Saturday, August 6, 2016

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు-2 : వనం జ్వాలా నరసింహారావు

(Recovered and Reloaded)

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు-2
సూర్య దినపత్రిక (24-04-2016)
వనం జ్వాలా నరసింహారావు

          శ్రీ రామాయణం క్షీర ధారవాసుదాసుగారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణంమందరాలన్నీమందార మకరంద మాధుర్యాలే.కవికులగురువు కాళిదాసు అన్నట్లు."చరిత్ర మా రాముడిదిరచన సాక్షాత్తు వాల్మీకులవారిదిగానం చేసినవారు కిన్నెర గాత్రులైన కుశ లవులుఇంతటి మహనీయమైన రామాయణ కావ్యంలోశ్రోతలను పరవశింప చేయని అంశం అనేదేదీ లేదు.

            భగవద్గీతశ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రంశ్రీ రామాయణం భారతీయ సంస్కృతీ రూపాలుసనాతన ధర్మ ప్రతిపాదకాలువీటి మౌలిక తత్వాలు ధర్మ-జ్ఞానాలుఈ రెండింటినీ వాచ్య-వ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోందివాల్మీకి ఆదికవిరామాయణం ఆదికావ్యంఇది ధ్వని-అర్థ ప్రతిపాదిత మహా మంత్రపూతంగాయత్రీ బీజసంయుతంఉపనిషతత్వసారం.స్మరణ-పారాయణ మాత్రంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది.

            వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగాపూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసుగారుఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీతెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయికానీకాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. రామాయణానికి రచయిత ఒక్కడేవాల్మీకి మహర్షి తప్ప ఇతరులెవరికీ రామాయణం రచయిత అని చెప్పుకునే హక్కులేదనే అనాలి. వాసుదాసుగారు కూడా వ్యాఖ్యాతననే అంటారు తన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి.

            వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి "మందర"మకరందాలనూరమా రామ పారమ్య పీయూషాలనూనాలుగు చెరగులా పంచిఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్నివేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించిఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లంచేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి"వాసుదాస స్వామి. "రామ భక్తి సామ్రాజ్యం యే మానవుల కబ్బెనో మనసా! ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమేఅన్న త్యాగరాజ స్వామి వారి కీర్తనకు సాకార దివ్య స్వరూపులు వాసుదాస స్వామిఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి అవతరించి వున్న కాలంలోవారి దర్శన-అనుగ్రహ భాషణా సౌభాగ్యమబ్బిన వారు"శ్రీ మద్రామాయణం-మందరం" పారాయణ పరులై,తమ పరంపరకు శ్రీ వాసుదాస స్వామి గారి దివ్య స్మృతులను అందించి తరించారువాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్ట మొదలు ఆంధ్రీకరించిపదే-పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల ఆంధ్రులకు అత్యుత్సాహాన్ని కలిగించి, "రామ భక్తి సామ్రాజ్యంఅంటేఆంధ్ర దేశమే సుమా,అనిపించిన నిరుపమ రామ భక్తులు వాసుదాస స్వామివారు.

                        ఇరవైనాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణంమహా మహానుభావులూమహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసుగారువాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపివాల్మీకాన్ని తెనిగించారువాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ,తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించితదనంతరం, "మందరంఅని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారుఆంధ్ర పాఠక లోకం మందరాన్ని అపారంగా అభిమానించింది-ఆదరించింది.

            వాసుదాసుగారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం.ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యధా మూలాలు లేవనిఅర్థ పూర్తి కలిగికావ్య-ఇతిహాస గౌరవ పాత్రమైసర్వజన పఠనీయమై,ప్రామాణికమైమూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించిరచించించారీ గ్రంథాన్ని వాసుదాసుగారు.ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించిఅలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేసారు .ఆయన రచించిన నిర్వచన రామాయణంఆయన జీవిత కాలంలోనే,నాలుగైదు సార్లు ముద్రించబడిందిఆంధ్ర వాల్మీకి రామాయణం బాల కాండలో,తన స్వవిషయం గురించి ప్రస్తావిస్తూ వాసుదాసుగారుసంస్కృత రామాయణాన్ని శ్రీరామచంద్రుడి కుమారులైన కుశ-లవులు లోకానికి ప్రకటించినట్లేతనకూ ఆయన కుమారుడిగాఅలాంటి అధికారం వుందని,అయితే సంకల్పించడం మాత్రమే తన వంతని-నిర్వహించడం శ్రీరాముడి వంతని,పూర్తిచేయించే భారం ఆయన భుజాలపైనే వేస్తున్నాననిఆయన వలదన్నా వదలనని చెప్పుకుంటారు.


            వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటేసంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని మిత్రులంటారాయనతోమూల గ్రంథం రాయడంకంటే వ్యాఖ్యానం రాయడం కష్టమనుకుంటారాయన మొదట్లోబాగా ఆలోచించిన తర్వాత, (శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం) "మందరంపేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు వాసుదాసుగారువాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథంసరికొత్త విజ్ఞాన సర్వస్వం."మందరం"అంటేక్షీరసాగరాన్ని మథించడంలో కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే గుర్తుకొస్తుంది సాధారణంగా ఎవరికైనాకాని,వాసుదాసుగారి శ్రీపాద సంబంధులకు మాత్రం, "మందరంఅంటేమొదట గుర్తుకొచ్చేదిఆంధ్ర వాల్మీకి రామాయణం మందరమేవాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీవారు, "క్షీరవారాసిగా సంభావించిదానిని మధించిన తమ"మేథఅందించిన మకరందాలను-మధురిమలనుముచ్చటగా "మందరం"అని పేర్కొన్నారుసహృదయ నైవేద్యంగా-అనుభవైక వేద్యంగా వచ్చిన రచనలకు అసాధ్యంగా-నిగమ గోచరంగా భావించబడిన రామాయణానికి"మందరంఅని నామకరణం చేయడంలో తను కొంతవరకే న్యాయం చేయగలిగానని అంటారాయనఇందులోంచి చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయనిభావితరాలవారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసుదాసుగారు.

            తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు వాసుదాసుగారుమందరంలో తను రాసిన ప్రతి పద్యానికిప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారుఒక్కో పదానికున్న వివిధార్థాలను విశదీకరించారుభావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారుఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసికి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుందిఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలుఉత్పల మాలలుసీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలుమత్తేభాలు మాత్రమే కాకుండాతెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీసందర్భోచితంగా ప్రయోగించారువాటిలో, "మత్తకోకిలము", "పంచ చామరం", "కవిరాజ విరాజితము", "తరలము", "ప్రహరణకలిత", "సుగంధి", "ఉత్సాహం", "మనోహరిణి", "వనమయూరము", "తోటకము", "మానిని", "ఇంద్రవంశము", "లయగ్రాహి", "తోదకము", "మాలిని", "కలితాంతము", "మధురగతిరగడ", "వనమంజరి", "కమల విలసితము", "వసంతమంజరి", "మంజుభాషిణి", "స్రగ్ధర", "వసంతతిలక", "మాలి", "కరిబృంహితము", “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విని", "మనోరంజని", “హ్లాదిని”,"వంశస్థము", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మణిమంజరి", "మంగళ మహాశ్రీ వృత్తం""మందాక్రాంత" లాంటివెన్నో వున్నాయిద్విపదలూ వున్నాయిదండకం కూడా వుందో సందర్భంలో.ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందో యతులను ఉపయోగించారో కూడా వివరించారువీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.

            వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది.ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వంప్రతి కాండలోనిప్రతి పద్యానికిప్రతి పదార్థం ఇస్తూచివరకు తాత్పర్యం రాస్తూఅవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూసాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవిప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారుశ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే,ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండాసకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుందిఒక సారి ధర్మశాస్త్రం లాగాఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా,మరో చోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘికసామాజికఆర్థికసామాన్యనీతిసంఖ్యా,సాముద్రికకామరతిస్వప్నపురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది.బహుశాక్షుణ్ణంగా చదివితేఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి.అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటేమందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినాఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుందిడాక్టరేట్ తో పాటుఅద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయిపాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చుపరిశోధనా దృక్ఫదంతో చదివితేప్రతి కాండ చివర వాసుదాసుగారు రాసిన ఆఖరు పద్యంలోఆ కాండలో వున్న మొత్తం పద్యాలెన్నో తెలియచేసే పంక్తులుంటాయి.

            ఆంధ్ర వాల్మీకిరామాయణం రాయడానికి ప్రేరణ-స్ఫూర్తిభాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసుదాసుగారుపోతనను కరుణించిన శ్రీరామచంద్రమూర్తిఆయనతో భాగవతాన్ని తెనిగింపచేసి భవ బంధ విముక్తుడిని చేసాడనిఅందుకే,పలుకుపలుకులో తేనెలొలికించివ్యాస భాగవతాన్ని మరిపించగలిగాడని వాసుదాసుగారి అభిప్రాయంఆ విధంగానేశ్రీరాముడి కరుణ తనపైన కూడా ప్రసరించిందని వాసుదాసుగారు భావించి వుండాలితద్రూపమే ఆంధ్ర వాల్మీకం.వాల్మీకాన్ని ఆమూలాగ్రంగా పరిశోధించిన పరమ భాగవతోత్తముడు వాసుదాసస్వామి.108సార్లు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని పఠించి-పారాయణం చేసిపట్టాభిషేకాలుసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించిన ఏకైక మహానుభావుడు వాసుదాసస్వామి.

            తనకంటే ముందు కాలం నాటి పూర్వ కవులెవరురామాయణాన్ని(పూర్వ కాండలుఉత్తర కాండ కలిపిసంపూర్ణంగా తెనిగించలేదని గ్రహించిన వాసుదాసుగారుఅన్ని కాండలను తెనిగించివిశేషించి తెలుగు పాఠక లోకానికి ఆవిష్కరించాలని సంకల్పించుకున్నారు."వాల్మీకిరామాయణాన్ని సమగ్రంగాయథామూలంగా పలికినవారు పూర్వ కవులందూ-నేటి (ఆయన కాలం నాటికవులందూ లేరునేటి (ఆయన కాలం నాటిరామాయణాలలో మూలానుసరణంగా వుందిసమగ్రం కాదుసమగ్రమయింది మూలాను సరణం కాదుతమ అభిప్రాయాలనుఇతరుల అభిప్రాయాలను మూలంగా చేర్చిపెడితేఅది వాల్మీకి పలికిందెలా అవుతుంది?" అని ప్రశ్నించాడు వాసుదాసుగారు.

            భగవత్ చరిత్రలెన్నో వుండగా రామాయణ రచనకే ఎందుకు పూనుకున్నావని అడిగినవారికి తనదైన శైలిలో జవాబిచ్చారు వాసుదాసుగారుజనన-మరణ రూపకమైన సంసార బంధం నుండి విముక్తి చేసేది రామ కథేననిభగవత్ సాయుజ్యం పొందేందుకు రామాయణ రచన చేసానని అంటారాయనపూర్వం కొందరు రాసారుకదామరల ఎందుకు రాస్తున్నావంటే, "ఎవరి పుణ్యం వారిదేఒకరి పుణ్యం మరొకరిని రక్షించదు"అని జవాబిస్తూశ్రీరాముడి అనుగ్రహం కొరకు రామాయణాన్ని రచించి వాగ్రూపకైంకర్యం చేయదల్చానంటారు వాసుదాసుగారు.

            భారద్వాజ గోత్రీకుడుఆపస్తంబ సూత్రుడుగోల్కొండ వ్యాపారి శాఖీయుడయిన వావిలికొలను సుబ్బారావుగారుకడప జిల్లా-జమ్మలమడుగులో 1863 లో జన్మించి 1939 లో పరమపదించారుఎఫ్.ఎ చదువు పూర్తిచేసిపొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి,రెవెన్యూ ఇన్స్పెక్టర్ హోదాకెదిగారుఆ విధంగా 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు మొదట్లోకందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాతమద్రాస్ (నేటి చెన్నైప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేసారు.వాసుదాసుగారి తర్వాత ఆ పదవిని అలంకరించింది అక్కిరాజు ఉమాకాంతం గారుకళాశాలలో చేరక ముందేపినతండ్రి మీద తనకున్న కృతజ్ఞతకు గుర్తుగా, "శ్రీ కుమారాభ్యుదయంఅనే ప్రబంధ గ్రంథాన్ని రచించిఆయనకు అంకితమిచ్చి శాశ్వత స్వర్గ సుఖాన్ని కలిగించారాయనకుఆయన రచించిన ఆ ప్రబంధంనాటి కవి పండితులను ఆశ్చర్య పరిచిందిఆయన ప్రతిభకది తొలి హారం.


            ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యా వియోగం కలగడంతో, వాసుదాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం1900-1908 మధ్య కాలంలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేసారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసుదాసుగారు, గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.


No comments:

Post a Comment