Saturday, October 13, 2018

శూర్ఫణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-30:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-30
శూర్ఫణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (14-10-2018)

అని శూర్పణఖ చెప్పగాకామవశమైన ఆ రాక్షసి మాటలకు నేర్పుగల శ్రీరామచంద్రమూర్తికోపపడకుండామెత్తటి మాటలతో సందేహం కలగకుండాతాను చెప్పేది స్పష్టంగా అర్థమయ్యేట్లు చెప్పాడిలా ఆమెకు. "రాకాసీదీనిని ముందు పెళ్లి చేసుకున్నానుఅయినా ఏంటంటావాఇప్పుడు ప్రియురాలైన దీనిని నేనెలా విడుస్తానుఅది ధర్మం కాదేఅది వుండవచ్చు...నువ్వూ వుండవచ్చు అంటావానీలాంటి అద్భుతమైన అందగత్తెకు సవతి పోరు వుండకూడదుకాబట్టి నీకు దుఃఖం కలగక తప్పదు.నున్ని దుఃఖ పెట్టడానికా పెళ్లి చేకోవడంకాబట్టి నామీద భ్రాంతి వదిలిపెట్టునువ్వు కామం నిలుపలేనని అంటావాఇదిగో వీడిని చూడుమంచి శీలం కలవాడునా తమ్ముడుచూడడానికి ప్రియమైన వాడుసహించరాని తేజం కలవాడులక్ష్మణుడనే పేరుకలవాడుఈ లక్ష్మణుడు భార్య లేనివాడు. అసమాన శౌర్యవంతుడు. సమర్థుడు. యౌవనంలో వున్నాడు. అందగాడు. ఇదివరకు భార్యా సుఖం తెలియనివాడు. భార్య కావాలని కోరుతున్నాడు. నీ అందమైన రూపం చూడగానే వీడు నీకు పతిత్వయోగ్యుడు అవుతాడు. పూబోడీ! సవతి పోరులేకుండా అతడిని భజించు.

అని శ్రీరామచంద్రుడు చెప్పగా విని ఆ రాక్షసిరామ మోహం కళ్లకు కప్పి వుండడం వల్లతన విధవాగర్భాదాన నూతన మహోత్సవం నిమిషమైనా ఆలశ్యం కావడానికి సహించలేకలక్ష్మణుడితో "ఓయీ అందగాడానీ చక్కదనానికి సరైన అందగత్తెను నేనేనీకు పెళ్లాం అవుతానునువ్వు నన్ను పెళ్లి చేసుకోవనాలలో,కొండలలో సంచారం చేద్దామారా..పోదాంఅన్నదిశ్రీరామచంద్రమూర్తి పరిహాసంగా మాట్లాడిన భావం తెలుసుకొన్న లక్ష్మణుడుతానూ శూర్పణఖతో పరిహాసంగానే మాట్లాడాడు. "ఓసీవెర్రి పిల్లానేను బానిసనునన్ను పెళ్లి చేసుకొని నువ్వు కూడా బానిసవై వీరి సేవ చేస్తావానీ చక్కదనానికి నువ్వు బానిసగా వుంటావాఈ మహాత్ముడుకి నేను బంటుగా సేవ చేస్తున్న సంగతి నీకు తెలియదేమోనీకు తెలిసే అవకాశం లేదుతెలుస్తేనేనేంటి...బానిసను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకొనేదానివిఅలాంటి సమృద్ధమైన అర్థం కలవాడిని నువ్వే సంతోషపెట్టగలవునిర్మలకాంటి కలదానివి కాబట్టినువ్వుఆయన్నే వరిస్తే నువ్వు చిన్న భార్యవై,కులుకుతూ ముద్దులొలకవచ్చుమగవారికి పెద్ద భార్య మీద కంటే చిన్న భార్యమీదే ప్రేమ ఎక్కవ కదాఈ మాత్రం ఆలోచించలేవానిన్నేమనాలిఇలాంటి వికార స్వరూపం గలదానినిభయంకర స్వరూపం వున్నదానినిఆ సవతినిపెద్ద పొట్టకలదానినిముసలిదానినిజానకిని నెట్టి నిన్ను భార్యగా గ్రహిస్తాడు. ఇలాంటి పరమ సుందరిని వదిలి ఎవరు మనుష్య స్త్రీకొరకు వేడుక పడతాడు?" అని లక్ష్మణుడు పలికాడు శూర్పణఖతో.


లక్ష్మణుడు చెప్పిన మాటలు పరిహాస వచనాలని తెలుసుకోలేని ఆ బుద్ధిహీననిజమని నమ్మిపర్ణశాలలో సీతతో వున్న శ్రీరామచంద్రుడి దగ్గరకు పోయి మదనతాపంతో ఇలా అంది: "ఈ విరూపనుసవతినిఈ కరాళనునిర్ణతోదరిని గ్రహించి నువ్వు నన్ను గౌరవించడం లేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే మింగి సవతిపోరు లేకుండా సుఖపడతాను". ఇలా అంటూ శూర్పణఖ జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీతమీద దూకింది. ఇది చూసిన శ్రీరాముడు దాన్ని బిగపట్టికోపంతో లక్ష్మణుడితో "లక్ష్మణా! నీచులతో పరిహాసం ఆడడం తప్పు. అలా మనం చేసినందువల్ల కష్టం కలిగింది. దీనివాత పడకుండా సీతాదేవి ఎలా బతికి సుఖంగా వుంటుందో ఆలోచించు. ఇది స్త్రీ. ఆయుధం ధరించి యుద్ధానికి వచ్చింది కాదు. కాబట్టి చంపకూడదు. దీన్నిబలగర్వంతో దేహం తెలియనిదాన్నిరాకాసిని పట్టుకొని విరూపగా చేయి" అన్నాడు. అప్పుడు శూర్ఫణఖ కంటే మహాబలశాలి అయిన లక్ష్మణుడు తటాలున కత్తి దూసిఅది ఎదిరించినా వదలకదాని ముక్కుచెవులు కోశాడు.

ముక్కు-చెవులు ఈ విధంగా మొక్కలు పోగాలబలబ నోరు కొట్టుకుంటూరొమ్ము గుద్దుకుంటూవానాకాలంలోని మేఘం అదిరినట్లుఅడవి ప్రతిధ్వనించేట్లుపెద్ద ధ్వనితో బొబ్బలు పెట్టుకుంటూనెత్తురు కారుతుంటేవికార రూపం మరింత వికారం కాగామనుష్యులు తనను ఇలా చేశారేనలుగురిలో నవ్వుల పాలైతిని కదా అని ఆక్రోశంతో ఏడుస్తూ అడవుల్లో పడి వేగంగా పరుగెత్తింది. 

ఇలా పరుగెత్తుకుంటూ పోయి జనస్థానంలో రాక్షసుల మధ్యన వున్న తమ్ముడు ఖరుడిని చూసి, ఏడుపు ధ్వనితో ఆకాశం నుండి పిడుగుపడ్డట్లు ధభీలున నేలమీదపడి పెద్దపెట్టున ఏడ్చింది.

No comments:

Post a Comment