Sunday, July 8, 2018

మునులకు అభయం ఇచ్చి సుతీక్ష్ణాశ్రమానికి చేరిన శ్రీరాముడు....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-16: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-16
మునులకు అభయం ఇచ్చి సుతీక్ష్ణాశ్రమానికి చేరిన శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు
అంధ్రభూమి దినపత్రిక (08-07-2018) 
ఋషులందరూ చెప్పిన మాటలు విన్న శ్రీరామచంద్రమూర్తి ఇలా వారితో ఇలా అన్నాడు: "మహానుభావులారా! మీరు నన్ను ఇలా గొప్పవాడిని చేసి మాట్లాడవచ్చా? నేను మీ ఆజ్ఞానుసారం నడుచుకునేవాడినే! మీరు ఆజ్ఞాపించాల్సిన వారే కాని విజ్ఞాపించాల్సిన వారు కాదు. నేను ఈ అడవుల్లోకి నా స్వకార్యం కొరకే వచ్చా. ఈ అడవుల్లోని రాక్షసులందరినీ వధించి మీకు మేలు చేయదమే నా స్వకార్యం. నా తండ్రిని సత్యవాదిని చేయడానికి అడవులకు రావడం నెపం మాత్రమే కాని యదార్థం కాదు. ఆశ్రితులను రక్షించడం రక్షకుని విధి. నేను చేయాల్సిన కార్యాన్ని ఇంతవరకూ చేయకపోవడం నా లోపమే. నన్ను క్షమించండి. ఈ కారణం వల్ల మాకు అరణ్యవాసం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. యుద్ధంలో తమ్ముడితో కలిసి విరోధులను చంపుతా. అప్పుడు నా భుజ శక్తి చూడండి".

ఇలా ఆ ఋషులకు అభయమిచ్చిన శ్రీరామచంద్రమూర్తి తన మాట నెరవేర్చడానికి అభిలాషతోతన వెంట మునీశ్వరులందరూ వస్తుంటేసుతీక్ష్ణాశ్రమానికి పోయే దారిలో పయనించాడుతన వెంట వచ్చిన వానప్రస్థులతో ముచ్చటించుకుంటూ నడిచిన శ్రీరాముడు అందమైన ఆశ్రమాన్ని చూశాడుపూలతో నిండికొండలాగా నల్లగా వ్యాపించిన పర్వతంతోసౌందర్య సంపత్తితో అలరారుతున్న ఆ శుభాశ్రమాన్ని సమీపించిఅక్కడ కూచున్న సుతీష్ణుడిని శ్రీరామచంద్రమూర్తి చూసిప్రీతితో ఇలా అన్నాడు: "ఋషీశ్వరాపాపరహితుడానేను రాముడినినిన్ను దర్శించుకోవాలని మిక్కిలి సంతోషంగా వచ్చానుమనసారా ప్రేమగల చూపులతో నన్ను చూడు". వెంటనే ఆ మినిశ్రేష్ఠుడు రాముడిని కౌగలిచుకుని, "సీతేశ్వరానీకు క్షేమమే కదా?" అని కుశల ప్రశ్న వేస్తూ ఇలా అన్నాడు: "ఇతరులు చూసి సహించలేని తేజస్సుకలవాడానువ్వు రావడం వల్ల ఇక్కడి ఈ ఆశ్రమం మరింత పవిత్రమైదిక్కుకలదిగా ప్రకాశిస్తున్నదిఓ వీరుడానువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసి శరీరాన్ని వదిలి దేవలోకానికి పోవడానికి ఇష్ఠం లేక ఇక్కడే నీకొరకు కాచుకుని వున్నానునా పుణ్యం వల్ల నువ్వొచ్చావు నాయనా!. కకుత్థ్స వంశంలో పుట్టినవారిలో శ్రేష్ఠుడవుమంచి పరాక్రమవంతుడవు అయిన శ్రీరామచంద్రమూర్తీరాజ్యాన్ని వదిలి మునివేషంతో చిత్రకూటంలో నువ్వు నీ భార్యతోతమ్ముడు లక్ష్మణుడితో కలిసి వున్నావని విన్నానురామచంద్రా! నేను సంపాదించిన పుణ్యంతో స్వర్గాన్ని పొందాను. అక్కడికి రమ్మని ఇంద్రుడు నన్ను పిలవదానికి వచ్చాడు. కానినువ్వు ఇక్కడకు వస్తున్నావని తెలిసిఅక్కడికి పోకుండానీ దర్శనంకొరకు ఇక్కడే కాచుకుని వున్నాను. నన్ను అనుగ్రహించి ఇక్కడ విహరించు" అని అన్నాడు.

జవాబుగా శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు: "మునీంద్రానీ తపఃఫలం నువ్వు నాకివ్వాల్సిన అవసరం లేదుఫలకాంక్షలేకుండా రామార్పణం అని నువ్వు సంకల్పిస్తే చాలుఅవే వచ్చి నాలో కలుస్తాయిఅప్పుడు నేను గ్రహిస్తామేముండడానికి అనువైన స్థలం చూపించునీ గురించి అంతా శరభంగుడు చెప్పాడు". ఈ మాటలు వినగానే మునీంద్రుడు శ్రీరాముడితో "శ్రీరామచంద్రా ఈ ఆశ్రమ భూమియే రమ్యమైనదిగుణం కలది. ఋషులెందరో ఇక్కద తపస్సు చేస్తున్నారు. ఫలమూలాలు దండిగా దొరకుతాయిక్కడ. ఇక్కడ భయమంటే ఏమిటో తెలియదు. కాకపోతే ఇష్ఠం వచ్చినట్లు తిరిగే మృగాలు వచ్చి దేహాలను తాకటం వల్ల తపస్సుకు విఘ్నం కలుగుతుంది. అది తప్ప మరే భయం లేదు. కాబట్టి ఇక్కడే వుండండి" అన్నాడు. తాను ఆమృగాలను చంపితే మునీంద్రుడికి మనోవ్యధ కలుగుతుంది కాబట్టి తానక్కడ ఎక్కువ రోజులుండకూడదని అంటూ శ్రీరాముడుసరస్సుకు పోయి సాయం సంధ్య పూర్తి చేశాడు. ఆ ముని ఇచ్చిన ఆహారాన్ని తిన్నాడు. ఆ రాత్రి సీతాలక్ష్మణులతో అక్కడే గడిపాడు.



తెల్లవారుఘాము కాగానే లక్ష్మణుడు ముందుగా లేచిస్నానం చేసిన తరువాత సీతాదేవి కూడా నిద్రలేచి అలాగే చేసిందిశ్రీరామచంద్రమూర్తి కూడా తటాకజలాలలో స్నానం చేసిహోమం చేసిఇష్ఠదైవ ప్రార్థన చేసిసూర్యోదయం కాగానే సూర్యుడికి నమస్కారం చేసి సుతీక్ష్ణ మునిని సమీపించి అంజలి ఘటించి ఇలా అన్నాడు: "తపస్సు వల్ల పవిత్రమైన హృదయం కల మునీంద్రానువ్వు మమ్మల్ని గారవించి గౌరవించడం వల్ల రాత్రి మాకు హాయిగా గడిచిందిఇక బయల్దేరి పోవడానికి అనుమతి ఇస్తారా?ఎక్కడికి పోతారంటారేమోతమ-తమ ఆశ్రమాలకు రమ్మని దందకారణ్యంలో నివసించే మునులు మమ్మల్ని అడుగుతున్నారువారివెంట మేం పోవాలనుకుంటున్నాం.కాబట్టి మామీద దయతో ఆనుమతి ఇవ్వండిఎండ సోకకముందే వెళ్లడానికి శలవివ్వండి". ఇలా చెప్తూ శ్రీరాముడు ముని పాదాలను తాకి నమస్కరించాడుశ్రీరాముడిని ముని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకుని, "రామచంద్రానీ నీడ నిన్ను విడిపోకుండా నీవెంట వచ్చేవిధంగాసీత నిన్ను కొలుస్తుండగా పోయిరా!. నువ్వు ఎవరివెంట పోవాలనుకుంటున్నావో ఆ ఋషులు మిక్కిలి పుణ్యాత్ములువారు నిన్ను పాపపు పనులు చేయమని ప్రోత్సహించరుకాబట్టి వారి ఇష్ఠప్రకారం పోదానివల్ల నీకు కీడులేదుమేలు కలుగుతుందిలక్ష్మణా! ఇక్కడి కొండలువృక్షాలుసరస్సులు అందలి నెమళ్లు మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్తి సుఖంగా పోయిరండి. పాపరహితుడవైన శ్రీరామచంద్రా! నా ఆశ్రమానికి మళ్లీ రండి.అని అంటాడు.

అప్పుడు లోకసుందరి అయిన సీత విల్లంబులనుఇతర ఆయుధాలను అంబులపొదులను రామలక్ష్మణులను తీసుకొమ్మని చెప్పి ఇచ్చిందివాళ్లు వాటిని తీసుకుని తమదగ్గర వుంచుకుని ఎక్కుపెట్టారురామలక్ష్మణులు విండ్లు ధరించిన విధం చూసి ఆయుధాల పట్టువిడుపులు తెలిసిన సీతాదేవి వారు యుద్ధ సన్నద్ధులైనారని తెలుసుకుంది. 

No comments:

Post a Comment