Wednesday, February 19, 2025

కెన్నెడీల వారసత్వంలో మరో అధ్యాయం (అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్) : వనం జ్వాలా నరసింహారావు

 కెన్నెడీల వారసత్వంలో మరో అధ్యాయం 

(అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (20-02-2025)

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఆకాశాన్నంటుతున్న వైద్య ఖర్చులు, బీమా సంస్థల ఆధిపత్యం, వైద్య సేవల అందుబాటు సమస్యలు, వైద్య లోపాలు వంటి సవాళ్లను అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న తరుణంలో, ట్రంప్ ప్రభుత్వం ఆరోగ్య కార్యదర్శిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను నియమించడం సార్వజనీన ఆరోగ్య విధానంలో ఒక విప్లవాత్మక మార్పు. ఆయన నియామకాన్ని సెనేట్ 52-48 ఓట్ల తేడాతో అంగీకరించడం అనే అంశం, ‘అమెరికా రాజకీయ సాహిత్యంలో’ కెన్నెడీ కుటుంబం ప్రభావాన్ని, ఏమేరకు ప్రతిబింబిస్తుందో అవగాహన చేసుకోవచ్చు. ‘అపారమైన కెన్నెడీ వారసత్వం’, అమెరికా పరిపాలనా వ్యవస్థను ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నాయంటే, దానికి కారణమైన ఆ కుటుంబ నేపధ్యమే. 

ఆరోగ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ తండ్రి మాజీ అటార్నీ జనరల్ సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సీనియర్, మేనమామలు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ, టెడ్ కెన్నెడీ, తల్లి-మానవ హక్కుల కోసం పోరాడిన సామాజిక న్యాయ ఉద్యమకారిణి ఎథెల్ కెన్నెడీల రాజకీయ వారసుడు. 1968లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన తండ్రి హత్యకు గురైనప్పటికీ, అది రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ రాజకీయ ప్రస్తానాన్ని ఆపలేకపోయింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసిన జూనియర్ రాబర్ట్, పోటీ నుండి విరమించుకుని, ఎన్నికలలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించడం కీలక రాజకీయ మలుపుగా మారింది. అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా ఆయన నియామకం, అమెరికా రాజకీయాల్లో అపూర్వమైన కెన్నెడీ కుటుంబ చరిత్రలో మరో నూతన అధ్యాయం. 

అమెరికా రాజకీయాల్లో కెన్నెడీ కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి కన్న కలలను వాస్తవం చేస్తూ, జాతికి జీవితాలను అంకితం చేసిన కొడుకులు, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక అపురూప వారసత్వ పరంపరకు చెరగని చిహ్నాలు. శక్తి, అధికారం, త్యాగం, బాధ్యత, రాజకీయ పరంపర, మరణాల ముసురుకు కూడా తలవంచని నిబద్ధత లాంటి అంశాలు కలగలిపిన అజరామరమైన వర్తమాన గాధ కెన్నెడీ కుటుంబం సొంతం. మరణాల, విపత్తుల, రాజకీయ కుదుపుల మధ్య జీవనయానం సాగించి, ఆదర్శాలను, ప్రజాస్వామ్యాన్ని నమ్మిన ఒక కుటుంబమే కెన్నెడీ కుటుంబం. ఈ కుటుంబ నేపధ్యంలో, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ప్రతిష్టాత్మక అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా నియమితుడయ్యాడు. మరోసారి కెన్నెడీ కుటుంబం ప్రజాస్వామ్య విలువలకు అనుసంధానమై, అమెరికా పాలనా వ్యవస్థలో ముద్ర వేసిన ఘట్టం.

నేడునోబెల్ బహుమతి గ్రహీత ‘పర్ల్ ఎస్ బక్’ జీవించి ఉన్నట్లయితే, తాను ఐదున్నర దశాబ్దాల క్రితం రాసిన ప్రసిద్ధ పుస్తకం, ‘ది కెన్నెడీ ఉమెన్’ లో రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్‌ రాజకీయ ఆరోహణను, భవిష్యత్తులో దాని ప్రభావాన్ని, మరో ఆసక్త్రికరమైన అధ్యాయంగా చేర్చేదేమో! ఈ పుస్తకంలో కెన్నెడీల రాజకీయ అస్తిత్వం, వారి ఎదుర్కున్న దురదృష్టకర సంఘటనలు, చైనా కుంగ్ కుటుంబంతో కెన్నెడీ కుటుంబం పోలికలు, ‘కర్స్ ఆఫ్ గ్రేట్‌నెస్’ (గొప్పతనపు శాపం) గురించి వివిధ కోణాలలో చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు డేవిడ్ వాన్ డ్రెహ్లే, ఇరవై సంవత్సరాల క్రితం వ్యాఖ్యానిస్తూ, ‘అమెరికాలో ఓ షేక్స్పియర్ ఉన్నట్లయితే, అతను కెన్నెడీ కుటుంబ గాథను అద్భుతంగా రాసేవాడు’ అన్నారు. 

మరో ఆసక్తికరమైన అంశం, కెన్నెడీ కుటుంబానికి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల కొన్ని సారూప్యతలు. ఇరు ‘ప్రజాస్వామ్య వారసత్వ కుటుంబాలూ’ తమ దేశ రాజకీయ ప్రస్తానాన్ని నిర్వచిస్తూ  ముందుకు సాగాయి. అలాగే, వారసత్వ పాలనకు తలొంచిన రాజకీయ కుటుంబాల మాదిరిగానే, తీవ్రమైన విషాదాలను సహితం ఎదుర్కొన్నాయి. జాన్ ఎఫ్ కెన్నెడీ, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సీనియర్లు హత్యకు గురైనట్లే, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు హత్య చేయబడ్డారు. జెఎఫ్‌కె జూనియర్ విమాన ప్రమాదంలో మరణించడం, సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కూడా ఒక పోలికే. కెన్నెడీ కుటుంబ సభ్యులు ఎన్నో ముఖ్యమైన హోదాల్లో పని చేసినట్లు, నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కూడా అత్యున్నత పదవులు అలంకరించారు. 

కెన్నెడీ కుటుంబ రాజకీయ ప్రయాణం జోసెఫ్ పి కెన్నెడీ సీనియర్‌ ఇంగ్లాండ్ దేశానికి అమెరికా రాయబారిగా నియామకంతో ప్రారంభమైందనవచ్చు. 1914లో ఆయన వివాహం చేసుకున్న రోస్ ఫిట్జ్‌గెరాల్డ్ కెన్నెడీ, మరో అమెరికన్ రాజకీయ నాయకుడు జాన్ ఎఫ్ ఫిట్జ్‌గెరాల్డ్ కుమార్తె, కెన్నెడీ వంశానికి మూలాధిపతిగా నిలిచారు. పర్ల్ ఎస్ బక్ పుస్తకంలో ఆమెను కాథలిక్ ఆచార వ్యవహారాలకు ప్రతిరూపంగా, క్రమశిక్షణ, సహనానికి చిహ్నంగా చిత్రీకరించారు. తండ్రికి సాన్నిహిత్యంలో రాజకీయ అనుభవం గడించిన ఆమె, ఆత్మస్థైర్యాన్ని, సమతౌల్యాన్ని నేర్చుకున్నారు. జోసెఫ్, రోస్ దంపతులు తమ తొమ్మిదిమంది పిల్లలను క్రమశిక్షణ, పట్టుదల, ప్రజా సేవపై అపారమైన నిబద్ధత కలిగి ఉండేలా తీర్చిదిద్దారు. వారికి పుట్టిన నలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు అమెరికా రాజకీయాలపై చెరగని ముద్రవేశారు.  

అందరికన్నా పెద్దదైన రోస్‌మేరీ మాత్రం జీవితాంతం చిన్నపిల్లగానే మిగిలిపోవాల్సి వచ్చింది. 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతే, దివ్యాంగుల కోసం స్థాపించిన పాఠశాలలో చేర్చారు. కుటుంబ విజయాలనూ, విపత్తులనూ సమానంగా స్వీకరించి, ముందుకు నడిపించిన శక్తివంతమైన మహిళగా రోస్ కెన్నెడీని చిత్రీకరించారు పర్ల్ ఎస్ బక్. జోసెఫ్ పి కెన్నెడీ తాత ప్యాట్రిక్ జోసెఫ్ కెనెడి 1849లో 26 ఏళ్ల వయస్సులో ఐర్లాండ్ నుంచి బోస్టన్‌కు వలస వెళ్లి బ్యారెల్ తయారీ నిపుణుడిగా ఎదిగారు. ఆయన వారసత్వాన్ని తన కుమారుడు రెండో ప్యాట్రిక్ కొనసాగించాడు. 

జోసెఫ్ ప్యాట్రిక్ కెన్నెడీ అమెరికా అధ్యక్షుడు కావాలనుకున్న తన అభిలాషలను కుమారుల ద్వారా నెరవేర్చాలనే సంకల్పంతో, అ ధైర్యాన్ని వారికిచ్చారు. 1932 అధ్యక్ష ఎన్నికల సమయానికి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కు ఆర్థిక వనరులను సమకూర్చే కీలకవ్యక్తిగా మారాడు. 1937లో గ్రేట్ బ్రిటన్‌లో అమెరికా రాయబారిగా ఆయన నియామకం, కెన్నెడీ ప్రజాస్వామ్య రాజవంశం బలపడటానికి పునాది వేసింది. అమెరికా అధ్యక్షుడిగా అయ్యే అవకాశం ఉన్నా, రాజకీయంగా కొంతకాలం ప్రక్కన పడిపోయిన జోసెఫ్, తన కుమారుల భవిష్యత్తును దేశ రాజకీయాల్లో స్థిరపరిచే దిశగా పట్టుదలతో ప్రయత్నించారు. పెద్ద కుమారుడు జో జూనియర్ అమెరికా అధ్యక్షుడవుతాడనే గాఢమైన నమ్మకం ఏర్పడింది. అందుకు తగినట్లుగా అతనిని తీర్చిదిద్దాడు. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో కూలి, పేలిపోయిన సైనిక విమానంలో వున్న ఆయన మరణించాడు. దాంతో కుటుంబం ఆశలన్నీ జాన్ ఎఫ్ కెన్నెడీ వైపు మరలాయి. యుద్ధంలో తీవ్రంగా గాయపడి, జీవితాంతం శారీరిక బాధను భరించాల్సి వచ్చినా, కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు జాన్ ఎఫ్ కెన్నెడీ. అమెరికా రాజకీయాల్లో మెట్టు మెట్టుగా ఎదిగి, ప్రతినిధుల సభకు, సెనెట్‌కు ఎన్నికై, చివరికి అత్యంత పిన్న వయస్సులో 35వ అమెరికా అధ్యక్షుడయ్యాడు. 

ఇక అప్పటి నుండి, కెన్నెడీ వారసత్వం, సాంస్కృతిక ఆర్భాటం, మనోధైర్యం రెండింటినీ కలిపిన విలక్షణ సంప్రదాయంగా నిలిచింది. ‘కెన్నెడీ’ అనే పేరు అధికార-అవకాశాల ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాదు, బాధ్యతతో కూడిన గొప్ప వంశపారంపర్యాన్ని సూచించసాగింది. జాన్ ఎఫ్ కెన్నెడీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, తండ్రి అతడికి కావాల్సిన ఆర్ధిక వనరులను సమకూర్చాడు. కుటుంబం ఆయన ప్రచారానికి అంకితమైంది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో, కుమారుడి వెనుక తాను ఉన్నానన్న అపప్రధ కలగకుండా, తన కుమారుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని ప్రపంచానికి చెప్పడానికి, జోసెఫ్ ప్యాట్రిక్ కెన్నెడీ హాజరవ్వలేదు. అధికారం చేపట్టి వెయ్యి రోజులు గడవకముందే జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు గురై, అమెరికా చరిత్రలో అత్యంత పిన్న వయసులో మరణించిన అధ్యక్షుడిగా నిలిచాడు. 

దశాబ్దాల తరువాత, అతని 38 ఏళ్ల కుమారుడు జాన్ కెన్నెడీ జూనియర్ విమాన ప్రమాదంలో మరణించాడు. కుమార్తె క్యారోలైన్ కెన్నెడీ ఆస్ట్రేలియా, జపాన్‌లకు అమెరికా రాయబారిగా పనిచేసింది. కెన్నెడీ కథ ఇక్కడితో ముగియలేదు. జాన్ ఎఫ్ కెన్నెడీ తమ్ముడు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సీనియర్, అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రచారం చేస్తూ హత్యకు గురయ్యాడు. మరొక తమ్ముడు ఎడ్వర్డ్ ‘టెడ్’ కెన్నెడీ, సెనెట్‌లో ‘సింహం’గా దాదాపు 50 ఏళ్ల పాటు కుటుంబ రాజకీయ వారసత్వాన్ని స్థిరపర్చాడు. ఇప్పుడు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం, కెన్నెడీ వారసత్వం కొత్త దశలోకి ప్రవేశించిందనడానికి నిదర్శనం. 

అమెరికా ప్రజాస్వామ్యంలో అనిశ్చితి, వారసత్వ రాజకీయాలు, త్యాగం, సిద్ధాంతపరమైన భేదాలు, వ్యక్తిగత విశ్వాసాలు, ఒక నిరంతర రాజకీయ సాహసం. వీటి సంగమంలో కెన్నెడీ కుటుంబ కథనం ఆవిర్భవించింది. చరిత్ర ముందుకు సాగుతున్నకొద్దీ, ‘కెన్నెడీ రాజకీయ వారసత్వం’ ప్రజా సంక్షేమం కోసం అప్రతిహతంగా సాగిపోతున్న ఒక శాశ్వత ప్రయాణమనవచ్చు. కెన్నెడీ కుటుంబం అనేది సాధారణంగా అధికార మదంతో దూసుకెళ్లే రాజకీయం కాదు, అది సేవా తత్వానికి నిలువెత్తు నిదర్శనం. జోసెఫ్ ప్యాట్రిక్ కెన్నెడీ, ఆయన కుమారులు జాన్ ఎఫ్ కెన్నెడీ, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సీనియర్, టెడ్ కెన్నెడీ, అందరూ దేశం కోసం త్యాగాలే చేశారని చరిత్ర చెబుతోంది. ‘ప్రజాస్వామ్యం వారసత్వం’ కాదు. ‘ప్రజాస్వామ్య వారసత్వం ఆషామాషీ’ కానే కాదు. అది గురుతర బాధ్యత. అధికారం గౌరవప్రదమైనది, కానీ అది ప్రజాసేవలోనే ఉన్నప్పుడే నిలుస్తుంది. 

‘వంశపారంపర్యమే కీలకం కాదు, ప్రజల విశ్వాసమే అసలు ఆధారం’ అని తాజాగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ నియామకం మనకు చెబుతుంది. కెన్నెడీ కుటుంబం చేసిన త్యాగాలు, వారి ఆత్మసంఘర్షణలు, నమ్మకాలు, ఇవన్నీ సేవాగుణానికి, నిబద్ధతకు, ప్రజాస్వామ్య న్యాయానికి నిదర్శనం. కెన్నెడీ వారసత్వం ఒక కథ మాత్రమే కాదు, అది ఒక విలువైన సందేశం. అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలలో, ఒకే కుటుంబం నుంచి రాజకీయంగా ఎదుగుతున్నవారి ప్రత్యేకతలు అవగాహన చేసుకోకుండా, ‘వారసత్వ రాజకీయాలను’ అసంబద్ధంగా విమర్శించడం తగదు. మంచిని మంచే అనాలి. తప్పుంటేనే నిష్పక్షపాతంగా ఎత్తిచూప్పాలి. 

Saturday, February 15, 2025

PARIS AI MEET WEIGHS RISKS AND REWARDS : Vanam Jwala Narasimha Rao

 PARIS AI MEET WEIGHS RISKS AND REWARDS

Narendra Modi and Emmanuel Macron Leads

Significant Paris Initiative for AI Global Framework

By Vanam Jwala Narasimha Rao

The Hans India (16th February, 2025)

{Technology is a powerful tide, yet wisdom must be its guide. Technology is a good servant but a bad master. Technology serves humanity with unparalleled convenience and efficiency and has become an indispensable tool. However, the very attributes that make it a great servant also bestow upon it the potential to be dangerous master. As a servant, technology elevates our lives, simplifying tasks and connecting us across vast distances. If humanity wields AI with purpose, it will not be a question of ‘To Be or Not To Be’ but, it will be the dawn of a world where intelligence, human and artificial, coalesce for the greater good.} – Editor’s Synoptic Note 

An objective analysis of the ‘Opening Address’ of Prime Minister Narendra Modi in ‘AI Action Summit in Paris’ on February 11,2025, unequivocally reveal, ‘Multifaceted Imperatives and Implications’ and future benefits to the universe and mankind at large with Artificial Intelligence. Modi’s way of presentation speaks of a fresh dawn of ‘Artificial Intelligence’ marking a turning point in human civilization, akin to the invention of the printing press or the industrial revolution, yet exponentially more transformative. In his characteristic style, Modi outlined a forward-looking, multi-dimensional approach to AI, positioning it as a force for global good rather than tool of control. 

As the world stands at crossroads, or ‘To be or Not To be’ the emphasis should no longer be about, whether AI will shape the future, but how we, as custodians of progress will shape AI itself. In this context, the ‘AI Action Summit 2025 in Paris’ became a historic moment of reflection, responsibility, and resolve. It is a ‘Significant Initiative for AI Global Framework.’ Co-Chaired by Indian Prime Minister Narendra Modi and French President Emmanuel Macron, the summit was not just a dialogue between nations but a dialogue between humanity and its technological destiny. From governance to ethics, from sustainability to accessibility, from security to innovation, from economics to Social Development, Impact on Jobs and Workforce, AI’s Carbon Footprint (infrastructure emissions associated with AI) etc. every facet of AI’s impact was meticulously addressed in its absolute brevity. 

The profound question now asked is: Can AI be harnessed as a ‘Force for Collective Good’ ensuring that no nation, no individual, and no moral principle is left behind? Narendra Modi’s address at the Summit reflects a strategic vision for ‘Artificial Intelligence’ that balances innovation, governance, sustainability, and inclusivity. It encompasses ‘Multiple Imperatives and Implications’ assuring present and future benefits for global society. ‘The Best of the Few Points’ from his address, that can be quoted and unquoted, effectively portray invaluable dimensions, even more than what Experts in the field of Artificial Intelligence, would be able to narrate. 

On ‘AI’s Dual Potential’ Modi’s statement that, ‘AI is writing the code for humanity in this century’ highlights its transformative role in shaping the future of civilization, governance, and human progress. On ‘Bias in AI’ he said that, ‘The positive potential of AI is absolutely amazing, but there are many biases that we need to think carefully about.’ This speaks about AI’s ethical concerns, particularly bias in training data which require global discussions on fairness, accuracy, and inclusivity in AI models.

On the ‘Need for Global AI Governance’ Modi stated that, ‘There is a need for collective global efforts to establish governance and standards that uphold our shared values, address risks, and build trust.’ This indicates ‘AI’s Rapid Advancement’ which demands international collaboration to ensure responsible and ethical development, preventing misuse while fostering innovation. Regarding ‘Sustainable Development’ he said that, ‘AI can help transform millions of lives by improving health, education, agriculture, and so much more.’ 

On ‘AI’s Impact on Jobs’ Modi is very clear when he said that, ‘History has shown that work does not disappear due to technology. Its nature changes, and new types of jobs are created.’ This means that, AI should not be feared as job destroyer, but rather as job transformer, emphasizing the need for reskilling, multiskilling, and workforce adaptation. On ‘Sustainable AI’ he said that, ‘The human brain manages to compose poetry and design space ships using less power than most lightbulbs.’ 

Modi further said that: ‘India has successfully built a Digital Public Infrastructure for over 1.4 billion people at a very low cost. Today, India leads in AI adoption, and techno-legal solutions on data privacy. No one holds the key to our collective future and shared destiny other than us as humans. And, as we advance our partnership to AI, it is a natural progression from sustainability to innovation to shape a smarter and responsible future.’ These quote-worthy points explain AI’s potential, risks, ethical considerations, governance, sustainability, and global collaboration.

When Modi emphasized the need for global governance highlighting simultaneously the risks of bias in AI models, which can distort outputs and affect decision-making, it implies for international cooperation as he himself put it, and the implication of this is ‘Countries will need to work on policy harmonization to ensure AI remains safe, ethical, and inclusive.’ PM Modi cleverly touched the aspect of ‘AI for Economic and Social Development’ with details briefly. The implication of this is, if implemented well, AI could accelerate Sustainable Development Goals (SDGs) by improving healthcare diagnostics, crop yield predictions, and education accessibility.

The address acknowledges concerns about AI-driven job displacement but asserts that history has shown technology reshapes work rather than eliminating it. The implications are, countries will have to invest in AI literacy and workforce adaptation to mitigate job losses and create new employment avenues in AI-driven sectors. PM Modi links AI’s energy-intensive nature to climate concerns, meaning that, the future of AI development will have to integrate low-energy computing and sustainable AI models to align with global climate commitments.

Present and Future Benefits for the Universe and Humanity, if read in between the lines Modi’s address carefully, are numerous despite few fears. To simplify, they are: Data-driven decision-making, Digital Public Infrastructure, AI-powered governance, AI for Inclusive Growth, Global Collaboration in AI Innovation, AI as a Tool for Peace and Stability etc. In addition, Ethical AI could reduce geopolitical conflicts by preventing misinformation and enhancing transparency in global relations.

India’s AI Leadership and Global Role particularly its techno-legal solutions for data privacy was highlighted by PM Modi. He also reinforced India’s willingness to share AI expertise with the world, strengthening its position as a key AI player in the Global South. India’s Digital Public Infrastructure and AI adoption strategy can be replicated worldwide for inclusive AI growth. India-France AI collaboration could pave the way for Europe-South Asia AI partnerships, strengthening India’s diplomatic and technological influence. 

French President Emmanuel Macron’s speech aligned with PM Modi’s on key themes, reflecting a shared vision for the future of Artificial Intelligence. However, Global AI Governance maybe essential as we progress or even may become an inevitability, though predicting now is too early. Following the bilateral discussions on February 12, 2025, between Narendra Modi and Emmanuel Macron in a joint statement, they launched the ‘India-France Roadmap on Artificial Intelligence’ focusing on the development of safe, open, secure, and trustworthy AI.

The world today faces a paradox. AI, with its immense potential, can either bridge divides or deepen them, democratize access, or centralize power, enhance creativity, or replace it. The answer lies not within AI itself, but within the architects of its future, that is ‘We as a Whole.’ As was emphasized in the summit, responsible AI is not just about regulation, but is about vision, trust, and inclusivity. Nations must rise above mere competition to forge partnerships that ‘Ensure AI serves Humanity rather than Enslaves it.’ The ‘Global South, India being one of the leading Proponents’ must not remain a passive observer but an active participant in the AI Revolution. 

‘Technology is a Powerful Tide, yet Wisdom must be its guide. Technology is a Good Servant but a Bad Master. Technology Serves Humanity with unparalleled convenience and efficiency, and has become an indispensable tool. However, the very attributes that make it a great servant also bestow upon it the potential to be dangerous master. As a servant, technology elevates our lives, simplifying tasks and connecting us across vast distances. If humanity wields AI with purpose, it will not be a question of ‘To Be or Not To Be’ but, it will be the dawn of a world where intelligence, human and artificial, coalesce for the greater good. 

Tuesday, February 11, 2025

బీఆర్ఎస్ చూపిన బాట ఉంది కదా : వనం జ్వాలా నరసింహరావు

 బీఆర్ఎస్ చూపిన బాట ఉంది కదా 

(సమగ్ర కుటుంబ సర్వే ద్వారా దశాబ్దం క్రితమే 

బీసీల అభ్యున్నతికి కేసీఆర్ చొరవ) 

వనం జ్వాలా నరసింహరావు

నమస్తే తెలంగాణ దినపత్రిక (12-02-2025)

దశాబ్ద కాలం క్రితం నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)’ గణాంకాలు, ఇటీవల నిర్వహించిన ‘తెలంగాణ కులగణన (టీసీఎస్)’ గణాంకాల మధ్య, బీసీల జనాభా శాతం వ్యత్యాసం వున్నదన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. బీసీల జనాభా శాతం పెరిగిందన్న ప్రభుత్వ వాదన సరైనది కానే కాదని, వాస్తవానికి తగ్గిందని బీఆర్ఎస్ నాయకులు సోదాహరణంగా గణాంకాలను ఉటంకిస్తూ విభేదిస్తున్నారు. టీసీఎస్ లో పెరిగిన బీసీల శాతం ముస్లిం బీసీలను జనరల్ బీసీ కేటగిరీలో చేర్చడంవల్లేనన్నది బీఆర్ఎస్ నాయకుల వాదన. ‘బీసీల హక్కులసాధన విషయంలో, రిజర్వేషన్ల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలి. సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కేవలం అసెంబ్లీలో చెప్పడమే కాకుండా త్రికరణశుద్ధితో  ఆచరణలో పెట్టడానికి చొరవ తీసుకోవాలి.  

బీజేపీ నాయకులు కూడా శాసనసభ లోపల, వెలుపల టీసీఎస్ విషయంలో తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎస్కేఎస్ గణాంకాలలో బీసీ శాతం గురించి పారదర్శకత లేదన్న ప్రభుత్వ వర్గాల ఆరోపణ అసమంజసం అనేది కూడా వంద శాతం సహేతుకం. గణాంకాలను నిశితంగా విశ్లేషించి చూసేవారికి, చిటికెడంత ఆశ్చర్యం కలుగుతున్నదనాలి. ఎందుకంటే, ఎస్కేఎస్ డేటాను ‘ఎత్తిపోతల పథకం’ లాగా అటుది-ఇటుగా, ఇటుది-అటుగా ‘నకల్’ చేసే ప్రయత్నం జరిగినట్లు అనుమానం కలుగుతున్నది.  

ఒక ప్రధాన ప్రతిపక్షంగా, గతంలో చిత్తశుద్ధితో సమగ్ర కుటుంబ సర్వే చేసిన ప్రభుత్వ పార్టీగా, ఒక ఆరోపణ చేసినప్పుడు, వారిచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇలా చేయకుండా, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ వెలుపలా, లోపలా, ప్రత్యారోపణలు చేయడం, ప్రజాస్వామ్య విలువలకు సరిపోదేమో! ప్రభుత్వం, దాని నాయకుడు, ఒకింత సంయమనం పాటించి, అసహనం వీడి, డేటాలను సమన్వయంచేస్తూ, అన్వయించుకుంటూ, రాజ్యాంగ ప్రమాణాల, సామాజిక వాస్తవాల, చట్టపరమైన పరిమితులకు అనుగుణంగా శాస్త్రీయతతో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు నిజమైన లబ్దిదారులకు చేరేలా ఆలోచన చేస్తానని ‘రాజనీతిజ్ఞతతో’ చెప్పడం సమంజసం. విమర్శకు ప్రతివిమర్శ సమాధానం కాదు. 

ఎస్కేఎస్, టీసీఎస్ సర్వేలలోని మెరుగైన అంశాలను తీసుకుని, వాటిని సమీకృతం చేసి, ‘అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మేలును అందించే’ సిద్ధాంతాన్ని పాటిస్తూ, వివక్షతలకు తావీయకుండా, రాజకీయ ప్రేరణల ప్రభావం లేకుండా, అవసరమైతే ఒక శాస్త్రీయ ప్రత్యామ్నాయ ‘హైబ్రిడ్ మోడల్’ రూపొందించే ఆలోచన చేస్తామని సభాముఖంగా సభానాయకుడు శాసనసభలో హామీ ఇచ్చినట్లయితే ఆయన వ్యక్తిత్వం ఆకాశం ఎత్తున ఎదిగేది. అదొక మేలైన మార్గంగా పరిణమించడానికి బాటలు వేసేది. తద్వారా రాజకీయాలకు అతీతంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు నిజమైన లబ్దిదారులకు చేరువలోకి వచ్చే సదవకాశం పరిపూర్ణంగా కలిగేది. 

ప్రభుత్వం, దాని నాయకుడి వాదననే పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తే, వారు చెప్తున్నట్లు, ‘తెలంగాణ కులగణన’ ఎంత మేలు కలిగించేదైనప్పటికీ, బీసీ జనాభాశాతం గణనలో తేడాలు, ముస్లిం బీసీలను హిందూ బీసీలతో కలిపి చూపడంలాంటి అంశాలు మేధావుల, మేదావేతరుల ఆక్షేపణలకు, తీవ్ర చర్చకు అవకాశం ఇస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో వీటిని పోల్చి చూపిస్తూ, బీఆర్ఎస్ నాయకుకు పేర్కొంటున్న వ్యత్యాసాలను, అధికారపక్ష  నాయకులు ఎవరికీ నచ్చిన రీతిలో వారు, శక్తివంచనలేకుండా తమ వాదనను సమర్ధించుకోవడం హాస్యాస్పదం. ఇలా వాదించడానికి పూర్వం, ఎస్కేఎస్ ‘మాక్రో-లెవల్’ హోలిస్టిక్ డేటను’’ అందులోని అంతర్గత సందేశాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడమే, ప్రస్తుతం ప్రబుత్వం ముందున్న సమగ్ర విధానానికి కీలకం. టీసీఎస్ పూర్తిగా నాణ్యమైనదని, ఎస్కేఎస్ కానేకాదని, వాదించడానికి బదులు, ఇవి పరస్పరం అనుబంధంగా, అదనపు పరిశీలనగా, పరిపూరకంగా, సమృద్ధిగా వున్నాయని అంటే మేలేమో!

ఎస్కేఎస్ 100% గృహ గణనను జరిపి గణాంకాలను క్రోడీకరించగా, దీనికి భిన్నంగా, టీసీఎస్ కేవలం 96.9% కవరేజీ మాత్రమే సాధించింది, ఆ గణన ఆధారంగానే, కులాల వారీగా వివరమైన విభజనను అందించింది. అయితే, ఎస్కేఎస్ కు టీసీఎస్ కు వున్న గణాంక వ్యత్యాసాలను సమగ్రంగా, కూలంకషంగా అధ్యయనం చేయకుండా, ఒకింత పాక్షిక ధోరణితో, అనవసర భయాందోళనలకు దారితీసేలా ప్రభుత్వపక్ష రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులైన మేథావులు, అనుమానాల నివృత్తి దిశగా కాకుండా వ్యాఖ్యలు చేయడం సమస్యను జటిలం చేయడంతోసహా, బీసీలకు జరగాల్సిన మేలు జరగకుండా చేస్తున్నారు. టీసీఎస్ డేటాను భూతద్దంలో చూపడానికి ముందుగా, ఎస్కేఎస్ డేటాను నిష్పక్షపాతంగా పరిశీలించడం, అదీ  లోతైన అవగాహనతో చేయడం అత్యవసరం. సమగ్ర కుటుంబ సర్వే, కులగణన సర్వేలు రెండింటినీ సమన్వయపరుస్తూ, గణాంకాలను సమగ్రంగా విశ్లేషించి, సంక్షేమ, రిజర్వేషన్ విధానాలను రూపొందించడం ప్రభుత్వానికి మంచిది. 

‘సమగ్ర కుటుంబ సర్వే’ దేశంలోనే అలా నిర్వహించిన వాటిలో మొదటిది. ఆగస్టు 19, 2014 న, తెలంగాణ రాష్టవ్యాప్తంగా, ఆనాడున్న 90 లక్షల కుటుంబాలను కవర్ చేస్తూ నిర్వహించబడింది. ‘ప్రతిఒక్కరి సమగ్ర సామాజిక-ఆర్థిక గణాంకాలను’ సేకరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా, లాభదాయకంగా అర్హులైనవారికి అందేలా చూడడం సర్వే మౌలిక లక్ష్యం. మానవ వనరుల సహాయంతో ఒకేఒక్క రోజులో పూర్తి డేటా సేకరించి,  కేవలం 14 రోజుల్లో కంప్యూటర్ డేటా ఎంట్రీ చేశారు. ‘మానవ శక్తి + సాంకేతికత’ కలయికతో అనుకున్నది సాధించడంవల్ల, ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇదే బాటలో, దశాబ్దం తరువాత, ‘మొదటి కుల గణన’ అంటూ, 112 లక్షల కుటుంబాలను కవర్ చేసినట్లు ప్రభుత్వం చెప్తున్నది. ఈ గణనకు ఎస్కేఎస్ లాగా ఒకేఒక్క రోజు కాకుండా, 50 రోజులకు పైగా సమయం పట్టింది. 

సర్వేల మధ్య సారూప్యతలు, వ్యత్యాసాలు వున్నాయనేది వాస్తవం. సమగ్ర కుటుంబ సర్వే 100% గణన ఆధారంగా బీసీల జనాభాను 51 శాతంగా పేర్కొంది. టీసీఎస్ 96.9% కవరేజీ ఆధారంగా బీసీల శాతం 56.33గా  పేర్కొంటూనే, హిందూ బీసీలు 46.25 శాతం, ముస్లిం బీసీలు 10.08 శాతం అని ‘మెలిక’ పెట్టింది. షెడ్యూల్డ్ కులాలు ఎస్కేఎస్ లో 18 శాతం కాగా, టీసీఎస్ లో 17.43 శాతం. షెడ్యూల్డ్ తెగలు ఎస్కేఎస్ లో 10 శాతం కాగా, టీసీఎస్ లో 10.45 శాతం. ఇతర కులాలవారు (ఓసీలు) ఎస్కేఎస్ లో 21 శాతం కాగా, టీసీఎస్ లో 15.79 శాతం గా నమోదైంది. రెండు సర్వేలలో ఎస్సీ, ఎస్టీ శాతాలు దాదాపు ఒకేలా వుండడం గమనార్హం. ఎస్కేఎస్ 51 శాతం బీసీ జనాభాలో ముస్లిం బీసీలు లేరు. బహుశా ఎస్కేఎస్ ఓసీ జనాభాలో అది కలిసి వుండే అవకాశాలున్నాయేమో? 

అప్పుడు ముస్లిం బీసీలను బీసీ జనాభాలో కలిపినట్లయితే ఎస్కేఎస్ బీసీ శాతం, టీసీఎస్ బీసీ శాతం; ఎస్సీ, ఎస్టీ శాతాల మాదిరిగానే దాదాపు సమానం అవుతాయి. ఈ అంతరాన్ని సరిగ్గా అర్థంచేసుకుని, అనుమానాలను నివృత్తి చేసుకోకుండా, టీసీఎస్ బీసీ శాతం పెరిగిందని ఏకపక్షంగా వాదించడం సమంజసం కాదు.    

బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. ఫిబ్రవరి 4, 2025న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ, కేంద్రం కూడా టీసీఎస్ తరహాలో కుల, సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించాలంటూ విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఆమోదించింది. అదొక ‘చారిత్రాత్మక దినంగా’ పేర్కొన్నారు సిఎం. ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి, టీసీఎస్ ‘చారిత్రక ప్రాముఖ్యతను’ నొక్కి వక్కాణిస్తూ, బీసీల హక్కుల సాధన విషయంలో, రిజర్వేషన్ల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలని సూచించారు. మంచిదే!  

కానీ, ఏడేళ్లు వెనక్కు పొతే, 2017 ఏప్రిల్ 16న ‘తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రిజర్వేషన్ బిల్లు’ అసెంబ్లీలో ఆమోదించబడిన వేళ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాత్మక రాష్ట్ర హక్కులను గట్టిగా, అత్యంత సమర్ధవంతంగా సభలో ప్రసంగించడం ఇంతకంటే ‘మరింత చారిత్రాత్మక ఘట్టం’ అని చెప్పాలి. కేసీఆర్ మాట్లాడుతూ, సమగ్ర కుటుంబ సర్వే డేటా పరిపూర్ణమైనదని, అత్యున్నత న్యాయస్థానం విధించిన 50% పరిమితిని దాటి రిజర్వేషన్లు పెంచడానికి అది సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదని స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు కేసీఆర్ అపారమైన చొరవ తీసుకున్నారు. అలాగే ముస్లిం బీసీ-ఇ రిజర్వేషన్ 4 శాతం నుండి 12 శాతానికి, ఎస్టీ  రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి, ఎస్సీ రిజర్వేషన్ 15 శాతం నుండి 16 శాతానికి పెంచే ప్రతిపాదన చేసారు. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల (42 శాతం) పెంపుతో సహా, మొత్తం రిజర్వేషన్లను 62%కి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఆ దిశగా నిరంతర కృషి చేశారు. 

బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ ప్రయోజనాలకొరకు గణాంకాలను వాడుకోవడం కాకుండా, వాటిని సామాజిక న్యాయ సాధనంగా ఉపయోగించాలి. బాధ్యాతాయుతమైన ప్రతిపక్షం, అందునా మొట్టమొదటిసారిగా రికార్డ్ స్థాయి సమగ్ర కుటుంబ సర్వే ఒకేఒక్క రోజులో ద్విగ్విజయంగా చేయించిన ప్రభుత్వ పార్టీ నాయకులుగా ఇచ్చిన సూచనలను మన:స్ఫూర్తిగా ప్రభుత్వం స్వీకరించాలి. గగ్గోలు పెట్టడం సరైనది కాదు.  ఏదేమైనా, కేసీఆర్, రేవంత్ అనుసరించే మార్గాలలోనే వ్యత్యాసం కనబడుతున్నది. ఎవరి మార్గాన్ని ఎవరు అనుసరిస్తున్నారో, అనుకరిస్తున్నారో అనేది వేరే సంగతి. కాకపోతే, వినయంగా వాస్తవాలను అంగీకరించకపోవడంలోనే తేడా కనిపిస్తున్నది. రాజకీయమంటే ఇదేనేమో! ‘మీ చర్యలు ఇతరులను మరిన్ని కలలు కనేటట్టు, మరికొంత ఎక్కువగా నేర్చుకునేటట్టు, ఎక్కువ పనిచేసేట్లు, ఇంకా మెరుగయ్యేటట్టు ప్రేరేపిస్తే, అప్పుడు మీరు నిజమైన నాయకుడు అవుతారు’ అని అమెరికా 6వ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ అన్నాడు. అంటే, నాయకుడి ప్రధాన బాధ్యత, తాను నడుస్తూ, ఇతరులను తనతోపాటు నడిపిస్తూ లక్ష్యసాధన దిశగా మలచుకోవడం. ‘సర్వేలు, డేటాను పక్కన పెడితే’ – ఎవరు ఎవరిని ప్రేరేపించారు? ఎవరి ప్రభావం ఎవరిమీద పడింది? అనేది అందరూ గుర్తించాల్సిన అవసరం వుండి. 

తెలంగాణ కులగణన సర్వే డేటా ప్రభావం రిజర్వేషన్ విధానాన్ని, ముస్లిం బీసీల ప్రాభల్యం కారణంగా, ప్రతికూలంగా మారుస్తుందేమోనని,  బీసీ నేతలు, మేధావులు సహజంగానే భయపడుతున్నారు. సర్వేలో ముస్లిం బీసీలను జనరల్ బీసీ క్యాటగిరీలో చేర్చడం వల్ల, హిందూ బీసీల వాటా తగ్గిపోతుందని వారు భావిస్తున్నారు. ఆందోళన పడుతున్నారు. ఇది సహజం. సర్వే డేటాను సమాజ వాస్తవాలను ప్రతిబింబించేలా, మారుతున్న సామాజిక-ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్ విధానాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రాజకీయ లక్ష్యాలకు వాడకుండా, నిజమైన సామాజిక సంక్షేమానికి ఉపయోగపడేలా ఉండాలి. 

అందుకే భేషజాలను పక్కనపెట్టి, ఎస్కేఎస్ డేటాను తెలంగాణ కులసర్వే డేటాకు ఎలా అనుసంధానం చేయవచ్చో ఆలోచించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలకు మేలుకలిగేలా, పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ ‘హైబ్రిడ్ మోడల్‌ను’ రూపొందించాలి. వివాదాన్ని తీవ్రతరం చేయకుండా, పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నం జరగాలి. సామాజిక-ఆర్థిక దృక్పథంలో సమతుల్య అభివృద్ధి అవసరం. దానికి చొరవ చూపాల్సింది ప్రభుత్వమే. దాని నాయకుడు. ప్రతిపక్షాల సహకారం కూడా కోరాలి. 

 వివిధరంగాలకు చెందిన బీసీ సామాజిక వర్గాల ప్రతినిథుల భయాలను ప్రభుత్వం తొలగించాలి. సర్వపక్ష సహకారంతో సామరస్య బాటలు వేయాలి. ప్రభుత్వం, మేధావులు, అధికార-ప్రతిపక్ష బీసీ నాయకులు ఉమ్మడిగా  రాజకీయ అడ్డంకులను అధిగమించే దిశగా ఎవరిపాత్ర వారు పోషించాలి. (‘పోప్ ఎన్నిక విధానం’ మాదిరిగా) ఒక నెల రోజులు ఆలశ్యమైనా, ఏకాభిప్రాయ సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకోవాలి. ‘బీసీల హక్కులసాధన విషయంలో, రిజర్వేషన్ల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలి. 

రేవంత్ రెడ్డి కేవలం అసెంబ్లీలో చెప్పడమే కాకుండా త్రికరణశుద్ధితో  దాన్ని ఆచరణలో పెట్టడానికి చొరవ తీసుకోవాలి. సర్వపక్ష ఆమోదమార్గం అన్నిటికన్నా ఉత్తమమైనది. దీని ద్వారా ఒక సమతుల్యమైన ‘హైబ్రిడ్ మోడల్’ అమలుకు మార్గం సుగమం అవుతుంది. (సమగ్ర చర్చల, ఏకాభిప్రాయం అనంతరం ‘తెల్ల పొగ’-వైట్ స్మోక్-క్షణం కోసం ఎదురు చూద్దాం!) సమగ్ర కుటుంబ సర్వే అయినా, తెలంగాణ కుల సర్వే అయినా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తమ హక్కులను పరిరక్షించుకోవాలి. ఆ దిశగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వేసిన బలమైన పునాదులమీద నిర్మాణం చేసే బాధ్యత మలి ముఖ్యమంత్రిమీద వున్నది.  

పెట్టుబడుల ప్రకటనలతో సరిపోలని ప్రగతి (ప్రపంచ ఆర్థిక వేదిక భావితరాలకు ఎలా ఉపయోగకారి?) : వనం జ్వాలా నరసింహారావు

పెట్టుబడుల ప్రకటనలతో సరిపోలని ప్రగతి 

(ప్రపంచ ఆర్థిక వేదిక భావితరాలకు ఎలా ఉపయోగకారి?) 

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజి (12-02-2025)

{ప్రపంచ ఆర్థిక వేదిక అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించేందుకు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పెట్టుబడులను ఆకర్షించేందుకు విశిష్టమైన వేదికగా ఎదుగుతున్నప్పటికీ, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ-ఉపాధి కల్పనవంటి వాస్తవిక ప్రయోజనాలు సాధించడం గురించి నిరంతరం అనుమానాలు వ్యక్తమవుతూనే వున్నాయి.}-సంపాదకుడి క్లుప్త పరిచయం 

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్-డబ్ల్యుఇఎఫ్) వార్షిక సమావేశాలను, అంతర్జాతీయ పెట్టుబడుల అవగాహన ఒప్పందాలకు (ఏమ్వోయూ) పరిమితం చేయకుండా, పారిశ్రామిక, ఆర్ధిక, సామాజిక రంగాలలో నిష్ణాతులైన పలువురు ప్రపంచ స్థాయి ప్రభావశీలులైన వ్యక్తులతో, దీర్ఘకాలిక పరిచయాలకు, నిరంతర నెట్వర్కింగ్ చేయడానికి, వర్తమానంలో, భవిష్యత్తులో ప్రపంచ దిశ-దశ ఏమిటి అనే విషయంలో అవగాహన కలగడానికి అవకాశంగా ఉపయోగించుకోవాలని ఆర్ధిక విశ్లేషకుల అభిప్రాయం. ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వెల్లడి చేశారు. ఇటీవలి డబ్ల్యుఇఎఫ్ దావోస్ వార్షిక సమావేశంలో, భారత కంపెనీలతో సహా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో పెద్ద ఎత్తున అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కొందరు ముఖ్యమంత్రుల అవాస్తవ ప్రకటనల నేపథ్యంలో ఇలాంటి విశ్లేషణలకు ప్రాముఖ్యత వున్నదనాలి.  

డబ్ల్యుఇఎఫ్ స్విట్జర్లాండ్‌లోని ఒక అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థగా 1971 జనవరి 24న జర్మన్ ఇంజనీర్, ఆర్థికవేత్త క్లాస్ స్క్వాబ్ తన 33 వ ఏట, యూరోపియన్ల యాజమాన్య వేదిక (యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరమ్) పేరుతోస్థాపించారు. దీని లక్ష్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, వ్యాపార, రాజకీయ, విద్యావేత్తలతో పాటు సమాజంలోని ఇతర ప్రతిభాశీలురైన నాయకులను ఒక ఉమ్మడి వేదిక మీదకు చేర్చి, వార్షిక సదస్సులు నిర్వహించి, ప్రపంచ, ప్రాంతీయ, పారిశ్రామిక విధానాలను రూపొందించడం. ఇటీవల ముగిసిన 54వ డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశం జనవరి 15-19, 2025 మధ్య దావోస్‌లో జరిగింది. కీలకమైన ప్రపంచ-ప్రాంతీయ సవాళ్లను పరిశీలించి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వృద్ధిని ప్రేరేపించడం, భౌగోళిక రాజకీయ తాకిడులకు ప్రతిస్పందించడం లాంటివి డబ్ల్యుఇఎఫ్ చేపట్టింది.   

ఇందులో అంతర్జాతీయ సంస్థల, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారుగా 3000 మంది ప్రపంచవ్యాప్త విధాన నిర్ణేతలు, ప్రభుత్వ, వ్యాపార, పౌర సమాజ విద్యాసంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరిలో దేశాధినేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఉన్నారు. అమెరికా నుండి 674 మంది, ఇంగ్లాండ్ నుండి 270, చైనా నుండి 140 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత దేశం నుండి, గతంలో కంటే, అత్యధిక సంఖ్యలో 133 మంది ప్రతినిధులు (‘ఒకే బృందం, ఒక భారతీయ ప్రదర్శన’ అనే థీమ్‌తో) హాజరయ్యారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా, వివిధ రంగాల నుండి సుమారు 100 మంది సీఈఓలు పాల్గొన్నారు. 

యూరోపియన్ మేనేజ్‌మెంట్ నిపుణలకు, అమెరికన్ మేనేజ్‌మెంట్ మెలకువలను, విధివిధానాలను నేర్పించడమనే క్లాస్ స్క్వాబ్ ప్రారంభ ఆలోచన, క్రమంగా ఆర్థిక, సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడంగా మార్పు చెందింది. 1971 సంవత్సరం నాటి ప్రారంభ సమావేశానికి 400 మంది దిగ్గజ యూరోపియన్ వ్యాపారవేత్తలను, వివిధరంగ నిపుణులను ఆహ్వానించి,  స్క్వాబ్ తన పూర్వ పరిచయాలతో, నేర్పరితనంతో, చాకచక్యంతో వ్యూహాత్మకంగా తక్షణ, భవిష్యత్తు నిధులను సమీకరించాడు. స్విస్ ఫెడరల్ ప్రభుత్వ పర్యవేక్షణలో లాభాపేక్షలేని సంస్థగా స్థాపించబడిన డబ్ల్యుఇఎఫ్, ప్రతిఏటా ప్రశాంతమైన పర్వత ప్రాంతం దావోస్‌లో ‘వార్షిక సమావేశాలు’ నిర్వహించడం ఆనవాయితీగా సాగుతున్నది. పరస్పర సహకార చర్చలకు అనువైన స్థలంగా దీన్ని ఎంచుకున్న స్క్వాబ్, డబ్ల్యుఇఎఫ్ ను ‘దావోస్ ఆత్మ’గా పేర్కొన్నారు. 

(ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్, నైపుణ్యం సంతరించుకున్న ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త. ప్రజా-పౌర సంబందాల నిపుణుడు. జాతీయ-అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక క్షేత్రాల్లో పేరొందిన వ్యక్తి.  వీటికి అదనంగా, ప్రపంచ ఆర్ధిక వేదికను మరింత సార్ధక మార్పులు తేవడానికి, మరింత  వినయం, బాధ్యత, నైతికతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఆద్యతన భవిష్యత్తులో సమాయత్తం చేయాలి. పెద్ద స్థాయిలో పెట్టుబడులు ఆర్థికాభివృద్ధికి సానుకూలమైన మార్గదర్శకాలు. ఇవి వాస్తవ వ్యతిరేక ప్రకటనలతో సరిపుచ్చకుండా, అసలు-సిసలైన అభివృద్ధి సంకేతాలుగా మారడం అత్యవసరం. నైతికతతో కూడిన ఆధునిక విధానాలతో ప్రపంచ ఆర్థిక వేదిక తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ, వర్తమాన, భవిష్యత్తు సమాజానికి దార్శనికతను ఇవ్వడానికి దోహదపడేలా ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్ జాగ్రత్త పడాలి.  వేదిక మరింత అర్థవంతం కావాలి.)

దావోస్‌లో డబ్ల్యుఇఎఫ్ కి స్థిరమైన ప్రాంగణం లేదు. కాకపోతే, పరిశోధన, వాణిజ్యం, సాంకేతికతపై దృష్టి సారించి, వ్యాపారం, ప్రభుత్వం, విద్యాసంస్థలు, పౌర సమాజాల నాయకులు కలవడానికి, వారిని కలపడానికి, చైనా దాలియాన్లో, మరికొన్ని ఇతర ప్రదేశాలలో ‘నూతన చాంపియన్ల ప్రత్యేక వార్షిక సమావేశాలు’ (యాన్యువల్ మీటింగ్స్ ఆఫ్ ద న్యూ చాంపియన్స్) డబ్ల్యుఇఎఫ్ నిర్వహించింది కొన్ని పర్యాయాలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015లో దాలియాన్‌లో జరిగిన అలాంటి ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొని, తనదైన ప్రత్యేక శైలిలో, తెలంగాణను పెట్టుబడుల స్వర్గంగా ప్రచారం చేయడంలో పూర్తిగా సఫలమయ్యారు. ఆ సమావేశంలో ఆయన చేసిన ‘రాజనీతిజ్ఞతతో కూడిన ఉపన్యాసం’ లోభారత ఆర్థిక వ్యవస్థను సమర్థించడం, చైనా అభివృద్ధిని ప్రశంసించడం, తెలంగాణ సాధించిన అభివృద్ధిని తెలియచేయడం విశేషం.   

ప్రత్యేక ఆహ్వానితులకే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనే వీలుంది. ఆర్థిక, రాజకీయ రంగంలో ప్రధాన పాత్రదారులు, క్లిష్టతరమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించడం లాంటి డబ్ల్యుఇఎఫ్ లక్ష్యాలను ముందుకు తీసుకుపోగలిగేవారు సమావేశాలకు ఆహ్వానితులు. పెట్టుబడుల అవకాశాలకోసం తెరవెనుక లాబీయింగ్ చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. బహుశా అందువల్లనే, భారతదేశంనుండి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ వేదిక వార్షిక సమావేశాలలో  పాల్గొంటారు. ఈ వేదికను 'జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక విధానాలను రూపకల్పన చేయడానికి ప్రోత్సహించే 'సామాజిక సంస్థ'గా కూడా చెప్పుకోవచ్చు. నిర్వాహకుల అవగాహనకు అతీతంగా, 'నియంత్రణల సడలింపుకు, మార్కెట్ స్వేచ్ఛకు’ ప్రాధాన్యమిచ్చే ‘నయా ఉదారవాద విధానాల' వేదికగా డబ్ల్యుఇఎఫ్ మారుతున్నదన్న విమర్శ వస్తున్నది. బహుశా, ప్రజల సార్వజనీక, విస్తృత ప్రయోజనాలకు ఈ వేదిక సరిపడకపోవచ్చునేమో. ఏదేమైనా, అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల పెట్టుబడి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఇది ప్రధాన వేదికే. 

(1997లో దేవేగౌడ పాల్గొన్న రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొన్న మొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీ. 2018 డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న మోడీ, పలువురి ప్రశంసలను పొందిన అలనాటి తన కీలక ప్రసంగంలో, భారతదేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సులభతర వాణిజ్యం, విరివిగా పెట్టుబడి అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలను సోదాహరణంగా ప్రస్తావిస్తూ, ప్రపంచ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించారు. పర్యావరణ మార్పులు, తీవ్రవాదం వంటి ప్రపంచ సమస్యలపై అనర్ఘళంగా మాట్లాడుతూ, భారత్‌ను బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. ఈ నేపధ్యంలో, ఇటీవలి సమావేశంలో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వేదికమీద భారతదేశం  7% ఆర్థిక వృద్ధి సాధించడాన్ని క్లాస్ స్క్వాబ్ సముచితంగా ప్రశంసించారు.) 

నారా చంద్రబాబునాయుడు 1990-2000 మధ్య కాలంలో, ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొన్న తొలి భారతీయ ముఖ్యమంత్రులలో బహుశా ప్రధముడు కావచ్చు. ఆ వేదికను చాకచక్యంగా ఉపయోగించుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష–పరోక్ష పెట్టుబడుల కేంద్రంగా మలిచారు. హైదరాబాద్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా రూపొందించి, దేశ ఐటీ వృద్ధిలో, ఆయన నిర్వహించిన పాత్ర అమోఘం. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో చర్చలు జరిపారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2023లో నూ, ఇప్పుడూ కూడా, పాల్గొని, అమెజాన్, సన్ పెట్రోకెమికల్స్, టిల్‌మన్ గ్లోబల్ హోల్డింగ్స్ వంటి హేమాహేమీ సంస్థల నుండి రూ 1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను తెలంగాణకు సాధించారు. ఈ పెట్టుబడులద్వారా సుమారు 49,550 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు ప్రభుత్వ అంచనా. ముఖ్యమంత్రిని, ఆయన సహచర ప్రతినిధుల బృందాన్ని అభినందించాలి. 

ప్రపంచ ఆర్థిక వేదిక అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించేందుకు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పెట్టుబడులను ఆకర్షించేందుకు విశిష్టమైన వేదికగా ఎదుగుతున్నప్పటికీ, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ-ఉపాధి కల్పనవంటి వాస్తవిక ప్రయోజనాలను ఎంతవరకు సాధిస్తున్నది అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతూనే వున్నాయి. చంద్రబాబునాయుడు పాలన చేసిన రోజుల నుండి, ఉమ్మడి అంధ్రప్రదేశ్, తదనంతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు ఈ వేదికను సద్వినియోగం చేసుకుని, బిలియన్‌ డాలర్లలో పెట్టుబడులు పొందినట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు ఎంతమేరకు దీర్ఘకాలిక అభివృద్ధి సాధించడానికి దోహదపడుతాయనేది కూడా  ‘బిలియన్‌ డాలర్ల’ ప్రశ్నే! లేదా, రాజకీయ స్వప్రయోజనాలను ప్రచారం చేసుకోవడానికేనా అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.

ఈ నేపథ్యంలో, జనాభా సమస్యను మొట్టమొదట సూత్రీకరించిన విశ్వవిఖ్యాత బ్రిటీష్ ఆర్థికవేత్త రాబర్ట్ థామస్ మాల్థస్ ‘జనాభా సిద్ధాంతాన్ని’ ప్రపంచ ఆర్థిక వేదికలో రాజకీయ నాయకులు ప్రకటించే బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే ఆసక్తికరంగా వుంటుంది. ఆహారధాన్యాల పెరుగుదల రేటు కంటే జనాభా పెరుగుదల రేటు హెచ్చుగా ఉంటుందని మాల్థస్ తన సిద్ధాంతంలో వివరించాడు. అంటే, మాల్థస్ సిద్ధాంతం ప్రకారం, ఆహార ధాన్యాల వృద్ధి అంకశ్రేణి క్రమంలో - అంటే 1, 2, 3, 4, 5... పద్ధతిలో పెరుగుతుంటే, జనాభా వృద్ధి గుణశ్రేణి క్రమంలో – అంటే, 1, 2, 4, 8, 16... పద్ధతిలో పెరుగుతుంది.  డబ్ల్యుఇఎఫ్ వేదిక ఆధారంగా జరిగే ‘అవగాహనా ఒప్పందాలు’ దరిమిలా ‘అవి కలిగించే వాస్తవ ప్రయోజనాల’ మధ్య కూడా ఇలాంటి అసమానతలే వున్నాయి.

పెట్టుబడుల ప్రకటనలు, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి భ్రమ, భారీ ఉద్యోగ-ఉపాధి కల్పనల ఆశలు రేకెత్తిస్తాయి. కానీ ఈ ప్రకటనల స్థాయిలో వాస్తవిక ఫలితాలు వుండడం లేదు. నిధుల విడుదల, మౌలిక ప్రాజెక్టుల అమలు, క్షేత్రస్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు సాధించడంలో అనేక నియంత్రణ సమస్యలు, ఆర్థిక అనిశ్చితులు, రాజకీయ ప్రేరిత హైప్ ప్రకటనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ అసమానత కారణంగా అభివృద్ధి అంతరం ఏర్పడుతోంది. వాగ్దానాల ప్రకారం ఆర్థిక మార్పు సాధించడంలో విఫలమవ్వడం వల్ల సంశయాలు, విలంబం, విధాన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి పెట్టుబడుల ప్రకటనలు వాస్తవ ప్రగతితో అనుసంధానమయ్యేలా జాగ్రత్తపడాలి. 

Monday, February 10, 2025

న్యాయ సంహిత, సహజ న్యాయ సూత్రాలను పాటిస్తుందా? : వనం జ్వాలా నరసింహ రావు

 న్యాయ సంహిత, సహజ న్యాయ సూత్రాలను పాటిస్తుందా? 

వనం జ్వాలా నరసింహ రావు

మనతెలంగాణ దినపత్రిక (11-02-2025)

ఆంగ్ల తత్వవేత్త జెరెమీ బెంథమ్ ప్రతిపాదిత ఉపయోగితావాద సిద్దాంతమైన  'గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ది గ్రేటెస్ట్ నంబర్'ను (అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మంచి చేకూరడం) పలువురు రాజకీయ, సామాజిక, పాలనారంగ ప్రముఖులు ఆమోదించారు. ఇది ప్రభుత్వాల పనితీరును లక్ష్యంగా పెట్టుకుని ఆలోచన చేయబడిన అద్భుతమైన సందేశం. ప్రభుత్వాల ఆలోచనారహిత, ఏకపక్ష విధి-విధాన నిర్ణయాల మంచిచెడులు, లాభనష్టాలు భేరీజు వేయడం జరుగుతున్నదా, లేదా? అవి అత్యధిక సంఖ్యాకులకు మేలు చేకూరుస్తున్నాయా? కీడు కలిగిస్తున్నాయా? అనే ‘మెరిట్, డీ మెరిట్’ మీదనే వాటి మనుగడ సాధ్యం అనే సిద్దాంతానికి ప్రాతిపదిక బెంథమ్ ఆలోచన. దీన్నే జాన్ స్టువర్ట్ మిల్ 'గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ప్రిన్సిపల్' (అత్యధికులకు ఆనందం అనే సిద్దాంతం) రూపంలో మరింత ముందుకు తీసుకుపోయారు, 

భారతదేశంలో కాలానుగుణంగా మారుతున్న న్యాయ వ్యవస్థ అవసరాలను గుర్తించి, బహుశా, విప్లవాత్మకంగా న్యాయ సంహితను పునర్నిర్మించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించి, న్యాయ సంఘం, నిపుణులు, లాయర్లు, న్యాయమూర్తులు, పార్లమెంటరీ కమిటీలు విశ్లేషణ జరిపి కొత్త నిబంధనలను రూపొందించడం జరిగింది. మార్పులో భాగంగా, 'భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)' అనే కొత్త క్రిమినల్ కోడ్ చట్టాలను తీసుకురావడంతో, ఇవి, బెంథమ్, జాన్ స్టువర్ట్ మిల్ ల సిద్ధాంతాలకు అన్వయించి, విశ్లేషించాల్సిన అవసరం వున్నదనాలి. 2024 జూలై 1న ఈ చట్టం అమల్లోకి రావడంతో, బ్రిటీష్ భారత కాలంనాటి 'ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసి)' స్థానాన్ని భర్తీ చేసింది. 

బీఎన్ఎస్ లో ఉపయోగించిన భాష, భారతీయ వ్యవహార శైలిలో 'సంస్కృత పదజాలం, నిర్వచనాలు' కలిగి వున్నాయనాలి. ఉదాహరణకు రాష్ట్ర ద్రోహ్, అసమయిక సభ, హత్య, చోరీ, ధార్మిక భావన భంగం, బలాత్కారం, సైబర్ అపరాధం, అపవాదు మొదలైనవి వున్నాయి. క్రిమినల్ చట్టాల్లో ఉపయోగించే భాషను నవీకరించి, సైబర్ నేరాలను, వ్యవస్థీకృత నేరాలను, ఆర్ధిక మోసాలను, తదితర వర్తమాన నేరాలకు సంబంధించిన నిబంధనలను పరిచయం చేస్తుంది చట్టం. పిల్లల, మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు, బలాత్కారం, లైంగిక వేధింపులకు, మెరుగైన, కఠినమైన జరిమానాలను, 'మరింత కఠినమైన శిక్షలను' అమలు పరచడానికి నిబంధనలను పొందుపరచడం జరిగింది. 

చట్టాలలో తీసుకువచ్చిన ఈ మార్పులకు అనుకూలతతో పాటు, తీవ్రమైన  వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ నవీన నామకరణ చట్టాలు కేంద్రప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసి నొక్కి వక్కాణించినట్లుగా, 'న్యాయ ప్రక్రియలో ఆలస్యాలు' తగ్గిస్తాయా? 'న్యాయ ప్రక్రియను' సులభతరం చేస్తాయా? అనేది ఆలోచన జరగాలి. న్యాయస్థానాల రికార్డులను డిజిటలైజ్ చేయడం, ఈ-ఫైలింగ్‌ను ప్రోత్సహించడం, వర్చువల్ హియరింగ్స్‌ను ముమ్మరం చేయడం కొత్త చట్టాలలో భాగం. ఈ ప్రయత్నాలు కేసుల పరిష్కారాలను వేగవంతం చేసి, పెండింగ్ కేసుల వ్యవధిని తగ్గించడానికి వీలవుతుందా? తేలాలి. చట్టాలలో పొందుపర్చిన 'బాధితుల హక్కుల' పట్ల మరింత దృష్టి సారించడం, నేర న్యాయ ప్రక్రియలో వారి భాగస్వామ్యం కలిగించడం, బాధితులకు చట్టపరంగా అవసరమైన నష్టపరిహారం చెల్లించడం, సాక్షుల రక్షణ కార్యక్రమం, నేరాల బాధితులకు సరైన సమయంలో, శారీరక ఆరోగ్య-వైద్య పరీక్షలు చేయించే విధానం చేసే మేలు తెలియాలి.  

హేయమైన నేరాలకు కఠినమైన జరిమానాలను విధించడం, శిక్షలు, బలాత్కారం, యాసిడ్ దాడులు, మానవ అక్రమ రవాణా లాంటి నేరాలకు మరింత కఠినమైన శిక్షలను అమలుపరచడం, ఈ నేరాల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంభించడం నూతన చట్టాల ప్రాముఖ్యత అని ప్రభుత్వం అంటున్నది. న్యాయవ్యవస్థపై భారం తగ్గించడానికి, చిన్న, చిన్న నేరాలను, నేరరహితమైనవిగా, పౌర ఉల్లంఘనలుగా వర్గీకరించడం, తద్వారా, తీవ్రమైన నేరాలపై దృష్టిని కేంద్రీకరించడం, వనరులను ఆ దిశగా వినియోగించడం జరిగిందని ప్రభుత్వ వాదన. ఇవన్నీ చేయడం ద్వారా, కొత్త చట్టాల లక్ష్యం, సమాజంలో నేరస్థుల పునరావాసం, పునఃసంప్రేక్షణకు ప్రోత్సాహించడం, నేరస్తులను తిరిగి సమాజంలోకి చేర్చడం, క్షమాభిక్ష ప్రసాదించడం, కౌన్సిలింగ్ ద్వారా చిన్న నేరాలకు పాల్పడినవారికి జైలుశిక్షలకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది న్యాయవ్యవస్థ పునరావాస దృక్పథాన్ని, సంస్కరణ కోణాన్ని ప్రస్ఫుటంగా సూచిస్తుందని కొందరి భావన. ఇవన్నీ పారదర్శకంగా జరుగుతే మంచిదే.

ఈ చట్టాలను, లోతుగా నిష్పాక్షికంగా విశ్లేషిస్తే, ప్రభుత్వం ఇస్తున్న వివరణలన్నీ సానుకూల వాదనలే అయినప్పటికీ, వాటిలో నిభిడీకృతమై వున్న చట్టపరమైన లాభనష్టాలను, ప్రయోజనాలను, అప్రయోజనాలను, ప్రభుత్వం మరికొంత జాగరూకతతో, పరిశీలనాత్మక ధృక్పధంతో, సామాన్యుల అవగాహనా కోణంలో, మెరుగైన, తెలివైన నిర్ణయం తీసుకుని, అవసరమైన, ఆధారిత మార్పులను కాలానుగుణంగా చేయాలి. కొత్త చట్టాల 'ఆవశ్యకతలు, అనివార్యతలు, చిక్కులు, ప్రభావాలు, అమలు' పరిచే సరైన వ్యూహం, చట్టపరమైన నిపుణల, సద్విమర్శించగల ప్రతిపక్ష నాయకుల, సామాన్య వ్యక్తుల ఆమోదయోగ్యమైనవిగా వుండేలా ప్రభుత్వం జాగ్రత్త పడాలి. అలా జరిగినప్పుడే జెరెమీ బెంథమ్ ప్రతిపాదించిన ‘అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మంచి చేకూరడం’ సిద్దాంతం కానీ, జాన్ స్టువర్ట్ మిల్ ప్రతిపాదించిన ‘అత్యధిక సంఖ్యాక ప్రజలకు అత్యధిక లబ్ది’ అనే సిద్దాంతం కానీ పాటించినట్లు అవుతుంది.     

నవీన చట్టాలు నేరాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సాంకేతికతకను విరివిగా వినియోగిస్తాయి. ఉదాహరణకు, బహువిధాల అవసరమైన దర్యాప్తు సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరచడానికి, ఖచ్చితంగా సకాలంలో న్యాయం జరిగేలా జాగ్రత్తపడడానికి, నిఘా, ఫోరెన్సిక్ సైన్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగం పనికొస్తాయి. అంతే కాకుండా, నూతన చట్టాలు సంస్కరణాత్మక న్యాయానికి, పునరావాస న్యాయానికి ప్రాముఖ్యత కల్పిస్తూ నేరస్థులకు పునరావాసం కలిగించడానికి, వివిధ సామాజిక సహాయక కార్యక్రమాల నేర ప్రవృత్తిని తగ్గించి మరోమారు నేరాలు చేయకుండా చూడడానికి పనికొస్తాయని ప్రభుత్వ భావన. పాత చట్టాలు ప్రధానంగా శిక్షాత్మక ప్రధానమైనవని, పరిమిత దృష్టితోనే పునరావాసానికి వీలున్నదని, ప్రభుత్వ సంజాయిషీ.

నిష్పక్షపాత విశ్లేషణ ఎప్పటికప్పుడు జరుగుతే, న్యాయ పరిజ్ఞానం ఉన్నవారికి, సామాన్య వ్యక్తికి, కొత్త చట్టాలను వాటిలో వున్న బలాలను, బలహీనతలను, అవకాశాలను, ఇబ్బందులను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చు. కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రధానంగా చట్టాల ఆధునీకరణ, సమర్థత (సాంకేతిక, సులభతరమైన విధానాల సమీకరణ), నేరస్థుల కేంద్రీకృత సహాయతా దృక్పథం (దయ, వేగవంతమైన న్యాయప్రక్రియ), కఠినమైన శిక్షలు (తీవ్రమైన నేరాలకు మాత్రమే) మొదలైనవి చట్టంలో వున్నాయి. చట్టంలో బలహీనతల గురించి ప్రస్తావించాలంటే,  అమలు పరచే ప్రక్రియలో సవాళ్లు (పాత నుండి కొత్త చట్టాలకు మార్పు), సాంకేతికత మీద ప్రధానంగా ఆధారపడటం (ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ మౌలిక సదుపాయాల లభ్యత పరిమితంగా ఉండటం), అపనమ్మకం (కఠినమైన చట్టాల, శిక్షల దుర్వినియోగం, అపనమ్మకం) మొదలైనవి వున్నాయి.

ఈ చట్టం అమలు ద్వారా, భవిష్యత్తులో అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయంటున్నారు న్యాయ నిపుణులు. న్యాయ సంస్కరణలు (న్యాయ వ్యవస్థను మరింత బలపరచడం), ప్రజా విశ్వాసం పెంచడం (ఆధునిక పద్ధతులు ప్రజా విశ్వాసం పునరుద్ధరించడానికి సామర్థ్యం కలిగి ఉంటాయి), అంతర్జాతీయ సరళి (అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా మారడం) మొదలైనవి ఇందులో భాగంగా చెప్పుకోవాలి. చట్టం అమల్లో ఇబ్బందులు లేకపోలేదు, సహజంగానే మార్పును నిరాకరించడం (వాటాదారులు, న్యాయనిపుణుల ప్రతిఘటనకు అవకాశాలు), సైబర్ సెక్యూరిటీ ప్రమాదం (సాంకేతికత మీద ఆధారపడటం వల్ల సున్నితమైన, ఆదార్ లాంటి న్యాయ డేటా, ఇతర ప్రక్రియలకు ముప్పు), ఆర్థిక భారం (మార్పులను అమలు చేయడం కోసం భారీ మొత్తంలో నిధుల అవసరం) మొదలైనవి, ఇందులో భాగంగా అర్థం చేసుకోవాలి.

భారతీయ తత్వం, సంప్రదాయంలో లోతుగా పొందుపరచిన సహజ న్యాయ సూత్రాలు 'భారతీయ న్యాయ సంహిత'లో సందర్భోచితంగా ఇమిడి వున్నాయన్న భావనను ప్రభుత్వం బలీయంగా కలిగించింది. భారతీయ న్యాయ సంహిత సంస్కరణలు నిష్పాక్షికంగా అమలైతే, అమలు చేయగలిగితే, భారతీయ న్యాయ పటాన్ని పౌరులందరికీ పటిష్టంగా, పారదర్శకంగా, న్యాయంగా, న్యాయసమర్పణలో సమానత ఉండేలా దోహదపదడంలో సందేహం లేదు. వాటి సంపూర్ణ విజయం న్యాయకోవిదుల, రాజకీయ-సామాజిక విశ్లేషకుల, విమర్శకుల ప్రత్యక్ష, పరోక్ష అంగీకారంమీద ఆధారపడుతుంది. దీర్ఘకాలిక అనుభవమే దానిని నిర్ధారిస్తుంది! 

నూతన క్రిమినల్ కోడ్ చట్టాలు న్యాయ శాసనాన్ని ఆధునికీకరించడానికి, నిరంతరం మార్పుకు గురవతున్న సవాళ్లను సమర్థవంతంగా, సులభతరంగా ఎదుర్కోవడానికి, నేరస్థులకు స్నేహపూర్వకంగా, వర్తమాన సమస్యల పరిష్కారానికి అనుగుణంగా, న్యాయ సంస్కరణలకు ఒక కీలక దశకు చేర్చేందుకు దోహదపడవచ్చు. న్యాయం పొందేవిషయంలో పౌరులంతా సమానమే అనే సహజ న్యాయసూత్రాలను త్రికరణశుద్ధిగా న్యాయవ్యవస్థ పాటిస్తేనే, ప్రభుత్వాలు పాటించనిస్తేనే, అది సాధ్యమవుతుంది.

 భారతీయ న్యాయ సంహిత, వేదకాలం నుండి పాటించిన సహజ న్యాయ సూత్రాల, తత్వవేత్తల, వేదాల, మనుస్మృతి, మహాభారతం, రామాయణం, కౌటిల్యుడి అర్థశాస్త్రం మొదలైన వాటిలో ప్రస్తుతించిన వాటికి అనుగుణంగా వుండకపోతే, సార్వజనీక ఆమోదం ఒకింత అనుమానాస్పదమే! 'సత్యం, నైతిక క్రమం' ప్రాముఖ్యతను పెంపొందించే, నొక్కి వక్కాణించే, వేదాలు, న్యాయసూత్రాలు, 'హిందూ వేదాంత తత్త్వానికి’ ప్రధాన భావనైన 'నైతికత, నైతిక సూత్రాలు' అనే మానవ ప్రవర్తనను మార్గనిర్దేశం చేస్తాయి. ఇందులో విధులు, హక్కులు, చట్టాలు, ప్రవర్తన, సద్గుణాలు, జీవన విధానం చేర్చబడింది. 'భారతీయ న్యాయసంహిత' ఈ 'సహజ న్యాయసూత్రాలను' వాస్తవ దృక్ఫధంతో, సమర్థవంతంగా, సమన్యాయంతో, న్యాయవ్యవస్థ సమకూర్చాల్సిన హక్కుల పరిరక్షణను పాటిస్తూ, ఆధునిక అవసరాలను తీర్చే దిశగా సముచితంగా అడుగులు వేస్తుందా, లేదా, అనేది కోటి రూకల ప్రశ్న.' వేచి చూస్తేనే అవగతమౌతుంది!