ్యూహం ఎలా వుంటుందో చూడాలి. (End)

Tuesday, June 8, 2010

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో మార్పు సంకేతాలు : వనం జ్వాలా నరసింహా రావు

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో
మార్పు సంకేతాలు
వనం జ్వాలా నరసింహా రావు
కాంగ్రెస్ పార్టీ యోధాన-యోధుడు, సిద్ధాంత కర్త, ఇందిరాగాంధికి అత్యంత సన్నిహితుడు అని పేరు తెచ్చుకున్న సిద్ధార్థ శంకర రే మార్చ్ 19, 1972 నుంచి, జూన్ 21, 1977 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సారధ్యం వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయిందనాలి. గత ముప్పై మూడేళ్ల గా, ఏ పనైతే తన అధికారాన్నంతా ఫణంగా పెట్టినా కాంగ్రెస్ సాధించలేకపోయిందో, దాన్ని, అచిర కాలంలోనే మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సాధించే రోజు దగ్గర పడుతుందని చెప్పడానికి ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన ఘన విజయమే నిదర్శనం.

ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితిని సడలించి 1977 లో సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పుడు, జనతా కూటమితో కలిసి పోటీ చేసిన సీపీఎం, ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో వామ పక్ష కూటమి విడిగా పోటీ చేసి, 243 స్థానాలను గెలుచుకుని, జ్యోతిబసు నాయకత్వంలో కాంగ్రేసేతర-లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా ఐదు పర్యాయాలు లెఫ్ట్ ఫ్రంట్ ను ఎన్నికల్లో గెలిపించి, 27 సంవత్సరాలు (జూన్ 21, 1977-నవంబర్ 6, 2000) ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు, స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుని, బుద్దదేబ్ భట్టాచార్యకు వారసత్వం అప్పగించారు. అప్పటినుంచి ముఖ్యమంత్రిగా బుద్దదేబ్ (నవంబర్ 6, 2000 నుంచి ఇప్పటి దాకా) పదవిలో కొనసాగుతూ, తృణమూల్ కాంగ్రెస్ కు శాసనసభలో గెలుపు దక్కకుండా కాపాడుతూ వస్తున్నాడు. ఇక ముందు అలా కాపాడగలగడం ఆయనకు కష్టమై పోతుందని చెప్పొచ్చు. మున్ముందు పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించే అవకాశాలు మెండుగా వున్నాయి.

వామ పక్ష రాజకీయ పార్టీలన్నీ ఐక్యమై, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించుకున్న నేపధ్యంలో, అనేక కష్ట-నష్టాలను అధిగమించుకుంటూ కొనసాగించిన సుదీర్ఘ ప్రజా పోరాటం ఫలితంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకత్వంలో, వామ పక్ష కూటమి, నాలుగు దశాబ్దాల క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ, నిలుపుకో గలిగింది మాత్రం ఆ తర్వాత ఏడేళ్ల నుంచి మాత్రమే. ఆ మాటకొస్తే, ప్రపంచం మొత్తంలోనే, మొట్టమొదటి సారి, బుల్లెట్ ద్వారా కాకుండా బాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా భారత దేశంలోని కేరళ రాష్ట్ర ఓటర్లకు దక్కింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించిన ఘనత కూడా భారత దేశానికే దక్కింది.

సామాన్య ప్రజానీకానికి మేలు చేయాలన్న లక్ష్యంతో వామపక్ష-కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, 1952 నుంచి, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక-నిరంకుశ విధానాలను ఎదుర్కొంటూ పశ్చిమ బెంగాల్ లో వామ పక్షాలు బలపడ సాగాయి. వామ పక్షాల ఐక్యతను-కూటమి అధికారాన్ని, సవాలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొన్ని సార్లు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మమత బెనర్జీ నాయకత్వంలో కొన్ని సార్లు, ఎన్నికల సమయంలో అవగాహనలు కుదుర్చుకున్నప్పటికీ, సుమారు నాలుగు దశాబ్దాలుగా "ఎర్రకోటకు బీటలు" పడకుండా అక్కడి ఓటర్లు జాగ్రత్త పడ్డారు.

చరిత్ర పుటలు తిరగేస్తే గాని పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్ర అర్థంకాదు. ఆ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు. ఉద్యమాలు ఈ నాటివి కూడా కాదు. స్వాతంత్ర్య పోరాట కాలంలో, గత శతాబ్దపు నలభయ్యో దశాబ్దంలోనే, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక-శ్రామిక శక్తులను ఐక్యం చేసిన ఘనత బెంగాల్ కుంది. స్వాతంత్ర్యం రాక ముందే కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ లో ఉద్యమాలకు నాయకత్వం వహించింది. స్వతంత్ర భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రంలో 1953 లో-1965 లో ట్రామ్ చార్జీలు పెంచినప్పుడు, 1954 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ బి. సి. రాయ్ వున్నప్పుడు సంభవించిన కరవుపై పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా పి. ఎల్. 480 పథకానికి వ్యతిరేకంగా 1960 నాటి విద్యార్థి పోరాటం, 1962 భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరపాలని చేసిన ఉద్యమం చరిత్ర ప్రసిద్ధికెక్కినవే. అలాంటి ఎన్నో ఉద్యమాల ఫలితంగానే అక్కడి ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అభిమానం పెరుగుతూ వచ్చింది.

ఆ నేపధ్యంలో 1967 లో పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా విడి-విడిగా, "యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో ఒక కూటమి, "పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో మరో కూటమి ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల అనంతరం రెండు కూటములు కలిసి "యునైటెడ్ ఫ్రంట్" గా కలిసి, మైనారిటీ కూటమికి చెందిన బంగ్లా కాంగ్రెస్ నాయకుడు అజోయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధిక సంఖ్యాక బలమున్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు జ్యోతి బాసు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారప్పుడు. అజోయ్ ముఖర్జీ 15 మార్చ్, 1967 నుండి 2 నవంబర్ 1967 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. మూడు నెలల పాటు (2 నవంబర్, 1967-20 ఫిబ్రవరి, 1968 వరకు) స్వాతంత్ర్యం వచ్చిన తొలినాటి రోజుల్లో ముఖ్యమంత్రిగా వున్న పి. సి. ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు. ఆయన పదవిలో వుంచడం కష్టం కావడంతో, అప్పటినుంచి ఏడాది కాలం రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం.

ఏడాది తర్వాత, 1969 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగి, మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ ఎక్కువ కాలం అధికారంలో వుండనీయలేదు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 25, 1969 నుంచి మార్చ్ 19, 1970 వరకు ముఖ్యమంత్రిగా వున్న అజోయ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని రద్దుచేసింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా "పశ్చిమ బెంగాల్ వ్యవహారాల" కొరకు కాబినెట్ మంత్రిగా నియమించబడిన సిద్ధార్థ శంకర్ రే చాణక్య నీతిలో భాగంగా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేవలం 13 నెలల కాలంలోనే రెండో పర్యాయం రద్దు చేసింది కేంద్రం. తిరిగి మరి కొంతకాలం (మార్చ్ 19, 1970-ఏప్రిల్ 2, 1971) రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం కేరళతో (నంబూద్రిపాద్ ను తొలగించడంతో) ప్రారంభమై, బెంగాల్ కు పాకింది. క్రమేపీ భారత దేశ రాజకీయాలలో అలా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం "సాంప్రదాయం" గా మారిపోయింది. ఆ పాపంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా ఏం తీసిపోలేదు. కమ్యూనిస్ట్ పార్టీల సారధ్యంలో వున్న ప్రభుత్వాలను రద్దుచేస్తున్న రోజుల్లో, ఆ పార్టీ తప్ప ఇతర కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, ఆ చర్య తప్పని గట్టిగా వ్యతిరేకించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టం.

ఏదేమైనా, 1971 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గతంలో మాదిరి "యునైటెడ్ ఫ్రంట్" గా కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు కలిసి పోటీకి దిగలేదు. సీపీఎం పార్టీ ఆలోచనా ధోరణికి అనుకూలమైన కొన్ని పార్టీలు సీపీఎం తో జతకట్టి పోటీ చేశాయి. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాకపోయినా, సీపీఎం అతి పెద్ద పార్టీగా-ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీగా అవతరించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అప్పటి గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడ్డారు. మరో పర్యాయం పి. సి.ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు (ఏప్రిల్ 2, 1971-జూన్ 28, 1971). సీపీఎం రాష్ట్ర వ్యాప్త ఆందోళనను చేపట్టింది. ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రజాస్వామ్య పోరాటమే మార్గమని భావించింది. ఘోష్ మనుగడ కష్టమై పోవడంతో మళ్లీ రాష్ట్రపతి పాలన (జూన్ 28, 1971 నుంచి మార్చ్ 19, 1972 వరకు) విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పకడ్బందీ వ్యూహంతో మరో మారు ఎన్నికల్లో దిగి, సీపీఎం ప్రాబల్యాన్ని ఎలాగైనా తగ్గించాలన్న ఆలోచన చేసింది ఇందిరా గాంధి ప్రభుత్వం. ఆమె కనుసన్నల్లో సిద్ధార్థ శంకర రే ఆ ప్రణాళికను అమలు పరిచాడు. అధిష్టానం ఆశీస్సులతో ఐదేళ్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.

1972 ఎన్నికలు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చే రీతిలో జరిగాయి. బూతుల ఆక్రమణ, దొంగ ఓట్ల స్వైర విహారం, ఓట్ల లెక్కింపులో అవకతవకలు భారీ ఎత్తున జరిగింది. ఎట్టి పరిస్థితిలలోను సీపీఎం పార్టీ అధికారంలోకి రాకుండా కట్టుదిట్టమైన అ నైతిక చర్యలన్నీ అవలంబించింది అలనాటి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ. సీపీఎం పార్టీ వామపక్ష కూటమికి సారధ్యం వహించి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఎన్నికలలో జరిగిన అక్రమాల కారణంగా, రిగ్గింగుకు వ్యతిరేకంగా దాదాపు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, ఆ పార్టీకి స్థానాలు తక్కువే వచ్చినా, ఓటింగ్ శాతం మాత్రం 28% వరకు వుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగు శాతానికి అనుగుణంగా సీట్లు వచ్చి వుంటే, ఆ సంఖ్య 80 (సీపీఎం స్థానాలు) వరకుండేది. బలమైన ప్రతిపక్షంగా వుండి వుండేది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి 216 స్థానాలు, సీపీఎం కు కేవలం 14 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంత జరిగింతర్వాత-ప్రజాస్వామ్యం అవహేళనకు గురైన తర్వాత, ఆ నేపధ్యంలో ఏర్పడిన శాసనసభలోకి ప్రవేశించరాదని తీర్మానించుకుంది సీపీఎం. శాసన సభ్యులుగా గెలిచిన ఆ పార్టీకి చెందిన వారెవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. నైతిక విలువలకు అనుగుణంగా ఐదేళ్లు జీతభత్యాల జోలికి పోలేదు.

ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ను సీపీఎం నుంచి విముక్తి చేయాలన్న దృఢ సంకల్పంతో 1997 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించింది కుమారి మమత బెనర్జీ. అచిర కాలంలోనే, సీపీఎం కు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమత బెనర్జీ, సీపీఎం ను గద్దె దింపడానికి అవకాశం వున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. ఎన్డీయే తో జతకట్టింది. పడకపోతే బయటకొచ్చింది. 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్ట్-లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించ లేకపోయింది. తన పార్టీ పక్షాన గెలిచిన ఏకైక లోక్ సభ సభ్యురాలిగా 2004 లో కేంద్ర మంత్రివర్గంలో చేరింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పారిశ్రామిక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత, ఆమె పార్టీ కార్యకర్తలు అక్టోబర్ 2005 లో ఆందోళన చేశారు. 2006 శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గతంలో గెలిచిన స్థానాలలో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. అయినా పోరాటం కొనసాగించింది. అదే సంవత్సరం ఆగస్టు నెలలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మమత నవంబర్ నెలలో టాటా మోటార్స్ కార్ల కర్మాగారం స్థాపన విషయంలో ఆందోళన చేసేందుకు సింగూరు వెళుతుంటే, మధ్యలో బలవంతంగా ఆపు చేసింది ప్రభుత్వం. శాసనసభ ప్రాంగణంలోకి వెళ్లి నిరసన తెలియచేసిందామె. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగి ఫర్నీచర్ ను, మైకులను ధ్వంసం చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా పోటీ చేసి, ఇరువురు కలిసి 26 స్థానాలను (మెజారిటీ) గెల్చుకుని రాబోయే రోజుల్లో సీపీఎం కు గడ్దు రోజులు రాబోతున్నాయన్న సంకేతాన్ని పంపారు. తృణమూల్ ఆందోళన ఫలితంగానే నంది గ్రామ్ లో రసాయన కేంద్రం స్థాపన ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విరమించుకోవాల్సి వచ్చింది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు మమత చేసిన కృషికి సింగూరు, నంది గ్రాం సంఘటనలు ఉదాహరణలుగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. వీటన్నిటి నేపధ్యంలో, జరిగిన మునిసిపల్ ఎన్నికలు, కలకత్తా కార్పొరేషన్ ఎన్నికలు, తృణమూల్ కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చాయి. ఇక శాసన సభ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధమౌతుంది మమత.

సీపీఎం పాలన పగ్గాలు జ్యోతిబసు చేతిలో వున్నంత కాలం మమత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ ఇరవయ్యే డు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో ప్రజలు స్వర్ణ యుగం చూసి వుండవచ్చు. దరిమిలా బుద్దదేబ్ పాలనలో తృణమూల్ ఎదుగుదలకు ఆస్కారం లభించింది. దీనికితోడు, దీర్ఘకాలం అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకత రావడం కూడా సహజం. నంది గ్రాం, సింగూరు ఘటనలు, మరికొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు సీపీఎం కు మునిసిపల్ ఎన్నికలలో పరాజయాన్ని చవి చూపాయి. సీపీఎం ఓటమి, తృణమూల్ గెలుపు తాత్కాలికమా, లేక, తాత్కాలికంగా శాశ్వతమా అన్నది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం. సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశాలకు బుద్దదేబ్ హాజరు కాకపోవడం వెనుక కారణాలు అన్వేషించాలి. పశ్చిమ బెంగాల్ లో పార్టీ పనితీరు పట్ల, పార్టీ ఓటమి పట్ల శాస్త్రీయంగా సమీక్ష జరిగిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయి. సీపీఎం భాగస్వామ్య పక్షమైన సీపీఐ మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ పనితీరును విమర్శించింది. సీపీఎం అవలంబిస్తున్న "అహంకార పూరిత-ఉద్యోగ స్వామ్య-పెత్తందారీతన విధానాన్ని" దుయ్యబట్టింది మరో లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ దృష్టిలో, రాబోయే శాసన సభ ఎన్నికలలో సీపీఎం విజయం క్లిష్టమైందనే భావం వ్యక్తమైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఆనందానికి హద్దుల్లేవనిపిస్తుంది. భవిష్యత్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు వుంటుందని, సీపీఎం సారధ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించి తీరుతామని ధీమాతో వున్నారాయన.

కేవలం 20% మంది ఓటర్ల తీర్పుతో ఘన విజయం సాధించిన మమత, మిగతా ఓటర్ల తీర్పులో కూడా విజయం సాధించుతారో, లేదో, తేలే రోజు తొందరలోనే రాబోతుంది. అంతవరకూ వేచి చూద్దాం.