Thursday, April 4, 2019

ఓటింగ్ నిర్వహణలో సుదీర్ఘ ప్రక్రియ అవసరమా? : వనం జ్వాలా నరసింహారావు


ఓటింగ్ నిర్వహణలో సుదీర్ఘ ప్రక్రియ అవసరమా?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (05-04-2019)
అత్యధిక జనాభాతోఅతి పెద్ద  ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరొందిన భారతదేశం  ప్రపంచంలో అత్యంత భారీ స్థాయి ఎన్నికలు జాతీయ స్థాయిలో ఐదేళ్లకోసారి నిర్వహించడం జగమెరిగిన విషయం. 2014 లో జరిగిన 16వ సాధారణ ఎన్నికల్లో దాదాపు 83.4 కోట్ల మందికి ఓటు హక్కుందివీరికొరకు, 9,27,553 పోలింగ్ స్టేషన్లను, 543 నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసింది ఎన్నికల కమీషన్ఆ ఎన్నికల్లోఇండిపెండెంట్లతో సహా 465 రాజకీయ పార్టీలకు చెందిన 8251 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 10 విడతలుగా జరిగాయి ఈ భారీ ఎన్నికలు. 2019 లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా సుమారు 10 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎన్నికల కమీషన్. సుమారు 90 కోట్ల మంది ఓటర్లున్నారు దేశవ్యాప్తంగా.

భారత దేశానికి స్వాతంత్ర్యం రావటంతోవయోజన ఓటు హక్కు ప్రాతిపదికగామొట్ట మొదటి సాధరాణ ఎన్నికలు దేశవ్యాప్తంగా 1951-52 లోలోక్ సభకు,  రాష్ట్ర శాసన సభలకు ఏకకాలంలో నిర్వహించటం జరిగిందిఅప్పట్లో 21 సంత్సరాలు (నేడు అదే 18 సంవత్సరాలకు తగ్గించారు) దాటిన ప్రతి పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోడానికి అర్హులేఓటరు నమోదు ప్రక్రియ అధిక వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్వర్తించాల్సి వచ్చింది అప్పట్లోఅప్పట్లో ఒటర్ల సంఖ్య 17.3 కోట్లు. ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయడంతో సెప్టెంబర్ 10,1951లో మొదలైన ఎన్నికల ప్రక్రియ జూన్ 4, 1952 తో ముగిసింది.  తొలి లోక్ సభ మొత్తం 499 సీట్లకు గాను ఎన్నికలు జరిగిన 489 సీట్లలో 72 స్థానాలను ఎస్సీలకు, 26 స్థానాలను ఎస్టీలకు కేటాయించారప్పట్లో. మొత్తం 1874 మంది పోటీ చేసారుఅదేవిధంగా 3,283 శాసనసభ స్థానాలకు వివిధ రాష్ట్రాల నుండి 15,361 మంది అభ్యర్థులు నిలబడటం జరిగిందిప్రపంచ దేశాలు ఈ ఎన్నికల ఆశక్తిగా తిలకించాయి

సుదీర్ఘ ఎన్నికల చరిత్రలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవియంలే నవీన బాలెట్లుగా మారాయివీటిని ఉపయోగంలోకి తేవడం ద్వారా ద్వారాఎన్నికల్లో భారీ సామాగ్రి రవాణా తప్పడంవ్యయం కూడా కుదించబడడంమానవ వనరుల అవసరం తగ్గడంచెల్లని వోట్లకు-దొంగ ఓట్లకు ఆస్కారం లేకపోవడంఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగవంతం కావడం జరిగింది. ప్రయోగాత్మకంగా ఈ పద్దతిని ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం, 2004లో జరిగిన 14వ సాధరణ ఎన్నికల్లో అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో ఉపయోగించారుఇటీవలి కాలంలో వీటి ఉపయోగం మీద దుమారం చెలరేగి ఇవి వద్దనీ బాలెట్ పద్ధతే మళ్లీ రావాలని డిమాండ్ పెరిగింది.

           ఈ నేపధ్యంలో, మరోమారు లోక సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ దరిమిలా నామినేషన్ల ఘట్టం-ఉప సంహరణ ఘట్టం విడతలవారీగా జరుగుతున్నది. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఎన్నికలు ఏప్రిల్ 11 న జరుగుతాయి.  ఎన్నికల నిర్వహణ వ్యయం కోట్లల్లోనే వుండవచ్చుపోటీ చేస్తున్న అభ్యర్థుల అధికారిక-అనధికారిక వ్యయంకూడా కోట్లలోనే వుండే అవకాశాలు కాదనలేంనల్ల ధనం ఎంత ఖర్చు కానున్నదనేది ఎవరికీ అంతు చిక్కని విషయం.  దీనిని కట్టడి చేయడానికి ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నాగత అనుభవాల నేపధ్యంలో పూర్తిగా నివారించడం కష్టమే“తిలా పాపం తలా పిడికెడు” అన్నట్లు, ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు అంతో-ఇంతో పాత్ర వుంటుందిఎవరినీ తప్పు పట్టడానికి వీల్లేని పరిస్థితిదీనికంతటికీ ప్రధాన కారణం "సుధీర్ఘ ఎన్నికల ప్రక్రియ"  సుధీర్ఘ ప్రక్రియ లేకుండా ఎన్నికలు జరిపించే ప్రయత్నాలు అప్పుడప్పుడు జరిగినా అవి ఫలించలేదుఇప్పుడు ఈ సారి జరగబోయే ఎన్నికల విషయంలోనైనా ఈ సుదీర్ఘ ప్రక్రియను కుదించే సంస్కరణ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా, లేదా, యధా ప్రకారం పాత పద్ధతినే అవలంబిస్తుందా అంటే బహుశా ఇప్పుడున్న పరిస్థితుల నేపధ్యంలో మార్పు వుండక పోవచ్చుప్రజాస్వామ్యం బలపడాలంటేఎన్నికలలో అవినీతి తొలగిపోవాలంటేనల్ల ధనం ఖర్చు తగ్గాలంటేఎప్పుడో ఒకప్పుడు ఈ పద్ధతి మారక తప్పదుసుదీర్ఘ ప్రక్రియను కుదించక తప్పదు.    

            సాధారణ ఎన్నికలకైనారాష్ట్ర శాసనసభ ఎన్నికలకైనాస్థానిక సంస్థల ఎన్నికలకైనాసంబంధిత ఎన్నికల అధికారి ఎన్నికల తేదీలు ప్రకటించడంతో మొత్తం ప్రక్రియ ప్రారంభమవుతుందిఓటర్ల జాబితా ప్రకటించడం ఎన్నికల ప్రక్రియలో మరో ప్రధాన ఘట్టంతేదీల ప్రకటనతోనే "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్అమల్లోకి వస్తుందిఈ బూచిని సాకుగా చూపించిప్రభుత్వం ప్రకటించిఅమలు చేయాలనుకున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగించడం మొదలవుతుందిఫలానా పార్టీ కోడ్ ఉల్లంఘించిందని ప్రత్యర్థులు పిర్యాదు చేయడం నిత్య కృత్యమై పోతుందిఇలా చేయడం ఎంతవరకు భావ్యమో అనే విషయాన్ని నిశితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం వుందిరాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా ఏదో ఒక రకమైన మోడల్ కోడ్ అమల్లోకి తెస్తున్నారు ఇటీవలఆ మాటకొస్తేదేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నిక జరుగుతే మోడల్ కోడ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా అమలు చేయాల్సి వస్తుందేమో

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంనామినేషన్ల ఘట్టంబీ ఫారాలు రిటర్నింగ్ అధికారులకు అందచేయడంస్క్రూటినీఉపసంహరణప్రచార పర్వంఓటింగ్ఓట్ల లెక్కింపుగెలిచిన అభ్యర్థుల పేర్ల ప్రకటన....ఇవన్నీ ఎన్నికల సుదీర్ఘ ప్రక్రియలో భాగమేఇంత సుదీర్ఘ ప్రక్రియ వల్లనే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుందిసీలింగ్ అనేది నామ మాత్రంగా మిగిలిపోయిందిఈ పరిస్థితి మారాలిఓటింగ్ విధానంలో కూడా ప్రస్తుతం అనుసరిస్తున్న పోలింగ్ బూత్‌లకు వెళ్లిక్యూలో నిలబడిగంటల తరబడి వేచి చూసిఓట్ వేసే పద్ధతి మారాలిప్రచారానికి ఎక్కువ సమయం ఇచ్చిఓటింగ్ కు కొన్ని గంటల సమయం-అదీ కూడా ఫలానా బూత్ కే పోయి ఓట్ వేయాలన్న నిబంధనలో మార్పు రావాలిదీని వల్ల వ్యయం తగ్గడమే కాకుండాఓటింగ్ పూర్తైన వెంటనే ఫలితం ప్రకటించే అవకాశం వుంటుందిరీ పోలింగ్ కు అవకాశమే రాదుప్రచారానికి తక్కువ సమయంఓటింగ్ కు ఎక్కువ సమయం ఇచ్చే రోజులు రావాలి.  అప్పుడే అందరూ ఓటు వేసే వీలుకూడా కలుగుతుంది. పోలింగ్ వంద శాతం వర కొచ్చినా ఆశ్చర్య పడక్కర లేదు.


ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమన్న పేరుంది భారతదేశానికి.  సామ్రాజ్యవాదవలస వాద దేశాల పాలన నుండి గడచిన ఆరేడు దశాబ్దాల కాలంలో విముక్తి పొంది స్వాతంత్య్రం పొందిన దేశాలెన్ని ఉన్నప్పటికీప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ ద్వారా ఐదేళ్లకోసారి అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతున్న దేశం బహుశా భారతదేశ మొక్కటేనేమో.  అలానే స్థానిక సంస్థలకు కూడా ఐదేళ్లకో సారిసాధ్యమైనంత మేరకు ఎన్నికలు జరుగుతుంటాయి అనేక రాష్ట్రాలలోఅయినప్పటికీమన ప్రజాస్వామ్యం మీదఎన్నికల ప్రక్రియమీదఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అక్రమాల మీద అన్నీ సందేహాలేఅన్నీ అనుమానాలే.  వివిధ కారణాల వల్లమనదేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్లఇప్పుడున్న రాజకీయ పార్టీలకు కానీప్రజా ప్రాతినిధ్య చట్టానికి కానీ ప్రత్యమ్నాయాలంత తేలిగ్గా లభించవనేది వాస్తవం

కేంద్రంలోకాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం దొరకడానికి మనదేశంలో ముప్ఫైఏళ్ళు పట్టింది.  ఆ తరువాత మళ్ళీ కాంగెస్సోదాని సారధ్యంలోని కూటమో ప్రత్యామ్నాయమైంది కాని మరోటి కాలేకపోయిందిప్రస్తుతం కేంద్రంలో వున్న ప్రభుత్వం కూడా దాని కాల పరిమితి తీరిన తరువాత అధికారంలోకి వస్తుందారాదాఅనేది చెప్పడం కష్టంఆ లెక్కన మళ్లీ కాంగ్రెస్ కూటమే వస్తుందాచెప్పలేం. బహుశా ఇది మరికొంత కాలం కొనసాగవచ్చుఅదే పరిస్థితి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొనసాగిందికాంగ్రెస్ పార్టీని గద్దె దింపిన తెలుగు దేశం మళ్లీ కాంగ్రెస్ చేతుల్లో అధికారాన్ని పెట్టిందిఇక తెలంగాణ విషయానికొస్తే అటు తెలుగు దేశానికిఇటు కాంగ్రెస్ పార్టీకిఏకైక ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించడమే కాకుండాఅది చేపట్టి అమలు పరుస్తున్న అనేక సంక్షేమ-అభివృద్ధి పథకాల ద్వారా తన ప్రభుత్వాన్ని అంచలంచలుగా బలపర్చుకుంటూ ముందుకు సాగుతోందిరాష్ట్ర ఆవిర్భావంటీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తరువాత జరిగిన అన్ని ఉపఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసిందిఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు అఖండ మెజారిటీతో మళ్లీ టీఆరెస్ ను గెలిపించారు. ఓటరుకు ప్రత్యామ్నాయాల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ వుంటే ఇలాంటివి సాధ్యపడతాయిఅందుకేసగటు ఓటరుఓటు వేసే విషయంలోఅవినీతికిఅక్రమాలకు తావులేకుండాఎవరి ఓటును వారే వేసుకునే అసలు సిసలైన మార్గాల అన్వేషణ జరగాలని సంస్కరణాభిషుల అభిప్రాయం.  వాస్తవానికి ఎన్నికల ప్రక్రియను కుదించే ప్రయత్నం సంస్కరణ దిశగా ఒక అడుగు అనాలి.

ఓటరును ఎవరెంతగా మభ్య పెట్టినాఎన్ని రాజకీయ పార్టీలుఅభ్యర్ధులు ఎంత డబ్బు కుమ్మరించినాకులం అనోమతం అనో ఎన్ని అపోహలు కలిగించినాఎన్ని బలీయమైన శక్తులు ఏ కొందరో అధికారంలో ఉండాలనోలేకుండా పోవాలనో కోరుకున్నాఅదే ఓటరుఅవసరమని భావించినప్పుడు దిగ్గజాలను ఓడించిన సందర్భాలూఏ అండదండా లేనివారిని గెలిపించిన సందర్భాలూమన దేశంలో కోకొల్లలు.  నిజంగా ఓటరుకు ప్రభుత్వంఎన్నికల సంఘం గనుక పూర్తి మద్దతు ఇచ్చే పరిస్థితులే ఉంటేఅధిక శాతం మంది నిర్భయంగా ఓటింగులో పాల్గొంటారనడంలో సందేహ లేదు.

భారతదేశంలో ఎన్నికల రాజకీయాలకొక ప్రత్యేకత ఉంది.  నియంత్రణలకునియమావళులకు అతీతంగాపాలకు, ప్రతిపక్షాల అదుపాజ్ఞల్లో, కనుసన్నలలో, అంచనాలకు అందనంత వేగంగాదూరంగా మనుగడ సాగిస్తుంటాయిఎన్నికల రాజకీయాలకుసాధారణ రాజకీయాలకు పొంతనే ఉండదు.  ఎత్తులుజిత్తులుజిమ్మిక్కులునిజాలలా అనిపించే అబద్ధాలుస్నేహితుల్లా కనిపించే శత్రువులునమ్మించి మోసం చేసే నాయకులు, అనుచరులుఆఖరి క్షణంలో అనూహ్యమైన మార్పులు-చేర్పులుఇలా ఎన్నోఎన్నెన్నో ఎన్నికల రాజకీయాల్లో గతంలో చోటు చేసుకున్నాయిభవిష్యత్‍లోచోటుచేసుకోనున్నాయిఎన్నికల్లో అక్రమాలు జరగడానికిజరగకుండా నిరోధించడానికిప్రత్యక్షంగానో-పరోక్షంగానో బాధ్యత వహించాల్సింది రాజకీయ పార్టీలుఎన్నికల కమీషన్. ఎన్నికల్లో అక్రమాలు రాజకీయ పార్టీల టికెట్ల పంపిణీ నుండి ఆరంభమవుతుంది.  ఎన్నికల కమిషన్ ఎన్నికలకే పరిమితమవడంతో రాజకీయ పార్టీల అవినీతికి వారి నిర్లిప్తత ఆజ్యం పోసినట్లవుతున్నది.  ఎన్నికల కమిషన్ పనిచేయడమనేది ఒక నిరంతర ప్రక్రియ కావాలి

ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాతఓ వారం రోజుల లోపుగా ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించడం జరిగి పోవాలి.  ఆ తర్వాత మూడు-నాలుగు రోజుల వ్యవధిలో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ప్రకటించినామినేషన్‌తో పాటే బీ-ఫారం సమర్పించే నిబంధనను విధించాలి.  మరో నాలుగు-ఐదు రోజుల వ్యవధిలో రోజుల తరబడి ప్రచారం లేకుండా ఎన్నికలు జరిపించాలి.  డబ్బిచ్చి పార్టీ టికెట్ కొనుగోలుచేసే వ్యవధి కూడా ఉండకూడదు.  ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు వెదజల్లే అవకాశం కానీఅవసరం కానీ ఎవరికీ లేకుండా చేయాలి.  డబ్బు ఖర్చు చేయనప్పుడు ఆ పెట్టుబడిని రాబట్టుకొనే ప్రయత్నం తగ్గే అవకాశముంది.  ఓటు హక్కును వినియోగించడం ఓ రెండు-మూడు రోజుల పాటు జరిగినా ఇబ్బంది లేదు

"శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డు ను డిజైన్ చేసిప్రతి ఒక్క ఓటరుకేవలం అతనోఆమో ఉపయోగించుకొనగల్గేలా ప్రోగ్రాం చేయాలిఎన్నికల బూత్‌ల లాగానే జనరల్ ఎన్నికలకు దేశ వ్యాప్తంగాఇతర ఎన్నికలకు సంబంధిత ప్రాంతమంతాఎన్నికల మిషన్లను బహిరంగంగా ఏర్పాటు చేయాలి.  భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి.  ఏ ఓటరైనాఎక్కడైనా ఆ రెండు-మూడు రోజుల్లో ఇరవై నాలుగు గంటలపాటు ఎప్పుడైనా ఓటు వేసుకునే ఏర్పాటు ఉండాలి.  ఓటరు ఓటును తన నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులలో ఎవరో ఒకరికి వేసే వీలుకలుగేలా కార్డును ప్రోగ్రాం చేయవచ్చు.  ఓటరుకు తప్ప ఇతరులకు ఆ కార్డును ఉపయోగించుకునే వీలుపడరాదు.  ఒకసారి ఉపయోగించిన తర్వాత మరో మూడు-నాలుగు నెలల వరకు ఓటింగ్‌కు ఆ కార్డు పనికిరాని విధంగా ప్రోగ్రాం చేయాలి.  ఒకప్పుడు ఒక్కో అభ్యర్థికి ఒక్కో డబ్బా కేటాయించేవారు. ఆ తరువాత కామన్ డబ్బాలొచ్చాయి. దరిమిలా ఇవీఎంలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను అర్ధం చేసుకోగలిగిన ఓటరుకు, "శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డు” ను ఉపయోగించి ఓట్ చేయడం  పెద్ద కష్టం కాదు.  ఓటరు దేశంలో ఎక్కడ కార్డును వాడినా అతని నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితాయే ఓటింగ్ మిషన్‌పై కనిపించే వీలు కలిగేలా ప్రోగ్రాం తయారుచేయాలి

క్యూలో నిలబడే అవసరం లేకుండా ఎప్పుడైనాఎక్కడినుంచైనా ఆదాయపు పన్ను రిటర్నను సమర్పించే సదుపాయం ఉండగా లేనిదిప్రపంచ వ్యాప్తంగా ఏటీఎం కార్డులుడెబిట్ కార్డులుక్రెడిట్ కార్డులు ఉపయోగించి డబ్బులు విత్‌డ్రా చేసుకునే కోర్ బాంక్ వ్యవస్థ వుండగాలేందిఒకే మిషన్ నుంచి ఏ బ్యాంక్ కార్డునైనా ఉపయోగించుకునే అవకాశం ఉండగా లేనిదిఇలాంటి పద్ధతినే ఓటింగుకు కూడా ప్రవేశ పెట్టే ఆలోచన ఎందుకు చేయకూడదుఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశంలో ఈ సౌకర్యం లేనంత మాత్రాన మన దేశంలో ఉండకూడదన్న నిబంధనేమీ లేదు కదా?  ఆన్‌లైన్ ఓటింగుకు శ్రీకారంచుట్టి ప్రపంచాన్నే అబ్బుర పరచలేదా నేటి కేంద్ర ప్రభుత్వం, లేదా, ఎన్నికల కమీషన్ఈ రకమైన కార్డును సార్వత్రిక ఎన్నికలకే కాకుండా శాసనమండలి ఎన్నికలలాంటి వాటికీ ఉపయోగించవచ్చు.  స్థానిక సంస్థల ఎన్నికలకూ వాడవచ్చు.  అన్నింటికీ ఒకటే కార్డు చాలు.  ఎన్నికల బూత్‌లోకి ఓటరు తప్ప ఎవరూ ప్రవేశించే వీలులేని విధంగా సాంకేతికంగా దీన్ని ప్రోగ్రామింగ్ చేయడమంత కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు.  ఓటర్లను దాచి పెట్టడంక్యాంపులు నడపడంలాంటి వాటిని అరికట్టవచ్చు ఈ కార్డు ప్రవేశ పెడితే.

"శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డు” పౌరుడు ఒక్క ఓటింగుకే కాకుండావిదేశాల్లో లాగాబహుళ ప్రయోజనాలకు వాడుకునే విధంగా ఉండాలి.  తలచుకుంటే ఇదేమంత కష్టసాధ్యమైన పనేమీకాదు.  చేయాలన్న తలంపుపట్టుదలే ఉంటేపోటీచేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా భరిస్తామని చెప్తున్న ఎన్నికల కమిషన్ బహుశా ఒక్క ఎన్నికల కయ్యే ఖర్చును ఈ కార్డు ప్రవేశపెట్టడానికి వినియోగిస్తే చాలు….చరిత్రలో భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఓ సరికొత్త రూపునిచ్చినట్లవుతుంది.  కంప్యూటర్ యుగంలో ఇవి రూపొందించడానికి పెద్ద తెలివితేటలు కూడా అక్కరలేదు.  అందులో ప్రవేశమున్న ఎవరైనా చేయగలరు ఈ పనిని. రాబోయే లోక సభ ఎన్నికల్లోనైనా, లేదా, భవిష్యత్‍లో నైనా దీనిని గురించి ఆలోచన చేయడం మంచిదేమో!

1 comment:

  1. Adhaar verifiable Online voting booths along with normal voting booths should be the way to go. ఒక్క సూచన ఇవ్వడానికి ఇంత పెద్ద వ్యాసం అవసరమా. ఊకదంపుడు వ్యాసాలలో బండారు గారిని మించిపోయారే.

    ReplyDelete