Thursday, July 12, 2018

ఆ ఉపన్యాసాలు...అమూల్యం ..... మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-3:వనం జ్వాలా నరసింహారావు


ఆ ఉపన్యాసాలు...అమూల్యం
మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-3
మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (13-07-2018)
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)
చెన్నారెడ్డికి ఒకరు రాసిచ్చిన ఉపన్యాసం చదివే అలవాటు ఏనాడూ లేదుఏ సభలోనైనాకనీసం గంటకు తక్కువ లేకుండాఆశువుగామూడు భాషల్లో-ఇంగ్లీష్ఉర్దూతెలుగు-ల్లోఅనర్గళంగా మాట్లాడే వారుప్రతి ఉపన్యాసంలోని అంశాలు పదిలంగా పది కాలాల పాటు దాచుకోతగినంత విలువైనవిఆయన ప్రసంగాలను ఆడియో రికార్డు చేయించి (అప్పట్లో ఇంకా వీడియోలు ఇంకా ప్రాచుర్యం పొందలేదుతర్జుమా చేయించి టైప్ చేయించడం జరిగిందివిలువైన ఆయన ఉపన్యాసాలన్నీ సమాచార పౌర సంబంధాల శాఖలో బహుశా వుండొచ్చుకొన్నింటి కాపీలు నేను కూడా బధ్ర పరచుకున్నాను ఇప్పటికీఆయన అనుభవాల-జ్ఞాపకాల సారాంశం రంగరించి తన ఉపన్యాసాల్లోవర్తమాన పరిస్థితులకు అన్వయించి చెప్పేవారు చెన్నారెడ్డితాను డాక్టర్ అయినా మంత్రిగా ఆరోగ్య శాఖ కోరుకోక పోవడానికి కారణంతనకు చదువు చెప్పిన అధ్యాపకులు ఇంకా పనిచేస్తుండగానేవారికి మంత్రిగా వుండడం సమంజసం కాదనే వారుబాబూ రాజేంద్ర ప్రసాద్ పేరు మీదవ్యవసాయ విశ్వ విద్యాలయం వున్న హిమాయత్ సాగర్ ప్రాంతాన్ని "రాజేంద్ర నగర్గా తనే మార్చిన విషయం ఓ సందర్భంలో చెప్పారు.  ప్రముఖ తెలంగాణా వాదిమాజీ ఎమ్మెల్యేసీనియర్ అడ్వొకేట్86 సంవత్సరాల బొగ్గారపు సీతారామయ్య గారు "యాన్ ఎజెండా ఫర్ ద డెవలప్ మెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్" పేరుతో ఆ ఉపన్యాసాలను పుస్తకంగా ప్రచురించారు.

లౌక్యంలో కూడా చెన్నారెడ్డిది అరుదైన శైలి. 1990 మే నెల బ్లిట్జ్ ఆంగ్ల వార పత్రికలో ఆయనతో పత్రిక ప్రతినిధి సాయినాథ్ చేసిన ఇంటర్వ్యూ వచ్చిందిఆ నెల మొదటి తేదీన నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో ఆ ప్రతినిధి చెన్నారెడ్డిని  ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను కూడా పక్కనే వున్నానుమారుమూల గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని నక్సలైట్ ప్రాబల్యమున్న ఆ గ్రామంలో ప్రారంభించడానికి అక్కడకు వెళ్లిన ముఖ్య మంత్రితో జరిపిన ఇంటర్వ్యూ అదిఢిల్లీలోని "రాజకీయేతర కాంగ్రెస్ ముఠా నాయకులకుచెన్నారెడ్డి  హెచ్చరిక చేసినట్లుజాతీయ స్థాయిలో అలాంటి నాయకుల వైఫల్యం మూలాన్నే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని ఆయన అన్నట్లుకొన్ని వివాదాస్పదమైన అంశాలున్నాయందులోఅలాగే మరో చోటచెన్నారెడ్డిశరద్ పవార్వీరేంద్ర పాటిల్ తెలుగు గంగ పేరుతో తిరుపతిలో సమావేశమైరాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వచ్చిందిఆయన చెప్పని ఆ విషయాలు బ్లిట్జ్ లో రావడంలోకంగారు పడుతూ ఆయన దృష్టికి తెచ్చినప్పుడు, "అలా ఎవరైనా అనుకుంటే పర్వాలేదుఅనడం నన్ను ఆశ్చర్య పరిచిందిబుద్ధుడి విగ్రహం టాంక్ బండ్ నీళ్లలో పడి పోయినప్పుడుఅంతవరకు దాని కొరకు జరిగిన వ్యయంనీళ్లలోంచి తీస్తే కాబోయే అదనపు వ్యయంపదే-పదే చెప్పే వారే కానితీయడానికి ఏం చెయ్యబోతున్నారో ఎప్పుడూ చెప్పలేదు.

చెన్నారెడ్డి గారి దగ్గర నేను “పీఆర్వో టు సీఎం” గా చేరిన మొదటిరోజుల్లోనే ఒక ఇబ్బందికి గురయ్యాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నాకు అంతకు ముందు ఎక్కడా పీఆర్వోగా పనిచేసిన అనుభవం కూడా లేదు. పోనీ జర్నలిస్టుగా పనిచేసానా అంటే, అది కూడా లేనట్లే. ఏదో అడపాదడపా “లెటర్స్ టు ద ఎడిటర్” రాయడమో, లేదా, ఆకాశవాణి, దూరదర్శన్ లలో తాత్కాలిక ప్రాతిపదికపైన వార్తా విభాగంలో పనిచేయడమో తప్ప పెద్దగా అనుభవం లేనివాడిని. ప్రభుత్వ పనితీరు కూడా అర్థం చేసుకోవడం అంతంత మాత్రమే. ఈ నేపధ్యంలో, ఒకనాడు డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. చెన్నారెడ్డి సీఎం హోదాలో హాజరయ్యారు. నాకు గుర్తున్నంతవరకు సుశీల్ కుమార్ మాథుర్ అప్పట్లో డీజీపీ. సమావేశం బాగానే జరిగింది కాని, ఎందుకో సీఎం కు కోపమొచ్చింది. ఇంటికి వస్తూనే, సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో, ఎదురుగా కనిపించిన నాతో తక్షణమే డీజీపీని వివరణ కోరాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని అన్నారు. నేను యధాలాపంగా “సరే” అన్నాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఈ విషయం సీఎం కార్యదర్శి ఐఏఎస్ అధికారి పరమహంస గారికి చెప్పాను. ఆయన తాను చూసుకుంటానని, నన్ను మరచిపోమ్మని అన్నాడు.

మరచిపోయే అవకాశం లేకుండానే, ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు “జ్వాలా, ఏమైంది? డీజీపీ విషయం ఏం చేసావు?” అని అడిగారు చెన్నారెడ్డి. పక్కనే వున్న పరమహంసను చూపిస్తూ, “సార్, పరమహంస గారికి చెప్పాను. ఆయన చూసుకుంటానన్నాడు” అనగానే సీఎం కు కోపమొచ్చింది. “ఏమయ్యా! నువ్వు నాకా, పరమహంసకా పీఆర్వో వి?” అని అడిగాడు. అందరిలాగా నేను ప్రభుత్వోద్యోగిని కాదనీ, వాళ్లలాగా వుండకూడదనీ, ఒకసారి తానొక్క మాట చెప్తే అది వేదవాక్యంలాగా ఒక జీవోలాగా, అమలు కావాలనీ, భయపడ వద్దనీ హితవు పలికాడు. బహుశా అప్పటినుండి నేనక్కడ పనిచేసినంత కాలం నా దృక్ఫదంలో ఒక మార్పు వచ్చింది. ధైర్యంగా పనిచేయగాలిగాను.


ఒకసారి, ఆయన ప్రవేశపెట్టిన ఒక పథకం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాను. కారులో ఆయన వెంట పోతూ అడిగాను ఆ విషయమే. జవాబు చెప్పలేదు. ఆ సాయింత్రం జరిగిన ఒక సభలో ఇతర విషయాలతో పాటు, ఆ పథకం గురించి చాలా వివరంగా అందరికీ అర్థం అయ్యేలా మాట్లాడాడు. నేను కూడా అక్కడే వున్నాను. అంతా విన్నాను. తిరుగు ప్రయాణంలో ఆ విషయం ప్రస్తావించి, అర్థమయిందా? అని ప్రశ్నించాడు. అదీ ఆయన పనితీరు. తన దగ్గర పనిచేసేవారికే తన ఆలోచనా ధోరణి అర్థం కాకపొతే, ఇతరులకు ఎలా అర్థమవుతుంది అని అలా సభాముఖంగా వివరించానన్నాడు.

చెన్నారెడ్డి మంత్రి వర్గంలో పనిచేస్తున్న ఒక సీనియర్ మంత్రి (స్వర్గీయ కోనేరు రంగారావు) పై అవినీతి ఆరోపణలొచ్చాయిచెన్నారెడ్డి ముఖ్య మంత్రి అయిన రెండు నెలలకే అది జరిగిందిఆరోపణలు చేసిన వారు బలమైన సాక్ష్యాధారాలున్నట్లు చెప్పడం జరిగిందితనకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలనుకున్న చెన్నారెడ్డి ఏం చేయాలన్న సందిగ్ధంలో పడ్డారుబహుశా తాను అడగ తల్చుకున్న వారందరినీ సలహా అడిగి వుండొచ్చుఆయన దగ్గర పనిచేస్తున్న మా వంతు కూడా వచ్చిందిఫిబ్రవరి 6,1990 రాత్రి పదకొండు గంటల సమయంలో సీఎం గారి ఫోన్ వచ్చిందిఆ మంత్రి విషయంలో ఏం చేస్తే బాగుంటుందని ఆయన ప్రశ్న వేశారుఆయన ఎలా చేస్తే బాగుంటుదనుకుంటే అలానే చేయమని బుద్ధిగా సమాధానం ఇచ్చానుఅన్నీ తాను అనుకున్నట్లే చేయడానికి ఎందుకంత మంది వ్యక్తిగత సిబ్బంది అని మరో ప్రశ్నఆయన మనసులో మాట అర్థం చేసుకుని చెప్పాల్సింది చెప్పడంఅదెలా అమలు పర్చాలని ఆయన అడగడంఆ బాధ్యత నెత్తిన వేసుకోవడంఆ మంత్రి మర్నాడు రాజీనామా చేయడం జరిగిందిఅదీ ఆయన లౌక్యం. (సశేషం) 

No comments:

Post a Comment