Wednesday, April 10, 2013

నాలుగు శతాబ్దాల హైదరాబాద్-1: కుతుబ్‌షాహీల పాలన నుండి స్వతంత్ర భారతావనికి: వనం జ్వాలా నరసింహారావు


నాలుగు శతాబ్దాల హైదరాబాద్-1

కుతుబ్‌షాహీల పాలన నుండి స్వతంత్ర భారతావనికి

వనం జ్వాలా నరసింహారావు

ప్రశ్నలు: జవాబులు

1.      170 సంవత్సరాల సుదీర్ఘ కుతుబ్‌షాహీ వంశీయుల గోలకొండ పాలనకు చరమగీతం పాడినది ఎవరు? (మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్)

2.      మొగలాయిల పాలన తరువాత ఏ రాజవంశం అధికారంలోకి వచ్చింది? (ఆసఫ్ జాహీ రాజవంశం)

3.      ఆంగ్లేయులకు, హైదరాబాద్ సంస్థానానికి మధ్య పటిష్ఠమైన సంబంధ బాంధవ్యాలు దేనితో ప్రారంభమయ్యాయి? (హైదరాబాద్ నిజాం, బ్రిటీష్ ప్రభుత్వంతో 1800 వ సంవత్సరంలో కుదుర్చుకున్న "ఆశ్రిత మైత్రి ఒడంబడిక" లేక సబ్సిడియరీ ఎలయన్స్ ట్రీటీ)

4.      హైదరాబాద్‌ను పాలించిన ఆసఫ్ జాహీ వంశీయులు తొలుత ఏ దేశానికి చెందినవారు? (టర్కీ-మధ్య ఆసియా దేశపు రాజ కుటుంబానికి చెందిన టర్కీ యులు)

5.      ఆసఫ్ జాహీ వంశీయుడైన నిజాం-ఉల్-ముల్క్ ఎప్పుడు జన్మించారు? ఎప్పుడు మరణించారు? (1724, 1748)

6.      ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ పరిపాలకుడుగా ఎప్పుడు నియుక్తులయ్యారు? (సెప్టెంబర్ 18, 1911)

7.      ప్రధమ ప్రపంచ సంగ్రామం ఆసాంతం, దివాన్‌గా కూడ బాధ్యతలు నిర్వహించిన హైదరాబాద్ నిజాం ఎవరు? ( ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్)

8.      గుల్ జార్ హౌజ్, బాద్-ఎ-షాహి, అశూర్ ఖానాలు, జామె-మస్జీద్, దాదా మహల్, చందన్ మహల్, లఖిన్ మహల్ లాంటి రాజ ప్రాసాదాలను నిర్మించింది ఎవరు? (హైదరాబాద్ మహానగరాన్ని అతి వైభవోపేతంగా 1591 లో భాగ్యనగర్ అనే పేరుతో నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్ షా)

9.      హైదరాబాద్ నగరం నడిబొడ్డున వున్న మక్కా మస్జీద్‍కు శంఖుస్థాపన చేసింది ఎవరు? ఎప్పుడు? (మహ్మద్ కులీ కుతుబ్ షా, 1617)

10. కుతుబ్ షాహీ రాజ వంశానికి చెందిన రాజులు ఎందరు? (ఎనిమిది మంది)

11. పురాతన గోలకొండ మట్టిబురుజు పునాదులపై సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ నిర్మించిన మహానగరం పేరేమిటి? (మహ్మద్ నగర్)



12. కుతుబ్ షాహీ ఎలా చనిపోయారు? అది సహజ మరణమేనా? (సహజ మరణం కాదు. అతడి సొంత కుమారుడు, ఆయన వారసుడిగా-ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టిన జమ్‍షద్ కులీ చేతుల్లో హత్యకు గురయ్యాడు)

13. చరిత్రకారుల దృష్టిలో కుతుబ్ షాహీ రాజవంశీయులలోని ఎవరి పాలనలో హైదరాబాద్ నగరం అంగరంగ వైభోగంగా పేర్కొనబడింది? (1580-1612 మధ్య కాలంలో పాలించిన మహ్మద్ కులీ కుతుబ్ షా పాలన రోజుల్లో)

14. కులీ కుతుబ్ షా ప్రేమికురాలిగా గణుతికెక్కి, భాగ్యనగర్ నిర్మాణానికి ప్రేరణ కలిగించిన నాట్యగత్తె భాగుమతి నివసించిన గ్రామం పేరేమిటి? ప్రస్తుతం ఆ స్థలంలో ఏ కట్టడం వుంది? (చిచేలం. చార్మీనార్)

15. భాగ్యనగర్ పేరును హైదరాబాద్‌గా మార్చే ముందు భాగుమతికి ప్రదానం చేసిన బిరుదేమిటి? (హైదర్ మహల్)

16. కులీ కుతుబ్ షా ఏకైక కుమార్తె పేరేమిటి? (హయాత్ బక్షీ బేగం)

17. మొగలు చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని ఓడిపోయిన ఎనిమిదవ చివరి గోలకొండ రాజెవరు?ఆయన ఎప్పుడు పాలించారు? ఎప్పుడు మరణించారు? ( సహనశీలి, మృధు స్వభావుడుగా ప్రసిద్ధికెక్కిన అబుల్ హసన్ తానాషా. 1672-1687. 1699)

18. హైదరాబాదీ సంస్కృతిపై చెరగని ముద్రవేసి, హైదరాబాద్ నగర రూపురేఖల తయారీతో ప్రత్యక్ష సంబంధమున్న కుతుబ్ షాహీల కాలం నాటి పెద్దమనిషి ఎవరు? (1585 లో పీష్వాగా నియుక్తుడైన మీర్ మొమిన్ పీష్వా)

19. 1656 లో ఔరంగజేబ్ సైన్యాన్ని ఎదుర్కొని, గోలకొండ కోటను రక్షించిన సేనానాయకుడు ఎవరు? (మూసా ఖాన్ మహల్ దార్)

20. కుతుబ్ షాహీల కాలంలో వెలసిన చారిత్రాత్మక కట్టడం చార్మీనార్‍ను నిర్మించిన మహానుభావుడెవరు? ఎప్పుడు? (మహ్మద్ కులీ కుతుబ్ షా, 1590-1591)

21. హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలను కలిపేది, విడదీసేది ఏ నిర్మాణం? (హుస్సేన్ సాగర్-టాంక్ బండ్)

22. ప్రప్రధమ భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, హైదరాబాద్ నగరాన్ని ఏమని వర్ణించారు? (భారతీయ సంస్కృతికి "విశ్వం" లాంటిదని)

23. దక్కన్ రాజధానిని, ఔరంగాబాద్ నుండి హైదరాబాద్‌కు మార్చినది ఎవరు? ఎప్పుడు? (రెండవ ఆసఫ్ నిజాం అలీఖాన్, 1763)

24. ఆధునిక హైదరాబాద్ నిర్మాత పూర్తి పేరు, బిరుదులతో సహా ఏమిటి? (లెఫ్ట్ నెంట్ జనరల్, హిజ్ ఎక్జాల్టెడ్ హైనెస్, రుస్తుం-ఇ-దౌరాన్, అరస్తు-ఇ-ఇజామాం, సిఫాసాలార్, ఆసఫ్ జా, ముజఫర్-ఉల్-ముల్క్-వాల్-మామాలిక్, నిజాం-ఉల్-ముల్క్, నిజాం-ఉద్-దౌల్హా, నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్, పతేజంగ్, సుల్తాన్-ఉమ్-ఉలూమ్, జి.సి.ఎస్.ఐ.జి.బి.ఐ, బ్రిటీష్ ప్రభుత్వ విశ్వాస పాత్రుడు, హైదరాబాద్-చీరాల నిజాం)

25. మూడవ ఆసఫ్ జాహి, సికిందర్ జాహి పేరుమీద నిర్మించిన నగరం పేరేంటి? ( జంట నగరాలలో ఒకటైన సికిందరాబాద్)

26. హైదరాబాద్ నగరానికి సంబంధించినంతవరకు ఫిబ్రవరి 5, 1885 ఎందుకని ముఖ్యమైన దినంగా చెప్పుకోవచ్చు? ( ప్రప్రధమంగా బ్రిటీష్ రాణి ప్రత్యేక దూతగా హైదరాబాద్ నగరానికి విచ్చేసిన భారత వైస్రాయ్ సమక్షంలో, ఆయన చేతుల మీదుగా మీర్ మెహబూబ్ అలీఖాన్ నిజాం నవాబ్‍గా పట్టాభిషిక్తుడైన రోజది. అలా పట్టాభిషిక్తుడైన మొదటి నిజాం ఆయనే)

27. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసు చర్య ఎప్పుడు ప్రారంభమైంది? దరిమిలా నిజాం మంత్రివర్గం రాజీనామా చేసిందెప్పుడు? (సెప్టెంబర్ 13, 1948: సెప్టెంబర్ 17, 1948)

28. భారత సైన్యం హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నదెప్పుడు? ఎప్పుడు సైనిక పాలన విధించడం జరిగింది? తుదకు భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగిందెప్పుడు? (సెప్టెంబర్ 19, 1948)

29. హైదరాబాద్ నగరం నడి మధ్యలో ప్రవహిస్తుండే మూసీ నదికి భీభత్సమైన వరదలు సంభవించిందెప్పుడు? (సెప్టెంబర్ 28, 1908 మంగళవారం)

30. ఆధునిక హైదరాబాద్ రూపురేఖల రూపకల్పనలో మహ్మద్ కులీ కుతుబ్ షా కు సహాయకుడుగా వ్యవహరించిన పీష్వా ఎవరు? (మీర్ ముమీన్ అస్ట్రాబడి)

31. ఆధునిక హైదరాబాద్ నగరానికి 1591 వ సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా శంఖుస్థాపన చేసిన రోజు శుభ దినం కాదని కొందరంటారు. కారణమేంటి? (చంద్రుడు సింహరాశి నక్షత్ర మండలంలోను, బృహస్పతి తనదైన వేరే మార్గంలోను కదులుతున్న రోజైనందున ఆ దినాన్ని అశుభమైనదిగా కొందరు పరిగణిస్తారు)

32. హైదరాబాద్ అసలు పేరేంటి? ఎవరి పేరుపై అలా పిలవడం జరిగిందసలు? (ఇస్లాం నాల్గవ మత ప్రవక్త హజ్రత్ అలీ బిరుదు ఆధారంగా, హయిదరాబాద్ అనీ, హయిదర్ నగరమనీ పిల్చేవారు)

33. భాగుమతి పేరు మీద హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలవడానికి మరేదైనా కారణం కూడా వుందా? (భాగ్ నగర్ అంటే ఉద్యానవనాల నగరం అని కూడా అర్థం)

34. కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హైదరాబాద్ నగరం ఎన్ని ముహల్లాలుగా విభజించడం జరిగింది? ప్రధాన రహదారులలో ఆ రోజుల్లో వున్న భవంతులెన్ని? (12, 000 ; 14, 000)

35. కులీ కుతుబ్ షా కాలం నాటి హైదరాబాద్ నగరంలో, ఏఏ ప్రాంతాలను రాజ ప్రాసాదాల కొరకు, ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తం కేటాయించారు? ప్రముఖుల నివాసం కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది? (వాయువ్య, ఈశాన్య ప్రాంతాలు)

36. కులీ కుతుబ్ షా కాలంలో, ఆధునిక హైదరాబాద్ నిర్మాణాలలో భాగంగా, పూర్తిగా విభజించబడిన ప్రప్రధమ కట్టడం ఏది? (1592 నాటి చార్మీనార్)

37. ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రముఖ యాత్రీకుడు, వ్యాపారస్తుడు టావర్నీర్ 1652 వ సంవత్సరంలో, హైదరాబాద్ నగరాన్ని దర్శించిన తరువాత దానిని ఏ నగరంతో పోల్చాడు? (ఫ్రాన్స్ దేశంలోని ఆర్లియన్స్)

38. రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం ఎంతకాలం పాటు వ్యవహరించబడలేదు? తిరిగి ఎవరి చొరవతో అది తన పూర్వ వైభవాన్ని పొందగలిగింది? (1687-1763 మధ్య కాలంలో 76 సంవత్సరాల పాటు. రెండవ ఆసఫ్ జాహి నిజాం అలీఖాన్ చొరవతో)

39. నిజాం-ఉల్-ముల్క్ కు చెందిన ఆరు ప్రాంతాలను ఆ రోజుల్లో ఎన్ని సర్కారులు గాను, ఎన్ని పరగణాలు గాను విభజించడం జరిగింది? (93 సర్కార్లు, 1228 పరగణాలు)

40. హైదరాబాద్-సికిందరాబాద్ జంట నగరాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన భాగంగా, ఒక నూతన శకారంభం ఎప్పుడు-ఎందువలన జరిగింది? (1798 లో కుదుర్చుకున్న ఆశ్రిత మైత్రీ ఒడంబడిక వలన సికిందరాబాద్ కంటోన్మెంటు బ్రిటీష్ సైనికుల స్థావరంగా తయారైంది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో అలా ఒక నూతన శకం ఆరంభమైంది)

41. ప్రప్రధమంగా హైదరాబాద్ శాసనసభను ఏర్పాటు చేసినప్పుడు ఎందరు సభ్యులుండేవారు? వారిలో ఎన్నికైన వారెందరు? నామినేటెడ్ ఎందరు? (మొత్తం 132, ఎన్నికైన వారు 76, నామినేటెడ్ 56)

42. ఏఏ రాజ ప్రముఖుల జన్మ దినాలను అధికారిక శెలవు రోజులుగా అలనాటి హైదరాబాద్లలో పరిగణించేవారు? (నిజాం పుట్టిన రోజు, విక్టోరియా మహారాణి పుట్టిన రోజు, బ్రిటీష్ రాజు జన్మ దినం)

43. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం ఎప్పుడైంది? (నవంబర్ 1, 1956 న- రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత)


No comments:

Post a Comment