Monday, October 28, 2013

"కాళోజీ యాదిలో" : వనం జ్వాలా నరసింహారావు

(నవంబర్ 13, 2013 న కాళోజీ 11 వ వర్ధంతి)

"కాళోజీ యాదిలో"
వనం జ్వాలా నరసింహారావు

స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ "ఇదీ నా గొడవ" ను నేను గత పది-పదిహేను సంవత్సరాలలో అనేక సార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ, పది మంది తెలుసుకోవాల్సిందే! అసలా పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో? లేదో? తెలియదు. మొన్నీ మధ్య  ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్ద మనిషి, తనకా పుస్తకం చదవాలని ఎన్నేళ్లగానో వున్నప్పటికీ, ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదని అన్నాడు. అప్పుడనిపించింది...ఎందుకు అందులోని విషయాలను కనీసం కొన్నైనా, పంచుకోకూడదని. అందుకే ఇది.. ఆసక్తి గల వారికి ఇదొక అవకాశం. ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు...ఒక్కొక్కటే...

నైజాం కాలంలో తెలంగాణాకు వచ్చిన కుటుంబాల వ్యవహార శైలి, వాళ్ల ఆధిపత్యం, ముల్కీ-నాన్ ముల్కీ నేపధ్యం, తెలంగాణా వాళ్లని అణచిపెట్టిన విధానం గురించి ప్రస్తావిస్తూ కాళోజీ ఇలా అంటాడు:

"ఢిల్లీ నుంచి మొదటి నైజాముల్ ముల్క్ తో పాటు ఇక్కడికి (తెలంగాణ) వచ్చిన కుటుంబాలల్ల అరబ్బు, పర్షియన్ పండితులెక్కువ. ఆధిపత్యం వీళ్లదే. మొగలాయీలు ఎట్లయితె బయటనుంచి వచ్చి అధికారం చెలాయించిండ్రో, వీండ్లు కూడా అంతే. వీండ్ల ఇండ్ల పేర్లు ప్రత్యేకంగ వుంటయి. సిద్దిఖీ వగైరా. అరబ్ దేశం నుంచి వచ్చి ఇరవై తరాలైనా, గొప్పగా ’మేం సీదా అరేబియా నుంచీ వచ్చిన వాండ్లం’ అని చెప్పుకుంటూ, ’ఇక్కడి వాళ్లకి మా వుఛ్చారణ ఏమొస్తది, ఏం మాట్లాడతరు?’ అని ఈసడిస్తరు-బెజవాడవాండ్లు, సర్కారు జిల్లాల వాండ్లు మమ్మల్ని ’మీకు తెలుగేం ఒస్తుంది’? అన్నట్లు. వీడు తెలుగు రాదంటడు, వాడు ఉర్దూ రాదంటడు, మరోడు ఇంగ్లీషు రాదంటడు. మరి మనకొచ్చెడిదేమిటని ప్రశ్న. ఇక్కడి యాసని కూడ ’నీ యాస పనికి రాదు’ అనబట్టె".

"ఈ ముల్కీ, నాన్ ముల్కీ సమస్య 300 ఏండ్లనుంచీ వుండె. బహమనీ రాజ్యంల కూడ ప్రాంతేతరుల సమస్య వుండేటిది. రాజుల వెంట కొన్ని కుటుంబాలు రావడం, వాండ్లతోపాటు వాండ్ల బంధువులు రావడం, ఆ సంఖ్య పెరగడం, దీనివల్ల స్థానికులకి ఉద్యోగావకాశాలు తగ్గడం మొదలైంది. ఇప్పుడు ఉత్తర దక్షిణ భారత దేశాల మధ్య, ఆంధ్ర తెలంగాణాల మధ్య ఈ సమస్య తలెత్తింది. ఇది ఆర్థిక సమస్య, బతుకు తెరువు సమస్య. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంల తెలుగు వాండ్లు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావలెనని ఆందోళన చేసిన్రు. తమకు ఉమ్మడి రాష్ట్రంల కలిగిన అన్యాయాలకి తమిళులే కారకులనీ, వాండ్ల ఆధిపత్యాన్ని సహించేది లేదని అన్నరు. మరి వాండ్లే తెలంగాణావాండ్లని అణచి పెట్టిన్రు. ’మన ఇద్దరిదీ ఒకటే భాష. నువ్వు ఆందోళన చేయగూడదు. వేర్పాటు ధోరణి కుదరది. అన్యాయం’ అంటూ ధర్మోపన్యాసాలు దంచిన్రు. తాము ఏ పెత్తందారీ తనానికి, అవమానాలకి గురి అయిన్రో అన్నీ మర్చి పోతున్నరు. అదే పెత్తందారి తనం తాము ఇక్కడ స్థానికుల మీద చేస్తున్నరు. తాము తమిళుల నుంచీ ఎందుకు వేరు పడదమనుకున్నరో గుర్తు చేసుకుంటె, తెలంగాణ వాండ్ల ఆందోళన అర్థమవుతుంది. ఎప్పుడైనా ఎదటవాడి రొమ్ముమీద కాలేసి తొక్కెటోడికి బాధ ఏముంటది? కిందపడి వుండేవాడికే బాధంతాను. నన్ను తొక్కుతున్నవ్ అని గోలపెడితె, ’నేనెక్కడ తొక్కుతున్నను...ఊరకె కాలు పెడ్తినంతె’ నంటడు. ఇతరుల భుజాల మీద ఎక్కి కూచున్నవాడు తన భుజం మీద ఎక్కినవాడిని ’దిగురా, దిగురా’ అంటడే గానీ తాను ఎవరి భుజాల మీదన్నా ఎక్కి కూచున్నానేమోనని ఆలోచించడు....." 

వరంగల్ లో నివసించే ఒక బ్రాహ్మణ వకీలు గురించి ప్రస్తావించారు కాళోజీ తన ఆత్మకథలో. హిందువైనా ఆయన ఏ విధంగా ఇస్లాం మతానికి దగ్గరైందీ, ఆయన చనిపోయిన తరువాత ఆయనను ఇస్లాం మతా ఆచారాలకు అనుగుణంగా గోరీ కట్టించిన వైనం వివరించారు కాళోజీ.

"శ్రీ రామారావు గారనే పెద్ద వకీలు వుండేవారు వరంగల్ ల. వయో వృద్థుడు. ఆ కుటుంబానికి సంబంధించిన సంప్రదాయం ఒకటి చెప్పుకోవలసి వుండె. కొన్ని బ్రాహ్మల కుటుంబాలల్ల కూడ లోపాయికారీగా ఇస్లాం మతానికి సంబంధించిన వన్నీ అవలంబిస్తరని ప్రతీతి. పెద్దపల్లి దేశ్ ముఖ్ శ్రీ రామారావు గారికి మేనమామ వరస. సంవత్సరానికి కాష్ గ్రాంట్ అరవై వేలుండేదాయనకు. ఆయనకి ధర్మ సత్రాలుండేవి. రోజూ 50-60 మంది బ్రాహ్మలు భోంచేసెటోళ్లు. ఒక హోదా, స్టేటస్, పెత్తనం, దానికోసం వుండే అట్టహాసం అంతా వుండేటిది. ఆయన గురించి కూడా ఓ ప్రతీతి ఏమిటంటే లోపాయికారీగా ఆయన నమాజు చదువుతాడనీ, ఆయన బంధువులు కూడా చదువతరీను. ఈ శ్రీ రామారావు కూడా అంతే. వారింట్లో పూజలు, పునస్కారాలు గానీ, హిందూ సంప్రదాయానికి సంబంధించినవేమన్న గాని జరిగినట్లు ఎవరికీ తెల్వది. కాని ఇస్లాం మతానికి సంబంధించి నమాజు, రోజా (వుపవాసం) పాటించకుండా వుండేది కాదు. ఎక్కడికి పోయినా వాండ్ల ఇండ్లల్ల మంచి నీళ్లు తాగిన వాళ్లున్నరు. నమాజు మాత్రం చదవకపోయిరి. శ్రీ రామారావు బైట ఎక్కడా కూడ మంచి నీళ్లు కూడా తాగెటోడు కాదు. కాని నమాజు, రోజా మాత్రం పాటించేది. ఆయన చనిపోయిండు. మరి దహనం చేయాల్నా, సమాధి (గోరి) కట్టాల్నా అని లోపాయికారీగా చర్చలు జరిగినై. సాధారణంగ వరంగల్ ల ఎవరన్నా చనిపోతే అందరం స్మశానానికి పోయి దహనం చేసెటోళ్లం. ఈయన విషయంల బంధువులు అక్కడికి తీస్కపోతం, ఇక్కడికి తీస్కపోతం అని తర్జనభర్జనలు పడ్డరు. కొంతమంది ముస్లిం వకీళ్లు వచ్చి చూసి ఆయన ఇట్ల వుండె, అట్ల ఉండె, ఇక్కడనే సమాధి కడతం అన్నరు. కొసకు వాళ్ల బంధువులు ఆ శవాన్ని హైదరాబాద్ తీస్కపోయిన్రు. ఇంకో పెద్ద లాయరు ఆవంచ వెంకట్రావు గారు శ్రీ రామారావు గారికి స్నేహితుడూ, జూనియర్ అవడాన్ని ఆయనా పోయిండట. కొసకి బార్కసులో చాంద్రాయణగుట్ట అవతల గోరీ కట్టిండ్రని విన్న. అప్పుడు నేను ’గబ్బిలం చావు’ అని ఓ స్కెచ్ రాసిన. శవం వెంబడి పోయిన పెద్ద వకీలు గారిక్కూడ చూపిన. ఆయన కన్నడం, సంస్కృతం, ఉర్దూ, పారశీకం-అన్నింటా ప్రవీణుడే. తెలుగు సరేసరి. ఆ స్కెచ్ ల ఈ వకీలుగారిని పెద్ద పిట్టగా చెప్పిన. గబ్బిలం పక్షా, పశువా అని ఒక పాఠం చదివిన జ్ఞాపకం. చచ్చిన వాడు హిందువా, ముస్లిమా అనేది అట్నే తేలలేదు. ’ఇది కథ కాదు...కల్పన కాదు’ అన్నడాయన ఇది చదివి. ఈ విధంగా ఏదైనా సంఘటన జరిగితే దాన్ని తీసుకుని రచన చేయడం జరిగేది. దాన్నే రన్నింగ్ కామెంట్రీ అంటూంటా...."


"పరాభవ హేమంతం" శీర్షికతో కాళోజీ రాసిన ఆయన జీవితానుభవాల స్వగతం, ఆయన జీవన శైలికి అద్దం పడ్తుంది. తనకెలాంటి నియమ నిబంధనలు లేవని, ఎవరెక్కడికి రమ్మంటే అక్కడకే పోయేవాడినని అంటూ ఇలా చెప్పారు:

"నా జీవితంలో నేను వేరే పని పాటలు ఏమీ పెట్టుకోలేదు కాబట్టి, ఫలాని చోటుకి, ఫలాని రోజుకి పోవలె అనే నియమం లేదు. నాతోటి కలిసిన వాండ్లతో గంటో అర్థో మాట్టాడేవరకు వాండ్లతో ఆత్మీయత ఏర్పడ్డం, వాండ్లు ఇంకో దిక్కు పోదామంటే, వాండ్ల వెంబడి పడిపోవడం. అసలు ఇంటినుంచి బయల్దేరి పోదామనుకున్న ప్రదేశానికి పోకుండానే, మరో దిక్కు పోవడం చాలా సార్లు తటస్థించింది. నేను ఏ రోజున ఎక్కడ వుంటానో ఎవరికీ తెల్వది అన్న మాట. అంటే నావరకు నేను నిర్ణయించుకునేది లేదు. అటువంటి జీవితం గడిచిందన్న మాట నాటినుంచీ నేటిదాక.......మిత్రుల ఇండ్లకి పోయినప్పుడు భవనాలల్లనూ వున్న, గుడిసెల్లనూ వున్న. భవనంల విందు భోజనం చేసినా, గుడిసెల ఇంత రొట్టె తిని చాయ్ తాగినా నాకు ఒకటే. కాలినడకనీ తిరిగిన, కారుల్లోనూ పోయిన. అట్నే రకరకాల మనుషుల తోటి - సాహితీ పరులు, రాజకీయ వేత్తలు, సంఘ సంస్కర్తలు, ఏ రకమైన అభిప్రాయాలు లేని వాండ్లు - కలిసి గడిపిన. జైళ్లల రకరకాల నేరస్థులతో కలిసి మెలిసి వున్న. ఈ రకరకాల జీవితానుభవాల గురించి ’నా గొడవ’ (పరాభవ హేమంతం) లో వున్న స్వగతంలో రాసిన ఇలా:"

          "అతిథివోలె వుండి వుండి, అవని విడిచి వెళ్లుతాను...పల్లెపట్టణంబులనక పల్లేరై తిరిగినాను….మురికి నీటి నడుమ వున్న ఇరుకులలో ఇరికినాను….కూటి పేద తన కబళము నోటకీయ గుడిచినానుపూల వాసనలు నిండిన పాల రాతి మేడలలో ఆయాసము కలిగించేడి పాయసాలు మెక్కినాను…..వాయువుతో పోటీపడు వాహనాలు ఎక్కినాను...కంటకాల మధ్య నేను కాలనడక నడిచి నాను...కాలు బైట పెట్టకుండ కాలమెంతొ గడిపి నాను...గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారి నాను...లోయలలో దూకి దూకి లోతులెన్నొ చూచినాను...నే ప్రాకని ఎత్తులేదు...నేజారని లోతులేదు...మూలజేరి మునులవోలె మూగనోము బట్టినాను...ఈగవోలె దోమవోలె...వాగుచు తిరుగాడినాను...అతిథివోలె వుండి వుండి...అవని విడిచి వెళ్లుతాను".

సర్దార్ జమలాపురం కేశవరావు గారంటే కాళోజీకి అమితమైన గౌరవం. ఆయన మాటలు, చేతలు ఆయనకెంతో నచ్చాయి. తనతో ఆయన జైల్లో వున్నప్పుడు జరిగిన సంఘటనను, ఆయన వుదాత్తతను వివరించడంతో పాటు ఆయన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడైనప్పుడు తను రాసిన గేయాన్ని ఆత్మ కథలో ప్రస్తావించారు. తానూ, జమలాపురం ఒకేసారి వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం, ఎలా ఓడిన విషయం కూడా చెప్పారు.

"నేను వరంగల్ జైల్లో (1947) ఉన్నప్పుడు నిజాం మీద అంతిమ పోరాటం జరుగుతుండె. కాంగ్రెస్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నయి. అట్టనె వాటితో పాటు ప్రభుత్వ నిర్బంధం కూడా పెచ్చు పెరిగి పోయింది.......నా మీద పెట్టిన కేసు తీర్పు ప్రకారం నాకు సంవత్సరంన్నర శిక్ష. ఆ తీర్పొచ్చే సమయానికి తొమ్మిది నెల్ల నుంచీ నేను జైల్ల వున్న. చిన్న కట్టెపుల్లకి జండా పెడ్తె నేను పోయి పక్కనె నిలబడ్డను. జెండా వందనం చేస్తినని నా మీద కేసు. నిజానికి నేను నిలబడ్డనె గాని వందనమైతె చెయ్యలేదు. ఇది వాస్తవం. శిక్ష ఖాయం చేసి నన్ను బారక్ ల వేసిన్రు. జమలాపురం కేశవ రావు, హీరాలాల్ మోరియా, వల్లభి (అయితరాజు) రామా రావు, పాల్వంచ రంగారావు, ఊటుకూరు నారాయణ రావు, సి. వెంకట రావు, అప్పి వెంకట రాజయ్య-ఇలా పది, పదిహేను మంది వున్నం లోపట. వాండ్లతో పాటు నన్నూ పెట్టిన్రు......ఈ పదిహేను మందితోనె గడపాలె....బాగా తినెటోళ్లం. ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు వరకు చదువుకునెటోండ్లం. అప్పి రాజయ్య గారు ప్రహ్లాద చరిత్ర బాగా చదివి వినిపించేటిది. మోతుకూరి నారాయణ రావుగారు కూడా పురాణాలు బాగా చదివెటోడు. అందరికంటె పెద్దవాడు, మొదటి నుంచీ ఉద్యమంల వున్నవాడు కష్ట నష్టాలు ఓర్చినవాడు జమలాపురం కేశవ రావుగారు. వల్లభాయ్ పటేలుకి లాగానే ఈయనక్కూడా సర్దార్ బిరుదుండేది. అందరి బదులు తనొక్కడే పని చేస్తుండేవాడు. ఆయన తీరే అంత. చెత్తగిన పడివున్నప్పుడు ఎవరికి చెప్పినా వూడుస్తరు. కాని ఎవరికి చెప్పకుండా చీపురు తీసుకుని తనె వూడ్చెటోడు. ఒకరోజు నేను లోపలికి పోయి చూసేవరకు ఆయన వూడుస్తున్నడు. వల్లభి రామారావు అనే ఆయన కూచుని వున్నడు. ’ఏమయ్యా రామారావ్! పెద్దన్న అట్ల వూడుస్తుంటే నువ్వు కూచున్నవ్?’ అని అడిగిన. ’ఆ! అన్ని పనులూ తనే చేస్తున్నననే గొప్పదనం, కీర్తికోసం చేస్తున్నడు. చెయ్యనీ’ అని ఆయన అనగానే. ఈడ్చి చెంప మీద కొట్టిన. రామారావును ఓదార్చి నన్ను కోప్పడ్డరు కేశవ రావుగారు. అదీ ఆయన వుదాత్తత!"

"కందిలో సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన ఆఖరి ఆంధ్ర మహాసభ (1946 మే 10, 11 తేదీలలో) జరిగింది. నేనందులో పాల్గొన నందువల్ల కేశవరావు గారి గురించి ఒక గేయం రాసి మిత్రులతోటి అక్కడ చదవమని చెప్పి పంపిన. ఆ గేయం: ’ముస్తాబు చేసుకుని మోటర్ల వూరేగు మురిపెంబు నీ కేమి లేదన్నా...మొండి చేతుల అంగి మోకాలు దాక నీ మొలగుడ్దతోటి తిరుగు కేశన్న!...పల్లె బాటల బాధ ప్రజలతో బాటు నీ బరికాళ్లకె (చెప్పులు లేని కాళ్లు) బాగ గురుతన్నా!...సర్దారు నామంబు సహజ నామంబుగా సరిపోయింది నీకు కేశన్నా!...దిద్ది తీర్చని జుట్టు, ముద్దులొలకని మోము, పెద్దవానికి లోటు కావన్నా!...జబ్బులేని ఒళ్లు, డబ్బులేని జేబు, మబ్బులేని మనసు నీదన్నా!’. జమలాపురం కేశవరావు గారికి వెంకటపతి, నాగేశ్వర్రావు అని ఇద్దరి శిష్యులుండెటోళ్లు. ఈ ముగ్గురూ కలిసి తెలంగాణాలో ఊరూరా తిరుగుతూ, (అటుకులో, బొంగు పేలాలో, బుక్కుకుంటూ, బెల్లం నములుకుంటూ) ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేసిండ్రు. వాండ్లు తిరగని వూరు లేదని చెప్పవచ్చు. జమలాపురం కేశవరావు  గారు ఆజానుబాహుడు. ధోతి పైకి చెక్కుకునెటోడు. మంచి ఆహార పుష్టిగల మనిషి. ఏది దొరికితే అది తిని, నేలమీద పడుకునీ, బండలమీద పడుకునీ, కాగితాలు పరచుకుని వాటిమీద పడుకుని తిరిగినవాడు....ప్రహ్లాదునిది హరి భక్తి. వీండ్లది ప్రజా భక్తి. ప్రజాసేవకు సర్వం అంకితం చేసిచేసి తిరిగెటోళ్లు. పట్టుదల, కార్యదీక్ష, చొరవ, త్యాగం గల వాండ్ల కృషి వల్లనే ఈ ప్రజా వుద్యమాలు నడిచినై.....అసలు కార్యకర్తలు మాత్రం జమలాపురం లాంటి వాళ్లే".

"జమలాపురం కేశవరావు ఉత్తమోత్తముడు. సామాన్యుల్లో సామాన్యుడు. అసామాన్యుల్లో అసామాన్యుడు. 13 వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడాయనే. తర్వాత కాంగ్రెస్ లో కూడా ప్రముఖుడయిండు. జిల్లా కాన్ఫరెన్సులకి అధ్యక్షుడయిండు. ఆ మహానుభావుడు తాను అధ్యక్షుడిగా వున్న చోట, తన సహచరులతో పాటు పదేసి రోజులు కాంపు వేసి కూర్చుని గుంజలు పాతడం, పందిళ్లు వేయడం, తడికలు కట్టడం దగ్గర్నుంచీ ప్రతిదీ తాను కూడా చేసెటివాడన్న మాట. అతన్ని పెద్దన్నా’ అని పిల్చెటోన్ని.....1952 లొ వరంగల్లులో నేను పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డా. ఆ పార్లమెంటరీ నియోజక వర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి సర్దార్ జమలాపురం కేశవరావు పోటీ చేసిండు - కాంగ్రెస్ అభ్యర్థిగా. అటువంటి మహానుభావుడు, త్యాగి, ఉద్యమ శక్తిగలవాడు, కాంగ్రెస్ లోపట ఉండేటువంటి కుళ్లు, ద్వేషంతోటి ఓడిపోయిండు. కమ్యూనిస్ట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలిచిండు. పార్లమెంటు సీటూ గెలిచిండు. అది వుంచుకుని అసెంబ్లీ సీటు రిజైన్ చేసిండు....వర్ధన్నపేట బై ఎలక్షన్ లలో కేశవరావు గారు మళ్లీ నిలబడి ఓడిపోయిండు. కాంగ్రెస్ లో భేదాభిప్రాయాల వల్ల కేశవరావు ఓడిపోయిండు....కేశవరావు స్థానికుడు కాదు. ఆయనకి మధిర లోనో, ఎర్రుపాలెంలోనో టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచెటోడు. కాని టికెట్లు ఎలాట్ చేసినోండ్లు కుట్ర చేసిన్రు. హయగ్రీవా చారికి, బొమ్మకంటి సత్యనారాయణకి టికెట్లు రాకపోవడం గమనించాలె. కేశవరావు గారు మంచి నడి వయసులోనె చచ్చిపోయిండు".

ఎవరైనా తమకు అవమానం జరిగినప్పుడు ఏ విధంగా తమ కింద వారి మీద ప్రతీకారం తీర్చుకుంటారో తెలిపే విషయాన్ని సోదాహరణంగా వివరించారు కాళోజీ. అదే విధంగా కలిమి లేముల తేడా పాటించే విధానాన్ని కూడా చెప్పారు.

నా షష్టి పూర్తి హైద్రాబాదులో కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగింది. పి. వి. నరసింహారావు అప్పుడు మాజీ మంత్రి. కాంగ్రెస్ లో వున్నడు. సంచికకో గేయం రాసిండు. ఆ సభలో మాట్లాడుతూ...’కాళోజీ నాకంటె వయసులో ఆరు సంవత్సరాలు పెద్ద. చదువులో మాత్రం మూడు సంవత్సరాలె. చదువుకుంటున్నప్పుడు సీనియర్స్ కీ, జూనియర్స్ కి కూడా ఆయన నడవడి వుత్సాహం, వుత్తేజం కలిగించేటివి. అయితే మా పెద్దలు (పి. వి. భూస్వామి వర్గానికి చెందిన వాడు) కాళోజీ దగ్గరకు పోకండి, ఆయనతో మాట్లాడకండి, సావాసం పట్టకండి, అతను ఖతర్ నాక్ మనిషి అని చెప్పేవాండ్లు’ అన్నడు. ఇదన్నదెవరు? ముస్లిములు కాదు. ప్రభుత్వాధికారులు కాదు. పి. వి. నరసింహారావు గారి పెద్దలు. వారు భూస్వాములు, పట్వారీలు, పెత్తందార్లు. తమ పిల్లల్ని స్నేహితానికైనా కాళోజీ దగ్గరకు పోవద్దు, అతను ఖతర్ నాక్ మనిషి అనెటోళ్లన్నమాట......ఇక్కడ నైజాం సర్కార్, స్థానిక ముస్లిములు కాక మూడో ప్రమాదం పెత్తందార్ల నుంచీ కూడా వుండేది.......హిందువుల్లో కాపువాడు, రెడ్డి వాడు ఒకే దిక్కున కూర్చుని భోంచేయరు. దేశ్ ముఖ్ రెడ్డి, మామూలు రెడ్డిని పక్కన కూర్చో పెట్టుకోడు గద! బ్రాహ్మణ దేశ్ ముఖ్ తన పక్కన కరణాన్ని (బ్రాహ్మణ) కూర్చో బెట్టుకు భోంచేయడు. రాచ వెలమ వేరు, మామూలు వెలమలు వేరు. పెదకమ్మ వేరు, చిన కమ్మ వేరు. గద్వాల రాజావారూ, వనపర్తి రాజావారూ వేర్వేరు. ఒకే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులాల వాండ్లతో కలిసి మెలిసి వుండడం కలలో మాట. హిందువులలో ప్రతివారూ కూడ కొందర్ని గొప్ప వాండ్లని వాండ్లకి లొంగిపోవడం, కొందర్ని చిన్నవారని వాండ్లని లొంగదీసుకోవడం పరిపాటి. ఒకనితో తన్నులు తినేటోనికి ఇంకొకరిని తంతేగాని తృప్తిగాదు. దీనికో కథ చెప్తరు. ఒక తాశీల్దారు పేష్కారును తిట్టిండట. ఆ పేష్కారు గిర్దావరును తిట్టిండట. గిర్దావరు పటేలు, పట్వారీలను తిట్టిండట. వాండ్లు సుంకరివాడిని కొట్టి వాడి మీద విరుచుకు పడ్డరట. అతను ఇంటికి పోయి భార్యను కొట్టిండట, ఆ భార్య ఏం చేసిందీ? కుండలు బద్దలు కొట్టి తానే ఏడ్చిందట. అంటే ఎవరైనా సరే తమకు అవమానం జరిగినప్పుడు ప్రతీకారం తమ కింది వాని మీద తీర్చుకుంటరన్న మాట. తరతమ బేధాలు సమసిపోతే తమ పెత్తనం పోతుందని ఈ పెత్తందార్ల భయం".

కాలోజీకి తన గురువుగారు గార్లపాటి రాఘవరెడ్డి అంటే అమితమైన గౌరవం. ఆయన ఎలా తనను తీర్చిదిద్దిందీ, ఎలా తన కవితలను సరిచేసింది, బడి పలుకుల భాష అంటే ఏంటీ, పలుకు బళ్ల భాష అంటే ఏంటీ, గురువుగారి మీద విశ్వనాథ సత్యనారాయణ గారికి కలిగిన సదభిప్రాయం విషయం, విశ్వనాథ సత్యనారాయణ  ద్వంద్వ ప్రవృత్తి గురించి కూడా సవివరంగా చెప్పారు ఆత్మకథలో. అలాగే ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారిని తెలుగులో రాయడం మానుకోమని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వివరించారు.

"కవిత్వం విషయంలో నాకే సందేహం వచ్చినా ఆయనకి (గురువుగారు రాఘవరెడ్డి) చూపించి, సరి చేయించుకోవడం అలవాటు. యతి ప్రాసలు సరి చూడడం, మాట లేమైనా మార్చడం మాత్రమే ఆయన పని. నా ఐడియా, అభిప్రాయం మారకుండా చూసెటోడు. ఏది రాసినా గాని ’ఇదేంది? ఈ అభిప్రాయం బాగా లేదు’ అని ఎన్నడూ అనకపోయేటిది. భాషా శాస్త్రవేత్తలు ఏమంటారొకానీ, నా అభిప్రాయంలో ఈ యతి ప్రాసలు సామెతల్లో పుట్టినయ్. ప్రతి సామెతలోనూ యతో, ప్రాసో, అంత్యప్రాసో వుండడం వల్ల చప్పున మాటలు స్ఫురణకు వచ్చి జ్ఞాపకం పెట్టుకోడానికి వీలు. అయితే ఛందస్సు ఎక్కడ నుంచి వచ్చింది? దీన్ని శాస్త్రంగా తర్వాత రాసిన వాండ్లుండవచ్చు. భాష విషయంలో నాకింకో అభిప్రాయం వున్నది. (నా అభిప్రాయాన్ని శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అనే గొడవలో నేను పడదలుచుకోలేదు). భాష రెండు విధాలు - ఒకటి బడి పలుకుల భాష, మరొకటి పలుకు బళ్ల భాష. బడి పలుకుల భాష అంటే గ్రాంథిక భాషే - కావ్యాల్లో, గ్రంధాల్లో వాడిన మాటలు తీసుకోవడం, ఆవిధంగానే మాట్లాడ్డం, అట్నే రాయడం. అయితే పాత పుస్తకాల్లో పలుకు బళ్ల భాష లేదా? అంటే తక్కువే ననిపిస్తుంది. ఎందుకంటే ఈ మహానుభావులు సంస్కృత కావ్యాలు, తెలుగు కావ్యాలు చదువుకుని, అట్నే రాసిన వాండ్లు. వీరి కవిత్వాన్ని చూస్తే వీండ్లు పలుకు బళ్ల విషయంలో అంత పట్టింపుతోని వున్నట్టు లేదు. ఎంత పెద్ద వాళ్లయిన గానీ ’ఎంత గొట్టు పదం వేసినం? ఎంత క్లిష్ట సంస్కృత సమాసం వాడిన?’ అనే చూసిన్రు. నాది పలుకు బళ్ల భాష. బడి పలుకుల భాష కాదు. ఎట్టంటే అది నేను చదువుకోలేదు. నేను పంతుళ్ల దగ్గర ఆ భాషయినా, దానికి సంబంధించిన వ్యాకరణమైనా చదువుకోలేదు. అందువలన నాది పలుకు బళ్ల భాష.....మా గురువుగారు బతికి వుండగా నేను రాసిన వాటికీ, ఆయన చనిపోయినంక రాసిన వాటికీ బేధం వున్నది.....ఒక వేళ ఒక మాత తప్పు పడినా దానిని మార్చుకునేటిది లేదు. ఆ చెప్పే మహానుభావుడు లేడాయె......అయితే రాఘవరెడ్డి గారుంటే, ఇటువంటి తప్పు జరక్కకపోయేది.....అయ్యగారు - గార్లపాటి రాఘవరెడ్డి గారు నేను తప్పు చేసినా తన శిష్యుడిని ఎక్కడా సమర్థించలేదు".

          "విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సారి మా ఇంట వున్నప్పటి సంగతి. ఆయన మంచం మీద పడుకుని వున్నరు. ముందటి సోఫాలో నేను కూచుని మాట్టాడుతున్న. ఇంతలో రాఘవరెడ్డి గారు వచ్చిన్రు. నేను పరిచయం చేసిన - మా గురువు గారు, సంస్కృతం వచ్చును, తెలుగులో కవిత్వం రాస్తరు . విశ్వనాథ అట్నే పడుకుని ’రెడ్డి గారూ, ఏవన్నా రెండు పద్యాలు వినిపించండి’ అన్నడు. ఆయన నోటికి వేనవేల పద్యాలు వచ్చేటివి - తనవీ, వేరే వాళ్లవీ కూడా. మంచి పద్యం లక్షణం - అది వినగానే జ్ఞాపకం వుండి పోవాలె - అదే మంచి పద్యానికి గీటు రాయి అనెటోడాయన. తన వేణుగోపాల శతకంలోంచి ఒక పద్యం వినిపించిండు. వింటున్న విశ్వనాథ లేచి కూచున్నడు. రెండో పద్యం విని మంచం దిగిండు. సోఫాలో వున్న మాదగ్గరకి వచ్చి, రాఘవరెడ్డి గారి పక్కన కూచుని, రెండు చేతులూ పట్టుకున్నడు - సంతోషంతో కన్నీళ్లు! విశ్వనాథ ఎంతో ఆనందపడ్డడు. ఆయన వానమామలై వరదాచార్యుల వారి ’మణిమాల’ కావ్యానికి పీఠిక రాస్తూ, ’ఈ సారి వరంగల్ పోయి వచ్చినప్పుడు రాఘవరెడ్డి గారనే మంచి కవి పరిచయం కావడం, కాళోజీ గారి ఆతిధ్యం మర్చిపోలేని విషయాలు’ అన్నడు. విశ్వనాథ విచిత్రమైన వ్యక్తి. ప్రైవేటుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరి కవిత్వమైనా బాగుంటే మెచ్చుకునెటోడు. ప్రభావితుడయెటోడు. మంచి రసికుడనిపించేటిది. మరి వేదిక ఎక్కినప్పుడు ఏమయ్యేదో ఏమిటో, తానే తప్ప ప్రపంచంల కవిలేడన్నట్టు విచిత్రంగ మాట్టాడెటోడు. ఈ బేధం అంచనాకి అందదు.....వానమామలై ’మణిమాల’ కు పీఠిక రాసినప్పుడు విశ్వనాథ ’తెలంగాణాకు చెందిన కవులలో ఇతను ప్రసిద్ధుడు’ అని రాసిండు. అంటే తెలంగాణా కవులు వేరూ, ఆంధ్ర కవులూ వేరూ అన్న మాట. వాళ్ల స్టాండర్డ్ వేరు, వీళ్ల స్టాండర్డ్ వేరన్న మాట. అదీ విశ్వనాథ లాంటి పెద్దల దృష్టి!.....విశ్వనాథ స్ప్లిట్ - Split- పర్సనాలిటీ (ద్వంద్వ ప్రవృత్తి) మన అంచనాకి తట్టనిది అని మాత్రం తేల్చుకున్న సుమా!"

విశ్వనాథ సత్యనారాయణ గారితో కాళోజీ చెప్పిన మాట... "మీరు తెలుగుల రాసింది నా బోటి వాండ్లకు కూడా తెలివకపోయె. తెలుగుల రాయడం వల్ల తెలుగు రాని ప్రాంతం వాండ్లకి మీ ప్రతిభ తెల్వడం లేదు. కాబట్టి దయచేసి మీరు తెలుగు రాయడం మానుకుని సంస్కృతంలోనె రాస్తె సంస్కృతం తెల్సిన వాండ్లకి మీ ప్రతిభ బోధపడుతుంది. మీ స్థాయీ వాండ్ల కర్థమవుతుంది. మీరు తెలుగులో రాయడమెందుకు? మీ భాష అర్థం కాక మేం బాధపడడమెందుకు? ’నీకేం తెలుస్తుందిలే’ అని మీరనడమెందుకు? సంస్కృతంలో రాయండి". (విశ్వనాథ ప్రతిభ ఉత్తరాది వారికి తెలిసేటందుకు వీలుగా వారి "వేయి పడగలు" ని నాటి ప్రధాని పి. వి. నరసింహారావు "సహస్ర ఫణి" పేరుతో హిందీలోకి అనువదించిండు).

మడులు దడులు కట్టుకోవడానికి కాళోజీ వ్యతిరేకం. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెపుతారు ఆయన. దివంగత ముఖ్యమంత్రి అంజయ్య తెలుగు భాష మీద ఎలా గల్లంతు లేచింది, ఎలా కార్టూనులు వచ్చిందీ తెలియచేస్తారు. ఒకరి భాష విషయంలో, యాస విషయంలో ఎగతాళి చేస్తే అతడి ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని అంటారు.

"జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా మడులూ, దడులు కట్టుకోడం, గీతలూ, గిరులు గీసుకోవడం సరికాదని నేను భావిస్తను. మనం ఎప్పుడో ఒకప్పుడు బతుకు తెరువుకోసం ఎక్కడెక్కడికో పోతుంటం. ఎవరెవరితోనో వుంటూంటం. మనం అప్పుడు అక్కడ మందిలో ఒకరుగనే కలిసిమెలసి వుండాలె. నేను వేరు, వారు వేరు అనేటి ఆలోచనలే తప్పు. కాని బాగా చదువుకున్నోళ్లు, పెద్ద పెద్దోళ్లు కూడా ఇలాంటి ఆలోచనల్లోంచి అంత తేలిగ్గా బయటపడలేరు. తమకు అనుకూలమైన, తమకిష్టమైన మార్పు అయితే సంస్కారవంతమైన దనుకోడం, తమ కిష్టం కానిదైతే భ్రష్టమైన దనుకోడం, చెడిపోయిందనుకోడం తప్పు. తన విషయంలో, తన అలవాట్ల విషయంలో, తన చర్యల విషయంలో అయితె ఇంకో అభిప్రాయం మంచిది కాదు. నా ’ఇజం’ గేయంలో దీన్నే ఎండగట్టిన.....భాష, సాహిత్యం, సంస్కృతి, మనల్ని (తెలుగువాండ్లని) ఒకటి గనే వుంచెగద. నన్నయ్య మహాభారతం, పోతన భాగవతం, పెద్దన మనుచరిత్ర, విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి, రాయప్రోలు ఆంధ్రావళి, అడవి బాపిరాజు గోన గన్నారెడ్డి, అన్నే తెలుగు పుస్తకాలే. అవీ ఇవీ కూడా మనవే అని అప్పుడూ అనుకున్నం. ఇప్పుడూ అనుకుంటం. వాండ్లు వేరు, మనం వేరు అనే భావం తెలంగాణా వాండ్లకి ఎన్నడూ లేదు. కాని, వీండ్లూ మనవాండ్లే, వీండ్లదీ మన భాషే, వీండ్లదీ మన జీవిత విధానమే, అనేటి భావాలు, మా గురించి పైనుంచి వచ్చినోళ్లకి వుండేటివి కాదు. కాని తెలంగాణ లోపటి పరిస్థితి వేరు......కృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టులాగా ప్రతాపరుద్రుడు కూడా మన తెలుగువాడేనని మేమనుకునెటోళ్లం. నన్నయ్య తెలుగువాడు, తిక్కన తెలుగువాడు, ఎల్లయ్య తెలుగువాడు, పుల్లయ్య తెలుగువాడు అని మా అభిప్రాయం. సాహిత్యంతో పరిచయమున్న పది మందికే ఇది పరిమితం"

"మేం తెలుగువాండ్లం, మాది తెలుగు భాష, మాది తెలుగు సాహిత్యం అని మాకు చాలా గొప్పగా వుండేటిది. తెలంగాణా, రాయలసీమ - రెండూ కూడా కలిసి వుంటేనే అది తెలుగు రాష్ట్రమవుతది. మొదటి నుంచీ తెలుగు భాషకీ, సంస్కృతికీ, సాహిత్యానికి ఈ మూడు ప్రాంతాల వాండ్లూ కలిసికట్టుగనే తోడ్పడిన్రు. కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంక మాత్రమే మనం రాజకీయంగ ఒకటైనం. ఈ మాట మర్చిపోయి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణా వాండ్లు తెలుగువాళ్లే కాదన్నట్టు ఒక వ్యవహారముండేటిది గద! ఎవరిదాకానో ఎందుకు? ముఖ్యమంత్రి అంజయ్య (తెలంగాణా) తెలుగు మీద ఎంత గల్లంతు లేచిందీ! ఎన్ని కార్టూనులచ్చినై? అంజయ్య తెలుగు ఎంతచదువుకున్నడు అనేటిది అనవసరం. అతని ఇంట్లో భార్యా బిడ్దలతో గానీ, బయట ఇరుగు పొరుగుతో గానీ, తెలుగులోనె మాట్లాడిండు గద! అతని మాతృ భాష (తెలుగు) లో ఆరణాల కూలీగా కొన్ని వేల కూలీ సభల్లో మాట్టాడిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ఆరణాల కూలీగా పని చేసినోడు ముఖ్యమంత్రి కాకూడదా? కూలీల మాటలు తెలుగు భాష కాదనా? అందరిదీ తెలుగే. అందరం తెలుగోండ్లమే......రావి శాస్త్రి విశాఖ భాషని తెలుగు కాదని మేమూ, నల్గొండ వాండ్లది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగుకాదని బెజవాడ వాడు, బెజవాడ వానిది తెలుగు కాదని రాయలసీమవాడు - ఇట్లనుకుంటపోతె మన మధ్య సహృద్భావం ఎట్టొస్తది? మనమందరం తెలుగువాండ్లం అని చెప్పే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ - అత్మీయత ఏముంటది? ఒకని భాష విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బతింటది. దానికి వెల కట్టలేం....."

హైదరాబాద్ రేడియోలో బాలల కార్యక్రమంలో తెలంగాణా పిల్లలు పాల్గొనే అవకాశం రాకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఎలా కేవలం రెండు జిల్లాల భాషనే ఇతరులపై రుద్దే ప్రయత్నం జరిగిందో కూడా వివరిస్తారు.

"......... మన విద్యా శాఖ వారు వాడుక భాషలో పాఠ్య పుస్తకాలు పెడ్తమన్నరు. అవి ఎవరి వాడుక భాషలో రాయిస్తరు? కృష్ణా, గుంటూరు జిల్లాల వాడుక భాష అయితే వరంగల్ పోరడు ఎట్ట చదువుతడు?దీని వల్ల తర తరాల ప్రజకి ఎంతో ద్రోహం జరుగుతది. ఇవాళ పాఠ్య గ్రంధాలకి పరిమితమైన భాష రేపు ప్రభుత్వ కచేరీలకు, కోర్టులకు కూడా పాకుతుంది. ప్రామాణిక భాష అనో, శిష్టవ్యావహారిక భాష అనో పేర్లు పెట్టి ఒక గ్రాంధికాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం. నువ్వేదైనా పేరు పెట్టు. నీ వాడుక భాషలో నువ్వు రాస్తే నీ జిల్లా వాడికి సౌలభ్యం వుంటుంది. తక్కిన జిల్లాల వాండ్లు ఎన్నేళ్లు తపస్సు చేసినా నీ వ్యావహారికం, నీ యాస వాండ్లు రాయలేరు. ఇవాళ సినిమా భాష, పత్రికా భాష, టి. వి. ల భాష ఎవరిది? రెండు జిల్లాల వాండ్లదే కదా? అన్నిట ఈ రెండు జిల్లాల వాండ్లే ముందుంటరు. తక్కిన జిల్లాల వాండ్లు ఏ నాటికైనా ముందుకు రావడానికి వీల్లేదు. వారికి అడుగడుగున అసౌకర్యం. అడుగడుగునా కష్టమే......మన తెలంగాణా వాండ్లు ఏం మాట్టాడరాదు. ఏవో లెక్కలు చూపిస్తరు........హైద్రాబాద్ రేడియోలో బాలల కార్యక్రమం వుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచీ ఈ నాటి (1985) దాకా అంటే దాదాపు 30 ఏండ్లపాటు బాలల కార్యక్రమాలు వందలు వేలు జరిగి వుండాలె కదా. వీటిల్లో తెలంగాణా పిల్లలు (ఆడ మగ) ఎందరు పాల్గొన్నారు? ప్రతి ప్రోగ్రాంల 15 మందో, 20 మందో పాల్గొంటే అందుల తెలంగాణా పిల్లగాండ్లేరి? వాండ్ల వాడుక భాష ఏది? వాండ్లు కనపడరు. వాండ్ల భాష వినపడదు......బిరుదురాజు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడైనా  బాలానందంల పాల్గొన్నరా? వీండ్లంత పెద్ద పెద్దోండ్లు - వీండ్ల పిల్లలకే గతిలేకపోతే తక్కినోండ్ల పిల్లల గురించి చెప్పేటిదేముంటుంది?మాట్టాడాల్సిన పనే లేదు. ఎందుకంటే రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాస ఏదీ తెలంగాణాది కాదు.....".

{తూర్పు మల్లారెడ్డి, ఎబికె. ప్రసాద్, వాసుదేవరావు (ఉదయంలో ఉన్నప్పుడు), స్మైల్, మరికొందరు కాళోజీ అభిమానులు రికార్డు చేసిన కాసెట్ల ఆధారంగా ("మనిషి కథ" పేరుతో ముందుమాట రాసింది వరవరరావు) వెలువడిన కాళోజీ ఆత్మకథ "ఇదీ నా గొడవ" నుంచి సేకరణ-జ్వాలా}


Thursday, October 24, 2013

EXPERIENCES AS CHAPTERS: VANAM JWALA NARASIMHA RAO

EXPERIENCES AS CHAPTERS
VANAM JWALA NARASIMHA RAO

Former CPIM Rajya Sabha Member, practicing People’s Doctor, Civil Liberties Leader, Atheist, Literary figure, Communist Activist since his student days, indirect participant in Telangana Armed Struggle, Dr. Yalamanchili Radhakrishna Murthy, popularly known in his friends and admirers circle as YRK died of heart attack on 19th October 2013 in Hyderabad Care Banjara Hospital at the age of 86. While correcting the English version of his Biography in Telugu (“Anubhavaale Adhyaayaalu”) penned by me he had an attack and was moved to hospital. Having known him in general for the past 40 years and intimately for the last five years I would like to share few thoughts about Dr YRK.

Though not a member of the Communist Party till 1985, Dr. Yalamanchili Radhakrishna Murthy practiced in letter and spirit the principles propounded by Marx. Initially he worked for the undivided Communist Party and later supported Communist Party of India (Marxist) and took the Party membership only on the advice of CPIM Top Leader late Putchalapalli Sundarayya. He equally fulfilled the responsibilities that were given to him by the society.

Right from his childhood he is a non believer in God-an atheist. He imbibed rationalism too under the influence of Gora. His wife also followed the same path and practiced the same principles. There are no idols of worship in his residence. He is however, not a conservative as far as reading habit and acquiring knowledge is concerned. His conservatism is confined to food habits, sartorial aspects and smoking. He was imprisoned five times. In one such occasion, while in Warangal Central Jail he learnt about the six branches of Indian Philosophy, Bhagavad-Gita, Islam and the secrets of Ayurveda evincing interest.

After taking membership of the CPIM and after subsequently undergoing heart surgery, he transferred whatever he has earned earlier as Doctor, to his two sons and kept away from all sorts of financial dealings. He never took even a single rupee from Party. As long as he was bodily fir and sound he worked for the party. Unwillingly and unsuccessfully he contested direct elections thrice. Though he never expected he was nominated to Rajya Sabha and served full term of six years. Whatever remuneration he got as MP he credited in to party account keeping negligible amount for his living. He also credited the entire pension amount for which he was eligible to the party account and instructed his wife to do the same even after his death. During the last five to six years he engaged himself in reading, writing, spending time with friends and giving suggestions to the party whenever necessary and whenever he was asked.


While recollecting his memories as part of my interaction to write his biography, Dr YRK spoke about his five times jail term, and how he was put in five central prisons, his nomination to the Rajya Sabha, the work done by him as a member of the Upper House and how purposefully he spent the MP local area development funds allotted to him, his coming up in the life, the ups and downs in his life, his medical education, subsequent practice, his association with party and so on. YRK was disinclined to go deep into the unhealthy developments in the party either at district or state or for that matter national level. He simply commented: “Yes. There have been few developments in the Communist Party of India (Marxist) that made me un-happy. The future will decide about them. I am still a member of the Party. It is not fair to discuss the decisions that were taken within the Party.”

Radhakrishna Murthy hails from Jameedintakarru, village near Gudivada in Krishna district. Communist activists were there in his village. Mikkilineni Venkateswara Rao, Kolli Subba Rao, Jasti Punnaiah and SVS Prasad Rao were prominent among them. All of them used to read secretly, “Swatantra Bharat” a cyclostyled magazine brought out by Putchalapalli Sundarayya. YRK was admonished by his father, for reading it.  When he was in intermediate second year, All India Peasants Conference was held at Bezavada on a large scale. That was an historical event in the history of the communist party even till this day. YRK went to witness that conference along with his friends. There he saw for the first time, Chandra Rajeswara Rao, Putchalapalli Sundarayya, Chalasani Vasudeva Rao and Swami Sahajananda of Bihar who were on the dais.

            The Telangana armed struggle begun when YRK was pursuing his MBBS course. It was the result of the strength of the communists and upsurge of masses in the princely states after the Second World War. Though YRK directly did not participate, he was part of that extending his helping hand along with Putchalapalli Sundarayya, Makineni Basava Punnaiah etc. In 1949, just a day before the Independence Day, the Communist Party gave a call to observe it as a black day against the incident of Katuru and Yelamarru in which the police forced men and women to strip off their clothes. YRK and his friends were entrusted with the work of pasting posters on walls protesting the incident. A Beat Constable seeing them arrested and took to Police Station. DR YRK was jailed subsequently and thus for the first time he tasted Jail Life.

After his graduation in Medicine YRK for a while worked in Railway Hospital in Madras and later resigned to move to Khammam for private practice in 1953. He decided to follow certain principles in his profession. Initially there was no consultation fee. As the number of patients increased a consultation fee of Rs. 2 was introduced. He never forced the patients to go in for unnecessary investigations as part of diagnosis. When he thought that it is beyond his capacity to treat the case he referred to specialists. He treated members of the Communist Party and their family members free of cost. He always accepted whatever money was paid by those who were not in a position to pay for in-patient treatment and surgeries, and never charged the patients who died, however long the treatment was offered. Those who were able to pay used to pay him. YRK’s relations with the communist party grown gradually and he became more and more attached to party.

When several communist leaders all over the country were arrested in the backdrop of Indo-China war there were serious ideological debates. Its vibrations were evident in Khammam too. Though YRK did not have formal membership in the communist party then, he was strictly abiding by the decisions and policies of the Party. Many members of the Party and sympathizers used to meet at the residence of YRK on every Sunday and were engaged in ideological discussions under the aegis of “Marxist Forum.” The whole discussion in those days was called “The Great Debate.” This debate was widespread in the “Marxist Forum” also. It is a fact that this debate was a bit close to the views of the Communist Party of China which tried to oppose certain revisionist tendencies put forward by the Communist Party of Soviet Union. The “Marxist Forum” meetings were attended regularly by senior party leaders like Chirraavuri Laxminarasaiah (The the Municipal Chairman), Manchikanti Ram Kishan Rao (Former MLA) and several student leaders and youth. Along with YRK, prominent local advocates like Advocates KV Subba Rao and Bodepudi Radhakrishna used to take active part in conducting the activities of this form. The forum ridiculously was referred by some as “Sunday Syndicate!”

Since all the important leaders of the Party in the district were arrested, YRK pondered over how to keep the Party united and strengthen it till the arrested leaders are released. He sought the help of the local advocates Bodepudi Radha Krishna and KV Subba Rao to get the leaders released. These three in later years were called as “Intellectual Trio”. Perhaps they too then might not have thought that their initiative would become one day, the starting point for the “Indian Civil Liberties Movement.” The Intellectual Trio realized that release of Khammam leaders was not possible unless civil liberties committees were set up all over the state and also at national level. As the government has curtailed the civil rights the trio felt that there is a need to fight for the protection of those rights and seek the support of the CPI leaders also for such struggle. Thus the Civil Liberties Movement started.

The civil liberties movement became very active and fierce. The government, instead of responding to the resentment of the people and release the arrested leaders has resorted to repression of the leaders of the civil rights movement. Dr. YRK who was the source behind this movement and those who helped him were detained. YRK’s second Jail term began like that. YRK was also arrested third time and was sent to jail in 1974 during the large scale Railway strike lead by George Fernandez. Though Communist Party had nothing to do with that, still due to local politics YRK was sent to jail.

38 years ago curtains were raised for the dark era in the democratic India. The President of India has signed the proclamation of emergency on the midnight of June 25, 1975 which was the outcome of Indira Gandhi’s dictatorial decision to safeguard her political future. Dr. Radhakrishna Murthy was one amongst those put behind bars during emergency. YRK was taken to Warangal jail after the arrest. The 1977 general elections were notified and political prisoners were released from the jail. The state Party asked YRK to file nomination for the Khammam Lok Sabha constituency. After his release he attended the state conference of agricultural laborers at Nelakondapally. The police arrested YRK again. Thus YRK was arrested for the fifth time. After going to the jail again the schedule for the 1977 general elections in March was announced. She ordered the release of political leaders and activists that were arrested after the imposition of emergency. He signed the nomination papers when he was still in jail. After some time he was released since he was a candidate. Thus the fifth jail term of YRK came to an end.

Writing forward to his biography YRK said: “I am in my 84th year. At present I am a recluse. For livelihood I practiced medicine for long years. Because of sheer interest I was a political activist. In my middle-class way of life, like all others, I experienced ups and downs in my life and received bouquets and brickbats. Some praised me and others were hurt. My good fortune is I am regarded in my extended family and in the society too”.

Doctor is a multifaceted personality.


Wednesday, October 23, 2013

"ఖమ్మం ఆదివారం సంఘం" - "సండే సిండికేట్ ఆఫ్ ఖమ్మం" : వనం జ్వాలా నరసింహారావు

భారత పౌర హక్కుల ఉద్యమానికి 
శ్రీకారం చుట్టిన అలనాటి

"ఖమ్మం ఆదివారం సంఘం" 
"సండే సిండికేట్ ఆఫ్ ఖమ్మం"

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్య సభ సభ్యుడు, సిపిఎం నాయకుడు, పౌర హక్కుల ఉద్యమానికి ఏనాడో రాష్ట్ర-దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రముఖ వైద్యుడు డా. యలమంచిలి రాధాకృష్ణమూర్తితో ఐదేళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా)

          నిన్న మొన్నటి వరకూ మన మధ్యన వున్న మాజీ రాజ్యసభ సభ్యుడు, సిపిఎం రాష్ట్ర-జాతీయ స్థాయి నాయకుడు, సామాజిక కార్యకర్త, ప్రజా వైద్యుడు, నిరీశ్వరవాది, సాహిత్యాభిలాషి, తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచే విప్లవ భావాలను అలవరచుకున్న వ్యక్తి, పౌరహక్కుల నేత, ఖమ్మం జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న "సీమాంధ్ర తెలంగాణ వాసి", డాక్టర్ యలమంచిలి రాధా కృష్ణమూర్తి గారు తన 86 వ ఏట, అక్టోబర్ 19, 2013 న హైదరాబాద్ కేర్ బంజారా ఆసుపత్రిలో మరణించారు. వివిధ కోణాలలో డాక్టర్ గారి వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చు. గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్య శీలుడు, సమర్థుడు, నిబద్ధత కల వాడు, నిశ్చల సంకల్పుడు, కమ్యూనిస్టు సదాచారం మీరనివాడు, ప్రజలకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, సాహిత్యాభిలాషి, కోపమంటే ఎరుగని వాడు, ప్రతిభావంతుడు, వృత్తిలో నిపుణుడు, ప్రవృత్తిలో అసూయ లేనివాడు, వేదికపై ఉపన్యాసం ఇస్తే వైరి వర్గాలు కూడా మెచ్చుకునే సామర్థ్యం కల వాడు, మానవ విలువలకు కట్టుబడిన వాడు, పౌర హక్కులను కాపాడగలనని నిరూపించి "షోడశ కళల" ను పుణికి పుచ్చుకున్న అరుదైన మహామనిషి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి. ఆయన జీవన యానాన్ని "అనుభవాలే అధ్యాయాలు" పేరుతో గ్రంధస్థం చేసే అవకాశం ఆయన నా కిచ్చారు. ఆ నేపధ్యంలో డాక్టర్ గారిని ఎన్నో పర్యాయాలు కలుసుకున్నాను. అలాంటి ఒక సందర్భంలో ఆయన బీజం వేసి, రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకెళ్లిన పౌర హక్కుల ఉద్యమం గురించి సంభాషించడం జరిగింది. ఆయనకిష్ఠమైన పౌర హక్కుల ఉద్యమాన్ని మరో సారి గుర్తుచేసుకునే ప్రయత్నమే ఇది.

ప్రప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ చైనా పర్యటించి పంచశీల సూత్రం పఠిస్తూనే, సోవియట్ యూనియన్ తో మైత్రీ సంబంధాలు పెంపొందించుకుంటూ వచ్చారు. చైనా-సోవియట్ దేశాలతో భారత దేశం కొనసాగిస్తున్న సత్సంబంధాలతో నిమిత్తం లేకుండానే (ఉమ్మడి) భారత కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ విధానాలను కొన్నింటిని ఘాటుగా వ్యతిరేకించేది. సోవియట్ యూనియన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా-భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్ ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని సామ్యవాద-సామ్రాజ్యవాద దేశాల మధ్య సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభి ప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారితీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్ - చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజా నిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై 1964లో సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. సోవియట్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులు, 1964 అక్టోబర్- నవంబర్ లో కలకత్తాలో సమావేశమై కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)ను ఏర్పాటు చేయగా, రెండో వర్గం వారు మరో నెల రోజులకు బొంబాయిలో సమావేశమై, తామే అసలైన కమ్యూనిస్టుల మని ప్రకటించుకున్నారు.


యుద్ధం నేపథ్యంలో చైనా వాదులుగా ముద్రపడిన భవిష్యత్ కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకులను దేశవ్యాప్తంగా పి.డి. చట్టం కింద ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అలా అరెస్ట్ అయినవారిలో, పోలిట్ బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద కూడా తీవ్రంగా పడింది. తెలంగాణ సాయుధపోరాటం కాలం నుండే ఖమ్మం జిల్లాకు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుండడంతో ఆ జిల్లాలో ముఖ్యమైన కమ్యూనిస్ట్ నాయకులందరినీ నిర్భంధించింది నాటి ప్రభుత్వం పిడి చట్టం కింద. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న రోజుల్లో, సహజంగా దాని ప్రభావం ఖమ్మం కమ్యూనిస్టుల పైన కూడా పడింది. చాలా కాలం వరకు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోక పోయినా పార్టీ నిర్ణయాలను, విధానాలను తు.. తప్పకుండా ఆజన్మాంతం అమలు జరిపిన ప్రజా వైద్యుడు, డాక్టర్. యలమంచిలి రాధాకృష్ణమూర్తి (డాక్టర్ వై.ఆర్.కె.) ఇంట్లో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే గొడుగు కింద సమావేశమై సిద్ధాంత పరమైన విషయాలను చర్చించుకునే వారు. 1961వ సంవత్సరంలో ప్రారంభమై క్రమం తప్పకుండా జరుగుతుండే ఆ సమావేశాలకు, జిల్లా సీనియర్ నాయకులైన చిర్రావూరి లక్ష్మి నరసయ్య (ఎన్నో మార్లు ఖమ్మం మునిసిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు), మంచికంటి రాం కిషన్ రావు (1983లో ఖమ్మం ఎమ్మెల్యే), 25-30 మంది పుర ప్రముఖులతో సహా పలువురు విద్యార్థి నాయకులు, యువకులు హాజరయ్యేవారు. వారందరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పంథాకు అనుకూలురే కాకుండా, పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఎం లోనే వుండిపోయారు. స్థానిక కాలేజీ విద్యార్ధి నాయకులు కూడా వస్తుండడంతో ఆ వేదిక కింద మార్క్సిజం-లెనినిజం అధ్యయన తరగతులు నిర్వహించడం కూడా జరిగేది.

ఈ నేపధ్యంలో పార్టీ చీలిపోవడం, సిపిఎం నాయకులందరూ నిర్బంధానికి గురికావడం జరిగాయి. ఇంట్లో తను స్థాపించిన మార్క్సిస్ట్ ఫోరం కింద నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న వారంతా సిపిఎం పక్షాన చేరడంతో అది తనకో నైతిక విజయంగా భావించారు డా. రాధాకృష్ణమూర్తి. పార్టీ పట్ల, సిద్ధాంతాల పట్ల సంపూర్ణ విశ్వాసమున్న డా. వై.ఆర్.కె. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి అనుకూలురైన ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులందరూ అరెస్ట్ కావడంతో వారంతా విడుదలయ్యే వరకూ పార్టీని ఏకతాటిపై నడిపిస్తూనే, ఏ విధంగా బలోపేతం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు. వారి విడుదలకెలా ప్రయత్నం చెయ్యాలన్న ఆలోచనలో భాగంగా స్థానిక అడ్వొకేట్లయిన బోడేపూడి రాధ, కె.వి.సుబ్బారావుల మద్దతు పొందారు. ఆ ముగ్గురి (మేధావుల) కలయికే భవిష్యత్ "భారత పౌర హక్కుల ఉద్యమానికి" నాంది అవుతుందని బహుశా ఆనాడు వారూ-ఎవరూ ఊహించి ఉండరు. ఆశ్చర్యకరమైన విషయం అప్పటికి, ఆ ముగ్గురు కూడా పార్టీ సానుభూతి పరులే కానీ సభ్యులు కాకపోవడం.

ముగ్గురూ వారి వారి వృత్తుల్లో నిరంతరం బిజీగా ఉండే వారు కావడంతో పార్టీ పరమైన పనికి ఎక్కువగా రాత్రి వేళలు కేటాయించేవారు. ఆపాటికే ఆదరణ పొందిన "మార్క్సిస్ట్ ఫోరం" వేదిక కార్యకలాపాలు ముమ్మరం చేసారు. అప్పట్లో వారికదో పెను సవాల్. ఒకవైపు సిపిఐ నాయకత్వమంతా (ఆ పక్షాన ఖమ్మం జిల్లాలో చేరింది అతి కొద్ది మందే అయినప్పటికీ కూడా) ఏకతాటిపై పని చేస్తూ, సిపిఎం కార్యకర్తలను తమ వైపుకు ఆకర్షించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. సిపిఐ పక్షాన జిల్లా అగ్రనాయకుల్లో ఒకరైన ఎన్. గిరి ప్రసాద్ ఉండడంతో అది మరో సవాలుగా మారింది. నిజానికి చీలికొచ్చేంత వరకూ గిరి ప్రసాద్ సిపిఎం పంథాకు అను కూలంగా ఉండేవారని అనుకునేవారు. మొత్తం మీద రెండో స్థాయి నాయకత్వం, మేధావి త్రయం మార్గదర్శకంలో చేసిన కృషి ఫలితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని పటిష్ట పరచగలిగారు. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో కాని ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండే సమావేశాలకు హాజరయ్యే వారిని ఆదివారం సంఘంగా- "సండే సిండికేట్" గా ఎద్దేవా చేస్తూ, పిలవడం జరిగేది ఓ రకమైన హేళనతో అప్పట్లో. ఇప్పటికీ ఆదివారం సంఘంతో అనుబంధమున్న వారు ఆ జిల్లాలో పలువురున్నారు.

నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావి త్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆ రోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు నచ్చ చెప్పారు మేధావి త్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్ ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను- ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్లలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పిడి యాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల కమిటి, పి.యు.డి.ఆర్, పంజాబ్ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, .ఎం.ఎస్ లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్ ఎన్.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లో ఉన్న సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావి త్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందల మంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి., సీ.పి.ఎం పార్టీ వారితో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది. సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వర రావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం పార్టీకి చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా బహిరంగ సభకు హాజరవ కూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం-డాక్టర్ వై ఆర్. కె, బోడేపూడి రాధ, కె. వి. సుబ్బారావులు.

.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్. ప్రసాద రావులను, సభ్యులుగా కర్నాటి. రామ్మోహన రావు-డాక్టర్. వై. రాధా కృష్ణమూర్తి లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్ని సభాముఖంగా బహిరంగ పరిచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాల రావులున్నారు. నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి వై. ఆర్. కె కు ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంత రావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావి త్రయం"-డాక్టర్. వై. ఆర్. కె, బోడేపూడి రాధ, కే. వి. సుబ్బారావు లను, వారితో పాటు అడ్వొకేట్ కర్నాటి రామ్మోహన రావును, రాష్ట్ర వ్యాప్తంగా వున్న దిగువ స్థాయి నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం. వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు-బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు-సభ జరిగింది. .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాల రావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది.

సరిగ్గా అదే రోజుల్లో, ఆ పాటికే అరెస్ట్ జైలు జీవితం గడుపుతూ అనారోగ్యానికి గురైన ప్రముఖ సీ.పి.ఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెరోల్ పై విడుదల చేసి, చికిత్స కొరకు సోవియట్ యూనియన్ పంపించి, కుదుట పడింతర్వాత ముషీరాబాద్ జైలుకు తీసుకొచ్చారు. ఖమ్మంలో అరెస్టయిన నలుగురినీ (వై.ఆర్.కె, బోడేపూడి రాధ, కే.వి.సుబ్బారావు, కర్నాటి రామ్మోహన రావు) కూడా ముషీరాబాద్ జైలుకే పంపారు. ఆ విధంగా వీరికి ఆపాటికే జైలులో వున్న సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి లాంటి ప్రముఖులందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మాస్కో నుండి తిరిగి వస్తూ ఢిల్లీలో ఇందిరా గాంధిని, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డిని కలుసుకుని అరెస్టులపై తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు సుందరయ్య. డాక్టర్. రాధాకృష్ణమూర్తి అరెస్ట్ విషయాన్ని ప్రశ్నించిన సుందరయ్యతో "మీకంటే అతడే ప్రమాదకరమైన వ్యక్తి" అని జవాబిచ్చాడు బ్రహ్మానంద రెడ్డి. ఆ విషయాన్ని స్వయంగా వై.ఆర్.కె కు తెలియచేసిన సుందరయ్య, పౌరహక్కుల ఉద్యమ ప్రభావం అంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని కుదిపేసినందుకు ఆయన్ను-మేధావి త్రయాన్ని అభినందించారు.

ఇక అప్పటినుంచి ఉద్యమాన్ని జైలునుంచే కొనసాగించాలని నిర్ణయించారు నాయకులందరు. న్యాయ పోరాటం చేయాలనుకొని, "హెబియస్ కార్పస్ పిటీషన్" వేయాలని భావించారు. జైల్లోనే కర్నాటి న్యాయశాస్త్రంలో పరీక్షలకు తయారయి, జైల్లో వుంటూనే రాసి, డిగ్రీ తెచ్చుకొని, భవిష్యత్ లో విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. కే. వి. సుబ్బారావు హైకోర్టును, వై ఆర్. కె, బోడేపూడి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ న్యాయవాది కన్నభీరన్ వీరికి సహాయపడేందుకు ముందుకొచ్చాడు. కే.వి. సుబ్బారావు పిటీషన్ ను హైకోర్ట్ కొట్టివేసింది. వై ఆర్. కె, బోడేపూడిల పిటీషన్ విచారణకు వచ్చినప్పుడు వారిని ఎలా ఢిల్లీకి తీసుకుపోవాలని చర్చించిన ప్రభుత్వం చివరకు తీసుకున్న నిర్ణయం వారిద్దరినీ ఆశ్చర్య పరిచింది. భద్రతా కారణాల వల్ల, ఒక సీనియర్ పోలీసు అధికారి వెంటరాగా, విమానంలో ఢిల్లీకి తీసుకుపోయి, విచారణ ముగిసేంతవరకూ వారిద్దరినీ తీహారి జైల్లో వుంచారు. అదే వారికి మొదటి విమాన ప్రయాణం. వీరు అక్కడకు చేరేటప్పటికే, అదే తీహారి జైలుకు, హెబియస్ కార్పస్ పిటీషన్ విచారణ కొరకు ప్రముఖ నాయకులైన సుందరయ్య, బసవ పున్నయ్య, . కె. గోపాలన్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బీ. టి. రణదివే, హరే కృష్ణకోనార్, నాగభూషణం పట్నాయక్ లాంటి వారందరినీ తరలించింది ప్రభుత్వం. వారందరూ ఒక ప్రణాళిక ప్రకారం అనధికారికంగా పోలిట్ బ్యూరో సమావేశం జరుపుకునేందుకు జైలుకు చేరారు!

తమ పిటీషన్ విచారణకొరకు వై. ఆర్. కె, కే. వి. సుబ్బారావులు రెండో పర్యాయం కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. తమ కేసును వారే స్వయంగా వాదించుకున్నారు. అప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయం నిర్బంధాలకు వ్యతిరేకంగా వెల్లువెత్తడంతో, ఏప్రియల్ 29, 1965 , పీ. డి చట్టం కింద అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ విషయాన్ని కోర్టుకు తెలియచేసింది. ఆ సాయంత్రమే సుందరయ్యగారిని తీహారి జైలునుంచే విడుదల చేసింది ప్రభుత్వం. ఆయనతో కలిసి హైదరాబాద్ తిరిగొచ్చిన వారిద్దరినీ ముషీరాబాద్ జైలునుంచి మర్నాడు విడుదల చేసారు. ఖమ్మం తిరిగొచ్చిన వారందరికీ, "నభూతో న భవిష్యతి" అన్న చందాన రైలు స్టేషన్ లో స్వాగతం లభించింది.

ఈ నేపధ్యంలో, చాలాకాలం తర్వాత 1982 సంవత్సరంలో, ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రాతిపదికగా-రాజకీయ, పౌర హక్కుల వేదికగా-పౌర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా, విస్తృత పరిధి పౌరహక్కుల ఉద్యమ సంస్థను నెలకొల్పాలని సుందరయ్య భావించారు. అది కేవలం సీ. పి. ఎం నాయకత్వంలో నడిచేదిగా వుండరాదని, అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో నడపాలని అనుకున్న ఆయన, ఆ బాధ్యతను డాక్టర్. రాధాకృష్ణమూర్తికి అప్ప చెప్పారు. ఎన్టీఆర్ సారధ్యంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరుగనున్న రోజులవి. వై.ఆర్.కె సంప్రదించి ఉద్యమానికి ఒప్పించిన వారిలో సీ. పి. . కి చెందిన గిరి ప్రసాద్-సురవరం సుధాకర రెడ్డి, బీ. జె. పి కి చెందిన రామారావు, జనతా పార్టీకి చెందిన బాబుల్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకుడు నాదెండ్ల భాస్కర రావులతో సహా గౌతు లచ్చన్న లాంటి ప్రముఖులెందరో వున్నారునవంబర్ 1982 లో విజయవాడలో నిర్వహించిన సదస్సుకు జస్టిస్. జీవన రెడ్డి, రఘునాధ రెడ్డి కూడా హాజరయ్యారు. రఘునాధరెడ్డిని అధ్యక్షుడుగా సుందరయ్య ప్రతిపాదించినప్పుడు, ఆయనకు ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరా గాంధి హయాంలో వున్న అనుబంధం వల్ల, కొంత వ్యతిరేకత వచ్చింది. గతం తవ్వుకోవద్దని భావించి, సుందరయ్య ప్రతిపాదనకు అందరు అంగీకరించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వై. ఆర్. కె, కార్యదర్శులుగా ఎ. పి. విఠల్, సురవరం సుధాకరరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులతో ఏ. పీ. సీ. ఎల్. ఏ పేరుతో పౌర హక్కుల ఉద్యమ సంస్థ ఆవిర్భవించింది మరో మారు. 1989 వరకూ దాని కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా సాగేవి. వార్తా బులెటిన్ కూడా వెలువడేది. దరిమిలా వై. ఆర్. కె పూర్తి స్థాయి సీ. పి. ఎం సభ్యుడయ్యారు. ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ అనంతరం రఘునాధరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చారు. పౌర హక్కుల ఉద్యమ పూర్తి బాధ్యతను నిర్వహించేవారు లేకపోవడంతో కార్యకలాపాలు ఆగిపోయినా ఏదో ఒక రూపంలో ఉద్యమం కొనసాగుతూనే వుంది.


అలనాడు "ఖమ్మం ఆదివారం సంఘం" వేసిన పునాదులపై లేచిన పౌర హక్కుల ఉద్యమం వివిధ రకాలుగా వూపందుకుంటున్నదనాలి. ప్రభుత్వాలు కూడా హక్కుల పరిరక్షణ తమ బాధ్యతగా పరిగణిస్తున్నారిటీవల కాలంలో. జాతీయ మానవ హక్కుల కమీషన్, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమీషన్లు అందులో భాగమే. ఒక విధంగా వాటి పనితీరు చాలా తృప్తికరంగా వుందనాలి. ప్రభుత్వాలు కూడా వాటి ఆదేశాలను అమలు పరుస్తున్నారు. అయినా జరగాల్సిందెంతో వుంది.