Tuesday, December 20, 2011

1969 జై తెలంగాణ - 1973 జై ఆంధ్ర: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 13
1969 జై తెలంగాణ - 1973 జై ఆంధ్ర
వనం జ్వాలా నరసింహారావు


(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదమూడవ అధ్యాయం ఇది).


1930వ దశకంలోనే దేశాన్ని భాషా ప్రాతిపదికన పునర్విభజించి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, జాతీయోద్యమం తీర్మానించింది. దక్షినాదిన, విశాలాంధ్ర, ఐక్య కేరళ, మహా కర్నాటక, బృహన్మహారాష్ట్రలు ఏర్పాటు చేయాలనీ, అవిభక్త కమ్యూనిస్ట్ ఉద్యమం భావించింది. ఆ ఆలోచనతోనే, 1946 లో పుచ్చలపల్లి సుందరయ్య గారు, "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అన్న పేరుతో పుస్తకం రాశారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పరిచేందుకు ఆ పుస్తకంలో పలు సూచనలు చేశారు. 1946లో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా, సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో తెలంగాణా జిల్లాల నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు నరసింహా రెడ్డి, భీమిరెడ్డి నరసింహా రెడ్డి, ఆరుట్ల దంపతులతో పాటు, ఆంధ్ర జిల్లాల నుండి సుందరయ్య, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, లావు బాలగంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి తదితర నాయకులతో సహా వేలాదిమంది ఇరు ప్రాంతాల కార్యకర్తలు భుజం-భుజం కలిపి 1951 వరకు వీరోచిత పోరాటం చేశారు. నాలుగువేల మందికి పైగా ప్రాణాలను అర్పించారు. సెప్టెంబర్ 17, 1948 న నిజాం హైదరాబాద్ రాష్ట్రం - సంస్థానం భారత యూనియన్లో్ విలీనం కావడం, 1953లో భాషా ప్రాతిపదికన విభజన జరగడం, 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడం అందరికీ తెలిసిన వర్తమాన చరిత్ర.


1953 లో తెలంగాణ కోసం కొందరు గొంతు విప్పినా, "సమైక్యాంధ్ర సదస్సు" ఉమ్మడి పార్టీ ఏర్పాటు చేసింది. అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. దానికి శ్రీశ్రీ ప్రధాన ఆకర్షణ. ఖమ్మం నుండి సదస్సుకు హాజరైన చాలా మందితో పాటు డాక్టర్గా్రు కూడా పాల్గొన్న నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.


1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉదృతంగా మొదలైంది. ఖమ్మం పట్టణం గాంధీచౌక్లోక అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహారదీక్షకు పూనుకోవడం ఉద్యమానికి నాందిగా చెపుతారు. అతని కుటుంబం వెంగళరావుకు అనుచర వర్గమన్నది వాస్తవం.

ఉద్యమానికి ఆ నాటి ప్రముఖ తెలంగాణ నాయకుడు, కె.వి. రంగారెడ్డి అల్లుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. హైదరాబాద్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యమం గ్రామ సీమల్లోకి పాకక పోయినా, నగర - పట్టణ ప్రాంతాలలో విద్యావంతులను ఆకట్టుకుంది. సహజంగానే, అనేక సంఘ వ్యతిరేక శక్తులు ఉద్యమంలో వచ్చి చేరాయి. నగరంలోని సీమాంధ్ర వ్యాపారులపై దాడులు, విధ్వంసం చోటు చేసుకున్నాయి. ఆంధ్ర జిల్లాల నుండి రోడ్లపై వచ్చే వాహనాలను ఆపి, వారిని హింసించడం, మహిళలను అవమాన పర్చడం జరుగుతూ వచ్చాయి. నగర గోడలపై ఆ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై అశ్లీల రాతలు వెలిశాయి.

ఖమ్మంలో జులై నెల 6, 1969న సిపిఎం ఆధ్వర్యాన వర్తక సంఘం భవనం ఆవరణలో సమైక్యతా సభ జరిగింది. మునిసిపల్ చైర్మన్ చిర్రావూరి లక్ష్మీనరసయ్యగారి అధ్యక్షతన నిర్వహించిన ఆ సభలో, శ్రీ శ్రీ, వావిలాల గోపాలకృష్ణయ్య, గోరా, మాదిరాజు రాంకిషన్రా వు, కొలిపాక కిషన్రాహవు, పెరవల్లి వెంకట రమణయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మోటూరి హనుమంతరావు, సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, సమైక్యతను సమర్థిస్తూ ఉపన్యసించారు. సదస్సు తరువాత, సాయంత్రం నాలుగు గంటలకు మూడువేల మందితో ఊరేగింపు మొదలైంది. ఊరేగింపును అడ్డుకున్న వారికి బి.ఎన్. గారి నాయకత్వాన తగిన సమాధానం చెప్పారు. బి.ఎన్. స్వయంగా ఎర్ర జెండా కర్రతో దుండగులను తరిమి కొట్టిన సంగతి గుర్తు చేసుకున్నారు డాక్టర్గానరు. ప్రత్యేక తెలంగాణలోని మొత్తం జిల్లాలలో సమైక్యత కోసం సిపిఎం చేసిన మొదటి ప్రయత్నం ఇది. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా సమైక్యతా వాద సదస్సులు జరిగాయి.

ఖమ్మంలోని సిపిఎం జిల్లా నాయకత్వం డాక్టర్ వై.ఆర్.కె ఆసుపత్రి, ఇల్లు రక్షణకై చర్య తీసుకుంది. చిర్రావూరి లక్ష్మీనరసయ్య గారి సూచనతో 10-15 మంది పార్టీ కార్యకర్తలు రేయింబవళ్లు కాపలా కాసిన వైనం డాక్టర్గాిరు మరిచి పోలేమన్నారు. అదే సంవత్సరం నిర్వహించాల్సిన పియుసి పబ్లిక్ పరీక్షలు జరగరాదని వేర్పాటువాదుల ప్రయత్నం. 50 మంది మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు ఉదయం నుండి, పరీక్షా కేంద్రమైన సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్ ముందర కాపలాగా నిలబడి ఆ మూడు రోజులు, పరీక్షలకు ఆటంకం కలగకుండా చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులలో డాక్టర్గా,రి పెద్ద కుమారుడు కూడా వుండి, తరువాత ఉత్తీర్ణుడైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు డాక్టర్గాలరు.

సమైక్యాంధ్ర అవసరాన్ని నొక్కి చెపుతూ, ప్రజలలో అవగాహన కలిగించడానికి సిపిఎం అనేక కరపత్రాలను వేసిందన్నారు. మోటూరి హనుమంతరావుగారి పుస్తకం "విశాలాంధ్రలో విషాదచ్ఛాయలు" ప్రస్తావన తెచ్చారు. అనేక వివరాలతో రాసిన ఆ పుస్తకం వేల కాపీలు రాష్ట్రం మొత్తం పంచబడింది. తెలంగాణలోని ఇతర జిల్లాలలో కూడా పార్టీ ఆధ్వర్యాన సదస్సులు, సభలు జరిగాయని చెప్పారు.

1973 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర జిల్లాలలో "జై ఆంధ్ర ఉద్యమం" ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున సాగింది. ఆ సమయంలోను, మార్క్సిస్టు పార్టీ దానికి వ్యతిరేకంగా తిరిగి పెద్ద ఎత్తున ప్రచార సాహిత్యం వెలువరించింది. సభలు నిర్వహించింది. వాటిలో భాగంగానే, బోనకల్లు - చిల్లకల్లు రోడ్డులో వున్న మక్కపేట గ్రామంలో, సభ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి మానికొండ సుబ్బారావు, ఖమ్మం జిల్లా పార్టీ పక్షాన డాక్టర్ వై.ఆర్.కె ఉపన్యాసకులుగా వెళ్లారు. కృష్ణా జిల్లా జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు (1983-1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోం మంత్రి), వారి శిష్య గణం సభా ప్రాంగణం చుట్టూ రాళ్లు పేర్చుకుని తెలంగాణ ప్రతినిధి డాక్టర్ వై.ఆర్.కె ప్రసంగిస్తుండగా రాళ్లవర్షం కురిపించడం మొదలుపెట్టారు. బందోబస్తులో వున్న పోలీసు బృందం సమయస్ఫూర్తితో తగు రక్షణలు కలిగించారు.

ప్రత్యేక వాద ఉద్యమాలపట్ల, ఆ నాడు మార్క్సిస్టు పార్టీ తీసుకున్న క్రియాశీల వైఖరికి ఈ ఉదాహరణలు నిదర్శనాలుగా డాక్టర్గా రు పేర్కొన్నారు.

2001-2010 మధ్య సాగిన - తరువాత సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎడల పార్టీ వైఖరికి, 1969-73 మధ్య తీసుకున్న వైఖరికి చాలా తేడా కనిపిస్తుందంటారు డాక్టర్గాంరు. ఈ వైఖరికి బహుశా కారణం, ఈ సారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం "లో కీ" తో ప్రారంభం కావడం వల్ల కావచ్చు, అది పెద్దగా మాటల యుద్ధంగా వుండడం వల్ల కావచ్చు, లేక వివిధ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పార్టీ 2004 లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి కావడం వల్ల కావచ్చు, తిరిగి 2009 ఎన్నికలలో కాంగ్రెస్కుట వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితితో కూడిన గ్రాండ్ అలయెన్స్ లో భాగస్వామి కావడం కావచ్చు. ఏదేమైనా వెనుకటి క్రియాశీల పాత్ర సిపిఎంలో లోపించిందంటున్నారు డాక్టర్గా రు. దాంతో పాటు, 2004 లో ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ప్రాతినిధ్యం నిరాకరించడం; తాము సమైక్యాంధ్రకు సైద్ధాంతికంగా కట్టుబడి వున్నామని చెప్పడం వరకే పరిమితం కావడం; కొంత మంది నాయకులు "తమ పార్టీ చిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపే శక్తి లేదనీ" అనడం; బాధ్యత కాంగ్రెస్ది్, కాగా, తాము అడ్డుపడుతున్నామని ప్రచారం చేయడం "తమ పార్టీ భుజాన తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం తప్పు" అనడం; చివరకు "కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామంటే మేం వద్దన్నామా?" అని, "మేం వ్యతిరేకించమనీ" ఇచ్చే ప్రకటనలు, మార్క్సిస్టు పార్టీయే తరులు - అటు తెలంగాణ ప్రాంతం వారైనా, ఇటు ఆంధ్ర ప్రాంతం వారైనా - అపహాస్యం చేసే పరిస్థితికి చేరుకోవడం డాక్టర్గా రిని బాధకు గురిచేసింది. ఇది విచారించ దగ్గ ఐరనీ అనిపిస్తోందన్నారు. 

ఇటీవల భోనగిరి, నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసులపైన, వారి ఏకైక శాసన సభ్యుడి (మిర్యాలగూడ) ఇంటిపైన టిఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసే సాహసం మామూలు పరిస్థితులలో ఊహించ రానిదంటారాయన. పైగా ఆ ఘటనల పట్ల ఖండన - మండనలు నిరోధించడంలో ఆ పార్టీకి సహజమైన "మిలిటెన్సీ" లోపించిందన్నారు డాక్టర్గాతరు.

ఏదేమైనా, 2011 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సమర్థన అస్తిత్వవాద రాజకీయాలలో (Identity Politics) వుందంటారు డాక్టర్‌గారు. ప్రాంతీయ అస్తిత్వ వాదం అనీ, ఈ సిద్ధాంతానికి మూలాలు పోస్టు మోడర్నిజంలో వున్నాయనీ, విజ్ఞులందరికీ తెలుసు. పోస్టు మోడర్నిజం అనేది సైద్ధాంతికంగా "యాంటీ మార్క్సియన్" అని చాలామందికి తెలుసు. ఇది ప్రాంతీయ కుల-జెండర్ వాదాలకు దారితీస్తుంది. ఈ నేపధ్యంలో ఆంగ్ల భాషలో వచ్చే మార్క్సిస్టు త్రైమాసిక పత్రికలో (ఇటీవల) డాక్టర్‌గారు చదివిన రెండు చక్కటి వ్యాసాలను ప్రస్తావించారు. ఒకటి ప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి ఇంతియాజ్ అహ్మద్ రాసిన ఇరవై పేజీల విపులమైన వ్యాసం. అదే సంచికలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ వ్యాసం కూడా ఆ అంశంపైనే వుందన్నారు. ఆ రెండు వ్యాసాలు, ప్రస్తుత వేర్పాటు ఉద్యమ వాతావరణంలో, వామపక్ష ఆలోచనలు వున్నవారికి చాలా ఉపయోగకరంగా వుంటాయని చెప్పారు. వాటిని తెలుగులోకి అనువదించి, ప్రచారంలోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అనీ, ఎందుకో వెనుకబడ్డాం లేదా సంశయించాం అనీ అభిప్రాయపడ్డారు.

"ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐదీ, సిపిఐ(న్యూ డెమాక్రసీ)దీ అత్యుత్సాహంగా వుంటే, మాది నిరుత్సాహంగా, నిర్లిప్తంగా వున్నట్లు తోస్తుంది” అని ముగించారు డాక్టర్‌గారు ఈ అంశంపై.

No comments:

Post a Comment