Saturday, February 23, 2019

వాల్మీకి, మార్క్స్- మానవత : వనం జ్వాలా నరసింహారావు


వాల్మీకి, మార్క్స్- మానవత
 వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (24-02-2019)
సాహిత్యానికీ, మానవ విలువలకూ; ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ; గతితార్కిక భౌతిక వాదానికీ, కర్మ సిద్ధాంతానికీ ఏదో ఒకరకమైన, అనిర్వచనీయమైన, విడదీయరాని అనుబంధం వుంది. హిందూత్వం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం". కర్మ సిద్ధాంతం ప్రకారంఈ సకల చరాచర ప్రపంచమంతటికీభూతకాలంలో జరిగిన దానికీ, వర్తమానంలో జరుగుతున్న దానికీ, భవిష్యత్ లో జరగబోయే దానికీకర్త, కర్మ, క్రియ ఒక్కరేఏ పనినిఎప్పుడు-ఎలా-ఎవరి ద్వారా జరిపించాలోజరిగినదాని పర్యవసానం ఏమిటో, లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ధారించే అధికారం ఆ ఒక్కరికే వుంది

సృష్టించేది బ్రహ్మనీసంహరించేది రుద్రుడనీకాపాడుతుండేది విష్ణుమూర్తనీ అంటారుఅది పూర్తిగా నిజంకాదేమోఅనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మంఒక్కరేఆ ఒక్కరేసృష్టికొక అధికారినీ (బ్రహ్మ), సంహరించడానికి ఒక అధికారినీ (రుద్రుడునియమించాడుబ్రహ్మరుద్రులు నిమిత్తమాత్రులేఅంటేఎవరో ఒక "జగన్నాటక సూత్రధారిస్వయంగా రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఒక అద్భుతమైన నాటకంలోసకల చరాచర ప్రపంచంలోని జీవ, నిర్జీవ రాసులన్నీ తమకు అప్పచెప్పిన పాత్ర పోషించాయిఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తేదాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి-ఆగమన్నప్పుడు ఆగిజీవితం చాలించాలిఆ తర్వాత ఏంజరుగుతుందనేది మళ్లీ ఆయన నిర్ణయానికే వదలాలి.

నిశితంగా పరిశీలిస్తేకార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో ఇలాంటి అంశాలే కనిపిస్తాయిఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ, భూస్వామ్య, ధన స్వామ్య వ్యవస్థ” కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందనిదరిమిలా విజయం సాధిస్తుందనీ, ముందున్న వ్యవస్థ కూలిపోతుందనిశ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందనికుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడుహిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగినదానిని (భూతకాలంవిశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలంవ్యతిరేకించిజరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్‌థీసిస్‌సింథసిస్అని పిలిచాడుఒకరకమైన "కర్తకర్మక్రియఅనవచ్చేమోఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్.

వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలోఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడుపాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడుకార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో, వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడుఆరంభం, అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానేనిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడుఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా

కార్ల్ మార్క్స్ లాంటి మహా మహానుభావులు, ఆలోచనాపరులుఅవనిలో అరుదుగా అవతరిస్తుంటారుపెట్టుబడిదారీ ధన స్వామ్య, భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్నివక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకుపరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడిఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయిఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశద పర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుందిప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనేఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడితద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందనిఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడుహేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగాఅన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండేప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత వాదం సిద్ధాంతంలో పేర్కొంటాడుమార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీఎప్పటికీమన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.

ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూమానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసిందిమనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలిఆలోచనా సరళిజీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకుసహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయిమానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు,ఎవరెవరితో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయివీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనేసామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుందిఅందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్ఒక మజిలీ-లేదా దశ నుండిదానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించిసంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుందిసమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసిప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసిశ్రామిక రాజ్యస్థాపన ద్వారా వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తుంది.

మార్క్స్ ప్రవచనాలకుతదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యాచైనా విప్లవానికిశ్రామిక రాజ్య స్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమేవాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించాడువాల్మీకి రచించిన రామాయణం సృష్టికర్తైన బ్రహ్మ ప్రేరణతోనే జరిగింది-అంటే జగన్నాటక సూత్రధారి అనుమతితోనే కదారామాయణంలోని పాత్రలను-చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు వాల్మీకిశ్రీరామచంద్రమూర్తిని దైవంగామహావిష్ణువు అంశగాజరగబోయే దాన్ని వివరంగా, రామాయణ గాధగా లోకానికి తెలియచెప్పాడుశ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించిదుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసిధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించాడని తెలియచేసేదే రామాయణ కథశ్రీమహావిష్ణువుకు అత్యంత ఆప్తుడిగా-భక్తుడిగా-కాపలాదారుడిగా వుండే వ్యక్తి దైవానుగ్రహానికి గురైశ్రీరాముడికి శత్రువుగా-రావణాసురుడనే రాక్షసుడిగా పుట్టబోతున్నాడని ముందే ఊహించి రాసాడు వాల్మీకి.


మార్క్స్ గతితార్కిక-నిర్ధారిత సిద్ధాంతంలో పేర్లు లేకపోయినారష్యా-చైనాలో జరిగిన విప్లవాలకు నాయకత్వం వహించిన లెనిన్మావోలు మార్క్స్ పరిభాషలోని శ్రీరామచంద్రుడిలాంటివారే. రష్యా నిరంకుశ రాజు జార్ చక్రవర్తిచైనా చాంగ్-కై-షెక్ లు రావణాసురుడిలాంటి రాక్షసులుమార్క్స్ పరిభాషలోని నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థకు అధినేతైన మహా బలవంతుడు-రాక్షసరాజు రావణాసురుడు, "శ్రామిక వర్గంలాంటి బలహీన శక్తులైన నర వానరుల కూటమి ఉమ్మడి పోరాటంలో ఓటమి పాలయ్యాడుకూటమిని విజయపథంలో నడిపించింది నాయకత్వ లక్షణాలున్న యుద్ధ కోవిదుడు శ్రీరామచంద్రుడుఆయనకు తోడ్పడింది తమ్ముడు లక్ష్మణుడుఆచార్య లక్షణాలున్న హనుమంతుడిని ఏంగెల్స్ తో పోల్చవచ్చు.మార్క్స్ పరిభాషలో చెప్పుకోవాలంటేమావోలెనిన్చౌ-ఎన్-లైస్టాలిన్ శ్రీరామచంద్రుడు కోవకు చెందినవారుమార్క్స్ చెప్పిన "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్ రామ రావణ యుద్ధంలోనూ అన్వయించుకోవచ్చుమార్క్స్ కోరుకున్న "శ్రామిక-కార్మిక-కర్షక"రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన "రామ రాజ్యం". కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవత్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడువాల్మీకైనామార్క్సైనా వారి-వారి సాహిత్యాలలో దేశ కాల పరిస్థితులకనుకూలమైన మానవ విలువల పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చారు.

మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం అన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది. కథానాయకుడు సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తిత్రేతాయుగంలో ఆయన అవతరించి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి మానవ విలువలను కాపాడాడనేది సారాంశం. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతేమనలాంటి వారు అంధకారంలో పడిదురాచార పరులమైపోయిమానవ విలువలకు తిలోదకాలిచ్చేవారిమేమో.

శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుందిమార్పు జరగాలంటేఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడంవిరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడంఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరని చెప్పుకున్నాంస్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా తాటకను చంపాడు. వాల్మీకి రామాయణంలోని "వశిష్ట విశ్వామిత్ర యుద్ధం"బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు"ఆత్మ విద్యకుఅనాత్మవిద్యకు" మధ్య జరిగిన యుద్ధంసంపూర్ణంగా అనాత్మవిద్య అన్నీ నేర్చుకున్నప్పటికీవాడు,ఆత్మవంతుడిని గెలవలేడని స్పష్టమవుతుందివిద్యావంతుడి దౌష్ట్యంఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుందివశిష్టుడుఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు. వర్గపోరాటంలో కూడా,కార్మికవర్గ నియంతృత్వానికి పూర్వ రంగంలోతమ హక్కులకొరకు శ్రామికులు పోరాడుతారని మార్క్స్ అంటాడు. "సంకెళ్లు తప్ప కార్మికులు కోల్పోయేదేమీలేదు" అంటాడు మార్క్స్. దానర్థం: ఎదుటివారిని దెబ్బతీసేందుకన్నాతమను తాము రక్షించుకోవడమే ప్రధానమని. ఇదీ మానవ విలువలనే సూచిస్తుంది.

మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. విజ్ఞాన సముపార్జనకవసరమైన సూక్ష్మాతిసూక్ష్మ విషయాలకు సంబంధించిన ప్రతి అంశంసంస్కృతీ, సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీదనే ఆధారపడి వుండే రీతిలోనే మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులుసాహిత్యాభిలాషులుశాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురుశతాబ్దాల పూర్వమేమానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుందిమానవతావాదాన్ని రకరకాల పేర్లతో, ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనాశ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనేమానవ విలువలకు అర్థముంటుందిఅలా కానప్పుడుఏదో ఒక రూపంలోమానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుందిఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదుఏదేమైనామానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం మాత్రం సాహిత్యమేఅందులో సందేహం లేదు.

మతంభాషసాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికితన మూర్తిని భగవంతుడిలో, ఆయన మూర్తిని తనలో చూసుకుంటూతద్వారా క్రమశిక్షణతో మెలుగుతూతోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.

No comments:

Post a Comment