Thursday, July 13, 2017

రాముడు బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు : వనం జ్వాలా నరసింహారావు

రాముడు బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక 
(14-07-2017) and (15-07-2017)

రాముడు లోకోత్తరుడు. ఆయనలో వున్న మంచి గుణాలు ఎవరిలోనూ కనిపించవు. అటువంటి వ్యక్తి చరిత్రే  రామాయణం. వాల్మీకిని రామాయణం రాయమని ప్రోత్సహించడానికి వస్తాడు నారదుడు.అలావచ్చిననారదుడిని, "గుణవంతుడుఅతివీర్యవంతుడు,ధర్మజ్ఞుడు,కృతజ్ఞుడుసత్యశీలుడు, సమర్థుడునిశ్చలసంకల్పుడుసదాచారం మీరనివాడుసమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడువిద్వాంసుడుప్రియదర్శనుడుఆత్మవంతుడుకోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడుఆశ్చర్యకరమైన కాంతిగల వాడుఅసూయ లేనివాడురణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకినారదుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు.

చైత్ర మాసం-శుక్లపక్షం-నవమి తిథి నాడుపునర్వసువు నక్షత్రంలోఅభిజిల్లగ్నం-కర్కాటక లగ్నంలోచంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం అయిందిఆ ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారకసూర్య,గురుశనిశుక్రవాటి-వాటి ఉచ్చ స్థలాల్లో (సూర్యుడికి మేషరాశి - గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్చ స్థానాలువుండగాకౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి రాముడిని కనిందిశ్రీరామావతారానికి ముఖ్యకారణం కౌసల్య తపః ప్రభావమేనని అనవచ్చుఆమె నవమీవ్రతాన్ని చేసినందువల్ల భగవంతుడు నవమి నాడు జన్మించాడు.

సౌమ్య నామ సంవత్సరంమాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగరక్షణకు తీసుకెళ్తాడు. 27వ రోజుఅంటేశుక్ల త్రయోదశిఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతా కల్యాణం జరిగిందివివాహం జరిగింది నవమి నాడు కాదుమరి ఆ 27వ రోజునవమి అని ఎక్కడా చెప్పడం జరగలేదుఎందుకు మనవాళ్లందరూ వివాహం జరిగిన తిథి నాడు కాకుండా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం జరుపుతున్నారో సామాన్యులకు అర్థంకాదు-అర్థం చేసుకొని అడగాలని కూడా ఎవరూ అనుకోరు

వాల్మీకి శ్లాఘించిన గుణాలు అసమానమైనవిఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి అనేకమయ్యాయిమనుష్యమాత్రులందు ఇవి కనపడవుఇట్టి సుగుణ సంపత్తికలవాడుఇక్ష్వాకుల మహారాజు వంశంలోరామచంద్రమూర్తి అనే పేరుగలాయన మాత్రమే. అతి వీర్యవంతుడాయనఅసమానమైన, వివిధమైన, విచిత్రమైన శక్తి గలవాడు స్వయంగా ప్రకాశించగలడుఅతిశయం లేని ఆనందంగలవాడు ఇంద్రియాలను, సకల భూతాలను వశపర్చుకున్నాడుసర్వం తెలిసినవాడునీతే ప్రధానం ఆయనకుపరులకు హితమైనప్రియమైన మాటలు చెప్తాడుఎవరిపై శత్రు భావం లేకపోయినాతనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తేవారిని నాశనం చేసే వాడు


 ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన దివ్య మంగళ విగ్రహానికి తోడుఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలు కూడా వున్నాయి. శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా ఆచరించేవాడుచేసిన ప్రతిజ్ఞ తప్పనివాడుసమస్త భూ జనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడుదానధర్మాలుస్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సుశత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వ విషయాలు తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. మిక్కిలి పరిశుద్ధుడుఋజుస్వభావం గలవాడు. ఆశ్రిత రక్షకుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. ఆశ్రితులకుమాతపితఆచార్యులకువృద్ధులకు వశ పడినవాడు. విష్ణువుతో సమానుడుశ్రీమంతుడు.లోకాలను పాలించ సమర్థుడు. ఆశ్రిత శత్రువులనుతన శత్రువులనూ అణచగలిగినవాడు.

ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడుధర్మాన్ని తానాచరిస్తూఇతరులతో ఆచరింపచేసేవాడుస్వధర్మ పరిపాలకుడు. స్వజనరక్షకుడు. వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు. కోదండ దీక్షాపరుడుసర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరిజ్ఞాపకశక్తిగలవాడు. విశేషప్రతిభగలవాడు. సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు. సాధువు. గంభీర ప్రకృతిగలవాడుఅన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. అందరిమీద సమానంగా ఎప్పుడూఏకవిధంగామనోహరంగాదర్శనమిచ్చేవాడుసమస్తభూతకోటికిపూజ్యుడుఅన్నింటా గుణ శ్రేష్ఠుడుకౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడుగాంభీర్యంలో సముద్రుడంతటివాడుధైర్యంలో హిమవత్పర్వత సమానుడువీర్యాధిక్యంలో విష్ణు సమానుడుచంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడుకోపంలో ప్రళయకాలాగ్నిఓర్పులో భూదేవంతటివాడుదానంలో కుబేరుడుఅసమాన సత్యసంధుడుధర్మానికి మారుపేరుఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు.

పంపా తీరంలోని వనంలో హనుమంతుడిని చూసిఆయన మాటపై గౌరవం వుంచిసుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడు.తనకథసీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడుచెప్పిన తర్వాతసుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు. రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమేగుహుడు హీనజాతివాడైనాపురుషుడైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం చెప్పడం జరిగిందిహీన స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి సౌశీల్యవంతుడయ్యాడువానరుడైన సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం జరిగింది.


శ్రీ రామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకానిరోగబాధలుకానియీతిబాధలుకాని లేవుపుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదుస్త్రీలు పాతివ్రత్యాన్ని విడవలేదువారికి వైధవ్య దుఃఖం లేదుఎక్కడా అగ్నిభయంలేదుశ్రీ రామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరుపెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదుదొంగలు లేరుఆకలికి-జ్వరానికి తపించినవారు లేరునగరాలలోగ్రామాలలోనివసించే జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగిభోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారుశ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలనుయజ్ఞాలను చేసిబ్రాహ్మణులకు లెక్కపెట్ట లేనన్ని ఆవులనుధనాన్ని దానమిచ్చితన సుఖాన్ని వదులు కోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించివైకుంఠ లోకానికి పోయాడుశ్రీరామచంద్రమూర్తిరాజ్య హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించివారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చివారంతా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడుబ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడుస్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీ,పరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడుపదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి.


రామాయణం పరిశుద్ధంగా చదివేవారికివినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయిఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుందిఅంతశక్తి దీనికుండటానికి కారణంఇది వేద స్వరూపమైవేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టిఅంతేకాదుసంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడాఇది వినేవారు-చదివేవారుఅంతమాత్రాన సన్యాసులు కానవసరం లేదుఆయుస్సు పెరిగికొడుకులు-కూతుళ్లతోమనుమలు-ఇష్ట బంధువులతో అనుభవించిమరణించిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుందిపరిమితి చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినాఇతరులు చదవగా విన్నాఅర్థ విచారం చేసినాబ్రాహ్మణుడికి వేద వేదాంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుందిక్షత్రియుడికి సర్వాధిపత్యం కలుగుతుందివైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుందిశూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుందికాబట్టి నాలుగువర్ణాలవారుస్త్రీ-పురుషులుదీన్ని చదవాలి-వినాలివిషయ చింతన చేయాలివినేవారుంటే చదివి వినిపించాలిచదివేవారుంటే వినాలిఈ రెండూ జరగని కాలముంటేవిన్నదానిని-కన్నదానినివిశేషంగా మననం చేయాలిఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి.

1 comment:

  1. ధన్యోస్మి. వనం వారూ నా రాముడి గురించి ఎంతో బాగా వ్రాసారు. అభినందనలు. చాలా చాలా సంతోషం కలిగింది.

    ReplyDelete