Monday, March 31, 2025

శ్రీ మహాభాగవత కథ-29 .... భూమి నైసర్గిక స్వరూపం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీ మహాభాగవత కథ-29

భూమి నైసర్గిక స్వరూపం

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-03-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

శుకయోగి పరీక్షిన్మహారాజుకు భూనైసర్గిక స్వరూపాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు. 

ఈ భూమి ఒక పద్మం. దానికి మధ్యన జంబూద్వీపం ఉన్నది. దీని పొడుగు లక్ష యోజనాలు. వెడల్పు లక్ష యోజనాలు. ఇది తామర ఆకులాగా గుండ్రంగా ఉంటుంది. ఈ ద్వీపంలో వర్షాలు అనే విభాగాలున్నాయి. ఇవి తొమ్మిది. ఒక్కొక్క వర్షానికి వైశాల్యం తొమ్మిది వేల యోజనాలు. ఈ వర్షాలను విభజిస్తూ ఎనిమిది పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. తొమ్మిది వర్షాలలో మధ్యదాని పేరు ‘ఇలావృతం’. దీనికి మధ్యభాగంలో బంగారు రంగుతో ‘మేరు పర్వతం’ ఉంది. భూమి అనే పద్మానికి నడుమ మేరు పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అది పద్మానికి మధ్యన ఉండే బొడ్డులాగా శోభిస్తూ ఉంటుంది. మేరువు కులపర్వతాలకు రాజు లాంటిది. దాని స్థితి దేవతలకే అర్థంకాకుండా, అంతుపట్టకుండా, విడ్డూరం కోల్పుతూ ఉంటుంది. (ఇలావృతం అంటే భూమి చేత ఆవరించబడ్డదని. భూగోళానికి నడిమి భాగం నాభి. ఇది భూగర్భానికి, భూమధ్యరేఖకు సూటిగా లోపాలు వైపున ఉంటుంది. మేరువు అంటే ఇరుసు, అంటే భూపరిభ్రమణానికి కేంద్రం, అని అర్థం. దేవతలు కూడా మేరువు మహిమకు ఆశ్చర్యపడతారంటే, భూపరిభ్రమణం ఎలా జరుగుతుందో ఎవ్వరికీ అంతుచిక్కని పరమేశ్వరుడి లీల!).

మేరు పర్వతం ఎత్తు లక్ష యోజనాలు. దాని శిఖరం ఎత్తు పదహారువేల యోజనాలు. ఈ శిఖరం భూమిలోకి కూడా పదహారువేల యోజనాల లోతుకు చొచ్చుకుని ఉంటుంది. ఈ శిఖరం వైశాల్యం 32 వేల యోజనాలు. మేరువుకు ఉత్తరం వైపు నీలం, శ్వేతం, శృంగవత్తు అనే పర్వతాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇవి రెండు వేలయోజనాల విస్తీర్ణం ఉంటాయి. ఇవి తూర్పు పడమరలకు, దక్షిణ ఉత్తరాలకు విస్తరించి ఉన్నాయి, ఇదొక రమ్యమైన దృశ్యం! ఈ ‘నీలశ్వేతశృంగవత్తు’ పర్వతాలనే సరిహద్దు పర్వాతలని కూడా అంటారు. వీటికి తూర్పున, పడమరన, చిట్టచివర, ఉప్పు సముద్రాలు తాకుతూ ఉంటాయి. అంటే, తూర్పు పశ్చిమాలవైపు ఉప్పు సముద్రాలు తాకేవరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయన్నమాట. ఇవి ఉత్తరం వైపు ఒకదానికంటే మరొకటి పదవ వంతు పొడుగు తగ్గుతూ ఉంటాయి. వీటి మధ్య ప్రదేశంలో రంయకం, హిరణ్మయం, కురు అనే పెర్లుకల వర్షాలున్నాయి. అవి తొమ్మిదివేల యోజనాల మేర విస్తరించి ఉన్నాయి. ఉప్పు సముద్రాల దాకా ఇవి వ్యాపించి ఉన్నాయి. ‘నీలశ్వేతశృంగవత్తు’ పర్వతాల మధ్యనున్న కొలతలలో సరిపడి ఉంటుంది ఈ వర్షాల విస్తీర్ణం. 

ఇలావృత వర్షానికి దక్షిణం వైపున నిషధం, హేమకూటం, హిమవంతం అనే పర్వతాలున్నాయి. అవి సరిహద్దు పర్వతాలు. తూర్పునుండి పడమరకు పొడవుగాను, ఉత్తరంనుండి దక్షిణానికి వెడల్పుగాను నీలాది పర్వతాల మాదిరిగానే ఇవీ నెలకొని ఉంటాయి. ఈ పర్వతాల మధ్య ప్రదేశంలో మూడు వర్షాలున్నాయి. కింపురుష వర్షం, హరి వర్షం, భారత వర్షం ఆ మూడిటి పేర్లు.  ఇలావృత వర్షానికి పడమట మాల్యవంత పర్వతం, తూర్పున గంధమాదన పర్వతం సరిహద్దు గిరులు. ఈ పర్వతాలు రెండూ, ఉత్తరం వైపు నీలం, దక్షిణం వైపు నిషధం అనే పర్వతాల వరకు పొడవుగా ఉంది, రెండువేల యోజనాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఆ మాల్యవంత, గంధమాదన గిరులు కేతుమాల వర్షానికి, భద్రాశ్వ వర్షానికి హద్దును నిర్దేశిస్తున్నాయి. 

మేరు పర్వతానికి నాలుగు దిక్కులలో నాలుగు పర్వతాలున్నాయి. అవి: తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పశ్చిమంలో సుపార్శ్వ పర్వతం, ఉత్తరంలో కుముద పర్వతం. ఇవి ఒక్కొక్కటి పదివేలయోజనాల ఎత్తు, పదివేలయోజనాల వైశాల్యం కలిగి ఉన్నాయి. ఇవి మధ్యలో ఉన్నతంగా, స్తంబంలా ఉన్న మేరువుకు చుట్టూ నాలుగు చిన్న స్తంబాలలో ఉంటాయి. ఈ నాలుగు పర్వతాలలో (మందరం) మామిడి, (మేరువు) నేరేడు, (సుపార్శ్వం) కదంబ, (కుముదం) మర్రి చెట్లు బాగా ఎత్తుగా పెరిగి పతాకాలలా ఉంటాయి. ఈ చెట్లు పదకొండు యోజనాల ఎత్తు, అంటే వైశాల్యంతో ఉంటాయి. ఈ పర్వతాల శిఖరాలమీద నాలుగు మడుగులున్నాయి. మందర పర్వత శిఖరం మీద పాలతో నిండిన మడుగు, మేరువులో తేనె నిండిన మడుగు, సుపార్శ్వంలో చెరకు రసం నిండిన మడుగు, కుముదంలో మంచినీళ్లు నిండిన మడుగు ఉన్నాయి. వాటిల్లో నిష్టగా స్నానం చేసినవారు సహజమైన సిద్ధుల వైభవాన్ని పొంది ఉంటారు. ఈ పర్వత శిఖరాల మీద నాలుగు ఉద్యానవనాలున్నాయి. ఇవి దేవోద్యానాలు. నందనం, చైత్రరథం, వైభ్రాజికం, సర్వతోభద్రం అని ఆ వనాల పేర్లు. వీటిలో దేవతా శ్రేష్ఠులు అప్సరసలతో కలిసి, గంధర్వ గానాన్ని వింటూ విహరిస్తారు.

మందర పర్వతం చివరనున్న మామిడి చెట్ల పళ్ళు కొండమీద రాలి, చితికి, వాటి రసం అద్భుతమైన నదీ ప్రవాహంగా మారింది.దాని పేరు అరుణోదం లేదా అరుణోనది. ఆ నదిలో పార్వతీదేవికి అనుచరులైన పుణ్యస్త్రీలు స్నానం చేస్తారు. మేరు పర్వతాల మీద ఉన్న నేరేడు చెట్ల జంబూఫలాలు మగ్గి వాటంతట అవే రాలిపోయి, చిట్లి, ఆ రసం అమృత ప్రవాహంలాగా పారుతుంది. ఆ జంబూ ఫలాల రస ప్రవాహమే జంబూ నది. ఇది ఇలావృత వర్షానికి దక్షిణాన భూముల్లో ప్రవహిస్తుంది. ఆ నదీజలాల ఇసుక జంబూ నదీ రసంతో తడపబడి సూర్య కిరణాలకు, గాలికి బంగారంగా మారుతుంది. అందుకే స్వచ్చమైన బంగారానికి ‘జాంబూనదం’ అన్న పేరు వచ్చింది. దేవతలలో ముఖ్యులు ఈ జాంబూనదాన్ని ఆభరణాలుగా ధరిస్తారు. ఈ బంగారం మంచి వన్నె కలది. సుపార్శ్వ పరవటం పైకొన నుండి ఐదు తేనె ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఐదు ముఖాలుగా ఆ ప్రవాహం సాగుతుంది. ఈ ధారలు ఇలావృత వర్షం పడమటి భాగాన్ని తడుపుతూ వుంటాయి. కుముద పర్వత శిఖరం మీద పుట్టిన ఒక పెద్ద మర్రిచెట్టు (శతవల్మ) కొమ్మల నుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం, విశిష్టమైన అన్నం కిందకు ఇలావృత వర్షం మీదకు జారుతాయి. అలాగే మానవుల కోర్కెలు తీర్చడానికి, బట్టలు, మంచాలు, ఆసనాలు, నగలు మొదలైన వస్తువులు ఇలావృత వర్షం మీద కుముద పర్వతం నుంచి వచ్చి పడతాయి.       

మేరు పర్వతానికి చుట్టూ కురంగ, కురర, కుసుంభ, వైకంకత, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శితివాస, కపిల, శంఖ (వైడూర్య చారుధి హంస విహంగా ఋషభ నాగ కాలంజర నారదాది) పర్వతాలుంటాయి. తూర్పు వైపున జఠరం, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పశ్చిమాన పవన, పారియాత్రాలనే పర్వతాలున్నాయి. ఇవి ఒకదానికొకటి పద్దెనిమిది వేల యోజనాలు దక్షిణం నుండి ఉత్తరానికి పొడవుగా వ్యాపించి ఉంటాయి. తూర్పు నుండి పశ్చిమానికి రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. మేరువుకు దక్షిణ భాగంలో కైలాస, కరవీర పర్వతాలున్నాయి. ఉత్తర భాగంలో త్రిసృంగ, మకర పర్వతాలున్నాయి. వీటి పొడవు వెడల్పులు కూడా పై పర్వతాల ప్రమాణంలోనే ఉంటాయి. మేరునగానికి ఇలా ఎనిమిది పర్వతాలూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఉంటాయి. మేరు శిఖిరంలో మధ్య భాగాన పదివేల యోజనాల వెడల్పు, అంతే ప్రమాణం పొడవు ఉండి (సమచతురస్రంగా) బంగారుమయమైన ఒక పట్టణం ఉంది. దాని పేరు బ్రహ్మ పురం లేదా శాతకౌంభి. ఈ బ్రహ్మ పురానికి ఎనిమిది దిక్కుల్లోనూ 280 వేల యోజనాల లోకపాలకుల పురాలున్నాయి. వాటి పేర్లు: అమరావతి, తేజోవతి, సంజ్ఞమణి, కృష్టాంగన, శబ్దావతి, గంధవతి, మహోదయ, యశోమతి.      

బ్రహ్మ పట్టణంలో పూర్వం హరి వామనావతారం ఎత్తి ఎదిగినప్పుడు ఆ త్రివిక్రముడి కాలిగోటి దెబ్బకు ఉర్ధ్వాండం పగిలిపోయింది. ఇలా అపగిలిన బ్రహ్మాండం పై భాగంలో కన్నం పడి నీటిధార అండంలోకి ప్రవేశించింది. ఆ జలదార శ్రీహరి కాలిని తాకడం వల్ల సకల జనుల పాపాల్ని నశింప చేస్తూ, ‘భగవత్పది’ (విష్ణుపది) అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఆ పుణ్యధార చాలాకాలం స్వర్గంలో విహరించింది. అదే విష్ణుపదం (ఇది ద్యులోకం). ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు ఉండే మండలం అదే. భగవత్పది ధ్రువమండలం చేరి కొన్ని యుగాలయింది. ధ్రువమండలానికి కింద సప్తర్షిమండలం ఉంది. సప్తర్షులూ ఆకాశగంగను తమతమ జటాజూటాలలో ధరిస్తూ ఉంటారు. ఆ నది ఆక్కడ నుండి అసంఖ్యాకమైన విమానాలు ఆవరించి, కిక్కిరిసి ఉన్న మార్గాల గుండా వచ్చి, విశాలమైన దేవయాగ మార్గం ద్వారా చంద్ర మండలాన్ని చుట్టి, తడిపి, మేరు పర్వత శిఖరమందున్న బ్రహ్మలోకం మీద పడుతోంది. అక్కడ నాలుగు ద్వారాలలోనూ నాలుగింటిగా విడిపోతుంది. విష్ణుపదికి ఇక్కడా నాలుగు పేర్లు. అవి: సీత, అలకనంద, చక్షువు, భద్ర. ఈ నాలుగు నదులూ దీర్ఘంగా ప్రవహించి ఉప్పు సముద్రంలో కలుస్తాయి. ఇలా ప్రవహిస్తోంది విష్ణుపది. 

నాలుగింటిగా విడిపోయి ప్రవహిస్తున్న ఈ నది పాయలలో సీతానది తూర్పు వైపు ప్రవహిస్తుంది. బ్రహ్మసదనం నుండి కేసర పర్వత శిఖరాలమీద పడి కిందకు పారి, గంధమాదన పరవటం శిఖరాల పైభాగంలో పడి భద్రాశ్వవర్షాన్ని ఏలుతూ తూర్పున ఉప్పు సముద్రంలో ప్రవేశిస్తోంది. చక్షువు అన్న పేరుతో ప్రసిద్ధి పొందిన నది పశ్చిమ ద్వారం నుండి వచ్చి మాల్యవత్పర్వతం మీద పడి, అటునుండి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి పడమటి లవణ సాగరంలో కలుస్తుంది. భద్ర నది తన సాటిలేని ప్రవాహంతో ఉత్తరద్వారం నుండి వచ్చి కుముద, నీల శ్వేతాఖ్య పర్వత శిఖరాల మీద క్రమంగా ప్రవహించి, శృంగపర్వతానికి వచ్చి, మానసోత్తరాలైన కురు భూములను పవిత్రం చేస్తోంది. అల అవచ్చి ఉత్తరపు ఉప్పు సముద్రంలో లీనమవుతున్నది. అలకనంద నది బ్రహ్మ సదనం నుండి దక్షిణంగా ప్రవహిస్తోంది. వెళ్లడానికి అసాధ్యమైన పర్వతాల మీదకు పోతుంది. హేమకూట, హిమకూట పర్వత శిఖరాలను త్రుళ్ళి పడుతూ తాకి, మహావేగంతో కర్మ క్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి దక్షిణపు లవణ సముద్రంలో కలుస్తున్నది. అలా లోకంలో మేరువు మొదలైన పర్వతాలకు పుత్రికలై జన్మించిన పుణ్యతీర్థాలు (నదులు) వేలాదిగా ఉన్నాయి. 

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Saturday, March 29, 2025

Osmania University - A crucible of intellectual and political discourse ...... A Saga of Learning, Intellect and Leadership : Vanam Jwala Narasimha Rao

 Osmania University 

A crucible of intellectual and political discourse

A Saga of Learning, Intellect and Leadership

Vanam Jwala Narasimha Rao

The Hans India (30-03-2025)

{Intellectual curiosity, political awareness, and social responsibility are timeless virtues. Student politics, civil disobedience movements, and debates offer rich lessons for today’s youth. Those who began their journeys at OU went on to become national and international figures, some advocating for human rights and civil liberties. It is a tale of camaraderie, personal growth, socio-political activism, and enduring values. The once-vibrant intellectual discussions matured into action, leaving a lasting impact on society. The current ban on dharnas, demonstrations, sloganeering, and other restrictions on the OU campus is a sad reflection of current realities} - Editor's Synoptic Note

Prohibiting dharnas, demonstrations, sloganeering, and other restriction on the Osmania University (OU) campus is a blow to this century-old educational hub of excellence known for its historical role as a crucible of intellectual and political discourse. 

Established in 1918 by Mir Osman Ali Khan, the VII Nizam, OU blends modern Western education with the rich cultural heritage of the East. From humble beginnings OU and its vibrant campus evolved into global seat of learning.  OU Campus has always been a hub of intense political activity and a breeding ground for flamboyant student politics especially of progressive thought. Prominent student leaders and movements led by them from time to time, played pivotal roles in shaping the socio-political discourse in Telangana, including first and second phases of Separate Telangana Movements.

The Iconic Arts College Building represents a synthesis of old and new. Walking through its corridors and halls gives a sense of pride. It is not only a place of academic pursuit but also a witness to contemporary history. It has stood tall as a symbol of resilience and revolution. The sparkling debates in its lecture halls and the activism on its lawns contributed to an environment that shaped leaders and thinkers, and as a testimony to shaping of several ideologies, from Left to Right to Nationalist. 

Arts College Room Number 57 holds a special place and a historical landmark in OU journey. Famous writers, celebrated poets and cultural icons frequented to interact with students. Known for its vibrant intellectual environment, it hosted lectures by prominent personalities, academics, and thought leaders over the decades. Many recall Room 57 as a center of inspiration and a vibrant place for dialogue from influential figures like PV Narasimha Rao, Khushwant Singh, George Fernandez, Ram Manohar Lohia and numerous ideologues of various hues who were on the platform of the Room to sensitize and revolutionize the society and who left a lasting impact. They passed on their philosophies to the next generations. It was not just a classroom but a forum for lively discussions on socio-political issues, literature, and philosophy.  

While studying BSc (Mid 1960s) in New Science College and BLibSc (Early 1970s) on the campus I was a frequent visitor to OU B-hostel, which place Nehru once acknowledged as the vibrant student culture. He referred to the students as future Indian leaders and humorously compared B-hostel to the House of Lords. Nehru’s recognition and his remark has since been quoted to emphasize the hostel’s prominence as a place where future leaders and intellectuals engaged in deep political and academic debates. 

OU A-Hostel also served as a meeting place for students and thinkers who actively engaged in socio-political discussions, contributing to movements such as the Separate Telangana Agitation and other national issues. It became synonymous with student leadership, activism, and progressive thought, influencing regional and national politics over decades. At these two Osmania University hostels, both leftist and rightist political ideologies have actively influenced university student union elections. 

The leftist groups, often aligned with communist (AISF and SFI) and socialist ideologies, focused on issues like social justice, student rights, and anti-imperialism. In contrast, the rightist groups, backed by ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad), promoted nationalism, cultural pride, and conservative values. Student union elections frequently saw contests between SFI and ABVP, often reflecting a microcosm of broader political struggles, with intense debates and campaigns shaping student leadership at the university. It was an era of ‘Intellectual Struggle for Supremacy’ and emergence of leadership at the state and national levels.

S Jaipal Reddy was an articulate and ideologically strong student leader at OU who with his sharp intellect and oratory skills became a formidable force in student politics. He later became a stalwart in Indian politics, serving as Union Minister and gaining respect as a champion of parliamentary democracy. K Keshav Rao was another influential student leader at OU, known for his political acumen and leadership abilities, who actively engaged in socio-political movements. He became a key strategist in the Indian National Congress and later in the Bharat Rashtra Samithi. As a Rajya Sabha MP, he played a crucial role in shaping policies, particularly in Telangana’s statehood movement. Both exemplify how OU’s vibrant political culture nurtured individuals.

Student Leader George Reddy was a revolutionary figure at OU whose activism was rooted in a deep sense of social justice. He became a key figure in mobilizing students against oppression, inequality, and caste-based discrimination. George’s rise was marked by his intellectual prowess, charismatic leadership, and commitment to leftist ideologies, which resonated with many students on campus. His radical views and influence made him a target of opposing right-wing student organizations. On April 14, 1972, he was murdered on campus by a group of assailants. His legacy, remains significant in the history of student politics at OU.

Vootukur Vara Prasad, who was a onetime Arts College President, was actively involved in student movements and was part of the broader wave of youth leadership. OU Products, Professor G Hara Gopal, Professor Raghavendra Rao, Vasireddy Shivalinga Prasad, Dr M. Sridhar Reddy etc. made a difference in society by excelling in their respective fields. Hara Gopal’s leadership qualities positioned him as a future torchbearer for civil rights, characterized by his courage, compassion, and unwavering dedication. His intellectual rigor was evident in his passion for justice, equity, and the rights of the underprivileged. His keen understanding of socio-political issues exhibited through thoughtful discussions. 

Professor Raghavendra Rao was an intellectual and a distinguished figure in the field of sociology, both as a student and later as a professor. Professor VS Prasad, a social scientist by training, after obtaining his Master’s and PhD in Public Administration from OU, started his academic career as a lecturer in Public Administration. Over more than four decades, he held several academic and educational leadership positions, including that of Vice-Chancellor.

Dr M Sridhar Reddy emerged as a beacon of hope during a pivotal time in the history of Telangana. As a passionate student leader at OU, he was at the forefront of spearheading the first phase of the Separate Telangana Movement, which originated in the A-hostel of Osmania University. Mallikarjun, who was then the General Secretary of the Osmania University Student Union, was also actively involved in this movement, who later became a Union Minister.

Osmania University’s Arts College cafeteria served as a hub for exchanging revolutionary ideas. Intellectual rigor and leadership were woven into the fabric of everyday life. Many of the individuals mentioned above and countless others made a difference in society later, thanks to the campus activism at OU. Those who began their journeys at OU have gone on to become national and international figures, some advocating for human rights and civil liberties. The once-vibrant intellectual discussions matured into action, leaving a lasting impact on society.

The essence of this narrative is a powerful reminder that intellectual curiosity, political awareness, and social responsibility are timeless virtues. Student politics, civil disobedience movements, and debates offer rich lessons for today’s youth. For future generations, this reflection on OU serves as a powerful message about the transformations in personal, social, and intellectual life over decades. It is a tale of camaraderie, personal growth, socio-political activism, and enduring values.

It is crucial to nurture critical thinking, build relationships grounded in mutual respect, and contribute to the collective good of society. The seeds sown in intellectual discussions, political debates, and the courage to fight for justice can grow into legacies that endure for generations to come. Prohibiting dharnas, demonstrations, and sloganeering on the OU campus is an attempt to stifle student leadership, contrary to Jawaharlal Nehru’s reference to OU students as the future leaders of India. Any attempt to ‘Annihilate the Zeal of Student Leadership’ is suicidal.

Thursday, March 27, 2025

ఎక్కడికి పోతుందీ విలేఖరిత్వం? ఏదీ సంయమనం : వనం జ్వాలా నరసింహారావు

 ఎక్కడికి పోతుందీ విలేఖరిత్వం? ఏదీ సంయమనం

వనం జ్వాలా నరసింహారావు 

మనతెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీ (28-03-2025)

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగానికి కృతజ్ఞతా తీర్మానం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభలో రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా, వ్యూహాత్మకంగా, స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ప్రధానంగా మీడియా బాధ్యతారాహిత్యంపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వృద్ధితో అసలు పాత్రికేయత అంటే ఏమిటనే ప్రశ్న తలెత్తిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అభ్యంతరకరమైన భాషను వాడుతున్న డిజిటల్ మీడియా ప్రవర్తనపై ఆయన విమర్శించలు చేశారు. మీడియా నియంత్రణకు అవసరమైన స్పష్టతపై చర్చ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘మనతెలంగాణ’ లాంటి సామాజిక స్పృహ కలిగిన పత్రికలు (ప్రస్తుతానికి ఇదొక్కటే!) ఈ అంశంమీద పలురంగ ప్రముఖుల అభిప్రాయాలను సేకరించి ప్రచురిస్తున్నది. 

ఇద్దరు మహిళా యూట్యూబ్ జర్నలిస్టుల వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారాన్ని విమర్శించొచ్చుగానీ, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం అనాగరికమన్నారు. ఆ ఇద్దరు మహిళల ప్రవర్తనను ఉద్దేశించి, వారి అసభ్యకరమైన కంటెంట్‌పై చర్య తీసుకున్న ప్రభుత్వం, ప్రభుత్వం మీద చేసే విమర్శల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ పాటిస్తుందని, వ్యక్తిగత విమర్శలు చేస్తే అవసరమైన చర్య కూడా తీసుకుంటుందని సీఎం హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛకు అనుగుణంగా విలేఖరుల తీరు బాధ్యతాయుతంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు సహించబోమని స్పష్టంగా తెలియజేశారు. చర్చల ద్వారా అసలు ‘పాత్రికేయ వృత్తి’ అంటే ఏమిటనే దానిపై శాసనసభలో స్పష్టత తీసుకురావాలని, అసలు-సిసలైన పాత్రికేయిల జాబితా  రూపొందించాలనీ ముఖ్యమంత్రి సూచించారు.

శాసనసభలో ఈ సందర్భంగా ‘ముసుగును తొలగించి, బట్టలు ఊడదీసి కొడతామని, ప్రజల ముందు ఊరేగిస్తాం’ అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా అనిపించాయి. శబ్దతీవ్రత ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నవారికీ షాక్ ఇచ్చాయి. విమర్శించేవారికి చురకలంటించడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ వ్యక్తిగత స్థాయికి తగ్గి చేసిన విమర్శలకు బదులుగా న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సింది. "అంటురోగ కారకమైన దోమను చంపేందుకు ఇంటినే కాల్చేస్తారా?" అన్న చందంగా ఈ వ్యవహారం మారిపోయిందని విశ్లేషకుల భావన. దూషణలను ఖండించాల్సిన వ్యక్తే ఘాటైన భాషను ఉపయోగించటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న లేచింది. మీడియా బాధ్యతగా వ్యవహరించాలనే నిబద్ధత ఉంటే, అసెంబ్లీ, ప్రభుత్వాలకూ వాక్చాతుర్యంతో స్పందించే సంయమనం అవసరమేమిటో ఈ ఉదంతం ఆలోచింపజేస్తోంది.

ఇదిలా వుండగా, రాజకీయ నాయకులే తాము చెప్పే మాటలకు గౌరవం కల్పించుకోకపోతే, మీడియాను బాధ్యతాయుతంగా ఉండమని ఎలా చెప్పగాలుగుతారనే ప్రశ్న కూడా ఉత్పన్నమౌతున్నది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ‘స్ట్రెచర్ నుంచి మార్చురీకి పంపిస్తా’ అన్న వ్యాఖ్యలు, అసలు రాజకీయ సంస్కృతి ఏమవుతోందన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాజకీయ మైదానమే ఒక కామెడీ స్టేజ్‌లా మారితే, మీడియా కూడా అంతే రీతిలో వ్యవహరించకతప్పదనే భావనకు దారితీసే ప్రమాదం వున్నది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిని మీడియాపై దాడిగా అభివర్ణించగా, రేవంత్ రెడ్డి మాత్రం పాత్రికేయ ధర్మాన్ని నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇరువురి అబిప్రాయాలు కూడా చర్చనీయాంశమే. సోషల్ మీడియా స్వేచ్ఛ ఏమిటి? మర్యాదారహితమైన వ్యాఖ్యలు చేసే జర్నలిస్టులను ఏ విధంగా నియంత్రించాలి? ఈ ప్రశ్నలు సామాజికంగా చర్చించాల్సినవే.

ఈ ఉదంతం కేవలం మీడియా స్వేచ్ఛకే పరిమితం కాదు. శాసనసభ లాంటి పవిత్రమైన వేదికమీద రాజకీయనేతలు అనుసరించాల్సిన పార్లమెంటరీ భాషాప్రయోగాలను తామే పాటించకుంటే, మీడియాను సంయమనంగా ఉండమని చెప్పగలమా? అసలు రాజకీయ నాయకులే విమర్శలు ఆహ్వానించాలి, కానీ ప్రతిసారి ప్రతిస్పందన జుగుప్సాకరంగా ఎందుకు మారుతోంది? ఎందుకు మారాలి? ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే. అయితే, దూషణల స్థాయిని నిర్ణయించే బాధ్యత ఒక సమాజంగా అందరిమీదా ఉంది. 

అందుకే, ప్రశ్న ఏమిటంటే, మీడియా సంయమనం పాటించాలా? లేదా రాజకీయ నాయకులే తమ భాషను మెరుగుపరచుకోవాలా? విమర్శించదలిచినప్పుడు సంయమనంతో, అక్షరసత్యంగా, న్యాయపరంగా స్పందించడం రాజకీయ పరిపక్వత. హద్దులు దాటి స్పందిస్తే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరింత పెంచినట్టే.  వాస్తవానికి, వాస్తవాలను తర్కబద్ధతతో స్పందిస్తే చాలని అనేక సందర్భాల్లో స్పష్టమైంది. కానీ, ఘాటైన పదజాలంతో సమస్యను మరింత పెంచుకోవటం, మరింత జటిలం చేయడం ఎంతవరకు అవసరమో? ప్రభుత్వాలకు ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఉంది. అదే విధంగా, పాత్రికేయులు కూడా తమ బాధ్యతను నిర్వర్స్తిస్తూ, హద్దులు దాటకూడదని అహర్నిశం గుర్తుచేసుకోవాలి. మితిమీరిన విమర్శలు కూడా నాశనానికే దారితీస్తాయని ఈ సంఘటన మనకు నేర్పే గుణపాఠం!

సుమారు రెండు దశాబ్దాల క్రితం, ప్రస్తుతం ‘మనతెలంగాణ’ దినపత్రిక సంపాదకుడుగా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడెమీ అధ్యక్షుడిగా వున్నప్పుడు, న్యూఢిల్లీ కేంద్రంగా డాక్టర్ ఎన్ భాస్కర్ రావు అధ్యక్షతన పనిచేస్తున్న ప్రముఖ మీడియా సంస్థ ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’- ప్రెస్ అకాడెమీ సంయుక్తంగా నిర్వహించిన ‘మీడియాకు లక్ష్మణరేఖ అవసరమా?’ అన్న అంశం మీద నిర్వహించిన సదస్సులో దేశవ్యాప్త మీడియా దిగ్గజాలు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించారు. వాటిని పుస్తక రూపంలో తెచ్చి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో న్యూఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. అక్షరలక్షలు చేసే ఆ ఉపన్యాసాల సారాన్ని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ముందుకు సాగితే కొంత మేరకు పరిష్కార మార్గాన్ని కనుగొనవచ్చేమో! మీడియారంగ ప్రముఖులు ఈ దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి. 

చివరగా ఒక్క మాట. ‘కలం కూలీ’ స్వర్గీయ జి కృష్ణ గారు తన ‘విలేఖరి లోకం’ (దేవులపల్లి అమర్ సంపాదకుడుగా వున్నప్పటి ప్రజాతంత్ర వారపత్రికలో ప్రచురించిన ఆయన వ్యాసాల సంకలనం) పుస్తకానికి ‘అవ్యక్త కోలాహలం’ శీర్షికన ముందు మాట రాస్తూ, ‘నా విలేఖరిత్వం జారచోర భజనా? నా విలేఖరిత్వం దేశానికి సేవా? అని ప్రశ్నించుకుని, కోలాహలంగా నిలిచిన తన అనుభవాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన అమర్ కు ధన్యవాదాలు చెప్పాడు. కృష్ణ గారి మాటల్లో ఏమైనా సందేశం వున్న్నదా? వుంటే ఆస్వాదించాలని మనవి.

Wednesday, March 26, 2025

రోగం కన్నా ఔషధమే ప్రమాదకరమైతే ఎలా? : వనం జ్వాలా నరసింహారావు

 రోగం కన్నా ఔషధమే ప్రమాదకరమైతే ఎలా?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతిదినపత్రిక (26-03-2025)

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 15న రాష్ట్ర శాసనసభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, సుమారు రెండున్నర గంటలపాటు అనర్గళంగా, సమగ్రంగా, వ్యూహాత్మకంగా చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆయన విమర్శకులను సైతం ఆకట్టుకున్నది. వివిధ సామాజిక అంశాలను, ప్రధానంగా మీడియా, అందునా డిజిటల్ మీడియా బాధ్యతకు, ప్రవర్తనా నియమావళికి సంబంధించి రేవంత్‌ సూటిగా ప్రసంగించారు. 

డిజిటల్, సామాజిక మీడియా పాత్ర, ఆమోదయోగ్యమైన ప్రమాణాలను పాటించడంలో స్పష్టమైన అసమతుల్యత, యూట్యూబ్ పాత్రికేయులు ఉపయోగిస్తున్న అవమానకరమైన, అసభ్యకరమైన భాషకు సంబంధించి, సూటిగా, సుతిమెత్తగా ముఖ్యమంత్రి గమనికలు, చేసిన సూచనలు, సమకాలీన సమాచార ప్రసార వ్యవస్థలో నిండినిభిడీకృతమై పోయిన అనైతికతను, తత్కారణాన నియంత్రణ అవసరాన్ని సుస్పష్టతతో బహిర్గతం చేశాయి. మీడియా బాధ్యతను సమర్థవంతంగా నిర్వచించాల్సిన అవసరాన్ని ఆయన గంభీరంగా, భావోద్వేగంతో ఉద్ఘాటించారు. 

ఇద్దరు మహిళా యూట్యూబ్ జర్నలిస్టుల ప్రవర్తన దీనికి నేపథ్యం. వారు తమ వీడియో కార్యక్రమంలో వినియోగించిన భాషను సిఎం ఉటంకిస్తూ, ఓ ప్రత్యేకమైన సంఘటనను స్పష్టంగా, సూటిగా ప్రస్తావించారు. ఆ ఇద్దరు జర్నలిస్టులు తనపై వ్యక్తిగతంగా, అవమానకరంగా, దూషణాత్మక అంశాలతో వీడియో పోస్ట్ చేసినందుకు వారిద్దరూ అరెస్ట్ అయ్యారని రేవంత్ వెల్లడించారు. ప్రజా ప్రతినిధులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే కానీ, వ్యక్తిగత దూషణలు, అభద్రత భాష వినియోగం మాత్రం నీతిబాహ్యంగా, పరిమితులకు, హద్దులకు అందకుండా వుండడాన్ని ముఖ్యమంత్రి నిర్ద్వందంగా ఖండించారు. దూషణాత్మక కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడంపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తుందని, కాకపోతే, ‘నేను చేసే ప్రతిచర్యను చట్ట పరిమితుల్లోనే చేస్తాన’నీ ముఖ్యమంత్రి ప్రకటించారు. అసభ్యకరంగా, నిరాధారంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తులు జర్నలిస్టులు కాదని, వారిని నేరస్తులుగా పరిగణిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వంపట్ల దూషణాత్మక కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం లేదా అవమానకరమైన భాష వాడటం వంటి తీరుపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తుందని, కాకపోతే, ‘నేను చేసే ప్రతి చర్యను చట్ట పరిమితుల్లోనే చేస్తాను’ అని ముఖ్యమంత్రి శ్లేషార్థంతో ప్రకటించారు. ముఖ్యమంత్రి పేర్కొన్న దాని ప్రకారం, సోషల్ మీడియా, డిజిటల్, యూట్యూబ్ ఆధారిత ఛానళ్ల పెరుగుదలతో, యదార్థ పాత్రికేయానికి, వ్యక్తిగత ప్రచారానికి మధ్యన గీతలు మందగించాయని, ఫలితంగా ఎవరు పాత్రికేయులు అనే మౌలికమైన ప్రశ్న ఉత్పన్నమైందని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. సిఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు చెప్పింది సమంజసమే! 

జర్నలిజాన్ని నిర్వచించేందుకు, ప్రధానమైన యదార్థ జర్నలిస్టుల జాబితాను రూపొందించేందుకు శాసనసభ, పాత్రికేయ నియంత్రణ సంస్థలు, జర్నలిస్ట్ సంఘాలు ఉమ్మడిగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అసభ్యకరంగా, నిరాధారంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తులు, దూషణాత్మక ప్రచారానికి పాల్పడితే, వారు జర్నలిస్టులుగా పరిగణించబడరని, నేరస్తులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి ముసుగును తొలగించి, బట్టలు ఊడదీసి కొడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలా అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ కంటెంట్‌ను పోస్ట్ చేసే డిజిటల్ మీడియా జర్నలిస్టులను, ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లను నడిపేవారిని శిక్షించేందుకు శాసనసభలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుకు తెచ్చారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో, మేథాజనబాహుళ్యంలో చర్చనీయాంశమైనాయి. డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయని కొందరి భావన. మీడియా కొన్ని హద్దులను పాటించాలా? దాన్ని ఒక స్వతంత్ర పౌర సమాజం లేదా వృత్తిపరమైన సంస్థ పర్యవేక్షించాలా? అనే విషయాలపై విస్తృత చర్చ జరగాలి. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన వాక్‌ స్వాతంత్ర్యం స్వేచ్ఛ హక్కు కింద రక్షణ పొందుతున్నది. ఇది భారత ప్రజాస్వామ్య విశిష్టతకు సంకేతంగా పరిగణించబడుతున్నది. మీడియా నిష్పాక్షికత, బాధ్యత, ప్రతిస్పందనశీలత వంటి ప్రమాణాలను అనుసరించాలని ఈ హక్కు ఆశిస్తుంది. 

పాత్రికేయ బాధ్యతారాహిత్యాన్ని ఎవరు నియంత్రించాలి? ఎవరు ఈ సమస్యను పరిష్కరించాలి? ఇది వృత్తిలో వున్న జర్నలిస్టుల సామూహిక బాధ్యతా? నిర్వాహక యాజమాన్య సంస్థలదా? ప్రభుత్వానిదా? స్వతంత్ర సంస్థలు లేదా వ్యక్తుల కూటమి ఈ బాధ్యత తీసుకోవాలా? ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? సమస్య పరిష్కారానికి పరిరక్షక చర్యలు తీసుకోవాలా? ఇలా అనేకానేక ప్రశ్నలు ఎప్పటికప్పుడు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో కూడా తలెత్తక మానవు. ఎప్పటికప్పుడు సందర్భోచితంగా జవాబులు, తాత్కాలిక ఉపశమనాలు లభిస్తూనే వున్నాయి. మళ్లీ మళ్లీ ప్రశ్నలు పునరావృతం అవుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చాలా ప్రాముఖ్యతగలదే కాకుండా, సమకాలీన పరిస్థితులకు వందశాతం సముచితమైనదనాలి. 

ఈ ప్రమాణాలు ‘ఫోర్త్ ఎస్టేట్’ అనే భావనలో అంతర్భాగం. హక్కులు, ప్రత్యేకాధికారాలను బాధ్యతలు, కర్తవ్యాలతో సమతుల్యం చేయకపోతే ఏ వ్యవస్థ అయినా సమర్థవంతంగా పనిచేయదు. కాకపోతే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ఉపయోగించిన హెచ్చరిక పదాలు, తనను వ్యక్తిగతంగా దూషించినవారిని ఉద్దేశించినవే అయినప్పటికీ, వాటి తీవ్రత ఆ వీడియో కంటెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వారిని సైతం విభ్రాంతికి గురి చేసింది. ‘‘ముసుగును తొలగించి బట్టలు ఊడదీసి కొడతాం, ప్రజల ముందు ఊరేగిస్తాం,’’ అనే వ్యాఖ్యలు ఒకింత ఆందోళన కలగచేశాయి. వ్యక్తిగతంగా అవమానపరుస్తూ, అసభ్య పదజాలంతో దూషణాత్మకంగా సాగే జర్నలిజాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందే.

అయితే, ముఖ్యమంత్రిని ఈ స్థాయికి నడిపించిన ఆ ఆగ్రహావేశం ‘రుగ్మత కన్నా ఔషధమే ఆందోళనకరమైతే ఎలా?’ అనే పాత సామెతను గుర్తుచేస్తున్నది. ఇది తనకు తానే నష్టం కలిగించుకునే చర్య. పత్రికా విలువలు కాపాడాలనే విషయంలో ఎవరూ రాజీపడకూడదు. తప్పుడు సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కానీ, ‘ప్రజాస్వామ్య ఆలయం’గా లేదా దేవాలయ గర్భగుడి లాంటి పవిత్ర స్థానంగా పరిగణింపబడే శాసనసభ మధ్యలో, తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రతిదాడికి దిగడం అనవసరం. దీన్ని చిన్న గాయానికి పెద్దాసుపత్రిలో చికిత్స చేయడం లాంటిదిగానో, కుళాయి లీక్‌ను చక్కదిద్దేందుకు సింక్‌ను పగలగొట్టడం లాంటిదిగానో, తలనొప్పిని తప్పించుకోవడానికి సుత్తితో కొట్టుకోవడం లాంటిదిగానో భావించాలి. ఆ ఇద్దరు యూట్యూబ్ మహిళా జర్నలిస్టులు హద్దులు దాటి వ్యవహరించారనేది నిజమే కావచ్చు. చట్టపరమైన చర్య తీసుకోవడం కూడా పూర్తిగా సమంజసమే కావచ్చు. అయితే, వారి చర్య హద్దులు మీరినదైతే, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సభ గడప దాటి, అంతస్తు దాటి, మొత్తం భవనాన్ని దాటి వెళ్లాయి! 

తప్పుడు సమాచార ప్రసారానికి ప్రభుత్వ బాధ్యతకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ప్రభుత్వ ప్రతిస్పందన మరింత శాంతంగా, సూక్ష్మంగా ఉండాల్సింది. జర్నలిస్టుల కథనం మార్గభ్రష్టమైనదే కాబట్టి, వాస్తవాధారంగా చేయాల్సిన ఖండన లేదా చట్టపరమైన తీవ్రమైనచర్య సరిపోయేది. శాసనసభ వేదిక నుండి ముఖ్యమంత్రి కటువైన పదజాలంతో జరిపిన ఈ మౌఖిక దాడి సమస్యను మరింత జటిలం చేయడమే గాక, ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్లే సానుభూతిని పెంచేదిగా ఉంది. విచిత్రమేమిటంటే– అదే శాసనసభలో గౌరవ సభ్యులు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును పూర్తిగా వినియోగించుకుంటారు. తీవ్ర ఆరోపణలు, పరస్పర దూషణలు కూడా అక్కడ జరుగుతుంటాయి.

విచిత్రమేమంటే, అదే శాసనసభలో గౌరవ సభ్యులు సాధారణంగా, స్వేచ్ఛగా మాట్లాడే హక్కును పూర్తిగా వినియోగించుకుంటారు. తీవ్ర ఆరోపణలు, పరస్పర దూషణలు కూడా అక్కడ సహజంగానే జరుగుతుంటాయి. శాసనసభ వెలుపల నేతల మధ్య జరిగే వాగ్వివాదాలైతే మరీ శ్రుతిమించిపోతాయి. ఇదంతా మనం రాజకీయ వ్యూహంలో భాగంగా పరిగణించి పట్టించుకోవటం మానేశాం. రాజకీయ నాయకుల అనియంత్రిత వ్యాఖ్యలు సహజంగా అంగీకరించబడినప్పుడు, ఆ యూట్యూబ్ వీడియోలో వాడిన పదజాలం విషయంలో అంతస్థాయి నైతిక ఆగ్రహం వ్యక్తీకరించడం, చట్టపరమైన చర్యలకు మించి అడుగులు వేసే ప్రయత్నం చేయడం అవసరమా అన్న ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది. నాయకులు అన్యాయమైన విమర్శలకు గురి కావడం రాజకీయ వృత్తి జీవితంలో సహజం. అంతమాత్రాన అనవసరమైన తీవ్రతతో స్పందించడం వల్ల, ప్రత్యర్థి వేదికను మరింత బలపరిచినట్లే అవుతుంది. దీనివల్ల సంఘర్షణ వాస్తవాల స్థాయిలో కాకుండా, భావోద్వేగాల స్థాయిలోకి మారిపోతుంది. ఉన్నత స్థాయిలో కనిపించాలనుకునే వ్యక్తే ఆగ్రహావేశంతో స్పందిస్తే, అది అవమానానికి గురి చేసిన వారికి సానుభూతిని కలిగించే ప్రమాదం ఉంది. 

రాజకీయ నాయకులే ఉన్నత ప్రమాణాలను పాటించనప్పుడు, యూట్యూబ్ లేదా సోషల్ మీడియా జర్నలిస్టులు బాధ్యతగా వ్యవహరించాలని ఎలా ఆశించగలం? ఇటీవల రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురించి, ఇతర బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడుతూ, ‘‘గౌరవం (‘స్టేచర్’) గురించి మాట్లాడుతున్నారు. కానీ వారు ఇప్పటికే స్ట్రెచర్‌పై ఉన్నారు. త్వరలోనే మార్చురీలో చేరతారు,’’ అని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ వేదికను పిల్లల పాఠశాల స్థాయిలో తిట్ల యుద్ధంగా మార్చడమే. మీడియా నుండి గౌరవాన్ని కోరుకుంటూనే, రాజకీయ వేదికలపై తిట్లతో విరుచుకుపడటం అంటే– ‘నేను చెప్పినట్లు చేయాలి, నేనూ చేసేలా కాదు’ అన్నట్టే! శాసనసభ తక్కువగా నియమాల రూపకల్పన మండలి, ఎక్కువగా హాస్యభరిత వేదికలా మారినప్పుడు, మీడియా సైతం ఆజానుబాహుగా సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఒక వేదిక మీద మాట్లాడుతూ ‘వివేకం, గౌరవం, మర్యాద’ అనే మూడు విలువలు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు.

ఇవి ‘చర్చించు, వాదించు, నిర్ణయించు’ అనే మూడు సూత్రాల ఆధారంగా మనగలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బహిరంగంగా ప్రకటనలు చేసే సమయంలో ఈ ప్రామాణిక సూత్రాన్ని గుర్తుపెట్టుకునే రాజకీయ నాయకులు చాలా తక్కువ. ఈ ధోరణి తెలంగాణలో ప్రత్యేకంగా పెరుగుతూ ఉంది. అయితే, రాత్రికి రాత్రి రాజకీయాల్లో ప్రవేశించిన నాయకులు ఎలా ప్రవర్తించాలి అనేది ఎవరు నేర్పించగలరు? శాసనసభలో మీడియా పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రదర్శించిన ఆగ్రహం వెనుక సమర్థమైన కారణమే ఉండవచ్చు గానీ, ఆయన స్పందనలోని తీవ్ర పదజాలం మాత్రం భిన్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవం, బాధ్యత కోసం జరిగే పోరాటంలో, సూక్ష్మత, నియంత్రణలు ఆగ్రహం కంటే ఎక్కువ శక్తివంతమైనవి. ఎప్పుడు ప్రతిస్పందించాలి, ఎప్పుడు మౌనం పాటించాలి అనే విషయాన్ని తెలుసుకోవడంలోనే రాజకీయ ప్రౌఢత ఇమిడి ఉంటుంది.

Sunday, March 23, 2025

పిండోత్పత్తి క్రమం, సప్త ద్వీపాల, సప్త సముద్రాల ఆవిర్భావం .... శ్రీ మహాభాగవత కథ-28 : వనం జ్వాలా నరసింహారావు

 పిండోత్పత్తి క్రమం, సప్త ద్వీపాల, సప్త సముద్రాల ఆవిర్భావం

శ్రీ మహాభాగవత కథ-28

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-03-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

జీవుడికి పూర్వ జన్మలో చేసుకున్న కర్మానుసారం తిరిగి పునర్జన్మ ఇచ్చే మహానుభావుడు ఈశ్వరుడు మాత్రమే!! కాబట్టి జీవుడు దేహ సంబంధాన్ని పొందే క్రమంలో పురుషుడి వీర్యంగా మారి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి ‘కలిల’మై (శుక్ర-శోణిత సంయోగం), అయిదు రాత్రులకు ‘బుద్బుద’ మై (బుడగ), పడవ దినానికి రేగు పండంత అయ్యి, ఆ పైన మాంస పిండమై, ఆపై గుడ్డు ఆకారాన్ని పొందుతాడు. ఆ మీద నెలకు శిరస్సు, రెండు నెలలకు కాళ్లు-చేతులు పుడతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు కలుగుతాయి. నాల్గవ నెలకు రసం, రక్తం, మాంసం, మేధస్సు, ఆస్థి, మజ్జ అనే సప్త ధాతువులు ఏర్పడుతాయి. అయిదవ నెలకు ఆకలి దప్పికలు కలుగుతాయి. ఆరవ నెలలో మావి చేత కప్పబడి తల్లి కడుపులో కుడి భాగాన తిరుగుతూ, తల్లి తిన్న అన్నపానాదాల వల్ల తృప్తిని పొందుతాడు. 

ఇక అక్కడి నుండి ధాతువులు (వాత, పిత్త, శ్లేష్మాలు) కలిగి, సూక్ష్మ జీవులతో నిండిన మలమూత్రాదుల గోతులలో తిరుగుతూ, క్రిములు పాకి భాద పెటుతుంటే మూర్చలో మునిగిపోతాడు. తల్లి తిన్న కారం, చెడు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రమైన రసాలతో బాధపడుతున్న శరీరావయవాలు కలవాడై మావితో కప్పబడి, బయటకు ప్రేగులతో కప్పబడి, మాతృగర్భంలో శిరస్సు వంచుకుని, వంగి పడుకుని ఉంటాడు. తన అవయవాలు కదల్ప లేక పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా ఉంటాడు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో పూర్వ జన్మలలో చేసిన పాపాలను తలచుకుని దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ, కొంచే సుఖం కూడా లేకుండా ఉంటాడు. 

ఏడవ నెలలో జ్ఞానం కలిగి, కదలికలు ప్రారంభమై, మలంలోని క్రిములతో కలసి ఒక్క దిక్కున ఉండకుండా, గర్భంలో సంచరిస్తూ, ప్రసూతి వాయువులకు కంపించిపోతూ ఉంటాడు. అప్పుడు దేహాత్మ దర్శనం కలిగి, తిరిగి గర్భవాస దుఃఖానికి చింతిస్తూ, బంధవ రూపములైన సప్త ధాతువులతో బద్ధుడై, రెండు చేతులు జోడించి, దీనవదనుడై, జీవుడు తాను ఎవ్వనిచే గర్భవాసవ క్లేశాన్ని అనుభవించడానికి నియమించా బడ్డాడో ఆ సర్వేశ్వరుడిని స్తుతిస్తాడు.  ఇలా స్తుతిస్తూ, స్వచ్చమైన జ్ఞానం కలవాడిన జీవుడు గర్భం నుండి బయటకు రాకుండా తొమ్మిది మాసాలు గడుపుతాడు. ఆ తరువాత పదవ మాసం రాగానే జీవుడు అధోముఖుడై ఉచ్చ్వాస నిస్శ్వాసాలు లేకుండా దుఃఖంతో బాధపడుతూ, జ్ఞానాన్ని కోల్పోయి, రక్తసిక్తమైన శరీరంతో క్రిమిలాగా నేలమీద పడి ఏడుస్తూ జ్ఞానహీనుడై జడుడి లాగా అయిపోతాడు. తన భావాన్ని అర్థం చేసుకోలేని ఇతరుల వల్ల పెంచబడుతూ, తన కోరికలను చెప్పుకోలేక, అనేక పురుగులతో కూడిన ఒక పక్కమీద పడుకుంటాడు. అవయవాలలలో ఎక్కడ దురద వేసినా గోక్కోలేక, కూర్చోలేక, లేవలేక, నడవలేక, ఓపిక చాలక, జనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రకారం శైశవంలో ఆ అనుభవాలను పొందుతూ పెరుగుతుంటాడు జీవుడు. 

సప్త ద్వీపాల, సప్త సముద్రాల ఆవిర్భావం

స్వాయంభవ మనువు కుమారుడు ప్రియవ్రతుడు, బ్రహ్మ ఆదేశానుసారం, తనకు మనస్సులో తపస్సు చేయాలని కోరిక ఉన్నప్పటికీ, రాజ్యాపలన చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా సుఖంగా రాజ్యపాలన చేస్తూ, విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల సంతానం-పదిమంది కొడుకులను, ఒక కూతురును పొందాడు. రాజ్యపాలన చేస్తున్న రోజుల్లో ఒకనాడు, సూర్యుడు మేరుపర్వతానికి ఒకవైపున చీకటి కలిపించే సందర్భంలో, ఆ చీకటిని పోగొట్టడానికి, సూర్యుడి రథంతో సమానమైన వేగం, తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి, రాత్రులను పగలుగా చేస్తానని ఏడురోజులపాటు రెండో సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు. రథ చక్రం తాకిడికి భూమ్మీద గోతులు ఏర్పడ్డాయి. అవే సప్త సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం ఏడు దీపాలయ్యాయి. మేరుపర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు కాబట్టి సముద్రాలు, ద్వీపాలి సప్త సంఖ్యలో వచ్చాయి. 

ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. వీటిలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమితి కలది. అక్కడి నుండి ఒక్కొక్క ద్వీపం ముందుదాని కంటే తరువాతది రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక సప్త సముద్రాలు ఇవి: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత (నేటి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం, జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తల లాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఇంకొకటి కలిసి పోకుండా, సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడడం చూసి, సకల జీవులూ విస్తుపోయాయి. 

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)