Friday, July 13, 2018

తుపాను నష్టానికి తల్లడిల్లిన నేత ..... మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-4:వనం జ్వాలా నరసింహారావు


తుపాను నష్టానికి తల్లడిల్లిన నేత
మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-4
మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (14-07-2018)
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)
వివరాల్లోకి పొతే, సీఎం ఫోన్ చేసిన మర్నాడు స్వర్గీయ కృష్ణకాంత్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసే రోజు. ఆ ఉదయమే అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ మల్లు అనంత రాములు రాజ్ భవన్లో వుంటున్న మా ఇంటికి అల్పాహార విందుకు వచ్చాడు. మా జిల్లా వాసే అయిన మల్లు అనంత రాములు ఎంతోకాలంగా నాకు పరిచయం. మరి కొద్ది సేపట్లో రాజీనామా సమర్పించమని నేను అడగాల్సిన స్వర్గీయ కోనేరు రంగారావుకు అనంతరాములు సమీప బంధువు. సరే...ఎలాగైతేం....గవర్నర్ ప్రమాణ స్వీకారం అనంతరం నేను చేయాల్సిన పని చేశాను. ఆ తరువాత కాసేపటికి మంత్రి రాజీనామా సమర్పించారు. దురదృష్ట వశాత్తు అది జరిగిన కొన్ని గంటల్లోనే, అనంత రాములు గుండె పోటుతో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న నేను తార్నాకా వెళ్లి ఆ సంగతి సీఎంకు చెప్పగానే వెంటనే సంతాప సందేశం ఇవ్వమన్నారు. అదే సమయంలో రాజీవ్ గాంధీ సందేశం వచ్చింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అనంత రాములు కీలకం అని ఆయన సందేశంలో వుండడం చెన్నారెడ్డి గారికి అంతగా రుచించలేదని నాకు అనిపించింది. ఆ తరువాత ఆయన సంతాప సందేశం విడుదల చేశాం. మల్లును అందులో ఆకాశానికి ఎత్తేసారు.

మే నెల 1990 లో ఆంధ్ర ప్రదేశ్ లో భీకరమైన తుఫాను వచ్చిందిఅదే రోజుల్లో వైద్య చికిత్స కొరకు అమెరికా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నారు చెన్నారెడ్డిఅనుకున్న రోజున కుటుంబ సభ్యులు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లడంబోర్డింగ్ పాసులు తీసుకునే వరకు రావడం జరిగిందిమంత్రి వర్గ సభ్యులకు చెప్పి పోవడానికి సచివాలయానికి వచ్చారు ముఖ్య మంత్రి చెన్నారెడ్డి. అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున రావుముఖ్య మంత్రి కార్యదర్శి పరమహంసమరికొందరుచెన్నారెడ్డి అమెరికా పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారుఒక్క నిమిషం కూడా ఆలోచించకుండాఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండాఆఖరు క్షణంలో ప్రయాణం మానుకున్నారుఅంతా సర్దు బాటు అయింతర్వాతరెండు-మూడు వారాల అనంతరం వెళ్లారువెళ్లిన తర్వాత కూడాఆసుపత్రిలో చేరేంతవరకుప్రపంచ బాంక్ అధికారులతో చర్చలు జరుపుతూనే వున్నారుబహుశా చెన్నారెడ్డి ఆ రోజుల్లో ప్రపంచ బాంకు ప్రతినిధులతో పెంచుకున్న అనుబంధమేనేటి ప్రభుత్వాల వరకూకొన సాగుతుందనడంలో అతిశయోక్తి లేదే మో!


వివరాల్లోకి పోతే.... మె నెల 13, 1990 న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సంభవించిన భారీ తుఫాన్, దాని తీవ్రతను అంచనావేసి వేలాది ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ముందస్తు చర్యలు, తుఫాన్ వచ్చిన సమయంలో, ఆ తర్వాత చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, వాటిని పర్యవేక్షించిన అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున్ రావు, ఆయనకు పరిపూర్ణ అధికారాలను ఇచ్చి అడుగడుగునా మార్గదర్శకత్వం వహించిన అలనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పాలనా దక్షత పదే-పదే గుర్తుచేసుకోవాల్సిందే. పట్టణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సి. అర్జున్ రావును, కారణాంతరాల వల్ల ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆగ్రహానికి గురైనందున, ప్రాధాన్యత లేదని పలువురు భావించే "సహాయ పునరావాస కమీషనర్" గా అంతకు రెండు నెలల క్రితమే నియమించింది ప్రభుత్వం. ఆయన ఆ పదవికే వన్నె తెచ్చే రీతిలో తీసుకున్న ముందస్తు నివారక చర్యల వివరాలు, ఆ శాఖ పదిలం చేసుకుని వుంటే, బహుశా చక్కటి "మార్గదర్శి" గా ఎల్లప్పుడూ పనికొస్తుండవచ్చు. తుఫాను ముగిసిన కొంత కాలానికి అర్జున్ రావు గారు, ఒక చిన్న కార్పొరేషన్ ఎండి గా వున్నప్పుడు, సహాయ పునరావాస కమీషనర్ గా ఆయన తీసుకున్న చర్యలపై "రీడర్స్ డైజెస్ట్" ఒక గొప్ప ఆర్టికల్ కూడా ప్రచురించింది.

దక్షిణ భారత దేశాన్ని 1977 దివి సీమ ఉప్పెన తర్వాత భీభత్సం చేసిన అతి భయంకరమైన తుఫానుగా 1990 మే నెల మొదటి వారంలో సంభవించిన తుఫానును పేర్కొన వచ్చు. మే 4, 1990 న "ఉష్ణ మండల గందరగోళం" గా ప్రారంభమై, తుఫానుగా మారి, వాయువ్య దిశగా కదిలింది. మర్నాటి కల్లా, తీవ్రమైన వాయుగుండంగా ఏర్పడి మే 8 కల్లా భయంకరమైన తుఫానుగా మారి, ఆంధ్ర ప్రదేశ్‌పై కనీ-వినీ ఎరుగని దుష్ప్రభావం చూపింది. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని పలు ప్రాంతాలపై కూడా దాని ప్రభావం పడింది. కనీసం పది జిల్లాలలోని కోటి మంది ప్రజలు తుఫానుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులకు లోనయ్యారు. విద్యుత్ సౌకర్యాలతో సహా అన్ని రకాల ప్రజావసరాల ఏర్పాట్లన్నీ అస్తవ్యస్థమైపోయి, జనజీవనం స్తంభించి పోయింది. లక్షలాది గుడిసె వాసులు నివాసాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ప్రభుత్వానికదో పెను సవాలుగా మారింది. "గుడ్డిలో మెల్ల" గా, తప్పిపోతుందనుకున్న తుఫాను రాష్ట్రాన్ని తాకనున్నదన్నసంకేతాలు ముందుగా అందడంతో, సరైన నివారక చర్యలు చేపట్టడంతో లక్షలాది ప్రాణాలు కాపాడబడ్డాయి.

తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి, నాకు గుర్తున్నంతవరకు చేసిన ప్రయత్నాలు కనీసం రెండు రోజులు ఫలించలేదు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించ నందువల్ల, ఆయనతో సహా మేమందరం ఎక్కిన వైమానికదళ హెలికాప్టర్ మొదటి రెండు రోజులు "మొరాయించింది". ప్రధాన మంత్రి వీపీ సింగ్ వచ్చి ఎక్కిన తర్వాతే అది కదిలింది. అయినప్పటికీ, విజయవాడ విమానాశ్రయం దాటి ముందుకు కదలలేదు. "ప్రధాన మంత్రికన్నా ముందర ముఖ్యమంత్రి ఎలా వెళ్లుతారు? ఆయనకెందుకు మొదలు ఆ కీర్తి దక్కాలి" అని హెలికాప్టర్ మొరాయించే ఏర్పాటు జరిగిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమనే ది వారికే వదిలేద్దాం. మరో మారు కూడా ప్రధాని వచ్చి తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ నాయకుడి హోదాలో స్వర్గీయ రాజీవ్ గాంధి తుఫాను ప్రాంతాలలో రెండు రోజులు తిరిగారు అప్పట్లో. సహాయ-పునరావాస కార్యక్రమాల సమీక్షకు చెన్నారెడ్డి గారు అమెరికా నుండి తిరిగి రావడానికి ముందు మరో మారు పర్యటించారు.
(సశేషం) 

No comments:

Post a Comment