Thursday, February 21, 2019

మహా నాయకులు నిత్య స్మరణీయులు : వనం జ్వాలా నరసింహారావు


మహా నాయకులు నిత్య స్మరణీయులు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (22-02-2019)
          అలనాటి అంతర్జాతీయ స్థాయి "రోల్ మోడల్ఉద్దండ నాయకులు ప్రస్తుతం లేనే లేరని అనలేం కానిఆ స్థాయి రాజనీతిజ్ఞతవారి తరహాలో తమ-తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తీరుతమ దేశాల వాణినే కాకుండా వారి-వారి ప్రాంతాల గురించి ఆ మహా నాయకులు పడ్డ ఆరాటంవ్యక్తిగతంగాఉమ్మడిగా తాము పోరాడుతున్న అంశాల విషయంలో వారు ప్రదర్శించిన నిబద్ధతబహుశాప్రస్తుత అంతర్జాతీయ స్థాయి నాయకుల్లో లోపించిందనడం అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తురాజనీతి శాస్త్రం అధ్యయనం చేసే నేటి తరం విద్యార్థులు కానివర్తమాన చరిత్ర కారులు కానిఆ మాటకొస్తే సాధారణ చదువరి కానియువత కానిగత కాలం నాటి మహా నాయకుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్న దాఖలాలు అంతగా కనిపించడం లేదుఅప్పట్లోఅంతర్జాతీయ స్థాయిలో ఒక గోష్టి కానిసమావేశం కానిసదస్సు కానిప్రపంచ దేశాల సమ్మేళనం కానిఎప్పుడు-ఎక్కడ ఏ మూల జరిగినాఆ నిర్వహణలో కనిపించిన హంగూ-ఆర్భాటంఆనందంఅంగరంగ వైభవం ఇప్పట్లో లోపించిందనాలి

అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడానికి తెర పైకి తెచ్చిన అలీనోద్యమం తీరుతెన్నులునేటి తరంవారుకనీసం తెలుసుకోవాలన్న-అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదేఅలానే 1955 నాటి జెనీవా సదస్సు గురించి కానిఆ రోజుల్లో జరిగిన ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల గురించి కానికామన్ వెల్త్ దేశాధి నేతల సమావేశాల గురించి కానిబాండుంగ్ సమావేశంగా పిలుచుకునే ఆప్రో-ఏషియన్ సమావేశం కాని, 1954 లో జరిగిన జెనీవా సమావేశం కానిఅలాంటి మరెన్నో అంతర్జాతీయ సమావేశాల గురించి కాని నేటి తరం యువత తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

అలనాటి అంతర్జాతీయ స్థాయి అగ్ర నాయకుల పేర్లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి: జవహర్లాల్ నెహ్రూఆయన కుమార్తె ఇందిరా గాంధీజాన్ ఫిట్జ్ గెరాల్డ్ కెన్నెడీనికితా కృశ్చేవ్చార్లెస్ డి గాలెడేవిడ్ బెన్ గ్యూరియన్ఆయన వారసురాలు గోల్డా మీర్మార్షల్ టిటోగమాల్ అబ్దుల్ నాజర్చౌ-ఎన్-లైమావో సేటుంగ్సిరిమావో బండార నాయికేవిల్లీ బ్రాండ్ట్సుకర్ణోక్వామే ఎన్ క్రుమాఫిడల్ కాస్ట్రోహోచిమిన్నెల్సన్ మండేలా.....లాంటి వారు.

జవహర్లాల్ నెహ్రూభారత ప్రప్రధమ ప్రధాన మంత్రిఐక్య రాజ్య సమితి విధానాలకు ఆయన తన సంపూర్ణ మద్దతిచ్చేవారుప్రపంచ వ్యాప్తంగాశాంతిత్వ వాదనకుఆయన పేరు పర్యాయపదం అనవచ్చుఅలీనోద్యమ వ్యవస్థాపకుడిగాఅలనాటి అగ్ర రాజ్యాలైన అమెరికారష్యా దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించిన వాడిగాఆ రెండు దేశాలకు చెందకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు మధ్యే మార్గాన్ని అనుసరిచేట్లు చేసిన వాడిగాచరిత్రలో ఆయనో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. చైనా దేశంతో "పంచశీలపేరుతో శాంతి-సహజీవనం దిశగా ఒప్పందం చేసుకున్నాడాయన

నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కూడా తండ్రి మార్గంలోనే అంతర్జాతీయ స్థాయి నాయకురాలిగా ఆయన తదనంతరం పేరు తెచ్చుకుందిభారత దేశానికి మొదటి పర్యాయం మూడో ప్రధాన మంత్రిగా,  ఆ తరువాత ఆరవ ప్రధాన మంత్రిగా హత్యకు గురయ్యేదాకా ఇందిరాగాంధీ పని చేశారుఆమె కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశంగా భారత దేశానికి పేరొచ్చిందిరాజకీయఆర్థికసైనిక పరంగా దక్షిణ ఏషియా ప్రాంతంలో ఒక గొప్ప రాజ్యంగా అవతరించింది భారత దేశంబంగ్లాదేశ్ ఆవిర్భావంపాకిస్తాన్ పై భారత్ గెలుపు ఆమె నేతృత్వంలో సాధించినవేఅలీనోద్యమానికి కూడా అమె చేసిన కృషి అమోఘం.అలానే పాలస్తీనా విమోచనోద్యమానికి ఆమె ఇచ్చిన మద్దతు మరువరానిది.

జాన్ కెన్నెడీ అమెరికా దేశపు 35 వ అధ్యక్షుడుగాతాను హత్యకు గురయ్యేవరకు పనిచేశారు. ఆయన కాలంలోనే "బే ఆఫ్ పిగ్స్" దాడిక్యూబన్ మిస్సైల్ సంక్షోభంబెర్లిన్ గోడ నిర్మాణంఆఫ్రికా-అమెరికా పౌర హక్కుల ఉద్యమం తో సహా వియత్నాం పైన యుద్ధంలో అమెరికా మితిమీరిన జోక్యం చోటు చేసుకున్నాయి. అతి పిన్న వయసులోనే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన కెన్నెడీఅచిర కాలంలోనే ప్రపంచ స్థాయి అగ్రనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తదనంతరం అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులు వచ్చినప్పటికీ ఆయన కొచ్చిన గుర్తింపు ఇంతవరకు మరెవ్వరికీ రాలేదనవచ్చేమో!

సోవియట్ యూనియన్‌కు ప్రధాన మంత్రిగా నికితా కృశ్చేవ్ వుండేవారు. జర్మనీ ఐక్యత కొరకు కృశ్చేవ్ నిరంతరం కృషి చేసేవారు. నవంబర్ 1958 లో ఆయన ఆ దిశగా అమెరికాకుఇంగ్లాండుకుఫ్రాన్స్ దేశానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. తక్షణమేఆరు నెలలు గడిచే లోపున తూర్పు-పశ్చిమ జర్మనీ దేశాలతోనుసోవియట్ యూనియన్ తోను శాంతి ఒప్పందం చేసుకోమని కోరాడు కృశ్చేవ్. అలా జరగని పక్షంలోసోవియట్ యూనియన్ తనంతట తానే తూర్పు జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకుంటుందని కూడా హెచ్చరించాడు.

చార్లెస్ డి గాలె ఫ్రాన్స్ ఐదవ గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుడి గానుఆ దేశానికి అధ్యక్షుడి గానుఫ్రెంచ్ సైన్యాధినేతగానుప్రముఖ రాజనీతిజ్ఞుడిగానుఆ రోజుల్లో యావత్ ప్రపంచానికి చిరపరిచితుడు. 1958 లో ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపన జరగడానికి చాలా కాలం క్రితమేఆ దేశానికి1945 లోనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి కారణ భూతుడు డి గాలె. నాటో సైనిక కూటమి నుంచి ఫ్రాన్స్ దేశాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండాఐరోపా సమాజంలో బ్రిటన్ దేశానికి ప్రవేశం కలగకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన వ్యక్తి డి గాలె. అమెరికాసోవియట్ యూనియన్ దేశాల మధ్య సమతుల్యం పాటించుకుంటూఒక పటిష్టమైన దేశంగా ఫ్రాన్స్ ను అభివృద్ధి చేయాలన్న విషయంలో డి గాలె ఎన్నడూ రాజీపడలేదు.

అలాగే...ఇజ్రాయిల్ కు చెందిన గోల్డా మీర్బెన్ గ్యూరియన్ లు. ఆ దేశ నాల్గవ ప్రధాన మంత్రిగా అధికారంలో వున్న గోల్డా మీర్ ను ఇజ్రాయిల్ రాజకీయాలలో "ఐరన్ లేడీ" గా అభివర్ణించే వారు. గోల్డా మీర్ అనేక మంది ప్రపంచ నాయకులను కలిసి ఆమె కలలు కన్న రీతిలోమధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేశారు. ఆమెకు ముందు ప్రధానిగా పని చేసిన డేవిడ్ బెన్ గ్యూరియన్ ఇజ్రాయిల్ రాజనీతిజ్ఞుడిగానుజాతి పిత గాను ప్రసిద్ధికెక్కాడు. ప్రప్రధమ ఇజ్రాయిల్ ప్రధాన మంత్రిగా బెన్ గ్యూరియన్ పనిచేశారు. 1948 లో జరిగిన అరబ్-ఇజ్రాయిల్ యుద్ధంలో తన దేశానికి నాయకత్వం వహించడమే కాకుండావివిధ జ్యూయిష్ సైనిక సంస్థలనుఇజ్రాయిల్ సైన్యాన్ని కలిపి సమైక్యంగా పోరు సల్పారు.

యుగోస్లేవియా విప్లవకారుడిగాఆ దేశ రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన మార్షల్ టిటో, వివిధ హోదాలలో తన దేశానికి ఎనలేని సేవ చేశాడు. నెహ్రూనాజర్ఎన్ క్రుమాసుకర్ణో లతో కలిసి అలీనోద్యమ ప్రధాన నాయకుడిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. అలీనోద్యమ ప్రప్రధమ సెక్రటరీ జనరల్ గా ఆయన ఎంపికయ్యారు. సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా ప్రధాన మంత్రిగాఆ తరువాత తొలుత అధ్యక్షుడిగాపిదప యావజ్జీవిత అధ్యక్షుడిగా అధికారంలో వున్న ఆయన అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడని పేరు తెచ్చుకున్నాడు.

ఇక గమాల్ అబ్దుల్ నాజర్ విషయానికొస్తే...ఆయనఈజిప్ట్ దేశానికి రెండవ అధ్యక్షుడిగా చనిపోయేంత వరకు వున్నారు. అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, 1956 లో "సూయజ్‌ కెనాల్ కంపెనీ"  ని జాతీయం చేయడంతో ఈజిప్ట్ లోనుమొత్తం అరబ్ ప్రపంచంలోను తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. సిరియాతో కలిసి "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించాడాయన. ఆయన మరణం ప్రపంచ నాయకులనెందరినో కదిలించింది. యావత్ అరబ్ ప్రపంచానికి చెందిన నేతలు ఆయన అంత్య క్రియలకు హాజరయ్యారు. జోర్డాన్ రాజు హుస్సేన్పాలస్తీనా విమోచనోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ బహిరంగంగా కంట తడి పెట్టుకున్నారు. లిబియాకు చెందిన కల్నల్ గడాఫి ఉద్వేగంతో రెండు పర్యాయాలు స్పృహ తప్పి పడిపోయాడు!


"పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" ప్రప్రధమ ప్రధాన మంత్రిగా పనిచేసిన చౌ-ఎన్-లై చనిపోయేంతవరకు పదవిలో కొనసాగారు. కొరియా యుద్ధం నేపధ్యంలోపశ్చిమ దేశాలతో శాంతి కొరకు ఆయన పాకులాడాడు. అమెరికాతో తైవాన్‌తో, సోవియట్ యూనియన్‌తోభారత దేశంతోవియత్నాంతో తలెత్తిన సంఘర్షణల నేపధ్యంలోచౌ-ఎన్-లై సామరస్య పూరకంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కొన్ని విధాన పరమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆయన మెంటర్ మావో సేటుంగ్  "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనావ్యవస్థాపకుడు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులలో మావో ఒకరు. మార్క్స్లెనిన్‌ల సరసన కమ్యూనిజాన్ని వ్యాపింప చేయడంలో కృషి చేసిన త్రిమూర్తులలో ఆయనొకరు. ప్రపంచ చరిత్రకు ఆయన చేసిన తోడ్పాటు చరిత్ర గతినే మార్చిందనాలి.

పాలస్తీనా నాయకుడిగాపాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడిగా యాసర్ అరాఫత్ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. పాలస్తీనా జాతీయ అథారిటీకి ప్రధమ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. పాలస్తీనా స్వయం ప్రతిపత్తి కొరకు తన జీవితాంతం ఇజ్రాయిల్‌తో ఆయన పోరాటం సాగించాడు. అసలు ఇజ్రాయిల్ ఉనికే వద్దన్న అరాఫత్ ఆ తరువాత రాజీపడిఐక్య రాజ్య   సమితి తీర్మానానికి అనుగుణంగా తన విధానాన్ని మార్చుకున్నాడు. శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయిక ఎన్నో సార్లున్నారు. ఆమె ప్రధానిగా పనిచేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

విల్లీ బ్రాండ్ట్ జర్మనీ దేశానికి చెందిన రాజకీయ నాయకుడురాజనీతిజ్ఞుడు. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్స్ లర్‍ గా పనిచేశారు. పశ్చిమ జర్మనీసోవియట్ అనుకూల దేశాల మధ్య సయోధ్య కుదిరించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగావిల్లీ బ్రాండ్ట్ కు నోబెల్ శాంతి బహుమానం లభించింది. ఇండోనేషియా ప్రధమ అధ్యక్షుడిగా పనిచేసిన సుకర్ణోఆ పదవిలో 22సంవత్సరాల పాటు కొనసాగారు. ఇండోనేషియాను వామపక్ష భావాల దిశగా మళ్లించిఇండొనేషియన్ కమ్యూనిస్ట్ పార్టీకి తన పూర్తి మద్దతిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాముఖ్యత-గుర్తింపు తెచ్చేందుకుసామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాలను కూడగట్టాడాయన. అలీనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.

క్వామే ఎన్ క్రుమా ఘనా దేశానికి తిరుగులేని నాయకుడుగా వుండేవారు. బ్రిటీష్ వలస రాజ్యంగా వున్న ఘనాకు స్వాతంత్ర్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్ క్రుమా ఆ దేశానికి ప్రధమ అధ్యక్షుడి గానుప్రధమ ప్రధాన మంత్రి గాను పనిచేశారు. ఆఫ్రికన్ యూనిటీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. లెనిన్ శాంతి బహుమతిని అందుకున్నారు ఎన్ క్రుమా. వియత్నాం కమ్యూనిస్ట్ విప్లవ నాయకుడిగా ప్రసిద్ధికెక్కిన హో చి మిన్ ఆ దేశాధ్యక్షుడిగాప్రధాన మంత్రిగా పనిచేశారు. వియత్నాం స్వాతంత్ర్యం కొరకు పోరాటం సాగించిన హో చి మిన్కమ్యూనిస్ట్ పాలనలోని వియత్నాం ప్రజాస్వామ్య రిపబ్లిక్ ను స్థాపించారు. ఫ్రాన్స్ దేశాన్ని ఓడించిన ఘనత ఆయనదే.

ఎలిజబెత్ రాణి తర్వాత బహుశా ఎక్కువ కాలం అధికారంలో వున్న వ్యక్తి ఫిడల్ కాస్ట్రోనే. లాటిన్ అమెరికాలో కాస్ట్రోను మించిన కమ్యూనిస్ట్ నాయకుడు మరొకరు లేరు. కమ్యూనిస్ట్ విప్లవ పంథాపై ఆయనకు గట్టి పట్టుంది. మరణించేవరకూ ఆయన క్యూబాకు తిరుగులేని నాయకుడు. అప్పటి నుంచి తానే పదవిని ఆశించననిచేపట్టనని ప్రకటన చేశారు. నెల్సన్ మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీగా ఆయన్ను పిలిచేవారు. అలాంటి మహా నాయకులు అరుదుగా వుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతేగత కాలంలో ఇలాంటి మహా నాయకులు మరికొందరుండవచ్చు....ఏరీ అలాంటి నాయకులిప్పుడు?

No comments:

Post a Comment