Saturday, August 25, 2018

అగస్త్యాశ్రమంలో శ్రీ సీతారామలక్ష్మణులు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-23 : వనం జ్వాలా నరసింహారావు


అగస్త్యాశ్రమంలో శ్రీ సీతారామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-23
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (26-08-2018)

ఆశ్రమ ప్రదేశం ప్రవేశించిన లక్ష్మణుడు అక్కడున్న అగస్త్య ముని శిష్యుడిని చూసిఅయ్యాదశరథ మహారాజు పెద్ద కొడుకుసీతాదేబి భర్తశ్రీరామచంద్రమూర్తి భార్యతో కూడి ముని దర్శనార్థమై వచ్చాడని చెప్పాడు. "ఆ రాముడి తమ్ముడినినా పేరు లక్ష్మణుడునేనాయనకు హితుడనుభక్తుడినిఅనుకూలుడినిఎల్ల వేళల ఆయన్నే సేవిస్తానుజనకాజ్ఞ పాలించాలన్న నీతిననుసరించి అడవులకు వచ్చాం. మీ గురువు అగస్త్య మునిని దర్శించాలనుకుంటున్నాం. మేము వచ్చిన సంగాతి ఆయనకు చెప్పి పోమగృహంలో వున్న అగస్త్య్డితోణ్యం కట్టుకోండి" అని లక్ష్మణుడు చెప్పగా. అలానే అనుకుంటూ,  హోమగృహంలో వున్న అగస్త్యుడితో దశరథ రాజకుమారులుసీతాసమేతంగా ఆయన సేవకొరకు వచ్చారని చెప్పారు. మునీంద్రుడు ఆజ్ఞ ఇస్తే తీసుకొస్తామని అంటారు.

ముని శిష్యుడు అలా చెప్పగానే, "ఔరా నా అదృష్టం...ఇన్నాళ్లకైనా రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడుఅదే చాలుసాధుయోగ్యమైన నడవడి కల ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నానుఆ ముగ్గురిని పూర్ణ భక్తితో భోగ్యమైన విధంగా ఇక్కడికి తీసుకుని రాఅనావశ్యకమైనా ఆలశ్యం ఎందుకు చేశావుసీతారామలక్ష్మణుల పేర్లు వినగానే వెంటనే పిలుచుకుని రావాలి కదానువ్వు రావడానికిపోవడానికి ఇంత సమయం తీసుకునివ్యర్థం చేసివాళ్లను బయట నిలబెట్టవచ్చావాళ్లు మన వాకిట్లో నిలబడాల్సినవారా?" అని అగస్త్యుడు అనగానేశిష్యుడు గురువుకు నమస్కారం చేసిపరుగెత్తుకుంటూ పోయిలక్ష్మణుడితో ఆయననురామచంద్రమూర్తినిసీతతో సహా రమ్మని చెప్పాడువారంతా కలిసి శీఘ్రంగా లోపలికి పోయారుపోతూ అక్కడ వారు...బ్రహ్మ స్థానం (బ్రహ్మను ఆవహింప చేసి పూజించే స్థానం), అగ్ని స్థానంశ్రీవిష్ణు స్థానంఇంద్రుడి స్థానంసూర్య స్థానంచంద్ర స్థానంభగుడి స్థానంకుబేర స్థానంధాత స్థానంవిధాత స్థానంవాయు స్థానంఆదిశేషుడి స్థానంగాయత్రీ స్థానంవసువుల స్థానంవరుణుడి స్థానంకుమార స్వామి స్థానంధర్ముడి స్థానం...అనే పూజా ప్రదేశాలను చూశారుఅలా పోతూ...పోతూశిష్యులతో కూడి అగస్త్య్డుడు ఎదురుగా రాగా,ఆయన్ను చూసిన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో వచ్చే వాడే అగస్త్యుడు అని చెప్పాడు.

వచ్చే వాడే అగస్త్యుడని ఎలా చెప్పగలిగాడో రాముడంటే...ఆయన బ్రహ్మ వర్చస్సు బట్టి తెలుసుకున్నానంటాడుఆయన రాగానే శ్రీరాముడు ఆయన్ను సమీపించి,పాదాలమీద వాలాడుఆ తరువాత సీతాదేవిలక్ష్మణుడు శ్రద్ధగా అలానే చేసారుఆ తరువాత వారంతా అభివందనం చేసి నిలుచుని వుండగాఆ ముని శ్రేష్టుడు శ్రీరామచంద్రమూర్తిని అతిథిగా గ్రహించిప్రేమతో అతిథులకు ఇవ్వాల్సిన అర్ఘ్యంపాద్యం ఇచ్చిపూజించియోగక్షేమాలు విచారించికూర్చోమని చెప్పాడుతరువాత వానప్రస్ఠ ధర్మం ప్రకారం నిండుగాతృప్తి కలిగేట్లు వారికి భోజనం పెట్టాడుదాంతర్వాతనిర్మల ధర్మజ్ఞానంలో పండితుడైన శ్రీరామచంద్రుడిని చూసివానప్రస్థగృహస్థ ధర్మాలు తెలిసే విధంగా ఇలా చెప్పాడు.


"సమస్త ప్రపంచానికిఅందులోని జనులకునీవే ప్రభువువి. నీవే మహారథుదవు...నీవే మూర్తీభవించిన ధర్మాత్ముడవు. విశేషంగా ప్రకాశించే కీర్తికలవాడివి. గౌరవించాల్సిన ఆకారం కలవాడివి నీవే. ఎంతటి పూజకైనా పూర్ణంగా తగినవాడివి. భూపతివైన నీవు ప్రయాతిథివై వచ్చావు. ఇంతకు మించిన పుణ్యం ఇంకేమైనా వుంటుందా?" అని చెప్పి వారికి కడుపునిండా పళ్లనువేళ్లనుపూలనుతినటానికిచ్చిఆ తరువాత శ్రీరామచంద్రమూర్తికి ఒక గొప్ప విల్లుఅక్షయ బాణాలుతూణీరాలు చూపించి ఇలా చెప్పాడు.

"దేవసంబంధమైపూజ్యమైబంగారు రత్నాలతో అలంకరించబడిన అసమానమైన ఈ విష్ణు ధనస్సు విశ్వకర్మ నిర్మించాడు. ఈ బాణ సమూహం వ్యర్థం కాదు. సూర్యుడి కాంతిలాంటి కాంతికలదిది. ఇది బ్రహ్మ ఇచ్చాడు. ఈ అక్షయ బాణాలుపదునైన బాణాలతో నిండిన అమ్ముల పొదులుబంగారు పిడికల కత్తిదాని ఒర ఇంద్రుడిచ్చాడు. సూర్య తేజా! ఈ వింటితో విష్ణుదేవుడు రాక్షసులను యుద్ధంలో చంపిజయం పొందాడు. ఈ బాణాలుకత్తిపొదులు ఆయన యుద్ధంలో ఉపయోగించినవే. నీకూ జయం కలగడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకున్నట్లు వీటిని గ్రహించు" అని అంటూ ఆ శ్రేష్ఠమైన ఆయుధాలను శ్రీరామచంద్రమూర్తికిచ్చి మళ్లీ ఇలా అన్నాడు.

No comments:

Post a Comment