Thursday, November 28, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు...బాల కాండ-14:వనం జ్వాలానరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) 
రామాయణంలో ఛందః ప్రయోగాలు
బాల కాండ-14
వనం జ్వాలానరసింహారావు


బాల కాండ చివరి పద్యం "తరలము" వృత్తంలో ఈ విధంగా రాస్తూ కాండలో మొత్తం ఎన్ని పద్యాలున్నాయో వివరిస్తారు వాసు దాసుగారు.

తరలము: జలజవైరిమహీధరాగ్ని  శశాంకపద్యనిరూపితా
తులితబాల్యవినోదఖేలన  తోయజాక్ష ! రమాధవా !
కలశవారిధితుల్యసజ్జన  కాండ  చిత్తనివాసకా !
కలుషసంహార ! యొంటిమిట్టని కాయి ! జానకి వల్ల భా ! -17

ఛందస్సు: న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి. 

తాత్పర్యం: జలజవైరి (చంద్రుడు)=1 , మహీధర (పర్వతాలు)= 7, అగ్ని అంటే త్రేతాగ్నులు= 3, శశాంక అంటే చంద్రుడు= 1. బాల కాండలో వాసు దాసుగారు ఎన్ని పద్యాలు రాసారో ఈ చివరి పద్యంలో పరోక్షంగా చెప్పారు. ఈ కాండలో మొత్తం 1371 పద్యాలున్నాయి.

No comments:

Post a Comment