Wednesday, July 11, 2018

కాంగ్రెస్ మేనిఫెస్టోకు కళ తెచ్చిన “చెన్నా” .... మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-2:వనం జ్వాలా నరసింహారావు


కాంగ్రెస్ మేనిఫెస్టోకు కళ తెచ్చిన “చెన్నా”
మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-2
మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (12-07-2018)
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)
పీసీసీ అధ్యక్షుడి హోదాలో హైదరాబాద్ వచ్చిన నాడు, బేగంపేట విమానాశ్రయంలో అశేష జనవాహిని, సుమారు లక్షమందికి పైగా, ఆయనకు స్వాగతం పలికారు. నాటి పోలీసు అధికారులు కూడా ఆయనను దాదాపు కాబోయే ముఖ్యమంత్రిగా పరిగణించి, విమానం దాకా ఆయన్ను తెచ్చే వాహనాన్ని అనుమతించారు. బ్రహ్మాండమైన ఊరేగింపుతో బేగంపేట నుండి, తార్నాకా ఇంటికి వెళ్లారాయన. ఆయన ఆధ్యక్షతన ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. అఖండ విజయం సాధించింది.

అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకిపార్టీ అధినేత-ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకిపీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే సవాళ్ళు విసరడం ఆరంభించారు చెన్నారెడ్డిజూన్ 3, 1989  "నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్నిర్వహించిన "జవహర్ రోజ్ గార్-పంచాయితీ రాజ్సదస్సులో ఎన్ టీ రామారావు సబ్సిడీ బియ్యం పథకం అంశం ప్రస్తావిస్తూ... ప్రతి వ్యక్తీ తమ కాళ్లపై తామే నిలబడేలాస్వయం కృషితో జీవనాధారం పొందగలిగే స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందించాలి కానిశాశ్వతంగా వారిని ఒకరిపై ఆధారపడేలా చేయకూడదని అన్నారు చెన్నారెడ్డిపంచాయితీరాజ్ సంస్థల ద్వారాస్థానిక స్వపరిపాలన ద్వారా మాత్రమే అది సాధ్య పడుతుందనికాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోఈ రెండింటి లో ఏది ముఖ్యమో అన్న అంశంపైనే పోటీకి దిగి గెలుస్తుందని సవాలు విసిరారుఆ నాటి సెమినార్ లో పాల్గొని ప్రసంగించిన ప్రముఖుల్లో పద్మభూషణ్ స్వర్గీయ సీ నరసింహన్ ఐసీఎస్ప్రముఖ అఖిల భారత కమ్యూనిస్ట్ నాయకుడు స్వర్గీయ మొహిత్ సేన్ కూడా వున్నారు.

నవంబర్-డిసెంబర్ 1989 లో జరిగిన ఎన్నికల్లో చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ఓడిపోడనుకున్న ఎన్ టీ రామారావును ఒక నియోజక వర్గంలోనుపార్టీని రాష్ట్రంలోను ఓడించిందిఆయన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు చేసిన వివిధ ప్రసంగాల్లో విసిరిన సవాళ్లనే ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. "అర్హులైన పేదలకే సబ్సిడీ బియ్యం పథకంపరోక్షంగా ప్రస్తావిస్తూపటిష్ఠమైన పౌర పంపిణీ వ్యవస్థ విధాన ప్రకటన మేనిఫెస్టోలో మొదటి అంశంగా చేర్చింది కాంగ్రెస్ పార్టీఅలానే స్వయం ఉపాధి పధకాల ప్రస్తావన కూడా దానికి జత పరిచింది పార్టీఎన్నికల ప్రణాళికను తయారుచేయడానికి నియమించిన కమిటీ ఆ పనిని పూర్తి చేయడానికి పదిహేను రోజులు తీసుకుందిముసాయిదాను అధ్యక్షుడి ఆమోదం కొరకు చూపించినప్పుడు నేను కూడా అక్కడే వున్నానుకేవలం పావు గంటలోనే ఆసాంతం  చదివితప్పులు సరిదిద్దిన చెన్నారెడ్డిఅదనంగా మరో ఇరవై మూడు పేరాలు , కాగితంపై పెట్టిన కలాన్ని ఎత్తకుండా రాశారుఆయన స్వదస్తూరీతో ఆ నాడు రాసిన మేనిఫెస్టో కాగితాలనుఈ నాటికీఆయన జ్ఞాపకంగా నా వద్దనే భద్రపరుచుకున్నాను

ఒక సందర్భంలో, ఎన్నికల ముందు ఒక స్నేహితుడితో కలిసి చెన్నారెడ్డితో మాట్లాడుతూ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చో అంచనా వేస్తున్నాం. అప్పటికే ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి సుమారు 200 స్థానాల దాకా రావచ్చని సమాచారం వచ్చింది చెన్నారెడ్డికి. అదే విషయం ఆయనతో ప్రస్తావించాను. ఆయనకు అధికారంలోకి రావాలని వున్నా, అన్ని సీట్లు వస్తాయన్న నమ్మకం అంతగా లేదు. నేనేప్పుడైతే 200 సీట్లు రాబోతున్నాయని అన్నానో, అలా వస్తే, నన్నే తన పీఆర్వో చేస్తానని అన్నాడు. అన్న మాట ప్రకారం చేశారు. వాస్తవానికి ఆయన సీఎం కాగానే, 1978 లో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎవరెవరైతే ఆయనకు పర్సనల్ స్టాఫ్ గా పనిచేశారో వారందరినీ మళ్లీ నియమించుకున్నారు. ఉదాహరణకు ఐఏఎస్ అధికారి కేఆర్ పరమహంసను తన కార్యదర్శిగా నియమించారు. ఒక్క పీఆర్వో విషయంలోనే అప్పుడున్న స్వర్గీయ పర్వతాలరావు స్థానంలో నన్ను నియమించారు. అది ఆయనలో వున్న గొప్పతనం. ఎన్నికల ముందు అన్న మాట ప్రకారం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకసారి ప్రధాని, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజీవ్ గాంధీ వచ్చారు. వెంట మణిశంకర్ అయ్యర్ వున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం మధ్యలో కల్వకుర్తిలో ఆగడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్ని సీట్లు వస్తాయని రాజీవ్ గాంధి చెన్నారెడ్డిని అడిగారు. 40 పార్లమెంటు సీట్లు, 194 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని చెన్నారెడ్డి జవాబిచ్చారు. ఆశ్చర్యపోయిన రాజీవ్ గాంధి, అన్ని సీట్లు వస్తే చెన్నారెడ్డే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. చెన్నారెడ్డి అన్నట్లుగానే కరెక్టుగా 194 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అన్న మాట ప్రకారం, గెలిచిన శాసన సభ సభ్యుల్లో చెన్నారెడ్డికి ఎంతమంది మద్దతున్నదనే అంశాన్ని పక్కన పెట్టి, ఆయన్నే సీఎం చేసింది అధిష్టానం.


పీసీసీ అధ్యక్షుడుగా చెన్నారెడ్డి చేపట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన "కోటి సంతకాల సేకరణకార్యక్రమం, "జైల్ భరోఉద్యమం ప్రజల స్పందనకు ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలినిజాం కళాశాల మైదానంలో డిసెంబర్ 3, 1989 న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన చేసిన తొలి ప్రసంగంలోప్రజలకు అయిష్టం కలిగించేదిఇబ్బందులకు గురిచేసేదిఆమోదయోగ్యం కానిది ప్రభుత్వం చేయడం తగదని అన్నప్పుడు, "హెల్మెట్లువిధిగా ధరించడం మాకిష్టం లేదంటూ ప్రేక్షకుల నుంచి కేకలు వినిపించాయితక్షణమే స్పందించిన చెన్నారెడ్డిధరించమని బలవంతంగా ఎవరిపైనా రుద్దమని అన్నారుఅలా అంటూనేబధ్రత దృష్ట్యా వాటిని ధరించితేనే మంచిదంటూ సూచన కూడా చేశారుఅదీ ఆయన స్పందించే శైలిఎన్టీ రామారావు ప్రభుత్వం వున్నప్పుడుహెల్మెట్లు ధరించే విషయంలో ఒకసారి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన సీనియర్ పాత్రికేయుడు భండారు శ్రీనివాసరావు (అప్పుడు ఆయన మాస్కో రేడియోలో పని చేస్తున్నాడు) కుముఖ్యమంత్రి హోదాలో మర్రి చెన్నారెడ్డి తన నిర్ణయం గురించి ఉత్తరం కూడా రాశారు!

ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి వెళ్లే ప్రతి సందేశంలోపత్రికా ప్రకటనలో ఆయన దైన శైలివ్యక్తిత్వం కొట్టొచ్చినట్లు కనబడేలా సంబంధిత వ్యక్తిగత సిబ్బందికి ఆయన ఆలోచనా ధోరణి తెలియ చేసేవారు చెన్నారెడ్డిముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టగానేఆయనను అభినందిస్తూ వచ్చిన వేలాదిమంది అభిమానులకుచెన్నారెడ్డి నుంచి ఆయన సంతకంతో వెళ్ళిన "కృతజ్ఞతల ప్రత్యుత్తరంకేవలం ధన్యవాదాలకే పరిమితం చేయలేదుఅద్వితీయమైన శైలిలో ఆయన తన అభిమానులకు చేరవేయాలనుకున్న సందేశాన్ని మాతో రాయించారుఅధికారం మారడంతో తనకు తెలుగుదేశం నుంచి వారసత్వంగా సంక్రమించిన "ఛిన్నాభిన్నమైన పాలనా వ్యవస్థనుఆర్థిక వ్యవస్థను", అత్యవసరంగా ప్రక్షాళన చేయడానికి వారి సహకారం అందించమంటూతన జవాబులో కోరారు చెన్నారెడ్డి

బ్లిట్జ్  సంపాదకుడు ఆర్ కే కరంజియా చెన్నారెడ్డిని అభినందిస్తూ రాసిన వుత్తరం గురించి ఆయన చాలా మందితో ప్రస్తావించారుఅప్పట్లో పంజాబ్ రాష్ట్రంలో నెల కొన్న శాంతి బధ్రతల సమస్యను-హింసాత్మక సంఘటనలను తన వుత్తరంలో పేర్కొన్న కరంజియాచెన్నారెడ్డి కనుక మరికొంత కాలం ఆ రాష్ట్ర గవర్నర్ గా కొనసాగి వున్నట్టయితేబహుశాపరిస్థితులు మరోలాగా-శాంతియుతంగా వుండేవని చెప్పారుతన పట్ల ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం ఒక అసాధారణమైన గౌరవంగా భావించిన చెన్నారెడ్డి కరంజియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసుకున్నారుపంజాబ్ మాజీ ముఖ్య మంత్రి దర్బారా సింగ్ చనిపోయిన వార్త ఆ రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత తెలిసిందిఅప్పటికే ఇంటికొచ్చిన నేనుఆ విషయాన్ని చెన్నారెడ్డి దృష్టికి తెచ్చిసంతాప సందేశం ఆయన మాటల్లో చెప్పమని కోరానుఅప్పటికే అర్థరాత్రి కావచ్చిందిఆయన గవర్నర్ గా పని చేసినప్పుడుదర్బారా సింగ్ పంజాబ్ ముఖ్య మంత్రిగా వుండేవారు. "పర్సనల్ టచ్తో సందేశం చెప్పారు.
(మిగతాది రేపు

1 comment: