Thursday, March 7, 2019

కీలక పదవుల్లో అతివలు: వనం జ్వాలా నరసింహారావు


కీలక పదవుల్లో అతివలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
ప్రపంచ వ్యాప్త మహిళా సాధికారత
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (08-03-2019)
నెల్లూరు జిల్లా నుండి పదేళ్ళ క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడి, వ్యాపార రంగంలో అద్భుత విజయాలను సాధిస్తున్న ఒక మహిళా పారిశ్రామిక వేత్తను, ఇటీవల కలవడం జరిగింది. ఆమె ఎంచుకున్న వ్యాపారం కూడా ఆసక్తికరమైనదే. అందంగా, చక్కగా, ఆహ్లాదకరంగా కనిపించాలనుకునే స్త్రీ-పురుషులందరికీ ఆమె నెలకొల్పిన ఆ అందాల, అద్దాల హరివిల్లు సాదర స్వాగతం పలుకుతుంది. ఎందుకీ వ్యాపారంలోకి దిగావనీ, ఎలా విజయవంతం అయ్యావనీ ఆమెను ప్రశ్నిస్తే, వచ్చిన జవాబు ఆశ్చర్యకరంగా వుంది. ఒకప్పుడు, తనకు అవసరమైనప్పుడు ఒక వంద రూపాయలకు కూడా ఇతరులపై ఆధార పడాల్సి వచ్చిందనీ, పట్టుదలగా పనిచేసి, తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకున్న ఆలోచనే తనను ఇంత దాన్ని చేసిందనీ, ఆ విద్యాధికురాలు అత్యంత నమ్రతతో చెప్పినప్పుడు నాకనిపించింది ఒకటే..... ఏ కార్యం సిద్ధించాలన్నా, నెరవేరాలన్నా సాధన అవసరమని. సాధనకు మరోపేరు కృషి అంటారు. “కృషితో నాస్తి దుర్భిక్షం” అని అంటారు. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అని కూడా అన్నారు. వయసులో చిన్నదైనా పట్టుదలలో పెద్దదైన ఆ మహిళామణికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాంఆ నేపధ్యంలోసామాజికంగాఆర్థికంగా,రాజకీయంగాప్రపంచ వ్యాప్తంగా మహిళలు రాణించడంచాలా రంగాల్లో పురుషులను అధిగమించడం గత శతాబ్దంలోనుముఖ్యంగా ఈ శతాబ్దంలోను గమనిస్తున్నాంఇతర రంగాలకంటే కూడా,మహిళలురాజకీయంగా అంచలంచలుగా ఎదగడమే కాకుండాఅధికారంలోకి వచ్చిన పలు దేశాల్లోఅనేక సంస్కరణలకు శ్రీకారం కూడా చుట్టారుమహిళలకు ఓటు హక్కు ఇవ్వండి అని పురుషులను ఒకానొక నాడు అడిగిన ఆ మహిళలేఅనేక హక్కులను తమకుపురుషులకు కూడా కలిగించే స్థాయికి ఎదిగారుప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యంసమానత్వందినదినాభివృద్ధి చెందుతున్నదనడానికి ఇంతకంటే నిదర్శనం మరోటి లేదుఈ నేపధ్యంలోప్రపంచ వ్యాప్తంగాగత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో మహిళలు గణనీయంగా ఎదిగిపలు దేశాలకు అధ్యక్షులుగానోప్రధాన మంత్రులుగానో కావడంఅలా అయిన వారిలో కొందరు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందడం తెలిసిన విషయమే.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఒక మహిళ, 1960 లోసిరిమావో బండార నాయకేశ్రీలంక ప్రధాన మంత్రిగాఅధికారంలో రావడంతో అంతర్జాతీయంగా ఒక సంచలనం కలిగింది. ఎలా ఒక మహిళ ఆ ఉన్నత పదవిలోకి రాగలిగిందనిఎలా పాలన చేయబోతున్నదనిప్రపంచ వ్యాప్త చర్చ జరిగింది. ఆ తరువాత ఎందరో మహిళలుసుమారు వంద మందికి పైగా ప్రధానులుగాఅధ్యక్షులుగాఎన్నో దేశాల్లో అధికారం చేపట్టారు. ఇంకా అది కొనసాగుతూనే వుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచినట్లయితేఆ దేశ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలయ్యేది ఆమె. ఇక భవిష్యత్ లో పురుషాధిక్యత రాజకీయాలకు చాలా దేశాల్లో స్వస్తి చెప్పాల్సిందే. ప్రస్తుతంవర్తమాన ప్రపంచ దేశాల్లో సుమారు 20 మందికి పైగా దేశాధినేతలుగా వున్నారు. ఈ సంఖ్య పోను-పోను పెరుగుతుంది. ఇరవై-ఇరవై ఒకటో శతాబ్దాలలో గణనీయమైన సంఖ్యలో వివిధ దేశాల్లో ప్రధానులుగాఅధ్యక్షులుగా వున్న మహిళల్లో చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వారైనప్పటికీకొందరికి మాత్రమె తెలిసుండే అవకాశం కూడా వుంది. వారిలో కొందరు అతి తక్కువ కాలం అధికారంలో వుండగామరి కొందరు దీర్ఘకాలం పదవుల్లో వున్నారు. కొందరికి వారసత్వంగా లాభం చేకూరగామరికొందరు ఎన్నికల సమరంలో కొత్తగా దిగి గెలిచారు.

శ్రీలంక ప్రధాన మంత్రిగా సిరిమావో బండార నాయికే మూడు సార్లు ఆ పదవిలో వుంది. ఆ తరువాత ఆమె కూతురు చంద్రికా కుమార తుంగ కొంతకాలం అధ్యక్షురాలిగాప్రధానిగా వుంది. సెప్టెంబర్ 1959 లో భర్త హత్యానంతర పరిణామాలలో బండార నాయికే  రాజకీయాల్లోకి రావడంతన భర్త అడుగుజాడల్లో ఆయన సామ్యవాద విధానాలనే కొనసాగిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడంసానుభూతి కొరకు తరచూ కళ్ల నీళ్ల పర్యంతం కావడంఅప్పట్లో చర్చనీయాంశాలయ్యేవి. 1965 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమెతిరిగి 1970 లో గెలిచి రెండోసారి ప్రధాని అయింది. శ్రీలంక అధ్యక్షురాలిగా 1994 లో ఎన్నికైన కూతురు చంద్రికసిరిమావోను మూడోసారి ప్రధానిని చేసింది.


ఒక తరం పైగా భారతదేశంలో నెహ్రూ కుటుంబీకులుపాకిస్తాన్ లో భుట్టో కుటుంబీకులుబంగ్లాదేశ్ లో ముజిబుర్ రెహ్మాన్ కుటుంబీకులు అధికారంలో వున్నారు. 20 వ శతాబ్దపు విశ్వవిఖ్యాత మహిళ ఇందిరా గాంధీ భారత ప్రధానిగా రెండు విడతలుగా బాధ్యతలు నిర్వహించిందిమొదట తండ్రి మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా పదవిని చేపట్టిన ఇందిరశాస్త్రి హఠాన్మరణం తరువాత ప్రధాని పదవి దక్కించుకునిమొదటి విడతలో సుమారు 11 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసిందిఎమర్జెన్సీ విధించిప్రజల విశ్వాసాన్ని కోల్పోయి 1977 ఎన్నికల్లో ఓటమి పాలైందిఆమె ఓటమికి కారణమైన జనతా కూటమి రెండున్నర ఏళ్ల కన్నా ఎక్కువ అధికారంలో కొనసాగ లేకపోయింది. 1980 లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరో మారు ప్రధాని కాగలిగింది. 1984 లో దారుణ హత్యకు గురైందిగొప్ప రాజనీతిజ్ఞురాలిగా ప్రపంచ వ్యాప్త మన్ననలను పొందిందిబంగ్లాదేశ్ విమోచన కారణ భూతురాలైందిఅపర దుర్గగా, కాళికామాతగా ప్రతిపక్షాల మెప్పును కూడా పొందిందిఆమె కోడలు ప్రధాని కాలేకపోయినా అనధికారిక ప్రధానిగా పదేళ్లు యుపిఎ ఛైర్ పర్సన్ గా వుందిఆమె మరో కోడలు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రి. అలానే ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతిగా అరుదైన గౌరవం పొందారు. స్పీకర్ పదవిని అలంకరించిన మీరా కుమార్సుమిత్రా మహాజన్ ప్రపంచంలోనే అలాంటి పదవులు పొందిన అతి కొద్దిమందిలో ఒకరు.

ఇజ్రాయిల్ దేశం వ్యవస్థాపకుల్లో ఒకరైన గోల్డా మీర్మొదట్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూభర్తతో పాటు ఉద్యమంలో పాల్గొనేది. రాజకీయాలలో కూడా చురుగ్గా వుండేది. 1948 లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి అయింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సోవియట్ యూనియన్ లో ఇజ్రాయిల్ రాయబారిగా గోల్డా మీర్ ను నియమించింది ప్రభుత్వం. దరిమిలా దేశానికి తిరిగొచ్చిన ఆమె లేబర్ పార్టీ జనరల్ సెక్రటరీ గా వుండగాఅప్పటి ప్రధాని హఠాన్మరణంతోతన 70 వ ఏట, 1969 లో ఇజ్రాయిల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది. 1978 లో చనిపోయింది.

బ్రిటన్ మొట్టమొదటి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రసాయన శాస్త్ర పరిశోధకురాలిగాబారిస్టర్ గా పని చేసి, 1953 లో ఆ దేశ చట్ట సభ హౌజ్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైంది. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించింది. 1975 లో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికైంది. 1979 లో ప్రధాని పదవి వరించిందామెను. పటిష్ఠ నాయకురాలిగా పేరు తెచ్చుకున్న థాచర్అసంతృప్తిని అణచడంలో ఆరితేరిన మహిళగా ప్రసిద్ధికెక్కింది. 1990 లో ఆమె నాయకత్వాన్ని సవాలు చేసినప్పుడుప్రధానిగా రాజీనామా చేసిహౌజ్ ఆఫ్ కామన్స్ నుంచి కూడా తప్పుకుంది. 1982 లో అర్జెంటినా నుంచి ఫాక్ లాండ్స్ ను వెనక్కు తీసుకోవడానికి ఆమె సైన్యాన్ని పంపింది. ఆమె ప్రవేశ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్కరణలు నేటికీ పలు దేశాల్లో అమల్లో వున్నాయి. ఆమెను విమర్శించిన వారు సహితం వాటిని కొనసాగించారు. ప్రస్తుత బ్రిటీష్ ప్రధాని థెరెసా మేరీ మే బ్రిటీష్ రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. 

సూంగ్ సోదరీమణులుగా ప్రసిద్ధికెక్కిన చైనా దేశానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లుఆ దేశంలోని అత్యంత శక్తిమంతులైన ముగ్గురు ప్రముఖులను వివాహం చేసుకున్నారు. వాళ్లు జీవించిన కాలంలో ఆ ముగ్గురూ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కినవారే. అందరిలోకి పెద్దదైన సూంగ్ ఐ లింగ్అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన చైనా దేశపు ఆర్థిక మంత్రి హెచెచ్ కంగ్ ను పెళ్లాడింది. ఆమె తరువాత రెండో సోదరి సూం చింగ్ లింగ్ చైనా జాతి పితగా పేరుగాంచినపీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన సన్ యట్ సేన్ ను పెళ్లి చేసుకుంది. 1968 - 1972 మధ్య కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సంయుక్త అధ్యక్షురాలిగా, 1981 లో గౌరవాధ్యక్షురాలిగా పనిచేసిందామె. చివరి సోదరి సూంగ్ మే లింగ్ కూడా ఒక ప్రముఖ రాజకీయ వేత్త. ఆమె ఒకప్పటి చైనా అధ్యక్షుడైన చియాంగ్ కై షేక్ ను పెళ్లి చేసుకుంది. నవ చైనా రాజకీయఆర్థికవర్తమాన చరిత్రలో ఆ ముగ్గురు సోదరీమణులు ప్రముఖ పాత్ర వహించారు.

జుల్ఫికర్ అలీ భుట్టో కూతురు బేనజీర్ భుట్టోతండ్రి వారసురాలిగా, 1988–90, 1993–96 మధ్య కాలంలో రెండు పర్యాయాలు పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసింది. ప్రపంచంలోని ముస్లిం దేశాలలో ఆమె కంటే పూర్వం ఏ మహిళ కూడా ప్రధాని కాలేదు. బేనజీర్ కూ ఆ ఖ్యాతి దక్కింది. తండ్రిని ఉరితీసిన మూడేళ్లకు కేవలం 29 సంవత్సరాల వయసులోనేతండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ చైర్ పర్సన్ గా ఎన్నికైదరిమిలా 1988 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించిఆ దేశ ప్రధాని అయిందామె. 2008 ఎన్నికలకు రెండు వారాల ముందుఒక బాంబ్ పేలుడు సంఘటనలో మరణించింది బేనజీర్. 1991 - 1996, 2001 - 2006 మధ్య కాలంలో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైన బేగం ఖలీదాబేనజీర్ తరువాత ఇస్లాం దేశాలలో ఆ పదవిని చేపట్టిన రెండవ మహిళ. ఏడేళ్ల కింద అధికారంలోకి వచ్చిప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా వున్న షేక్ హసీనా వాజేద్ఆ దేశపు రెండవ మహిళా అధ్యక్షురాలు. బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ పెద్ద కూతురామె. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కొంతకాలం ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా కూడా పనిచేసింది హసీనా.

న్యూజీలాండ్ 37 వ ప్రధానిగా 1999 లో పదవిలో కొచ్చిన హెలెన్ ఎలిజబెత్ క్లార్క్ వరుసగా మూడు సార్లు 2008 వరకు ఆ పదవిలో కొనసాగింది. ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళా ప్రధాని హెలెన్. 2004 నుంచి 2010 వరకు మొజాంబిక్ అధ్యక్షురాలిగా వున్న లుఇసా డయాస్ డిఓగో ఆ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు. జర్మనీ రాజకీయ నాయకురాలు ఎంజెలా డొరోథియా మెర్కెల్ 2005 నుంచి ఆ దేశ ఛాన్స్ లర్ గా వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తూర్పు జర్మనీ ప్రభుత్వంలో ఆమె అంతకు ముందు అధికార ప్రతినిధిగా కూడా పనిచేసింది. కమలా పర్సాద్ బిస్సెస్సార్ 2010 నుంచి 2015 వరకు ట్రినిడాడ్-టొబాగోల ఏడవ ప్రధానిగా వుంది. ఆమె ఆదేశపు మొదటి మహిళా ప్రధాని. ప్రస్తుతం ఆమె ప్రతిపక్ష నాయకురాలు. 2010 నుండి 2013 వరకు ఆస్ట్రేలియా 27 వ ప్రధానిగా వున్న జూలియా ఐలీన్ గిల్లార్డ్ మొదట్లో ఉప ప్రధానిగా కూడా పదవిలో వుంది.

ఇలా ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో వుండడం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్ లో మరి కొన్ని దేశాల అధ్యక్ష-ప్రధాన మంత్రులుగా మహిళలే ఎన్నిక కావాలని కోరుకుందాం.

2 comments:

  1. >ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో వుండడం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్ లో మరి కొన్ని దేశాల అధ్యక్ష-ప్రధాన మంత్రులుగా మహిళలే ఎన్నిక కావాలని కోరుకుందాం.>>>

    తెలంగాణాలో మాత్రం మహిళలకు పదవులు శూన్యం.

    ReplyDelete
  2. మంచి వ్యాసం. దయచేసి ఇది మీ ముఖ్యమంత్రి గారి చేత ఒకటి రెండు మార్లు చదివించగలరా? కనీసం ఒక్క మహిళామణికీ మంత్రిపదవి ఇవ్వటానికి మీనమేషాలు లెక్కించే ముఖ్య మంత్రిగారు అప్పటికైనా కాస్త కళ్ళు తెరుస్తారేమో మరి.

    ReplyDelete