Thursday, September 20, 2012

"మన సింగపూర్ సంభాషణ"- సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన అపురూపమైన కార్యక్రమం: వనం జ్వాలా నరసింహారావు


"మన సింగపూర్ సంభాషణ"
సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన అపురూపమైన కార్యక్రమం
వనం జ్వాలా నరసింహారావు

ఈ ఏడాది ఆగస్ట్ 26 న నిర్వహించిన "సింగపూర్ జాతీయ ర్యాలీ డే" సందర్భంగా, ఆ దేశ ప్రధాని లీ సయాన్ లూంగ్, దేశ ప్రజలంతా కలిసి కట్టుగా వుండాలని, జాతీయ జీవన స్రవంతిలో ఐకమత్యంగా ఆలోచన చేయాలని పిలుపిచ్చారు. ఇది మామూలుగా అందరు నాయకులు, అన్ని దేశాలలో, చెప్పే మాటే అనిపించినా, కొంత భిన్నంగా వుందనాలి. రాబోయే 20 సంవత్సరాల కాలంలో, సింగపూర్, విజయపథాన పయనించే, అరుదైన దేశంగా వుండేందుకు, ప్రభుత్వం చే పట్టబోతున్న అపురూపమైన ఒక ప్రణాళికా బద్ధ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలబడాలని ప్రధాని కోరారు. ప్రధాని ఈ సందేశానికి పునాదులు, అంతకు మునుపు పక్షం రోజుల క్రితం ఆగస్ట్ 8 న ఆయన చేసిన "జాతీయ దినం" సందేశంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ఆయన ఆనాటి సందేశంలో, విద్యా శాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్ ను సంబోధిస్తూ, వర్తమానంలో అమలవుతున్న ప్రభుత్వ విధానాలపై సమూల సమీక్ష జరగాలనీ, కొంగొత్త ఆలోచనలతో ముందుకు సాగాలనీ, దాని కొరకు, మంత్రి మండలిలోని యువ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ఆయన అధ్యక్షుడుగా వుండాలని కోరారు. భవిష్యత్‍లో విజయపథంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగిపోవడానికి, పౌరులను భాగస్వాములను చేసే దిశగా అడుగులు వేయాలనీ, సింగపూర్ ప్రజలను తమ ప్రభుత్వం గుండెల్లో దాచుకునే రీతిలో వారిని భాగస్వాములను చేయాలనీ, అదే తమ నూతన ప్రభుత్వ విధానమనీ ఆయన చెప్పారు. "మన మార్గాలను రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో వుంచుకుని ఎంచుకోవాలి, ప్రతి ఏడాది మెరుస్తున్న ఒక నక్షత్రం లాగా మనం కనిపించాలి, నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి. రాబోయే కాలంలో మార్పు ఎలా వుండబోతుందో అనేది ముందుగానే పసిగట్టి, దానికి అనుగుణంగా మన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి" అని ప్రధాని లీ సయాన్ లూంగ్ అంటూ, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజల సంపూర్ణ మద్దతు కావాలని కోరారు. 


 విద్యా శాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్
 "సింగపూర్ జాతీయ ర్యాలీ డే" అనేది ఏటేటా జరిగే ఒక నిర్దుష్ట కార్యక్రమం. ఆ ర్యాలీలో జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించడం ఆనవాయితీ. ప్రతి ఏడు ఆగస్ట్ 9 న జరిగే జాతీయ దినోత్సవం పరేడ్  ముగిసిన తరువాత, వచ్చే రెండో ఆదివారం నాడు, ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. 1966 నుంచి నిర్విఘ్నంగా సాగుతున్న ఈ ర్యాలీ నాడు, జాతిని ఉద్దేశించి చేసే తన ప్రసంగంలో ప్రధాని, సింగపూర్ ఎదుర్కొన బోయే సమస్యలను, భవిష్యత్ దర్శినిని, ప్రజల ముందుంచుతారు. అమెరికా అధ్యక్షుడు ఏటేటా చేసే, "స్టేట్ ఆఫ్ ద యూనియన్" ప్రసంగం లాంటిదే ఇది.


జాతీయ దినోత్సవం నాడు చేసే ప్రసంగంలోని వాడి-వేడి అంశాల నుంచి ప్రజలు వారికి తోచిన అర్థాలను ఆకళింపుచేసుకునే పక్షం రోజుల లోపలే, జాతీయ ర్యాలీ డే ప్రసంగం ప్రజల ముందుంటుంది. సర్వసాధారణంగా ప్రధాని ఉపయోగించే ఆనవాయితీ పదాలు ఎలాగూ ఉంటాయని ప్రజలు ముందుగానే ఊహించుకుంటారు. ప్రధాని తన ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పక ముందే, టెలివిజన్ సెట్ల ముందు కూచున్న లక్షలాది మంది ప్రజలు, ప్రధాని తప్పకుండా, ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య నిరంతర సత్సంబంధాల గురించి మాట్లాడుతారని అర్థం చేసుకుంటారు. "ఇన్‍క్లూజివ్" అనే ఆంగ్ల పదాన్ని-అంటే ప్రజల భాగస్వామ్యం అతి పెద్ద మోతాదులో వుండాలి-అన్న భావం స్ఫురించే రీతిలో పదే-పదే ప్రధాని ఉచ్చరించనున్నారని కూడా ప్రజలు పసికడతారు. ప్రతి ఏడాది కంటే భిన్నంగా, ఈ సంవత్సరం, కేవలం ప్రధాని మాత్రమే కాకుండా, మరో ముగ్గురు మంత్రులతో ఆయన ప్రసంగం చేయించారీ సందర్భంగా. ప్రధాని ప్రసంగానికంటే ముందే, విద్యా శాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్-యువజన-క్రీడల శాఖ మంత్రి హలిమా యాకోబ్, కమ్యూనికేషన్ల శాఖ సీనియ మంత్రి లారెన్స్ వాంగ్, ప్రసంగించారు. "నేషనల్ కన్వర్జేషన్" గురించిన ప్రస్తావన, దానికి సంబంధించిన వాగ్దానాలు చేయడం జరిగింది. సింగపూర్ ప్రజలను జాతీయ జీవన స్రవంతిలో మరింత చేరువగా భాగస్వాములను చేయాలన్న సంకల్పానికి నాంది పలకడం జరిగింది. ఇక భవిష్యత్ మీ చేతుల్లోనే వుందని ప్రధాని పదే-పదే చెప్పారు. మీ భవిష్యత్‌ను మీరే సరి దిద్దుకోవాలి అన్న సూచన కూడా చేశారు. 
 "సింగపూర్ జాతీయ ర్యాలీ డే" సందర్భంగా ప్రధాని లీ సయాన్ లూంగ్

 విద్యా శాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్, ప్రధాని చెప్పిన దానిని మరో మారు పునరుద్ఘాటించారు. "అవర్ సింగపూర్" అన్న నినాదం లోతుపాతులను గురించి మరింత వివరణ ఇచ్చారాయన. ప్రధాని తనకు సూచించిన ప్రణాళికా బద్ధ కార్యక్రమంలో మూడు ప్రధానమైన లక్ష్యాలు-ధ్యేయాలు వుంటాయని విశదీకరించారు. మొదటిది: ఇప్పటికే ప్రభుత్వం రూపొందించి అమలు పరుస్తున్న పథకాలలో దేశాభివృద్ధికి పని కొచ్చే వాటి విషయంలో సంపూర్ణమైన నమ్మకాన్ని ప్రకటించడం; రెండోది: కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుకూలంగా, ప్రభుత్వ ఆలోచనా విధానంలో కూడా ఎలాంటి మార్పు రావాలి; మూడోది: నూతన ఆలోచనల దిశగా ఎలా అడుగులు వేయాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సింగపూర్ ప్రజలకు ఇస్తున్న ఒక చక్కటి అవకాశమని, "అన్నింటికన్నా నా దేశానికి ప్రధానమైంది ఏంటి? ఒక దేశంగా, ఈ దేశ ప్రజలుగా మనం ఎక్కడకు-ఎలా పయనించాలి?" అని ప్రతి పౌరుడు ప్రశ్నించుకోవాలి అన్నారు విద్యాశాఖ మంత్రి. ఉదాహరణగా మంత్రి, తన శాఖనే పేర్కొన్నారు. పాఠశాలల్లో గ్రేడింగ్ పద్ధతి మంచిదేనని, ప్రమాణాలను పాటించడానికి ఉపయోగపడుతుందని అంటూనే, యావత్ విద్యావిధానానికే ఇది తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదముందని హెచ్చరించారు. విద్యార్ధులలో "అతి" మెరిట్ విధానం, పోటీ దనం అంత మంచిది కాదేమో అన్నారు. మెరిట్ విద్యార్ధి భవిష్యత్‍లో అంతా తనకే తెలుసు అన్నట్లుగా వ్యవహరించే అవకాశాలను గురించి చర్చ జరగాలని మంత్రి సూచించారు. కష్టపడే వారికి, మెరిట్ వున్నవారికి మధ్య ఒక సమతుల్యం పాటించాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు. ఇలాంటి వాటి విషయంలో ఒక అవగాహనకు రావాలంటే, సుదీర్ఘమైన చర్చ జరగాలనీ, అందుకే, "నేషనల్ కన్వర్జేషన్" ప్రతిపాదనను ప్రభుత్వం ప్రజల ముందుంచిందని ఆయన తెలిపారు.


దరిమిలా, 26 మంది సభ్యులతో కూడిన "మన సింగపూర్" కమిటీ, విద్యాశాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్ అధ్యక్షతన రూపు దిద్దుకుంది. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను కమిటీ సభ్యులుగా చేసింది ప్రభుత్వం. ఒక టాక్సీ డ్రైవర్, సామాజిక కార్యకర్తలు, కళాకారులు, విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, రాజకీయ వాదులు, ఈ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు. ఒక్కో సెషన్‌లో 50 నుండి 150 మంది వ్యక్తులు పాల్గొనే విధంగా, 30 డైలాగ్ కార్యక్రమాలను నిర్వహించాలని, ఆ విధంగా ప్రజలను భాగస్వాములను చేయాలనీ, డైలాగ్ వివిధ భాషలలో జరపాలనీ, కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల కల్లా, సుమారు 3,000 నుంచి 4,000 మంది వరకు ఈ డైలాగ్‌లలో పాల్గొనే అవకాశం వుంది.


ఫేస్ బుక్ లాంటి సామాజిక మీడియాలో కూడా, సింగపూర్ ప్రధాని ప్రకటించిన "నేషనల్ కన్వర్జేషన్" ప్రతిపాదన బహుళ ప్రాచుర్యం పొందుతోంది. "అవర్ ఎస్ జి కన్వర్జేషన్" అనే పేరుతో, అధికారిక పేజీని, ఫేస్ బుక్‌లో తెరవడంతో అనేకమంది అందులోని అంశాలకు స్పందిస్తున్నారు. సింగపూర్ ప్రజల అసలు-సిసలు మనోభావాలను ప్రతిబింబించే వేదికగా "నేషనల్ కన్వర్జేషన్" పని చేస్తుందన్న ఆశాభావాన్ని కరు వ్యక్త పరిచారు. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను బడికి పంపుతున్న ఒక తల్లి ఆవేదన మరో విధంగా వుంది. తన పిల్లలు పాఠశాలలోని పోటీ దనానికి తట్టుకోవడం ఎలా అన్న ప్రశ్న తనను వేధిస్తున్నదని, పోనీ తాను వారికి చదువు చెపుదామంటే తన ఉద్యోగ బాధ్యతలు అడ్డొస్తున్నాయని, దీనికి సమాధానం "నేషనల్ కన్వర్జేషన్" లో దొరకవచ్చని ఆమె అభిప్రాయ పడ్డారు. ఇలా ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పారు. అన్ని రంగాల ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తూనే వున్నాయింకా.


"నేషనల్ కన్వర్జేషన్" కొరకు రంగం సిద్ధమౌతోంది. నిర్వహించ తలపెట్టిన 30 డైలాగ్‌లలో మొదటి దానికి అపూర్వ స్పందన వచ్చింది. ఇప్పటికే సుమారు వంద మందికి పైగా వ్యక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వచ్చే అక్టోబర్ నెలలో మొదటి సెషన్ జరగవచ్చని మీడియా వర్గాలు ప్రకటించాయి. ప్రతి సెషన్‌లో 50 నుంచి 150 వ్యక్తులుంటారు. వారిని 8 నుంచి 10 బాచ్‍లుగా విభజించుతారు. ప్రతి బాచ్‍కు ఒక ఫెసిలిటేటర్ వుంటారు. దేశ భవిష్యత్ విషయంలో ఎలా ముందుకు సాగాలి అనే అంశాన్ని విపులంగా చర్చించేందుకు సంబంధిత ఫెసిలిటేటర్ డైలాగ్లో పాల్గొంటున్న వ్యక్తులను ప్రోత్సహిస్తారు. సామాజిక బృందాలు, ట్రేడ్ యూనియన్లు, అట్టడుగు స్థాయి వ్యవస్థలు, అనేక రకమైన టీంలు, డైలాగ్‌లలో పాల్గొనేందుకు ఆసక్తిని వ్యక్త పరుస్తున్నారు. బీజింగ్‌లో నివాసముంటున్న సింగపూర్ వాసులు కొందరు కలిసి, అక్కడే వేదిక చేసుకుని, డైలాగ్‌లో పాల్గొనాలనే ఆలోచన చేస్తున్నారు. దీనికి కమిటీ అంగీకారం తెలిపింది కూడా. డైలాగ్ ఆరంభం చేయడానికంటే ముందర, సింగపూర్ గురించిన ఛాయా చిత్రం పాల్గొనేవారికి చూపుతారు. అందులో భూత-భవిష్యత్-వర్తమానంలో సింగపూర్ గురించి అనేక విశేషాలుంటాయి. డైలాగ్‌లో పాల్గొనే వ్యక్తులకు, ఉన్నత స్థాయిలో వున్న వారితో కలిసి, ఒకే వేదిక మీద వాదోపవాదాలు చేసే అవకాశం వుంటుంది. అలాంటి వారిలో మంత్రులు కూడా వుంటారు. ఏఏ డైలాగ్‌లో ఎవరెవరు పాల్గొనాలనే అంశాన్ని కమిటీ నిర్ణయించినప్పటికీ, ప్రజల నుంచి కూడా ప్రతిపాదన రావచ్చు. ప్రజలకు ఈ కార్యక్రమం మరింత చేరువ కావడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను, ఈ-మెయిల్‌ను ప్రకటించింది ప్రభుత్వం. డైలాగ్ విశేషాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో పెట్టే ఏర్పాటు కూడా చేసింది.


ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు మన ముఖ్య మంత్రి చేపట్టకూడదు?

Wednesday, September 19, 2012

Unique Experiment to involve People in Governance “Our Singapore Conversation”: Vanam Jwala Narasimha Rao


Unique Experiment to involve 
People in Governance

“Our Singapore Conversation”
Vanam Jwala Narasimha Rao

At this year’s Singapore National Day Rally on August 26, 2012, Prime Minister Lee Hsien Loong urged the people to come together in a national discourse. The Prime Minister called on Singaporeans to support a move by the government to ensure Singapore would remain a success story in the next 20 years. Earlier In his National Day message to Singaporeans on August 8, 2012, he has tasked Education Minister Heng Swee Keat to chair a committee of younger ministers to take a “fresh look” at existing government policies. In revising its policies, he said the government would keep "Singaporeans at the heart of all we do" and would engage citizens in the review in order to build a broad consensus going forward. “To be a shining red dot twenty years from now, we must rethink our approaches, and reinvent ourselves. We must anticipate changes and prepare for what lies ahead,” he said, while asking Singaporeans "for your support in this exercise". 


The National Day Rally is an annual address that the Prime Minister of Singapore makes to the entire nation, on the second Sunday after August 9, the country's National Day. A yearly event since 1966, the Prime Minister uses this rally to address the nation on its key challenges and its future directions, and can be compared to the State of the Union Address delivered by the President of the United States. 

 Prime Minister Lee Hsien Loong

Every August, after the hype and excitement of the Singapore National Day Parade has died down; Singapore Prime Minister makes the National Day Rally speech. Of course, there would be the easily predictable buzzwords. Even before a single word is uttered on live television every Singaporean knows that there would be mention of increased engagement between the government and the people, and of course, almost excessive use of the word “inclusive”. This year, three ministers – Education Minister Heng Swee Keat, Minister of State for Community Development, Youth and Sports Halimah Yacob and Senior Minister of State for Education and for Information, Communications and the Arts Lawrence Wong – gave speeches before Prime Minister took centre stage. Promises were made about a “national conversation”, an attempt to include Singaporeans more in building the future of the country. There was a marked emphasis on hope and heart.


            Education Minister Heng Swee Keat said government will engage all Singaporeans in a national conversation about how to take the country forward by "putting Singaporeans at the heart of our concerns". In his speech, Heng touched on the details of "Our Singapore"- an initiative that PM Lee Hsien Loong had tasked him to do in his National Day Message. He highlighted three goals that the national conversation will seek to achieve: reaffirm what is good and still relevant, see what has changed and recalibrate accordingly and, refresh and innovate by charting new directions. "It will be an opportunity for Singaporeans to come together, and ask: What matters most? Where do we want to go as a country, as a people?" 

  Education Minister Heng Swee Keat

Drawing the example of Singapore's education, Heng cited that although the "focus on grades and achievements maintain standards, it comes at the expense of a holistic education, a happier childhood and quality time with parents". "Extreme meritocracy and competition can lead to a winner-take-all society, with the winners thinking little of others. We need to restore a balance to hard-nosed material pragmatism," he said. Heng also called for Singaporeans to take part in the national conversation as it will be as "inclusive as possible". 


            Subsequently, a 26-member “Our Singapore” Committee chaired by Education Minister Heng Swee Keat was announced with its members coming from all walks of life which include a taxi driver, social entrepreneurs, artists, students, academics, media and politicians. The committee decided to engage the public in over 30 dialogue sessions, each involving 50 to 150 people and to be conducted in different languages and dialects. About 3,000 to 4,000 people are expected to be polled by November or December this year. 


            The National Conversation on Our Singapore, announced by Prime Minister in his National Day Message and elaborated during the National Day Rally, is gathering momentum in social media. The official "Our SG Conversation" Facebook page has garnered number of responses since it was launched by Minister for Education, who is fronting the national conversation effort. One contributor hopes that the Facebook page will help facilitate an authentic conversation for the benefit of Singaporeans. A working mother of two shared her challenges and said she was "tense" about whether her children could excel in school and succeed in life. She added that working takes up time and energy, leaving little of her time for her children. There were also calls for the conversation to have multi-language platforms for all Singaporeans, and not just focus on the English-speaking group. Political watchers said that while social media is likely the people's preferred platform to express their views, it is important for the government to also reach out to the silent majority. 


            According to the media reports, the first of at least 30 citizen dialogues being planned for the national conversation will be held early October and some 100 people have already expressed interest. Each session is expected to involve 50 to 150 people, who will be split into groups of 8 to 10 with a facilitator encouraging deeper conversations about the country’s future. Other groups including some community groups, unions and grassroots organizations, have also indicated that they may organize their own dialogues, with a Singaporean in Beijing even offering to run one in the Chinese capital. This offer has been accepted.


            As part of the facilitation of the dialogue, one activity that has been planned is to come up with a “story headline” for Singapore 20 years on. At the dialogues, participants will get a chance to rub shoulders with high-level panel members such as the ministers. While the panel members will nominate names for the dialogues, the public can also sign up. 


            The government announced a toll free number and an e-mail to reach easily by the public as well as its preparedness to post the details of the sessions on a website. 

Why not AP Chief Minister Kiran Kumar Reddy emulate from this experience and involve people in a better manner in the governance?

సింగపూర్‌లో అందరికీ అందుబాటులో ఆరోగ్య వైద్య సదుపాయం: వనం జ్వాలా నరసింహారావు


సింగపూర్‌లో అందరికీ అందుబాటులో ఆరోగ్య వైద్య సదుపాయం
వనం జ్వాలా నరసింహారావు

సింగపూర్‌లో అమల్లో వున్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారని, సింగపూర్ జనరల్ ఆసుపత్రిలో ప్రొఫెసర్-సీనియర్ కన్సల్టెంట్‍గా పని చేస్తున్న భారతీయుడు డాక్టర్ వి. అనంతరామన్ చెప్పారు. సింగపూర్‌కు వెళ్లిన నేను, భారత దేశంలోని పలు రాష్ట్రాలలో 108-అత్యవసర వైద్య సహాయ సేవలను అందిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‍మెంట్-రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) లో పనిచేస్తున్న రోజుల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చిపోతుండె అనంతరామన్‍ను కలవడానికి, ఆయన పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, సుమారు రెండు గంటలు ఆయనతో గడిపాను. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలో అనేక ఔట్ పేషంట్-ఇన్ పేషంట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, సింగపూర్‌లోని పౌరులకు-విదేశీయులకు వారి-వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన వైద్య సౌకర్యం కలిగిస్తున్నాయని అనంతరామన్ అన్నారు. ఇందులో ప్రాధమిక ఆరోగ్య-వైద్య సదుపాయం, ముందస్తుగానే జబ్బులు రాకుండా అరికట్టేందుకు అవసరమైన వైద్య సౌకర్యంతో పాటు, ఆరోగ్య సంబంధిత మైన విద్యావిధానాన్ని అమలు పర్చడం చేస్తోంది సింగపూర్ ప్రభుత్వం. ఆ దేశంలో అమలవుతున్న ఆరోగ్య-వైద్య సౌకర్యాల గురించి వివరంగా మాట్లాడారు అనంతరామన్. భారత దేశంలో మాదిరిగానో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానో కాకుండా, సింగపూర్‌లో నూటికి ఎనభై శాతం మేర ప్రాధమిక వైద్య సౌకర్యం సుమారు 2000 వరకూ వున్న ప్రయివేట్  ఆసుపత్రులలో లభ్యమవుతుంది. ప్రభుత్వ పరమైన పాలీ క్లినిక్‌లు కేవలం 18 మాత్రమే. భారతదేశంలో, అందునా ఆంధ్ర ప్రదేశ్‌లో, ప్రయివేట్ రంగంలో ఎక్కువగా స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం మాత్రమే వుంటుంది. ప్రాధమిక వైద్య సౌకర్యం దాదాపు లేనట్లే. సింగపూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో 80% స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం దొరుకుతుంది. ఆసుపత్రి పడకల సంఖ్య కూడా ప్రభుత్వ రంగంలోనే అధికం-సుమారు 80% పైగా. ప్రయివేట్ ఆసుపత్రులలో కేవలం 20% మాత్రమే! డాక్టర్ల సంఖ్య కూడా అంతే. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేవారి సంఖ్య 80% కాగా, ప్రయివేట్ రంగంలో 20% మంది మాత్రమే వున్నారు. 

                సుమారు 52 లక్షల జనాభా,  704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగిన సింగపూర్ దేశమంతా అదే పేరు కలిగిన ఒక పెద్ద నగరం. బహుశా ప్రపంచంలో అలాంటివి అతి తక్కువగా వున్నాయి. ఆసియా ఖండం మొత్తంలో అత్యున్నత ఆరోగ్య వైద్య ప్రమాణాలను పాటిస్తున్న దేశం సింగపూర్. 1965 లో సింగపూర్‌కు స్వాతంత్ర్యం లభించిన కొద్ది రోజుల్లోనే, అప్పటికే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అంటువ్యాధులను ముందస్తుగానే అరికట్టే ప్రక్రియ ఆరంభమైంది. పెద్ద ఎత్తున ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దరిమిలా, భవిష్యత్‍లో ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా జాగ్రత్త పడేందుకు 1983 లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. రాబోయే 20 సంవత్సరాలలో చేపట్టి అమలుపర్చాల్సిన ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన గురించి ఒక నిర్దుష్ట కార్యక్రమాన్ని రూపొందించింది. ఏటేటా ఆ కార్యక్రమాన్ని సమీక్షించి తప్పులను సరి దిద్దుకుంటూ ముందుకు సాగుతోంది.

 సింగపూర్ జనరల్ ఆసుపత్రి-ఎస్.జి.హెచ్

సింగపూర్ ఆరోగ్య వైద్య విధానంలో అత్యంత కీలకమైన "మెడి సేవ్"-వైద్య పొదుపు పధకానికి నాంది పలికింది. సింగపూర్‌లో మూడు విభాగాల ఆరోగ్య వైద్య నియంత్రణ వ్యవస్థలున్నాయి. మొదటిది ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెండోది కేంద్రీయ భవిష్యత్ నిధి, మూడోది సింగపూర్ మానిటరీ అథారిటీ. ఆరోగ్య సంరక్షణ సేవల పూర్తి పర్యవేక్షణ బాధ్యత మంత్రిత్వ శాఖదే. పొదుపు పధకాన్ని అమలు పర్చాల్సిన బాధ్యత భవిష్యత్ నిధిది. సింగపూర్ పౌరులందరూ-శాశ్వత నివాసీయులందరూ, వర్తమానంలోను, భవిష్యత్‍లో పదవీ విరమణ చేసిన తరువాత ముసలితనంలోను, తమ పోషణ బాధ్యత-ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలలో, తామే విజయవంతంగా తమపై వేసుకునే విధంగా భవిష్యత్ నిధి చర్యలు తీసుకుంటుంది. బీమా రంగానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించి, భీమాదారులెలాంటి ఇబ్బందులకు గురి కాకుండా-వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను, సింగపూర్ కేంద్రీయ బాంక్ లాగా, మానిటరీ అథారిటీ వ్యవహరిస్తుంది. ఈ మూడు వ్యవస్థలు ఒకదానికి మరొకటి సరైన సహాయ సహకారాలు అందించుకుంటుంది.

సింగపూర్ మొత్తంలో, పదమూడు ప్రయివేట్ ఆసుపత్రులు, పది ప్రభుత్వ ఆసుపత్రులు, అనేక స్పెషలిస్ట్ క్లినిక్‌లు వున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన చార్జీలు అమల్లో వున్నాయి. పేషంట్లు తమకిష్టమైన సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు, తాను వెళ్లదల్చుకున్న ప్రభుత్వ-లేదా-ప్రయివేట్ ఆసుపత్రికి కాని, పాలీ క్లినిక్‌కు కాని వెళ్లవచ్చు. ఎమర్జెన్సీ సేవలైతే 24 గంటలు అందుబాటులో వుంటాయి. ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులన్నీ కూడా అధునాతన వైద్య సదుపాయాలను కలిగి వుంటాయి. అక్కడా-ఇక్కడా కూడా అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఎప్పుడో, 2000 సంవత్సరం నాటికే సింగపూర్ ఆరవ రాంకు సంపాదించింది. శిశు మరణాల విషయంలో అత్యంత తక్కువ శాతం సింగపూర్‌లోనే. ప్రసూతి మరణాలు దాదాపు లేనట్టే. 

ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా విధానంలో మూడు రకాలున్నాయి. మొదటిది "మెడిఫండ్". దీని ద్వారా, తమంతట తాము ఎలాంటి పద్ధతిలోను వైద్య ఖర్చులు భరించలేని వారికి ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వమే కలిగిస్తుంది. ఇదొక రకమైన శాశ్వత నిధి. రెండోదైన "మెడిసేవ్" ద్వారా, దాదాపు 85% మంది జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదొక రకమైన నిర్బంధ పొదుపు విధానం. మూడొదైన "మెడిషీల్డ్" కింద ప్రభుత్వమే ఒకరకమైన ఆరోగ్య భీమా పథకం అమలు పరుస్తుంది. నిర్బంధ పొదుపు ద్వారా, సబ్సిడీ విధానం ద్వారా, ధరలు అదుపు చేయడం ద్వారా, మెడిషీల్డ్ అమలు సులభతరమవుతుంది. అన్నింటిలోకి ప్రధానమైంది "మెడి సేవ్". ఇది మరొక రకమైన జాతీయ ఆరోగ్య భీమా ప్రణాళిక. మెడిసేవ్ పథకాన్ని ఏప్రిల్ 1984 లో, జాతీయ వైద్య పొదుపు గణాంక పద్ధతిన, ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. తక్షణం ఆసుపత్రిలో చేరడానికి, ఔట్ పేషంట్ విభాగంలో చికిత్స పొందడానికి, డే సర్జరీకి ఈ పొదుపు ఖాతాను ఉపయోగించవచ్చు. ప్రతి ఉద్యోగి తమ ఆదాయంలో, వారి-వారి వయసుకు అనుగుణంగా, 6.5-9.0% మేరకు,  తమ వ్యక్తిగత మెడిసేవ్ అకౌంట్‍‍లో జమ చేస్తారు. అలా పొదుపు చేసిన డబ్బు నుంచి, వైద్య-ఆరోగ్య బిల్లులు చెల్లించవచ్చు. సింగపూర్‌లో నిరుద్యోగం కేవలం రెండు శాతం లోపే. అంటే, దాదాపు అందరికీ పొదుపు చేసే వీలుంటుంది. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పొదుపు ఖాతాదారులైతే, వారందరిదీ పూల్ చేసి కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు. ప్రతి వ్యక్తికీ, వారు చికిత్స పొందే సమయంలో, వారు ఎంపిక చేసుకునే మూడు రకాల సబ్సిడీలలో ఒకటి వర్తిస్తుంది.

ప్రభుత్వ పరంగా కాని, ప్రయివేట్ పరంగా కాని, ఏ స్థాయి సబ్సిడీ పొందుతున్న వారికి కాని, సింగపూర్ జాతీయ ఆరోగ్య ప్రణాళిక ప్రాధమిక సూత్రం ప్రకారం, "ఉచితం" అనే మాట వారి నిఘంటువులో అసలే కనిపించదు. ఏదీ-ఎవరికీ ఉచితం కానే కాదు. అలాగే, ఎవరికీ-ఎట్టి పరిస్థితుల్లోను, ఆరోగ్య వైద్య సేవలను నిరాకరించే ప్రసక్తే లేదు. రోగి ఫీజు కట్టాడా-లేదా అనే విషయాన్ని వైద్య సేవలను అందించడానికి ముడి పెట్టే సమస్యే లేదు. భారత దేశంలోను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోను వున్న ప్రయివేట్-ప్రభుత్వ ఆసుపత్రిలో-పాలీ క్లినిక్‌లలో మాదిరిగా కాకుండా, పేషంటు దగ్గర ఫీజు మొత్తాన్ని, మందులతో సహా, డిశ్చార్జ్ చేసేంతవరకు వసూలు చేయరు. వాళ్లు బిల్లు చెల్లించినా, చెల్లించ లేకపోయినా డిశ్చార్జ్ నిలుపుదల చేయరు. ఫీజు చెల్లించకుండా వెళ్లిన వారి విషయంలో, అది రాబట్టుకొనేందుకు వేరే యంత్రాంగం తరువాత కృషి చేస్తుంది కాని కట్టేంతవరకు డిశ్చార్జ్ చేయమని అనరు. ఫీజు కట్టకుండా వెళ్లి పోయేవారెంతమంది అని డాక్టర్ అనంతరామన్‍ను అడిగినప్పుడు, ఒక శాతం లోపే అని సమాధానం వచ్చింది. వారు కూడా సాధారణంగా కట్టలేని విదేశీయులే! ఏదీ ఉచితం లేకపోవడానికి కారణం, అనవసరంగా ఎవరూ వైద్య సేవలను దుర్వినియోగం చేయకూడదనే. వైద్య ఖర్చులు వారి-వారి స్థాయి సబ్సిడీని పట్టి వున్నప్పటికీ, "ఔట్-ఆఫ్-పాకెట్" వ్యయం మాత్ర్తం స్థాయిని బట్టి మారుతుంటుంది. ఎక్కువ స్థాయి సబ్సిడీ లభించే వారికి "ఔట్-ఆఫ్-పాకెట్" ఖర్చులు కూడా ఎక్కువగానే వుంటాయి. తక్కువ వారికి అంతగా వుండవు. మొత్తం మీద వారికీ-వీరికీ చివరకు పడేది దాదాపు ఒకే రకం భారం. క్రమేపీ పెరుగుతున్న ప్రయివేట్ రంగం వైద్య సేవలను ఎక్కువగా, ప్రయివేట్‌గా భీమా చేయించుకున్నవారు, విదేశీయులు, ఖర్చు భరించగల శక్తి వున్నవారు, "ఔట్-ఆఫ్-పాకెట్" ఖర్చుకు భయపడని వారు, ఉపయోగించుకుంటున్నారు. ఎంతగా ప్రయివేట్ రంగం విస్తరిస్తున్నప్పటికీ, ఇప్పటికీ, 70-80% మంది సింగపూర్ దేశీయులు ప్రభుత్వ పరంగానే వైద్య సేవలను పొందుతున్నారు.

సింగపూర్ జనరల్ ఆసుపత్రి-ఎస్.జి.హెచ్, ఆదేశం మొత్తంలో, అతి పెద్ద-పురాతనమైన ఆసుపత్రి. దాని పునాదులు 1821 లో వేయడం జరిగింది. "సింగ్ హెల్త్" అనే పేరుతో, ఆ గొడుగు కింద, ప్రభుత్వ రంగంలోని అనేక స్పెషలిస్టు ఆసుపత్రులు నడుస్తున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రి, కాన్సర్ ఆసుపత్రి, హృద్రోగ ప్రత్యేక ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, డెంటల్ ఆసుపత్రి, న్యూరో ఆసుపత్రి ఆ గొడుగు కింద పనిచేస్తాయి. ఎస్.జి.హెచ్ లో సుమారు 600 మందికి పైగా వైద్యులు, 29 క్లినికల్ స్పెషాలిటీల్లో పని చేస్తున్నారు. ప్రతి పేషంటుకు వ్యక్తిగతంగా వారి-వారి వైద్య అవసరాలకు అనుగుణంగా, నిబద్ధతతో పనిచేస్తారీ డాక్టర్లు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో తప్ప, మామూలు పరిస్థితుల్లో పేషంటును ఆసుపత్రిలో చేర్చుకోవాలంటే, ఆ అవసరం వున్నదని, ఎవరో ఒక స్పెషలిస్ట్ సూచించాలి. అడ్మిషన్ డేట్ తేలిన తరువాత, ముందస్తు జాగ్రత్తలెన్నో పేషంటుకు వివరిస్తారు. వాళ్లకు ఏ రకం సబ్సిడీ లబిస్తుందో, ఆ స్థాయికి తగ్గ గదులనే కేటాయిస్తారు. డార్మెటరీ కూడా కావచ్చు. అడ్మిషన్‌కు ముందుగానే, ఫీజు చెల్లించే విధానం, అవసరమైన డాక్యుమెంట్ల విషయం, అందాజాగా ఫీజు మొత్తం వివరించడం జరుగుతుంది. అడ్మిషన్ కంటే ముందే, ఎక్స్-రే, రక్త పరీక్షలు, ఇ.సి.జి లాంటి అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు.

సింగపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాని, ప్రభుత్వ స్పెషలిస్ట్ కేంద్రాలలో కాని, పాలీ క్లినిక్‌లో కాని, చికిత్సకు వెళ్లిన వారి క్లినికల్ పరీక్షల వివరాలను, "నేషనల్ ఎలెక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ సిస్టం" అనే పేరుతో, ఒక సెంట్రలైజ్డ్ డాటా బేస్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పేషంట్ మెడికల్ హిస్టరీ మొత్తం ఒకే చోట బధ్ర పరిచి, కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఆరోగ్య కేంద్రాలు ఒకే గొడుగు కింద పనిచేసే ఈ విధానం వల్ల, ఒక సారి ఒకచోట క్లినికల్ టెస్టులు చేయించుకున్న పేషంటు, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు, ఆయన దగ్గర కంప్యూటర్లో ఇవి చూసే వీలుంటుంది. మళ్లీ-మళ్ళీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా, సమయం వృధా కాదు.  

సింగపూర్ జనరల్ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఎమర్జెన్సీ శాఖలో, ప్రతి షిఫ్ట్ లోను, ఒక సీనియర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ తప్పనిసరిగా పనిచేస్తుంటారు. పేషంట్ రోగ తీవ్రతను బట్టి, అవసరానికి అనుగుణంగా, ప్రాధాన్యతా స్థాయిని ఎంపిక చేస్తారు. ఫలానా చోట వారికి అవసరమైన చికిత్స జరుగుతుందంటూ, వారిని, అక్కడకు వెంట తీసుకెళ్తుంది ఆసుపత్రి సిబ్బంది. నాలుగు రకాల ప్రాధాన్యతా పరమైన వెయిటింగ్ ప్రదేశాలుంటాయి. తీవ్రంగా బాధ పడుతున్న పేషంట్లకు ఒక విధంగా, మేజర్ ఎమర్జెన్సీకి ఇంకో విధంగా, మైనర్ ఎమర్జెన్సీలకు మరో విధంగా, ఎమర్జెన్సీ కాదని భావించిన వాటికి వేరే విధంగా చికిత్స ప్రారంభమవుతుందక్కడ. జ్వరాలతో బాధపడుతూ వచ్చే పేషంట్లను, వారి ఇన్‌ఫెక్షన్ ఇతరులకు తగలకుండా, మరో ప్రత్యేకమైన ప్రదేశానికి తరలిస్తారు.

సింగపూర్లో అత్యవసర వైద్య సహాయ సేవలను, "ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్" పేరుతో, "సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్" నిర్వహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో 108 సేవల వలనే, ఇక్కడ 995 నంబర్‌కు ఫోన్ చేసి ఈ సేవలను పొందవచ్చు. జీవన్మరణ సమస్య తలఎత్తినప్పుడు మాత్రమే 995 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరాలి. ఫోన్ చేసిన వెంటనే 108-అంబులెన్స్ తరహాలోనే ఇక్కడా అంబులెన్స్ వస్తుంది. వైద్య సహాయం కావాలని కోరుకునే నాన్-ఎమర్జెన్సీ పేషంట్ సౌకర్యం కొరకు, వారికి అంబులెన్స్ పంపేందుకు 1777 అనే మరో నంబర్ కేటాయించింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే, 995 నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కోరినవారి దగ్గర నుంచి 180 సింగపూర్ డాలర్లు ఫీజు కింద వసూలు చేస్తారు. లేకపోతే ఈ సౌకర్యం ఉచితమే. అంబులెన్సులలో పేషంట్లను ప్రమాద స్థలానికి అతి సమీపంలో వున్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుస్తారు. అలా చేయడం వల్ల తక్షణ వైద్య సదుపాయం లభిస్తుంది. సింగపూర్ మొత్తంలో  14 అంబులెన్స్ స్టేషన్లు, 40 ఎమర్జెన్సీ అంబులెన్సులు వున్నాయి. 

డాక్టర్ వి. అనంతరామన్

డాక్టర్ అనంతరామన్ వెంట నేను మొత్తం సింగపూర్ జనరల్ ఆసుపత్రిని చూశాను. అంగుళం-అంగుళం అత్యంత జాగ్రత్తగా, హైజినిక్‍గా కాపాడుతున్నారు ఆసుపత్రిని. బహుశా ఇండియాలోని "బెస్ట్ ఆఫ్ ద ఆసుపత్రి" లో కూడా లేని ఔట్ పేషంట్ సౌకర్యం ఇక్కడ వుందనవచ్చేమో! ఇక్కడ ఎమర్జెన్సీ అడ్మిషన్లు ఇరవై నాలుగు గంటలూ కాగా, నాన్-ఎమర్జెన్సీ ఔట్ పేషంట్ సౌకర్యం నిర్ధారిత సమయాలలో మాత్రమే లభిస్తాయి.