Sunday, March 31, 2019

యతివేషంలోని రావణుడిని సత్కరించి తన వృత్తాంతం చెప్పిన సీతాదేవి ...... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-54 : వనం జ్వాలా నరసింహారావు


యతివేషంలోని రావణుడిని సత్కరించి తన వృత్తాంతం చెప్పిన సీతాదేవి
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-54
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (31-03-2019)
         బిక్షాపాత్ర, కమండలాలు ధరించి, బ్రాహ్మణ సన్న్యాసి వేషంలో వున్న రాక్షసుడిని, తనకు కీడుచేసే ఆలోచనలో వున్నవాడిని, విరోధించినా తాను గెలవలేనివాడిని, రాక్షసుడని తెలిసీ, బ్రాహ్మణుడిని పూజించిన విధంగానే ఆయననూ పూజించింది సీతాదేవి. “ఇదిగో దర్భాసనం..ఇక్కడ కూర్చో. ఇదిగో అర్ఘ్యం...ఇదిగో బాద్యం...సర్వం సిద్ధం. ఇదిగో నీ ఆహరం కొరకు అడవిలోని పండ్లు....తృప్తిగా భుజించు” అని శాస్త్ర ప్రకారం చెప్తున్న సీతను, రాముడి భార్యను, భూపుత్రిని, తన చావుకోరకు రావణుడు బలాత్కారంగా అపహరించాలనుకున్నాడు. అడవిలో మాయా మృగాన్ని వేటాడడానికి పోయిన రామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి వస్తాడేమోనని అడవివైపు నాలుగు దిక్కులా చూశాడు కాని వాళ్ళు కనపడలేదు. యథాప్రకారం అడవి చెట్లు మాత్రం కనబడ్డాయి. అది చూసి సీత మనస్సు భయంతో కలవరపడింది.

         (సీతారామలక్ష్మణులు వున్న పర్ణశాలకు ఉత్తరాన పర్వతాలు, తూర్పున గోదావరి నది వుంది. దక్షిణాన, పడమర అడవి వుంది. మారీచుడు రామచంద్రమూర్తిని పడమటగానే తీసుకుపోయాడు. రావణాసురుడు పోవాల్సింది దక్షిణ మార్గాన కాబట్టి ఆ తోవలో రామచంద్రమూర్తి వుండకూడదు కదా?)

         తనను బలాత్కారంగా తీసుకుపోదలచి రావణుడు ఆ విధంగానే ప్రశ్నించాడని సీత భావించింది. అయినా, అతిథులను, అభ్యాగతులను ఆడరించాల్సిన విధానం చక్కగా తెలిసిన సీత, ఇంగిత జ్ఞానం వున్నది కాబట్టి, రావణుడి మాటలు, వాడి ఆర్భాటం విని-చూసి, వీడు నిజమైన సన్న్యాసి కాదనుకుంటుంది. ఉదర నిమిత్తం సన్న్యాసి వేషం ధరించిన బ్రాహ్మణుడు అనుకుని, అతిథితో అబద్ధం ఆడకూడదని, బ్రాహ్మణుడితో అసత్యం ఆడరాదని, అతిథి బ్రాహ్మణుడైతే అసలే అసత్యం ఆడకూడదని అనుకుంటుంది. వీడు దొంగ సన్న్యాసి కాబట్టి వంచకులకు వంచనతో సమాధానం చెప్పాలి అనీ, అలా చెప్పడం దోషం కాదనీ, అల్ప కాలం ఆలోచన చేసి వాడికిలా చెప్పడం ప్రారంభించింది.

         “మిథిలా రాజు, మహాత్ముడు, జనకరాజు కూతుర్ని. నా పేరు సీత అంటారు. నీకు మేలు కలగాలి. నేను శ్రీరాముడి భార్యను సుమా! సర్వ విధాల భోగోపకరణాలు కలదాన్ని. మనుష్య సుఖాలతో పన్నెండు సంవత్సరాలు మామగారి ఇంట్లో నా భర్తతో కూడి, ఎలాంటి కొరతలేకుండా గడిపాను. ఆ తరువాత మా మామగారు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని పదమూడో సంవత్సరంలో ఆలోచన చేశాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడాయన ప్రియమైన భార్య కైక, నా భర్త దేశాన్ని వదిలి పోవాలని, తన కొడుకు రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలని, రెండు వరాలు తన భర్తను కోరింది. తన మాట అంగీకరించకపోతే ప్రాణాలు విడుస్తానని బెదిరించింది. నా మామగారు ఆమెను ఎంత ప్రార్థించినా ఆయన విన్నపం చెవిన పెట్టలేదు. ఆ పట్టాభిషేక విఘ్నకాలానికి నా భర్తకు ఇరవై అయిదు సంవత్సరాల వయసు. నాకు పద్దెనిమిదేళ్ల వయసు. ఇంత లేత వయసువారు అడవుల్లో ఎలా తిరగ గలరో కూడా మా అత్త కైకేయి ఆలోచించలేదు”.


         (రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో అరణ్యానికి పోయేటప్పుడు ఆయన వయసు పన్నెండేళ్ళు. ఆ సంవత్సరమే సీతా వివాహం. తరువాత పన్నెండేళ్ళు అయోధ్యలో సుఖంగా వున్నాడు. ఆ తరువాత సంవత్సరం పట్టాభిషేక ప్రయత్నం కాబట్టి అప్పటికి రాముడికి పాతిక సంవత్సరాలు. అరణ్యావాసం ఆరంభమైన తరువాత ఋశ్యాశ్రమాలలో పదేళ్లు గడిపాడు. పంచవటిలో మూడేళ్లు వున్నాడు. వనవాసారంభం మొదలు పెట్టి ఇప్పటికి పద్నాలుగవ సంవత్సరం కాబట్టి, సీతాపహరణ సమయానికి శ్రీరాముడికి ముప్పై ఎనిమిదవ ఏడు. సీత జనకుడికి దొరికింది మొదలు ఆరు సంవత్సరాలు మిథిలలో వుంది. వివాహం తరువాత అయోధ్యలో పన్నెండేళ్ళు వుంది. పదమూడో సంవత్సరం అరణ్యాలకు ప్రయాణం కాగా, వనవాసానికి బయల్దేరి అప్పటికి సీతాదేవికి పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి. కాబట్టి, ఇప్పటికి సీతకు, ముప్పై ఒక్క ఏళ్లు గడిచాయి. ఇది ముప్పై రెండో ఏడు”.

         సీత రావణుడికి ఇంకా ఇలా చెప్పింది. “లోకంలో రాముడు, రాముడు, రాముడు అని స్మరిచని వాళ్లుండరు. అంత గొప్ప ఆయనకెలా కలిగిందంటావా? ఆయన అసత్యం చెప్పడు. సద్గుణాల రాశి. తప్పుపట్టడానికి ఒక్క దోషమైనా దొరకదు. స్త్రీల విషంయంలో కానీ, ధన విషయంలో కానీ, నిష్కల్మషమైన హృదయం కలవాడు. సర్వ భూతాలకు మేలుచేసే గుణాలుకలవాడు. ఈ గుణాలన్నీ ఈయనలో కలవని చాటిచెప్పే విధంగా ఆయనకు కమలాల లాంటి పెద్ద కళ్ళు, మోకాలినంటే చేతులు కలవాడు. కళ్ళు, చేతులు చూడగానే ఈయన మహానుభావుడనే భావన కలుగుతుంది. ఇలాంటి నా భర్తకు తన భార్య ముద్దు తీర్చడానికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేయలేదు. తండ్రి దగ్గరున్న రాముడితో, ఆయన ఆజ్ఞప్రకారం రాజ్యాన్ని భరతుడికి ఇచ్చి, పద్నాలుగేళ్లు అరణ్యాలకు పొమ్మని, తండ్రిని సత్యవాదిని చేయమని కైక చెప్తుంది. తండ్రిని సత్యవచనుడిని చేయడానికి, దేనికీ భయపడని రాముడు, అరణ్యాలకు వచ్చాడు”.

         “నా భర్త సవతి తమ్ముడు, శూరుడు, లక్ష్మణుడు అన్నకు సహాయంగా విల్లు-బాణాలు ధరించి మాతో అడవులకు వచ్చాడు. కైక కారణాన రాజ్యాన్ని పోగొట్టుకుని మేం ముగ్గురం అడవుల్లో తిరుగుతున్నాం. కొంచెం సేపు నువ్వు ఇక్కడ వుంటే నా భర్త వస్తాడు. నీకు వనఫలాలు ఇస్తాడు. బ్రాహ్మణుడా! నీ పేరేంటి? నీ గోత్రం ఏమిటి? నువ్వే కులం వాడివి? ఏ జాతివాడివి? వివరంగా చెప్పు. ఎక్కడైనా ఆశ్రమంలో వుండకుండా ఈ అరణ్యాలలో ఎందుకు తిరుగుతున్నావు?

         సీతాదేవి ప్రశ్నలకు క్రూరపు నడవడికల ఆ రాక్షసుడు తన చరిత్ర చెప్తా వినమని అంటూ, పరుషంగా మాట్లాడాడు.

Thursday, March 28, 2019

తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది తీసుకున్న దానికంటే ఎక్కువే .... తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం-4


తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది తీసుకున్న దానికంటే ఎక్కువే
తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం-4
జ్వాలాంతరంగం (29-03-2019)
సూర్యదినపత్రిక (29-03-2019)
లంచం ఇవ్వకుండా మున్సిపల్ అనుమతి దొరికితే చాలు, అంతకన్నా గొప్ప ప్రభుత్వం లేదని అధికారులకు ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు అది జరగడం లేదు. ఈ దుర్మార్గాలు, ఈ వేధింపులు ఖచ్చితంగా ప్రజలకు ఇక మీదట ఉండకూడదు. ప్రాణం పోయినా సరే, ఏది ఏమైనా సరే, రాజీపడకుండా ఈ టర్మ్ లో అన్నీ చేయాలని ప్రభుత్వ సంకల్పం. మున్సిపల్ రిఫామ్స్ గానీ, ధరణి వెబ్ సైట్ గానీ, లేదా రైతులు ఎమ్మార్వో కార్యాలయానికి గానీ లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసుకిగానీ వెళ్లే పద్దతులు లేకుండా జరగబోతున్నది. విధాన రూపకల్పన జరిగింది ఈ పాటికే. వెబ్ సైట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. భూ రికార్డులు, పాస్ పుస్తకాలు ప్రతి ఒక్క రైతుకూ అందుతాయి. పోడు వ్యవసాయం చేసే వారికి పోడు భూమికి సంబంధించి పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టా విషయంలో కూడా పాస్ పుస్తకం ఇస్తుంది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు ఎక్కడా ఎలాంటి గందరగోళం లేకుండా క్లియర్ గా పాస్ పుస్తకం ఈ సంవత్సరంలోనే అందివ్వడం జరుగుతుంది. దానిలో ఎటువంటి రాజీ లేదు.

         ఒక బ్రహ్మాండమైన, ఆదర్శవంతమైన పంచాయితీతాజ్ చట్టాని తెచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాభివృద్ధికి సర్పంచ్ ను, గ్రామ కార్యదర్శిని బాధ్యులుగా చేసింది చట్టం. నిధులకు ఎ మాత్రం కొరత వుండదు. పంచాయతీల నిధుల విషయంలో రాబోయే ఐదేళ్లలో రు.40,000 నుండి రు.50,000 కోట్లు వివిధ వనరుల ద్వారా, రూపేణా అందుబాటులోకి వస్తాయి. నరేగా నిధులు, 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన నిధులు, కలిప ఈ లెక్క వేయడం జరిగింది. నిధుల్లో పెరుగుదల కూడా తప్పకుండా ఉంటుంది. దీనికి కారణం, 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నివేదికను బట్టి స్థానిక సంస్థలకు నిధులు పెంచుతారు. ఆ రకంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రు.40,000 నుండి రు.50,000 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 500 జనాభా ఉండే అతిచిన్న గ్రామ పంచాయతీకి కూడా నరేగా నిధులు రు.8,00,000 వస్తాయి.

నరేగా నిధుల విషయంలో ఇప్పటిదాకా చాలా అరాచకం జరిగింది. ఇష్టం వచ్చిన పద్ధతిలో నిధులు ఖర్చు పెట్టారు. ఇష్టం వచ్చిన పద్ధతిలో వ్యవహారాలు జరిగాయి. గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేశారు. మండల పరిషత్ లను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చచేశారు. ఎవరో కొందరు వ్యక్తులు ప్రతిపాదనలు పెట్టడం, మంజూరు చేయడం చాలా గందరగోళం జరిగింది. దాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఎట్టిపరిస్థితుల్లోను నూటికి నూరుశాతం నరేగా నిధులు గ్రామ పంచాయతీల ద్వారానే ఖర్చు పెట్టించడానికి సిద్ధమైంది ప్రభుత్వం. అది కూడా సర్పంచ్ ల ద్వారానే జరుగుతుంది. నరేగా నిధులు, కేంద్ర ఆర్థికసంఘం సిఫార్సు చేసే నిధులు, రాష్ట్ర ఆర్థికసంఘం ఇచ్చే నిధులు, పంచాయతీల స్వంత ఆదాయం అన్నీ కలిపి సుమారు రు.50,000 కోట్ల రూపాయలు ఈ టర్మ్ లోనే ఖర్చు కాబోతున్నాయి. రు.50,000 కోట్లు ఖర్చయిన తర్వాత గ్రామాలు బాగా లేవు అనే మాట వినబడదు. గ్రామాలు ఎందుకు బాగుండవు? బాగా ఉండి తీరాలి. ఆ దిశగా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అలా జరక్కపోతే, బాధ్యులను శిక్షిస్తుంది. రూపాయి కూడా నష్టం జరగకుండా నియంత్రణ వుంటుంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రజలు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. 


         కేంద్రం నుంచి నిధులు తేవడం లేదని ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి కాని అది యదార్థం కాదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చి మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లక్ష కోట్లు, రెండు లక్షల కోట్లు తెలంగాణాకు ఇచ్చామని పచ్చి అబద్దాలు చెప్పారు. సీఎం కేసీఆర్ ధీటైన సమాధానం ఇచ్చారు ఆయనకు పత్రికాముఖంగా. వాస్తవానికి దేశాన్ని, సాకుతున్న ఐదారు పెద్ద రాష్ట్రాలలో  తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఇన్కం టాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కానీ, లేదా వివిధ కేంద్ర పన్నులు కానీ, కేంద్రానికి పన్నుల రూపంలో, రు.50,016 కోట్లు తెలంగాణ నుండి కేంద్రానికి వెళ్లాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కానీ, డెవల్యూషన్స్ నిధులు కానీ, అన్నీ కలిపితే రాష్ట్రానికి బదులుగా వచ్చేది 24,000 కోట్ల రూపాయలు మాత్రమే. రు.26,000 కోట్ల రూపాయల తెలంగాణ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వాడుతున్నదే తప్ప, కేంద్ర ప్రభుత్వానిది రాష్ట్రం వాడడం లేదు. తెలంగాణాకు కేంద్రం నిధులు తేవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నీతి ఆయోగ్  కూడా స్వయంగా రికమెండ్ చేసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు. వాటికి 24,000 కోట్ల కోట్ల రూపాయలు ఇవ్వండని రికమెండ్ కూడా చేసారు. కాని 24 రూపాయలు కూడా కేంద్రం ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగా  వందసార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. సెక్రటరీలు, మంత్రులు వెళ్లి అడిగారు. కేసీఆర్ స్వయంగా వెళ్ళినపుడు కూడా అడిగారు. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, హౌజింగ్ వంటి అన్ని రంగాల గురించి వాళ్ళను తీసుకువచ్చి, స్కీములు చూపించడం జరిగింది. గ్రౌండింగ్ పనులను కూడా చాసారు వాళ్ళు. చాలా బాగుంది. బాగా పనులు జరుగుతున్నాయని పొగిడారు. కాని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ముందుముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చే, ఆ రాష్ట్రం అవసరం వుండే, కేంద్ర ప్రభుత్వం రావాలని కోరుకుందాం. అప్పుడు ఆటోమేటిగ్గా నిధులు వస్తాయి. తెలంగాణ అవసరం ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంటే తప్పకుండా నిధుల వరద పారుతుంది. అందులో డౌట్ లేదు.

         ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు ఎకనామిక్ సర్వే పెట్టరు. రెండవది 31, మార్చి ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎకనామిక్ సర్వే ఇప్పుడు రాదు. సమగ్ర వివరాలు అన్నీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తాయి. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో ముందుకు పోతే మినిమమ్ ఎక్స్ పెండీచర్ కు పర్మిషన్ తీసుకుంటే తప్పకుండా జూన్ లేదా జూలై మాసంలో పూర్తి బడ్జెట్ ను పెట్టుకోవాలనే ఉద్దేశంతో వుంది ప్రభుత్వం. ఎందుకంటే, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో, వాళ్ల పాలసీ ఏముందో చూసుకొని సమగ్రమైన బడ్జెట్ ను పెట్టుకుందామనే ఉద్దేశంతోనే ఓట్ ఆన్ అకౌంట్ ను పెట్టింది తప్ప, వేరే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఫుల్ బడ్జెట్ అనేది కేంద్రం యొక్క ట్రెండ్స్ ను బట్టి రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటుంది. అప్పుడు అన్ని వివిరాలు ఎకనామిక్ సర్వే ద్వారా కానీ, మరొకటి కానీ సభ ముందు సమగ్రంగా పెడతారు.
--సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చల ప్రసంగం ఆధారంగా

Monday, March 25, 2019

Political Parties and Defections : Vanam Jwala Narasimha Rao


Political Parties and Defections
Vanam Jwala Narasimha Rao
The Hans India (26-03-2019)

As part of political reckoning or polarization, in the recent past, number of elected representatives as well as activists belonging to different political parties have joined Telangana Rashtra Samithi and the process is unabated. This phenomenon of changing loyalties is viewed as unethical by few, others who disagree with them argue that for an ever-changing political necessity prevailing in the state it is but natural. Having been attracted to Chief Minister KCR’s persistent hard work to develop the state and countless development and welfare activities initiated and implemented by his government many are looking towards TRS. Another reason for large scale defections of elected representatives as argued by one more section could be, that, the opposition which is expected to play the role of offering constructive criticism failed miserably to do so. It is also a known fact that few persons belonging to TRS when shown interest to join opposition they are readily welcomed and admitted unconditionally. It has become a routine affair to shift loyalties from one party to another, and hence, criticism against this may perhaps be not taken seriously.  

In a parliamentary democracy discipline is essential to political parties. When it is absent it may lead to collapse of elected governments or may lead to annihilation of opposition as the case may be. The best example of part indiscipline is defections mand this is not limited to one single party. Almost all political parties either had a taste of it or may taste in future. In India it is a political game. This game may be sweetish sometimes or may otherwise leave bitter experience. If one observes the way defections have been taking place in AP state on the eve of general elections and also in the recent past, they leave a heinous indelible mark on the political scene. However, it also appears like a routine affair too. The reason of defections in AP totally differ from that of Telangana.

The origin and genesis of defections could be traced to British parliament, the House of Commons, which is supposed to be the mother of Parliamentary Democracies. Whoever crosses the floor in Britain after getting elected from one party and are called there as disloyal persons. Though not a common feature the defections do take place now and then. Members of the House of Commons of the United Kingdom, British members of the European Parliament, and members of the British devolved assemblies sometimes cross the floor and abandon a previous party membership to take up a new one. It is also common in USA, Australia, Canada. As far as India is concerned, despite stringent Anti-Defection laws, for various reasons and on various grounds, politicians of almost all affiliations change loyalties and switch parties. No one is talking this seriously. However, when someone defects to their party they invite him with claps and when it happens the other way affecting them, the same people indulge in criticism. There are also varied views whether the defected member should loose membership of the House or not.

The thought of Anti-Defection Law for the first time in India came in 1960s. In 1967 general elections Congress Party lost in eight states and was not in a position to form governments there. This resulted in coalition governments formation and idea of common minimum programs. In addition, large scale defections cropped up. Between 1967-71 there recorded 142 defections in Parliament and 1969 defections in state legislatures. 32 governments collapsed and 212 defectors were rewarded with ministerial berths.

The then Haryana State Government collapsed due to defections. The Congress Government led by Bhagavat Dayal which lost majority during speaker election leading to defeat of official candidate had to resign. The Congress dissidents after defection formed Haryana Congress Party and joined hands with opposition. Consequently, with Rao Birendra Singh as CM new Government was formed. Thus, Haryana became the first state where a defector became Chief Minister. One MLA by name Gayalal of that state defected thrice and since then the words “aayaram and gayaraam” became popular. Against this background came the Anti-Defection Act in the year 1985. This Act enacted during Rajiv regime was made part of 10th Schedule of Constitution.


Whatever manner we may like to interpret the Anti-Defection Law, one thing that is certain is, that, there is a conspicuous absence of well-established conventions required in a parliamentary democracy, in this regard. Though stability of governments was ensured through this act, there is a possibility of deficiency of government accountability to parliament. Probably it would have been better had the Anti-Defection Act been restricted or limited to no-confidence motions and money bills. This Act also may lead to curtailing the freedom of expression of an elected member as he has no choice to air out his dissent.

Against this background it needs to be examined whether there is any necessity for an Anti-Defection Law. Are defections limited to India alone? How the other countries are facing the defection issue? An interesting factor is that, despite prevalence of defections many developed nations have not enacted an anti-defection law to restrict floor crossing of their law makers. It was a world-wide known truth that in 1931 in Britain politics for the first time James Ramsay MacDonald who became Prime Minister representing Labour Party defected. MacDonald, following differences with his party leadership on the then prevailing national economic crisis, left the party. But, neither he nor three of his cabinet colleagues who left party with him did not resign to the membership of British Parliament, the House of Commons. There was no necessity also. Elections were also not held.

In Australian Parliament also party defections were very common. Floor crossing and collapse of governments were a regular feature there. In USA too it is common and many a times Members of House of Representatives do vote against their own party and that too on matters of high importance. They however do not defect officially. Whether defection or no defection a Member of British Parliament once elected shall remain as its member until the expiry of the term. Indian Constitution by and large is a British Parliamentary and west minister type model.   

As already mentioned, defections in India was a post 1967 election development. Not that they were totally absent earlier but were rare like in the case of Ashok Mehta and Tanguturi Prakasam Pantulu who continued in the posts even after defection. Post 1967 such examples were innumerable. To mention few: Governments of Charan Singh and TN Singh in UP; GN Singh in MP; Rao Birendra Singh in Haryana; Gurnam Singh, Prakash Singh Badal and Lachman Singh Gil in Punjab; MP Sinha, BP Mandal, Daroga Roy and Karpuri Thakur in Bihar and that of Namboodiri pad in Kerala formed after defections. This defection process has become a continuous one.

In a democracy unless majority of people change parties from time to time, there cannot be change of governments and only one government stays in power like in a dictatorship. The fact that once in five years or ten years governments are changing in states and centre means voters and people are changing parties. There is nothing strange in this. Similarly elected representatives or aspiring candidates for better opportunities may resort to change of party. Freedom of expression is a Constitution guaranteed Fundamental Right. To express dissent on his original party one may choose to defect. That is why there need to be well laid conventions but not mere Acts.

పార్టీలూ ఫిరాయింపులూ! ..... వనం జ్వాలా నరసింహారావు


పార్టీలూ ఫిరాయింపులూ!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (26-03-2019)
రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో భాగంగానో, లేదా, రాజకీయ పున‌రేకీక‌ర‌ణ‌లో భాగంగానో ఇటీవ‌ల కాలంలో వివిధ రాజ‌కీయ పార్టీల‌నుంచి ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు, పార్టీ కార్యకర్తలు, మాజీలు, తాజాలు పలువురు తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరుతున్నారు. ఇలా పార్టీలు మార‌డాన్ని కొంత‌మంది నీతిబాహ్య‌మైన‌దిగా భావిస్తే, అవ‌స‌రాన్ని బ‌ట్టి ఇలా మార‌డం స‌బ‌బేన‌నే వారు కూడా లేక‌పోలేదు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి, ఆయన ప్రభుత్వపు సంక్షేమ ప‌థ‌కాల, అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప‌ట్ల అక‌ర్షితులై ప‌లువురు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నార‌న్న‌ది ఆ పార్టీ నాయకులు చేస్తున్న వాదన. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో నిబ‌ద్ద‌త‌తో  కూడిన ప్ర‌తిప‌క్షంగా ప్ర‌తిప‌క్ష పార్టీ వ్య‌వ‌హ‌రించ‌డంలో వైఫ‌ల్యం చెంద‌డం కూడా ప్ర‌జాప్ర‌తినిధులు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధ‌ప‌డేందుకు మ‌రో కార‌ణం కావచ్చు. అలాగే, టీఆర్ఎస్‌లో ఉన్న‌వాళ్ళు ఏదో కార‌ణంగా ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరేందుకు ఆస్త‌కి చూపితే ఆ పార్టీలు బేష‌ర‌తుగా చేర్చుకోవ‌డం కూడా అందరికీ తెలిసిన విషయమే. అంటే చట్ట స‌భ‌లో ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలో చేరడం  స‌ర్వ సాధార‌ణం అయిన త‌రుణంలో ఎదురయ్యే విమ‌ర్శ‌ల‌ను పెద్ద‌గా ప‌రిగ‌ణించ‌న‌వ‌స‌రం లేదేమో!!

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు క్రమశిక్షణ అత్యంత అవశ్యం. అది లోపించన నాడు ప్రభుత్వాలు పడిపోనూవచ్చు, ప్రతిపక్షాలు విల-విల్లాడ వచ్చు కూడా. ఫలానా రాజకీయ పార్టీ క్రమశిక్షణ కోల్పోయిందనడానికి అసలు-సిసలైన ఉదాహరణ ఫిరాయింపులే. ఈ రకమైన క్రమశిక్షణ ఉల్లంఘన ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితమైంది కానేకాదు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఈ దెబ్బ తగలడమో, భవిష్యత్ లో తగలబోవడమో తధ్యం. భారతదేశంలో ఇదొక సహజమైన రాజకీయ క్రీడ. ఈ క్రీడ ఒక్కోసారి తీపిని పంచుతే, మరో సారి చెడు అనుభవాన్ని మిగులుస్తుంది. సాధారణ ఎన్నికల ప్రకటన పూర్వరంగంలో, ఆ తరువాత గత కొద్దికాలంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు స్థంబాల ఆటలాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పార్టీ ఫిరాయింపుల పరిణామాలను గమనిస్తుంటే, కొంత జుగుస్పాకరంగా ఉన్నప్పటికీ, అదేదో సర్వసాధారణ విషయంలాగా కనిపిస్తున్నది. అక్కడి కారణం ఒకటైతే, తెలంగాణాలో చెప్తున్న కారణాలు మరో రకం. ఫలితం మాత్రం ఒకటే.

         పార్టీ ఫిరాయింపుల నేపధ్యాన్ని  పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక అని పిలవబడే బ్రిటీష్ హౌజ్ ఆఫ్ కామన్స్ లో వెతుక్కోవచ్చు. ఆ దేశంలో, ఒక పార్టీ గుర్తుమీద ఎన్నికై మరో పార్టీకి మారిన వారిని “అవిదేయులు” గా సంబోధిస్తారు. అక్కడ ప్రభుత్వ పక్షం నుండి ప్రతిపక్షానికి, లేదా, ప్రతిపక్షం నుండి ప్రభుత్వ పక్షానికీ మారడం అరుదుగా జరిగినప్పటికీ, అడప-దడపా జరుగుతూనే వుంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో కూడా ఇది సహజంగా జరిగే విషయమే. ఇక భారతదేశం విషయానికొస్తే ఎంత పకడ్బందీ ఫిరాయింపుల వ్యతిరేక, నిరోధక చట్టాలు వచ్చినా, రకరకాల కారణాల వల్ల ఒక పార్టీ నుండి మరొక పార్టీకి నిరాటంకంగా మారడం దాదాపు అన్ని పార్టీల ప్రతినిధులకు సహజమైన అలవాటుగా మారిపోయింది. దీన్నిప్పుడు ఎవరూ పెద్ద తప్పుగా పరిగణించడం లేదు కూడా. కాకపోతే తమ పార్టీలోకి వేరే పార్టీ నుండి వలసలు వచ్చినప్పుడు సంతోషించి చప్పట్లు కొట్టే రాజకీయ నాయకులు, అదే తమ పార్టీ నుండి వేరే పార్టీలోకి మారితే తీవ్రంగా విమర్శిస్తుంటారు. తమకో నీతి, ఇతరులకో నీతి అనేది వారి వాదనగా కనిపిస్తుంది. పార్టీ మారిన ఎన్నికైన ప్రజాప్రతినిధుల సభ్యత్వం రద్దు చేయాలా? వద్దా? అనే విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.

         పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1960 దశకంలో ఆలోచనలోకి వచింది. 1967 లో సాధారణ ఎన్నికలు జరిగిన 16 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది రాష్ట్రాలలో మెజారిటీ రాలేదు. ఏడు రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమై, కనీస ఉమ్మడి కార్యక్రమం అన్న మాట ఆచరణలోకి వచ్చింది. దీనికి అదనంగా పెద్ద ఎత్తున రాజకీయ వలసలు మొదలయ్యాయి. 1967-71 మధ్య నాలుగేళ్ల కాలంలో పెద్ద ఎత్తున, పార్లమెంటులో 142 ఫిరాయింపులు, యావత్ దేశంలోని శాసనసభల్లో 1969 ఫిరాయింపులు చోటు చేసుకున్నాయి. 32 ప్రభుత్వాలు కూలిపోగా పార్టీ ఫిరాయించిన 212 మందికి మంత్రి పదవులు లభించాయి.


         హర్యానా రాష్ట్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపుల కారణాన పడిపోయింది. భగవత్ దయాళ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, శాసనసభలో జరిగిన సభాపతి ఎన్నిక సందర్భంగా, అధికారిక అభ్యర్థి ఓటమి పాలవడంతో సభ విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అసమ్మతి వాదులు పార్టీ ఫిరాయించి, హర్యానా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టి, ప్రతిపక్షంతో చేతులు కలిపి, కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించిన రావు బీరేందర్ సింగ్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఒక పార్టీ ఫిరాయింపుదారుడికి ముఖ్యమంత్రి పదవిని దక్కబెట్టిన మొదటి రాష్ట్రంగా హర్యానా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ రాష్ట్రానికే చెందిన గయాలాల్ అనే శాసనసభ సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారిన ఘనుడయ్యాడు. అప్పటి నుండే “ఆయారాం”, “గయారాం” అనే పదాలు వాడుకలోకి వచ్చాయి. ఇలాంటి నేపధ్యంలోనే 1985 సంవత్సరంలో పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం వచ్చింది.

భార‌త‌దేశంలో ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టంలోని అంశాల‌ను ఏ విధంగా వ్యాఖ్యానించినా, స్ప‌ష్ట‌మైన సంప్ర‌దాయాలు లోపించిన మాట వాస్త‌వం. అందువ‌ల్ల పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యం చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన సూత్రాల ప్ర‌కారం కాలానుగుణంగా వ‌స్తున్న ఆచార వ్య‌వ‌హారాల‌పైనే ఎక్కువ అధార‌ప‌డి సాగుతుంది. ఆయారాం గ‌యారాంల వ‌ల్ల‌, రాజ‌కీయ ఫిరాయింపుల వ‌ల్ల ఎదురవుతున్న దుష్ప‌రిణామాల‌కు చెక్ పెట్టేందుకు రాజీవ్ గాంధీ హయాంలో 1985లో రాజ్యాంగం 52వ అధిక‌ర‌ణాన్ని స‌వ‌రించ‌డం ద్వారా ఫిరాయింపు వ్య‌తిరేక  చ‌ట్టాన్ని రాజ్యాంగం 10వ షెడ్యూల కింద చేర్చారు. నిజానికి మ‌న దేశంలో 1973లో, 1985లోనూ, 2003లోనూ వేర్పేరుగా ఫిరాయింపు వ్య‌తిరేక చ‌ట్టాల‌ని చేశారు.

         ప్రభుత్వాలకు ఈ చట్టం ద్వారా కొంత స్థిరత్వం కలిగే వీలున్నప్పటికీ, పార్లమెంటుకు ప్రభుత్వ జవాబుదారీతనంలో కొంత లోటు జరిగే అవకాశం వుంది. ఎన్నికైన సభ్యులకు తమ-తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అసంతృప్తిని వెలిబుచ్చే అవకాశాలు కూడా వుండవు. కొందరు నిపుణులు సూచించినట్లు, పార్టీ ఫిరాయింపుల నిరోధం కేవలం అవిశ్వాస తీర్మానానికో, లేదా, ద్రవ్య బిల్లుల విషయానికో పరిమితం చేసినట్లయితే బాగుండేది. ఇతర విషయాల్లో సభ్యుల మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకునే వెసలుబాటు కలిగిస్తే మంచిది.

         ఈ నేపధ్యంలో చర్చించాల్సింది, అసలు, పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అవసరం వుందా? పార్టీ ఫిరాయింపులు కేవలం భారత దేశానికే పరిమితమా? ఇతర దేశాలు ఫిరాయింపుల వ్యవహారాన్ని ఎలా ఎదుర్కుంటున్నది? ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అభివృద్ధి చెందిన పలు ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ, ఆ దేశాలు ఏవీ కూడా తమ చట్టసభల సభ్యులను నియంత్రించడానికి ఫిరాయింపుల వ్యతిరేక చట్టాలను తేలేదు. బ్రిటన్ రాజకీయాల్లో, 1931 లో మొట్టమొదటిసారి లేబర్ పార్టీ పక్షాన ప్రధాన మంత్రి అయిన రామ్సే మెక్డొనాల్డ్ పార్టీ ఫిరాయింపు వ్యవహారం జగద్విదితం. దేశంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో తన పార్టీ విధానాలతో విభేదించిన మెక్డొనాల్డ్ పార్టీని వదిలాడు. అయితే మెక్డొనాల్డ్ కాని, ఆయనతో కలిసి పార్టీ ఫిరాయించిన మరో ముగ్గురు మంత్రిమండలి సభ్యులు కానీ, బ్రిటీష్ పార్లమెంట్ (హౌజ్ ఆఫ్ కామన్స్) సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. చేయాల్సిన అవసరమూ కలగలేదు. మళ్లీ ఎన్నికల జోలికి కూడా పోలేదు. ఆస్ట్రేలియా పార్లమెంటులో కూడా పార్టీ ఫిరాయింపులు సహజమే. చట్ట సభ సభ్యులు తరచూ పార్టీలు మారడం, ప్రభుత్వాలు కూలిపోవడం, కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడం చాలా సార్లు జరిగిందక్కడ. అమెరికాలో తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రతినిధుల సభ సభ్యులు ఓటేయడం, అది కూడా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాల్లో ఓటేయడం తరచూ జరిగే వ్యవహారమే. కాకపోతే వీరెవరూ అధికారికంగా పార్టీనుండి ఫిరాయించరు.

భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలా వరకువెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్దతితోనే రూపు దిద్దుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారతఇంగ్లాండ్ దేశాలకుదాదాపు ఒకే రకమైన సంప్రదాయాలుప్రక్రియలున్నాయి. వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ విధానంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే విధానం అంతర్లీనంగా వుంటుందనాలి. అలాంటివి ప్రజాస్వామ్యం బలపడ్డానికి దోహదపడతాయి. ఇంగ్లీష్ పార్లమెంటుకు ఒక సారి ఎన్నికైన వ్యక్తికిపదవీ కాలం పూర్తవకుండా-లేదా మళ్లీ ఎన్నిక లొచ్చే వరకైనాపదవి వదులుకునే అవకాశం లేనే లేదు. పదిహేడవ శతాబ్దంలోరాచరిక వ్యవస్థ నేపధ్యంలోబ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నిక కావడంసభ్యులుగా వుండడం అరుదైన గౌరవంగాప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావించినందున ఎవరు పదవి వదులుకునేందుకు ఇష్టపడేవారు కాదు.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఫిరాయింపుల పర్వం, భారతదేశానికి సంబంధించినంతవరకు 1967 లో జరిగిన నాల్గవ సాధారణ ఎన్నికల అనంతరం మొదలైంది. ఇక ఆ తరువాత నిరాటంకంగా కొనసాగింది. అంతకు ముందు అసలే లేవా అంటే, అడపా-దడపా వున్నాయనే అనాలి. డాక్టర్ రఘు వీరా, అశోక్ మెహతా, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటివారు పార్టీలు మారి పదవుల్లో కొనసాగారు. కాకపొతే ఆ సందర్భాలు చాల తక్కువే అనాలి. 1967 ఎన్నికల తరువాత ఎప్పుడైతే కాంగ్రెస్ చాలా రాష్ట్రాలలో ఓటమి పాలై, ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాయో, ఇక అప్పటి నుండి ఫిరాయింపులకు ప్రోత్సాహం మొదలైంది. ఫిరాయింపుల కారణాన చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు స్థిరంగా కొనసాగడమో, లేదా, పేకమేడల్లా కూలిపోవడమో తరచూ చోటుచేసుకుంది.

ఇలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే చాలా వున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ చరణ్ సింగ్, టీఎన్ సింగ్ ప్రభుత్వాలు; మధ్య ప్రదేశ్ జీఎన్ సింగ్ ప్రభుత్వం; హర్యానా రావు బీరేందర్ సింగ్ ప్రభుత్వం; పంజాబ్ గుర్నాం సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్, లచ్మన్ సింగ్ గిల్ ప్రభుత్వాలు; బీహార్ ఎంపీ సిన్హా, బీపీ మండల్, దరోగా రాయ్, కర్పూరీ ఠాకూర్ ప్రభుత్వాలు; కేరళ నంబూద్రీపాద్ ప్రభుత్వం అలా మార్పులు జరిగిన వాటిలో కొన్ని. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇలా జరిగిన ప్రభుత్వాల మార్పిడి అధికారస్వామ్యం మీద ప్రభావం చూపడమే కాకుండా దాన్ని శక్తివంతంగా మార్చింది. రాజకీయ అస్థిరత్వానికి కూడా దారితీసింది. ఈ తతంగం 1971 సాధారణ ఎన్నికల వరకూ కొనసాగింది. ఆ తరువాత ఇందిరా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీతో అటు కేంద్రంలోనూ, ఇటు చాలా రాష్ట్రాలలోనూ గెలవడంతో స్థిరమైన ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీయడమే కాకుండా చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం కూడా జరిగింది. అయినప్పటికీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే వుంది ఏదో ఒక రూపంలో. ఫలితంగా వచ్చిందే ఫిరాయింపుల నిరోధక చట్టం. అదెంత సత్ఫలితాలను ఇచ్చిందో చెప్పనక్కర లేదు.

ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి, లేదా, పలువురు వ్యక్తులు పార్టీ మారక పోతే ఎప్పటికీ ఒకే ప్రభుత్వం అధికారంలో వుంటుంది కదా! ప్రతి ఐదేళ్లకోక సారి ప్రభుత్వాలు మారుతున్నాయంటే ఒక పార్టీ నుండి ప్రజలు (ఓటర్లు) మరో పార్టీకి మారుతున్నట్లే కదా!! అలాగే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కానీ, ఎన్నిక కావాలనుకున్న ఆశావహులు కానీ, అవకాశాల కొరకు పార్టీ మారితే తప్పేంటి అని కొందరి వాదన. భావ ప్రకటనా స్వేచ్చ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కు కనుక, గెలిచిన పార్టీ నుండి ఆ పార్టీపైన అసంతృప్తి వెల్లడించడానికి మరొక పార్టీలోకి మారితే ఆక్షేపణ ఎందుకని కూడా వారంటున్నారు. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో చక్కటి సంప్రదాయాలు నెలకొనాలికాని, చట్టాలు ఏమీ చేయలేవనేది వందశాతం నిజం.

Saturday, March 23, 2019

రాముడి దగ్గరకు పోయిన లక్ష్మణుడు, యతివేషం ధరించిన రావణుడు ....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-53 : వనం జ్వాలా నరసింహారావు


రాముడి దగ్గరకు పోయిన లక్ష్మణుడు, యతివేషం ధరించిన రావణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-53
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (24-03-2019)
వినడానికి కూడా యోగ్యంకాని మాటలను జానకి లాంటిది పలకగా, జితేంద్రియుడైన లక్ష్మణుడు శరీరం గగ్గురపడగా, రెండు చేతులు జోడించి సీతవైపు తిరిగి, ఆమెకు బదులు చెప్పడానికి తన మనస్సు అంగీకరించడం లేదంటాడు. ఇంకా ఇలా అంటాడు. “నువ్వు నాపాలిట దేవతవని నా అభిప్రాయం. యోగ్యా-యోగ్య విచారం చేయకుండా నోటికి వచ్చినట్లు కఠినంగా మాట్లాడడం స్త్ర్రేలకు కొత్త కాదు. చెడు విషయంలోనూ, మంచి విషయంలోనూ వారి ఇష్టప్రకారం నడచుకోకపోతే పురుషులను నోటికి వచ్చినట్లు తిట్తారు. స్త్రీలకందరికీ లోకంలో ఇలా పరుషంగా అనుచిత భాషణం చేయడం స్వభావంగా వచ్చింది. స్త్రీలు ధర్మజ్ఞానం లేనివారు. చపలచిత్తులు. ఎంత క్రూరకార్యం చేయడానికైనా వెనుదీయరు. దయాదాక్షిణ్యాలు లేవు. అన్నదమ్ములు, తండ్రిబిడ్డలు, ఒకరితో ఒకరు కలిసి వుండకుండా కొంపలు విడదీయగల నేర్పరులు. మదించినదానా! నీమాటలు కొర్రు కాల్చి గుచ్చినట్లు అయింది”.

“న్యాయం చెప్పేవాడినైన నేను న్యాయం పలుకుతుంటే, నీ దుష్టవాక్యాలను ఈ వనదేవతలందరూ వివరంగా సాక్షులై విందురుగాక. చీ! సహజంగా స్త్రీత్వమే పాపాత్మకం. కోపస్వభావంగలదానా! పెద్దవాడు తండ్రితో సమానమైన అన్న ఆజ్ఞ పాలిస్తున్న నన్ను ఈ విధంగా సందేహించినందున నువ్వు ఇప్పుడే పాడైపో. అబలా! ఇప్పుడే పోతాను రాముడున్న దగ్గరికి. ఇప్పుడు నీకు స్వస్తి కలుగుకాక. వనదేవాతలు రక్షించెదరుగాక. నాకు చెడు సూచించే అపశకునాలు కనిపిస్తున్నాయి. రామచంద్రుడితో తిరిగి వచ్చిన తరువాత నిన్ను చూడగలనో? లేదో?

ఇలా ఎప్పుడైతే లక్ష్మణుడు అన్నాడో, జానకి కన్నీళ్లు కారుస్తూ, ఏడుస్తూ, కర్ణశూలాల లాంటి మాటలన్నది. “నేను విషం తిని చస్తాను. గోదావరిలో దూకుతాను. ఉరిపోసుకుంటాను. మంటల్లో పడి చస్తాను. ఇతరులను కాలి వేలితోనైనా తాకుతానా?” అని అంటూ గట్టిగా ఏడుస్తూ, రెండు చేతులతో దబ-దబా అని కడుపుమీద కొట్టుకుంది. లక్ష్మణుడు ఓదార్చినా వినలేదు, ఆగలేదు. ఆ తరువాత లక్ష్మణుడు ఇంకా ఇక్కడే వుంటే ఏమవుతుందోనని భయపడి, సీతకు నమస్కారం చేసి, రుజుత్వమే మేలని భావించి, రాముడి దగ్గరకు పోయాడు.

         లక్ష్మణుడు అలా వెళ్లిపోగానే అవకాశం దొరికిందని రావణుడు సీతను చేరదల్చుకున్నాడు. సన్న్యాసి వేషం వేసుకుని, సన్న కాషాయ వస్త్రం కట్టుకుని, ఎడమ భుజం మీద త్రిదండం పట్టుకుని, చేత కమండలం వుంచుకుని, గొడుగు పట్టుకుని, శిఖ కలిగి, పావుకోళ్లు తొడుక్కుని, అన్నదమ్ములిద్దరూ లేకపోవడంతో సీతదగ్గరకు పోయాడు రావణుడు. వాడికి భయపడి చెట్లా ఆకులూ కదలలేదు. గాలి ఆగిపోయింది. వేగంగా పారే గోదావరినది వాడి భయంతో మెల్లమెల్లగా నడిచింది. దుష్టుడైన రావణుడు మగడు సమీపంలో లేడని వ్యధపడుతున్న సీతను సమీపించబోయాడు. ఆవేశించిన కామంతో, మోసబుద్ధితో, వేదఘోష చేస్తూ, సీతదగ్గరకు పోయి సవినయంగా ఆమెతో ఇలా అన్నాడు.


         “మనోహరమైన దానా! పచ్చని వస్త్రం ధరించిన దానా! అందమైన బంగారు వన్నె కలదానా! చంద్రుడి లాంటి ముఖంకలదానా! కమలంతో కలసిన తామరతీగె లాగా ఉన్నదానా! సుందరీ! నువ్వెవరు? నువ్వు భూదేవతవా? కీర్తివా? లక్ష్మీదేవివా? స్వతంత్రించి తిరిగే రతీదేవివా? దేవతాస్త్రీవా? ఆడ ఏనుగు లాంటి నడకగల దానా! నా మనస్సు హరిస్తున్నావు. నువ్వెవరివి? వాస్తవం చెప్పు. మొల్ల మొగ్గల్లాంటి దంతాలు కలదానా! నీ దంతాలు నిర్మలంగా, నున్నగా, సమంగా, మొగ్గల్లాంటి కొనలతో వున్నాయి. వెడల్పాటి కళ్ళదానా! నీ కళ్ళు చివర్లో ఎర్రగా, నిర్మలంగా, దీర్ఘంగా నల్లని గుడ్లు కలిగి వున్నాయి. నీ మొల అందంగా బలిసి విశాలంగా వుంది. నీతొడలు ఏనుగు తొండాలలాగా వున్నాయి. అబలా! నీ స్తనాలు వుబ్బి గుండ్రంగా ఎత్తుపల్లాలు లేకుండా, ఒకే విధంగా ఒకదానిని మరొకటి రాసుకుంటూ తాటిపళ్ళలాగా మనోహరంగా బలిసి వున్నాయి. చూసేవారి హృదయాలను హరిస్తున్నాయి”.

         “అందమైన చిరునవ్వు, అందమైన దంతాలు, అందమైన కళ్ళు, అందమైన వెంట్రుకలదానా! శృంగార చేష్టలకు సముద్రమైన దానా! పిడికిట పట్టే నడుం కలదానా! హృదయానికి ఇంపైనదానా! ఒకదానికొకటి రాసుకునే తొడలదానా! కఠినమైన కుచాలుకలదానా! ఏటి ప్రవాహం అడ్డం లేకుండా తీరాన్ని కోసి లోపలికి తీసుకున్నట్లు కమలాల లాంటి కళ్ళుకల చిన్నదానా! నీ చూపులతో నా మనస్సును కరిగించి హరించావుకదా? నేను దేవతా స్త్రీలను, యక్షస్త్రీలను, కిన్నర స్త్రీలను, కన్నులకు సంతోషం కలిగించే ఎందరినో చూశాను కాని, సౌందర్య సంపదలో నీలాంటి దాన్ని భూలోకంలో చూడలేదు. సుందరీ! నీ వయస్సు, నీ సౌకుమార్యం, నీ చక్కదనం, ఆలోచించగా నువ్వు వంటరిదానివై ఈ అడవిలో వుండడం నాకు వెర్రి కలిగిస్తున్నది. లతాంగీ! నువ్వు ఇంటికి పో. భయంకరమైన రాక్షసులు ఇక్కడ తిరుగుతుంటారు. కాబట్టి నువ్వు ఇక్కడ వంటరిగా వుండకూడదు. నీకు తగినవిధంగా త్వరగా పోయి బంగారుమేడలను, ఉద్యానవనాలను అలంకరించడానికి పో. నువ్వు అక్కడ వుండడమే వాటికి అలంకారం”.

         “కమలాల లాంటి కళ్ళదానా! శ్రేష్టమైన పూడండలు, శ్రేష్టమైన భోజనం, శ్రేష్టమైన వస్త్రం, శ్రేష్టుడైన మగడు నీకు కావాలి. ఇది నా అభిప్రాయం. అల్పుడు, సామాన్య పురుషుడు నీకు తగిన మగడు కాదు. మనుష్య స్త్రీలలో ఇలాంటి అందగత్తె లేదు. కాబట్టి నువ్వు దేవకాంతవని నమ్ముతున్నాను. అలా అయితే వాళ్లలో నువ్వెవరివి? ఏకాదశ రుద్రులకు సంబంధించిన దానివా? నిజంగా మరుత్తులకు చెందినదానివా? ప్రేమతో చెప్పు. దేవతా స్త్రీలు, కిన్నర స్త్రీలు ఇది రాక్షస భూమి కాబట్టి ఇక్కడికి రారు. నువ్వెక్కడిదానివి? వంటరిగా ఇక్కడ ఎందుకున్నావు? చెప్పు”.

         “నీలాంటి సుందరి మనుష్యులలో లేరు. కాబట్టి నువ్వు మనుష్య స్త్రీవి కాదు. దేవతా స్త్రీవే అయ్యుండాలి. ఇది రాక్షస భూమికాబట్టి దేవతా స్త్రీలు, కిన్నర స్త్రీలు ఇక్కడికి రారు. అయినా నువ్వు వచ్చావు. రాక్షసులకు ఇష్ట దేవత రుద్రుడు కాబట్టి ఆ రుద్రులకు సంబంధించిన దానివా? లేక, వాయువు ఇక్కడ తిరుగుతుంటాడు కాబట్టి వాయువులకు చెందిన దానివా? నిజం చెప్పు. ఇక్కడ పులులు, సింహాలు, కోతులు, చిరుతపులులు, ఎలుగులు, పెద్దగద్దలు, విస్తారంగా ఇక్కడ తిరుగుతున్నాయే? నువ్వెలా భయం లేకుండా ఇక్కడ వున్నావు? మదిరాక్షీ! నీ భర్త ఎవడు? నీ కులం ఏది? నీ జాతి ఏది? వయసుదానివి కదా, ఇక్కడ ఎందుకు వున్నావు? ఇది రాక్షసుల గుంపులు తిరిగే స్థలం” అని రావణుడు అడిగాడు. బ్రాహ్మణ సన్న్యాసి వేషం వేసుకున్న వాడిని సీతాదేవి శీఘ్రంగా, యతులను పూజించే విధంగా పూజచేసి సత్కరించింది.

Thursday, March 21, 2019

రైతుకు ఎక్కడా ఎలాంటి గందరగోళం వుండదు ..... తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం -3


తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం -3
జ్వాలాంతరంగం
సూర్యదినపత్రిక (22-03-2019)
         కౌలు రైతులకు రైతు భీమా ఎందుకు వర్తింప చేయరని ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చాలా సార్లు ప్రశ్నిస్తుంటారు. ఈ నేపధ్యంలో కౌలు రైతుల గురించి వివరంగా చెప్పాలి. అసలు కౌలు రైతులేవరు? ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడనుకుందాం. ఈ సంవత్సరం ఆయనకు ఆరోగ్యం, మిగతా అన్ని విషయాలు అనుకూలంగా వుంటే అతడే స్వయంగా వ్యవసాయం చేసుకుంటాడు. వచ్చే సంవత్సరం ఆయనకు చేతకాక పోతే ఒక వ్యక్తికి కౌలుకిస్తాడు. ఆ మరుసటి ఏడాది ఇంకొకరికి, మూడో సంవత్సరం మరొకరికి ఇవ్వచ్చు. ప్రతిఏడు ఒక్కరికే ఇవ్వాలని లేదు కదా? ప్రభుత్వానికి ఆ రైతు ఏ సంవత్సరం ఎవరికీ కౌలుకు ఇస్తున్నాడని చూడడమే పనా? అతడు ఈ సంవత్సరం తన భూమి ఎవరికి కౌలుకి ఇచ్చాడు, ఆ తర్వాతి సంవత్సరం ఎవరికిచ్చాడో రాసుకుంటూ కూర్చోవాలా? గవర్నమెంటుకి పనేమీ లేదా?

కరెక్టుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. రైతులను ఎన్నోరకాలైన ఇబ్బందులకు గురిచేయడం జరిగింది. పాసుబుక్ లో పట్టాదారు పేరు అనీ, అనుభవదారుడి పేరు అనీ వుండడంతో ఆ నెపంతో ఒక్కోసారి ఉల్టా రాసి, వాడిమీద ఇంకొకడు వెళ్లి కేసు పెట్టడం  జరిగేది. అసల్దారు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇదేమి పద్ధతి ? అనుభవదారుడి పేరు రికార్డుల్లో రాయాల్సి వస్తే బంజరాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉండే బంగళాలు కిరాయికి తీసుకుంటే, అనుభవదారుని పేరు రాస్తారా? ఎందుకు రాయరు ? గవర్నమెంటుకి రెండు పాలసీలు ఉండకూడదు కదా? హైదరాబాదులో కిరాయికి ఇచ్చే ఇళ్లకి సంబంధించి అనుభవదారుని పేర్లు రాస్తున్నారా? రైతుల విషయంలోనే అలా జరగాలా? వాళ్లను పీడించవచ్చు, ఇష్టమొచ్చినట్లు ఉల్టా పల్టా చేయవచ్చు, వేలకు వేలు లంచాలు తీసుకోవచ్చు, ఇదా పద్ధతి ? కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక పాలసీ తీసుకుంది. ఎన్నికల ముందు కూడా సీఎం కేసీఆర్ ఈ విషయంలో కుండబద్దలు గొట్టనట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రైతు పక్షపాతిగా ఉంటాం అని ఆయన అన్నారు. రైతు మీద ఇంకొకడు సవారీ చేస్తామంటే ఒప్పుకోం అని స్పష్టం చేసారు సీఎం.

రైతులు ఎంత కష్టపడి తమ భూములను కాపాడుకుంటారో సీఎంకు తెలుసు. ఆయనా రైతే. ఆయనకు కూడా వ్యవసాయం వంశపారంపర్యంగా ఉంది. అవసరమైతే రైతులు రెండుపూటలు ఉపవాసం ఉంటారు కానీ భూమి అమ్మరు. అంత కష్టపడి కాపాడుతారు. కాని జరుగుతున్నదేంటి? రైతుకి పదిమంది భర్తలు. ఎంత భయంకరమైన టార్చర్, ఎన్ని రకాలైన బాధలు రైతుకి. అందుకోసమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రైతు పట్టాదారు పాసు పుస్తకాలలో మూడు కాలమ్స్ మాత్రమే వున్నాయి. ఇంతకు ముందు 36 కాలమ్స్ ఉంటే, అందులో 33 కాలమ్స్ ఎత్తిపారేసింది ప్రభుత్వం. సాంప్రదాయ రెవెన్యూ ఆలోచన సరళి ఉన్నవారంతా ఇది చాలా ప్రమాదకరం అని అన్నారు. మొత్తం మార్చేస్తున్నారని అన్నారు. ఏమీ భూకంపం రాదు, ఎవ్వడూ చచ్చిపోడని చెప్పారు ముఖ్యమంత్రి. ఇదంతా జరిగి ఏడాది అయింది, ఎవ్వడూ చచ్చిపోలేదు. అందరూ సుభిక్షంగానే ఉన్నారు. రైతులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఆ కాలమ్స్ పోయాయి, అనుభవదారులు లేరు. పాట్టాదారులు మాత్రమే వున్నారు. కౌలుదారుకు ఏమన్నా ఇవ్వాలంటే, అది రైతుకు, కౌలుదారుకు మధ్య జరిగే ఒప్పందమే కాని ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేదు.

         ఈ ప్రభుత్వం రైతులను గురించి మాత్రమే పట్టించుకుంటుంది. రైతులకు కౌలుదార్ల పట్ల మెర్సిఫుల్ గా ఉండండి అనీ, వాళ్లకు ఏమైనా సహాయం చేయండి అనీ ముఖ్యమంత్రి శాసనసభలో అప్పీలు కూడా చేశారు. ప్రభుత్వం రైతుకు ఇస్తోంది కాబట్టి, రైతు భూమి ఇతరులు సాగు చేస్తున్నారు కాబట్టి, వాళ్లకు రైతు కూడా పెట్టుబడి సహాయం చేయండని సిన్సియర్ గా అప్పీల్ చేస్తున్నాను అన్నారు. రైతులను మాత్రం గందరగోళంలో దింపి, అనుభవదారుల పేరు రాసి, రైతుల హక్కులకు వాళ్ల భూములకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనీయదీ ప్రభుత్వం. రైతుకు నిశ్చయాత్మక టైటిల్ వుండాలి. యాజ్మనాయ హక్కుండాలి. అంతా ఇష్టమొచ్చిన పద్ధతిలో ఉంది. కాబట్టి ఇష్టమొచ్చిన పద్ధతిలో ఇతరులు ఆక్రమణలు చేస్తున్నారు. బలమైన వ్యక్తి బలహీనుడైన వాడి ఇంటికి వెళ్లి, ఈ ఇల్లు నాది అని అతన్ని బయటకి వెళ్లగొట్టే పరిస్థితి వస్తే చేసేదేమీ లేదు. నిశ్చయాత్మక టైటిల్ లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నిశ్చయాత్మక టైటిల్ పెడితే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.

అన్నీ అనుకూలించి ఆ నిశ్చయాత్మక టైటిల్ తెస్తే ప్రజలకు అద్భుతమైన రక్షణ వస్తుంది. వ్యవసాయ భూమిగానీ, స్వంత గృహం గానీ, ఏవైనా ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా రక్షణగా ఉంటాయి. ఆ దిశగా, భూ రికార్డుల ప్రక్షాళనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఆరేడు మాసాల్లో సమగ్రంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. కొన్ని భూములు పార్ట్–బిలో ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. దాదాపు పది లక్షల ఎకరాల భూమిపై అటవీశాఖకు – రెవెన్యూశాఖకు వివాదం వుంది. ఆ రెండుశాఖలూ ప్రభుత్వానికి సంబంధించినవే. ఇది మాదని ఈయన అంటాడు, ఇది మాదని ఆయన అంటాడు. ఎన్నో ప్రాజెక్టులకు, ఎన్నో జాతీయ రహదారులకు, ఎన్నో రైల్వే లైన్లకు, ఎన్నో ప్రభుత్వ భవనాలకు కొందరు వారి భూమిని డొనేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అక్వైర్ చేసింది. ఒక్కటంటే ఒక్కదానిమీద కూడా టైటిల్ మార్చలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మార్పిస్తున్నది. సబ్ స్టేషన్లు నిర్మించినా, ఒక్కదానిమీద కూడా విద్యుత్ శాఖకు అధికారం లేదు. ఎవరైతే ఓనర్ డొనేషన్ ఇచ్చారో అతని పేరుమీదనే ఉంది.


         భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పవర్ స్టేషన్ ఉంటే, దానికి విద్యుత్ శాఖకు సంబంధించినదని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే దానిపై వైద్యశాఖకు చెందినదని రాశారు. ఇంత చిక్కిరిబిక్కిరిగా, ఇంత గందరగోళ పరిస్థితుల్లో భూముల యొక్క రికార్డులు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టు కింద తీసుకున్న భూములు కూడా సాగునీటి ప్రాజెక్టుల పేరు కింద లేవు. భూములు స్వాధీనం చేసుకొని, భూములు తవ్వుకుంటూ కాలువలు తవ్వారు. ప్రాజెక్టులు కట్టారు. కానీ భూమిని సాగునీటి ప్రాజెక్టు కిందకు బదిలీ చేయలేదు. ఇలా లక్షల ఎకరాల్ని కూడా గుర్తించి వాటిని సంబంధిత శాఖల పేరుమీద బదిలీ చేయించింది ప్రభుత్వం. చాలా వరకు అయినాయి. ఇంకా అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అవి కూడా పూర్తవుతాయి. ఒకసారి పూర్తవుతే శాఖలవారీగా ఒక్కొక్క శాఖ ఎంతెంత భూమి కలిగి ఉందనే ఒక ఇన్వెంటరీ ఉంటుంది. ఒక లెక్క ఉంటుంది. కానీ గతంలో అంతా అరాచకంగా ఉన్నది. సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసం అని ఊరికే బాధ్యతారహితంగా అనరు సీఎం. వీటన్నింటినీ ప్రక్షాళన చేసే ప్రయత్నం జరుగుతున్నది.

         పాస్ పుస్తకాల విషయంలో సభాముఖంగా రైతాంగానికి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఒక పార్ట్ ముందు ముగుస్తుంది. రెండవ పార్ట్ కి కొంత సమయం పడుతుంది. ఒక పార్ట్ ఏమంటే, వ్యవసాయానికి సంబంధించిన భూములు. దానిని పర్ ఫెక్ట్ గా చేయవచ్చు. చాలా వరకు అయింది. పోడు భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకా కొంత మాత్రమే ఉంది. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న ప్రతి వాళ్లకు రైతుబంధు, రైతు బీమా కల్పించింది ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉన్నపుడు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలిచ్చిన వారికి కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఎవరైతే భూములుండి పట్టాలు దొరకలేదో అటువంటివి లక్ష పైచిలుకు ఉన్నాయి. అలాగే కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్నవారు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏదో ఒక దశలో పోడు భూముల వ్యవహారం పూర్తి కావాలి. అక్కడి నుంచి ఇక ఆపేయాలి. వున్న హ్యాబిటేషన్స్ ను, వారి వ్యవసాయభూమిని గుర్తిస్తుంది ప్రభుత్వం. వారికి ఏదో రూపంలో ఒక సర్టిఫికెట్ ఇచ్చి అక్కడికి క్లోజ్ చేద్దామని చెప్పారు సీఎం. అతి తక్కువ కాలంలో అది జరగబోతున్నది. దాని గురించి ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

         భూ రికార్డుల ప్రక్షాళన – దేశం మొత్తం ఇక్కడి నుండి నేర్చుకొని పోయే విధంగా చేయాలని సంకల్పించిందే ధరణి వెబ్ సైట్. అది కొన్ని మాసాల కాలంలోనే వస్తుంది. భూమి పొద్దున రిజిస్ట్రేషన్ అయితే ఆ రిజిస్ట్రేషన్ తాలూకు వివరాలు గంట లోపలే సైట్ లో అప్ డేట్ అవుతుంది. ప్రతి గంటకు ఆర్ఓఆర్, ప్రతి గంటకు జమాబందీ ఉంటుంది. ఒక నిమిషం కూడా ఏదీ పెండింగ్ ఉండదు. కొన్నిచోట్ల కొంతమందికి ఆదాయం పోతుందనే దుర్మార్గమైన ఆలోచన ఉంది. దుర్మార్గమైన ఆలోచనలు జరుగుతున్నాయి. మనందరం సిగ్గుపడేటువంటి  సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అవేర్ నెస్ వచ్చింది. కాబట్టి ఆ పీడ ప్రజలకు పోవాలి. ఆ పీడ పోవాలంటే ధరణి వెబ్ సైట్ రావాలి. గంట గంటకూ రికార్డు అప్ డేట్ కావాలి. అమెరికా గానీ, ప్రపంచంలో ఎక్కడున్న వారైనా ఏ భూమి ఎవరి పేరుమీద ఉన్నదో బటన్ కొడితే చూసే పరిస్థితి వస్తుంది. సీఎం స్వయంగా కలిగించుకుని దానిని తయారు చేశారు. ఇంతకు ముందు బ్యాంకర్స్ పాస్ పుస్తకాలు, పహణీ నకల్స్ తీసుకొని రుణాలిస్తుండేవారు. కానీ ఇప్పుడు వారు వెబ్ సైట్ లో చూసే పంట రుణాలివ్వాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఎన్కంబరెన్స్ తో సహా వివరాలుంటాయి. పంట రుణాలు తీసుకున్న వివరాలుంటాయి. షార్ట్ టర్మ్ లోన్లు తీసుకున్నా వివరాలుంటాయి. భూమి మార్టిగేజ్ చేసినా కూడా వివరాలుంటాయి. కాబట్టి వెబ్ సైట్ ఆధారంగానే రైతులకు రుణాలివ్వాలి. రుణాలిచ్చినట్లుగా అగ్రిమెంట్ పత్రం రాయించుకోవచ్చు. పాస్ పుస్తకం, పహానీ నకలు అడగడం జరగదు.

         కుల ధృవీకరణ పత్రాన్ని కూడా ప్రతిసారీ ఎందుకు తీసుకోవాలి. కులం మారుతుందా? పుట్టిన నుండి చచ్చేదాకా అదే ఉంటుంది. మారితే మతం మారుతుంది. కానీ, కులం మారదు కదా. కుల దృవీకరణ పత్రం కావాలని అడగగానే పైసే దేవో, పైసే లావో అనడం బాధాకరం. మనిషి పుట్టిన నాడే కుల దృవీకరణ పత్రం ఇవ్వాలని మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఖచ్చితంగా నిబంధన పెట్టబోతున్నది ప్రభుత్వం. అదే కుల దృవీకరణ పత్రం ఆయన చనిపోయేవరకు ఉండాలి. మార్చడానికి లేదు. మాటి మాటికీ కార్యాలయానికి వెళ్లు, ఆడికి పో, ఈడికి పో అనే బాధలు తప్పాలి. ఆదాయ పత్రం కూడా వట్టిగా ఇవ్వరు. దానికో యాతన. దానిమీద కూడా చర్చ జరుగుతోంది. ఈ సర్టిఫికెట్స్ విషయంలో ఈ టర్మ్ లో మొత్తానికి మొత్తం ఖచ్చితంగా రిఫామ్స్ తీసుకొస్తుంది ప్రభుత్వం.
(ఇంకా వుంది...వచ్చే వారం)
--సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చల ప్రసంగం ఆధారంగా