Showing posts with label 108. Show all posts
Showing posts with label 108. Show all posts

Saturday, January 7, 2012

సమన్వయమా, సమాంతరమా: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (8-01-2012)
వనం జ్వాలా నరసింహారావు

సమన్వయ కమిటీ సమన్వయ సాధన కోసమేనా?; ప్రథమ సమావేశంలో అనూహ్య పరిణామాలు; అసంతృప్తివాదుల సమర శంఖం; పరస్పర ఆరోపణలు, విమర్శలు; విభేదాలపై కథనాలు; సమర్ధ పాలనకు సహకరిస్తారా? (ఎడిటర్)


పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో తడబడుతూ అడుగులు వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అచిర కాలంలోనే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్రమ పద్ధతిలో ఆకళింపు చేసుకుని, అందరినీ కూడదీసుకుని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న నేపధ్యంలో, కారణాలేవైనప్పటికీ, పార్టీకి-ప్రభుత్వానికీ మధ్య అవగాహనుండాలన్న నెపంతో, ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఆ కమిటీలో సమతుల్యం వుండాలన్న భావనతో ముఖ్యమంత్రిని-ఉపముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని-మాజీ పీసీసీ అధ్యక్షుడిని, కావూరిని-చిరంజీవిని-షబ్బీర్ అలీని ఒక ఆలోచన ప్రకారం సభ్యులుగా ప్రకటించింది అధిష్టానం. కిరణ్ తోక కత్తిరించడానికే ఈ కమిటీ ఏర్పాటైందని కొందరు భావిస్తే, కానేకాదు... బొత్స దూకుడు కట్టడి చేయడానికే అని మరికొందరన్నారు. అదేం కాదు, చిరంజీవిని బుజ్జగించడానికే అని అన్నవారు కూడా వున్నారు. మాజీ పీసీసీ ఛీఫ్‌ను, మహమ్మద్ అలీ షబ్బీర్‌ను, కావూరి సాంబశివరావును ఎందుకు నియమించారంటే ఇదమిద్ధంగా సమాధానం లేదెవరిదగ్గరనుంచి కూడా. ఏదేమైనా, ఏదో ఒక పదవిని అప్ప చెప్పడం, అదెంత పెద్దదైనా-చిన్నదైనా, ఆ పదవి లభించినవారెంత పెద్దవారైనా-చిన్నవారైనా, మురిసిముక్కలవడం కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడూ అదే జరిగింది. సమన్వయ కమిటీలో పేర్లున్న వారిలో కొందరిని ఈ వ్యాస రచయిత అభినందించినప్పుడు, వారి ఆనందానికి హద్దులు లేని విధంగా వారి దగ్గర్నుంచి స్పందన లభించిందంటే, ఆ పదవి ఎంతముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా, సమన్వయ కమిటీ ప్రధమ సమావేశానికి కమిటీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పూనుకుని, హైదరాబాద్ నగరానికి విచ్చేయడం, సమావేశం పూర్వ రంగంలో- సమావేశంలో, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం.




కిరణ్ కుమార్ రెడ్డి నియంతలాగా వ్యవహరిస్తున్నారని సమన్వయ కమిటీ ఛైర్మన్ గులాంనబీ ఆజాద్‌కు పలువురు ఫిర్యాదులు చేశారని, అసంతృప్తి వాదులెందరో ముఖ్యమంత్రిపై సమరశంఖం పూరించారని, అంత భారీ ఎత్తున ఆయనకు వ్యతిరేకత వ్యక్తం కావడం ఆజాద్‌ను విస్తుపోయే ట్లు చేసిందని మీడియాలో కధనాలొచ్చాయి. తనపైనా, తన సహచర మంత్రులపైనా కొందరు ఎమ్మెల్యేలు-మంత్రులు ఫిర్యాదులు చేయడం వెనుక, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రోత్సాహం వుందన్న అనుమానం కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితుల ముందర వ్యక్త పరిచినట్లు కూడా మీడియా కధనాలొచ్చాయి. నిఘా వర్గాలు కూడా ఆ అనుమానాలను ధృవపర్చాయట. నిజానిజాలేవైనప్పటికీ, బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పటినుంచి, ఆయనకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య విభేదాలున్న ట్లు కథనాలొస్తూనే వున్నాయి. వాస్తవానికి ఆ కథనాల నేపధ్యంలోనే, సమన్వయకమిటీ ఏర్పాటైందని కూడా అనుకుంటున్నారు విశ్లేషకులు. ఐతే, సమన్వయ కమిటీ ఏర్పాటుకు కిరణ్ హస్తముందా? బొత్స హస్తముందా? లేదా వారిద్దరినీ ఒకరిపై మరొకరు దాడి చేసుకోకుండా నివారించేందుకు అధిష్టానమే అందుకు పూనుకుందా? అనే దానికి ఎవరి సమాధానం వారే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన బొత్స పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ప్రత్యేక అజెండాతో వెళుతున్నారని, అందులో భాగంగానే కిరణ్‌ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నారని బాహాటంగా బొత్స వర్గీయులే చెప్పడమే కాకుండా, ఆజాద్‌ ఎదుట ఆ తర్వాత జరిగినట్లు భావిస్తున్న పంచాయితీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, చిరంజీవితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా కిరణ్‌‍ను టార్గెట్ చేశారట.

తొలి సమన్వయంలోనే వెల్లువెత్తిన సమర ధ్వనులలో, కిరణ్ కుమార్ రెడ్డిపై చేసిన ఆరోపణలలో ప్రధానమైనవి, ఆయన ఎవరినీ సంప్రదించకుండానే నూతన పథకాలను ప్రకటించడం, సీఎం వి అన్నీ ఒంటెత్తు పోకడలనడం, గాంధీభవన్‌కు అంతవరకూ ఎన్నడూ రానివారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారనడం, ప్రభుత్వ పాలనంతా పూర్తిగా ఏకపక్షం అనడం లాంటివున్నాయి. అలా ఫిర్యాదులు మొదటిరోజు చేసిన వారిలో సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి కూడా వున్నారు. ఆయన లేవనెత్తిన అంశంలో సహచర మంత్రి శంకర్రావుపై సబితా ఇంద్రారెడ్డి మనుషులు చేసినట్లు చెప్పుకుంటున్న దాడి కూడా వుండడం విశేషం. ఇక ఎప్పటినుంచో 104, 108 వాహనాల విషయంలోను, రాజీవ్ ఆరోగ్య శ్రీ విషయంలోను, ఆ మాటకొస్తే మొత్తం ఆరోగ్య-వైద్య శాఖ విషయంలోను ముఖ్యమంత్రి జోక్యాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆ శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, ప్రభుత్వ పథకాల విషయంలో సీఎం సంబంధిత శాఖ మంత్రులను అసలే సంప్రదించడం లేదని, అలానే తామూ ఆయనను సంప్రదించే అవకాశమే లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారట. అలాగే 108 వాహనాలపై రాజీవ్ గాంధి బొమ్మ వివాదం కూడా ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. కొందరు పార్టీ నాయకులు, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే 2014 ఎన్నికల్లో పరాజయం పాలైతుందని అనే దాకా వెళ్లడం గమనించాల్సిన విషయం.

గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకెలా పొక్కాయోకాని, ముఖ్యమంత్రిని "మిస్టర్ చీఫ్ మినిస్టర్" అని ఉపముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ సంబోధించినట్లు కూడా కొన్ని పత్రికలలో వార్తలొచ్చాయి. మరీ విడ్డూరం: కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వ లక్షణాలను కూడా ఆయన ప్రశ్నించారట. కిరణ్ కుమార్ రెడ్డికి అన్నీ అస్పష్టతలే అన్న చందాన సాగిన దామోదర రాజ నరసింహ ధిక్కార ధోరణిలో భాగంగా జగన్ విషయం కూడా ప్రస్తావనకొచ్చిందట. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, యువనేత రాహుల్ గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేకపోవడం, పై పెచ్చు ఆ తిట్ల పురాణమంతా రాస్తున్న ఆయన పత్రికకే కోట్ల రూపాయల ప్రభుత్వ అడ్వర్టైజ్‌మెంట్లు విడుదల చేయడం రాజనర్సింహ తప్పుబట్టారు. ఒకానొక సందర్భంలో ఆయన దాడికి అడ్డుతగిలిన ప్రతివారిపై కూడా ఎదురుదాడికి దిగారట ఆయన. టెలివిజన్ ఛానళ్లలో ప్రతిరోజూ వస్తున్న విశ్లేషణల-చర్చల ప్రస్తావన కూడా తీసుకొచ్చిన దామోదర రాజ నరసింహ, కనీసం వాటిల్లోనైనా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా వాదనలు విన్పించేవారు లేకపోవడం కూడా ముఖ్యమంత్రి తప్పుగానే వర్ణించారట. ముఖ్యమంత్రికి మీడియా విషయంలోను స్పష్టమైన అవగాహన లేదనే దాకా వెళ్లింది ఆయన ఆరోపణల పర్వం.

ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు స్పష్టంగా పొడచూపాయి. విభేదాలుండడంలో తప్పు లేదు. వాటిని సమన్వయ సమావేశంలో చర్చించుకోవడంలోను తప్పులేదు. ఎటొచ్చీ, ఆ సమావేశ విషయాలు బయటకెందుకు పొక్కాలనే విషయంలోనే పార్టీ వారందరినీ తప్పు పట్టాల్సి వస్తుంది. సమన్వయ సమావేశానికి ముందు ఆజాద్‌కు అందిన ఫిర్యాదులు బయటకు రావడం సహజం. కాకపోతే, సమన్వయ సమావేశంలో జరిగినవి కూడా ఒక్కో పత్రికలో ఒక్కో విధంగా అంతా పూస గుచ్చినట్లు రావడం వెనుక ఎవరి హస్తం వుందనేదే అర్థం కావాల్సిన అంశం.

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చేతనైనంత మేరకు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్తున్న సమయంలోనూ, చేపట్టిన మరుక్షణం నుంచీ ఆయన చుట్టూ సమస్యల తోరణాలు స్వాగతం పలికాయి. ఆయన ధరించింది ఒక ముళ్ల కిరీటం. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. అప్పట్లో ఆయన పాలనా దక్షతకు, సమర్థతకు అవన్నీ అగ్నిపరీక్షల లాంటివే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్యఆందోళనలు-ఉద్యమాలు, ఫ్రీ జోన్ అంశం, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ధిక్కార ధోరణి, నత్తనడకన సాగుతున్న జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత లాంటి సమస్యలెన్నో ఆయనకు ఎదురయ్యాయి.  ఒక్కొక్క సమస్యను అధిగమించే క్రమంలో, ఆయన ఒక్కొక్క అడుగే ముందుకు వేశారు. మంత్రివర్గం ఏర్పాటులో తనదైన శైలిని అనుసరించి మంచి పేరే తెచ్చుకున్నారు. శాసన సభాపతి ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంటి వాటిలో తన మాట చెల్లించుకోవడంతో పాటు, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం కూడా చెప్పుకోవాల్సిన సంగతే. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధిష్టానం బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినప్పుడు, ఎదురు చెప్పకపోవడం కూడా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం అనాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయనను విమర్శించినా, సంయమనం కోల్పోకుండా, తగు రీతిలో, ఎవరినీ నొప్పించకుండా-అందరినీ మెప్పించుకుంటూనే, స్పందించారే కాని, తన స్థాయి మరిచిపోయి ఎదురుదాడికి దిగలేదు. వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవలం పదహారు మంది ఎమ్మెల్యేలే మిగలడం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చాకచక్యమే అనాలి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, తన జిల్లాకే చెందిన తన చిరకాల ప్రత్యర్థి, నారా చంద్రబాబునాయుడుని సహితం తన దారిలోకి తెచ్చుకోగలిగి, శాసనసభలో ఆయన పరోక్ష మద్దతు కూడా తనకే సుమా అని ప్రచారం చేయించుకోగలిగిన థీశాలి కిరణ్ కుమార్ రెడ్డి. అవిశ్వాస తీర్మానంలో, నెగ్గుకోరావడం కూడా అభినందించాల్సిన అంశమే.

ఐనా, అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికీ, బొత్స సత్యనారాయణకూ మధ్య ఏదో అగాధం వుందని భావించింది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం వుండాలనీ భావించింది. పర్యవసానంగా సమన్వయ కమిటీ రూపు దిద్దుకుంది. ఆ కమిటీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మరింత పటిష్టంగా పనిచేయడానికి తోడ్పడాలి కాని, అడ్డుకోవడానికి కాకూడదు. గులాంనబీ ఆజాద్ అలా అడ్డుకునేవారికి తన మద్దతు ఇవ్వకూడదు. రాబోయే రోజుల్లో ఆ కమిటీ సమన్వయం కొరకు సంయమనంతో పనిచేస్తుందని, అందులోని సభ్యులంతా సమాంతరంగా పనిచేయరని భావించుదాం.


Wednesday, July 13, 2011

HMRI: 104-Reasons Why It Was Not to Blame: Vanam Jwala Narasimha Rao

HMRI: 104-Reasons Why It Was Not to Blame

The New Indian Express, Hyderabad Edition

14th July, 2011

Vanam Jwala Narasimha Rao

Consultant PPP, HMRI-104 Services and

Former Consultant PPP, EMRI-108 Services

Newspapers this week (12th July, 2011) have reported that, the state government is intending to take control of the services 104 and 108 following alleged lapses in their functioning. The reports have said the two services will be merged in to one entity. However, some of the reports got the facts wrong. For instance, it was wrongly stated that the Government has been paying Rs. 10 Crores per month to HMRI towards bills run up by HMRI.

This is an attempt to clarify the position. The Health Management and Research Institute (HMRI) is a not for profit organization. It entered into an MoU with the Government of AP, to deliver healthcare through 104. In this endeavor, the organization received government funds only for operational expenses while management costs were always borne by its founders and patrons. All audited accounts and books of HMRI are examined every year by statutory auditors appointed by government. No adverse comments or remarks have ever been made by any agency.

The Government’s expenditure on account of HMRI operations have never-ever exceeded Rs. 8.5 Crores per month, even when the 104 Health Information Help Line, the Community Paramedic Training (CPM) program, Health Management information Systems (HMIS), the Integrated Disease Surveillance Program (IDSP) and the Fixed Day Health Service were in operation together. Neither HMRI claimed, nor Government paid, in any month, to a tune of Rs 10 Crores! Ever since Government withdrew FDHS from HMRI without even a proper notice, on December 4, 2010, citing a strike by employees, operational expenditure for the 104 never exceeded Rs. 2.07 Crores per month.

The Government has now decided to cancel the “contract” (though it was a MoU) with HMRI for running 104 Call Centre with effect from first of October. HMRI has accepted the proposal and is in the process of enabling a smooth take by the government.

As far as the capital cost is concerned all the items that come under Capital Expenditure were by and large directly procured by the government or by a procurement committee constituted by it. The assets thus procured remain in the name of government whereas the cost of the software which runs into Crores of rupees was borne by the HMRI Management.

The Health Management and Research Institute and the Commissioner Health and Family Welfare (CHFW) of the Government of AP entered in to an MOU to operationalise two important Health care Delivery services for the benefit of vulnerable sections under Public Not for Profit Private Partnership (PNPP), namely the 104 Health Information Help Line (HIHL) and the FDHS (Fixed Date Health Services). The partnership started with 104-HIHL to begin with and was extended later to FDHS.

The operational expenditure of these two services was to be born by the Government, where as HMRI would provide the knowhow and software besides developing various protocols and management. Consequent to the resignation of the Founder Chairman of HMRI in January 2009, the Piramal Group came forward to support HMRI and Ajay G. Piramal has been the Chairman since August 2010.

Since June 2010 sanctions and releases to HMRI by the Government, which were to be quarterly advances as per MOU, were gradually diluted. Quarterly advances were replaced by monthly. Since July 2010, payment delays commenced and monthly advances were almost never adhered to. This resulted in late payments of not only salaries but also other operational expenses. Often, HMRI with its limited financial resources had to step in to avoid any breakdown in the Health Care Delivery.

While this was so, there were indications from various quarters that the FDHS program was planned to be revamped and would be brought under the Cluster Health and Nutrition Centers. This caused considerable uncertainty and insecurity among the Field Staff. The 104 Contract Employees Union affiliated to CITU went on strike from November 10, 2010. Meeting the demands of the employees was not in the purview of HMRI since all of them involved policy matters and financial support from the Government. Ultimately 475 Mobile Health Units which provided once-a-month Fixed Date Health Service at every rural habitation located 3km beyond Primary Health Center aimed at reducing maternal and child mortality and screen, identify and refer non-communicable diseases, were handed over to the District Collectors.

The FDHS program had provided 2.73 lakhs Van days visited 22,500 villages on an average of 12 times and screened 116 lakhs people. More than 3.5 lakhs diabetes cases and seven lakhs hypertension cases were diagnosed and referred to doctors. Nearly 13 lakhs pregnant women were registered and on an average they were visited thrice. In addition, 20 lakhs children below 5 years and 20 lakhs school children were provided services.

Since then, HMRI has been attending to only the Health Information Help Line (HIHL) services. Since its inception it has received more than 540 lakhs calls benefiting about 200 lakhs vulnerable beneficiaries. On an average the Help Line receives 30 to 40 thousands calls daily.

Non-profit organizations try to reach the poor and the disadvantaged, but, their sustenance depends on timely funding support from the government. Hence, the survival of the PNPP model is in question. The Government has every right to continue or discontinue HMRI services. It is certainly not right to blame a service that did its work till the last minute.

Sunday, April 18, 2010

Need for Permanent “Health and Emergency Care Developmental Fund”: Vanam Jwala Narasimha Rao

Rededicate to Health-Care
Honor the Commitments of
Former CM Rajashekhar Reddy

Appeal to Chief Minister Rosaiah
Vanam Jwala Narasimha Rao

I am shocked to see an un-believable news report in a regional television channel that the state government has decided to put on hold its share promised for the life-saving and preventive Emergency and Health schemes respectively, introduced and implemented during former Chief Minister Rajashekhara Reddy’s tenure. Having associated for more than three and half years with one of these revolutionary schemes that saved 50000+ lives in Andhra Pradesh, and continue to associate with the second now, I have every reason to express my concern when attempts are said to have been made to dislodge them.

Yes, I am talking in particular, about the most popular 108 emergency response services - the first of its kind Public Private Partnership, pre-hospital care based ambulance services in our state, which forced several state governments to replicate and introduce and run in their respective states as efficiently as in this state. Media has also been reporting for over a week that there is un-rest among a section of associates working in two very important Healthcare Institutions, EMRI (Emergency Management and Research Institute) and HMRI (Health Management and Research Institute). Preliminary enquiries by media confirm that either non-revival of the funding pattern or non-release of agreed operational expenditure in advance as per MoU norms or cuts in the unit costs on some pretext or other has become a regular phenomenon being resorted by the concern departmental heads supported by the concern Minister. The private partner is left with no option except delaying the monthly payments like salaries not to speak of annual incremental hikes. Hence the unrest in some quarters as reported in the media could be true.

The two Institutions EMRI and HMRI-one to provide 108 emergency response services and the other 104 Health Information Help Line & Fixed Date Health Service respectively are the two most successful Transformational Institutions conceived and developed in the state while Dr Rajshekhar Reddy was Chief Minster. Many thinkers and doers-some behind-have been associated in defining, conceiving, designing, developing, implementing and replicating these health-care schemes. The day is not far-off when these schemes would become instrumental in putting Hyderabad and Andhra Pradesh in the world Health-Care Map as the key Hub of reforms.

Dr. AP Ranga Rao as the Principal Advisor to EMRI, besides conceiving the idea, helped in establishing a state of the art Emergency Response System in Andhra Pradesh which paved the way for 10 more states to adopt it catering to 80 million populations. His role included providing concept, Architecture, design, algorithms, processes, monitoring tools and advocacy with Government. Thanks to EMRI and the forward thinking governments in 10 states in India, today, in almost half of India any person, round the clock, when in emergency, can be confident of transportation facility to be reached to the nearest medical stabilization center within the GOLDEN HOUR, through a net work of Pre-hospital care based Ambulances, by just dialing toll-free 108 number.

EMRI aims to provide emergency management in a way similar to, or exceed the 9-1-1 system in United States of America. The vision of EMRI is to provide leadership through Public (Not-for-profit) Private Partnership-PPP framework to respond to emergency calls round the clock and save lives meeting global standards in Emergency Management, Research and Training.

Dr Ranga Rao also as the Chief Advisor to HMRI helped in launching and scaling two very important healthcare interventions namely a 24X7 Health Help Line and the Fixed Date Health Service (FDHS). The Health Helpline provides Medical Triage and Advice, Counseling to people seeking help for psychological problems and provides information on health providers with the help of 150+ directories through 104 toll-free telephone. FDHS serves the 4.2 Crore population through a Mobile Health Unit which visits a habitation once a month focusing on pregnant women, children and the elderly.

Both EMRI and HMRI as non-profit organizations were established by the state IT icon Ramalinga Raju of erstwhile Satyam Computers Limited-now the Tech-Mahindra. Ironically, today Raju who “made the things happen” by establishing EMRI is a tainted IT icon. But, his passion to serve the people and save their lives through this unique 108 and prevent health related problems through 104 and FDHS is appreciable.

Dr Ranga Rao’s efforts and Raju’s vision of saving lives and preventing health related problems were supported and are being implemented right from day-one by another management brain behind-Dr Balaji Utla, who was initially with EMRI and moved to HMRI later and continues as its CEO till today passing through all the hard times. Venkat Changavalli as CEO of EMRI from the day the first PPP MoU was signed with AP Government five years ago in the presence of Dr Rajashekahara Reddy, through his management expertise initiated and successfully expanded EMRI to 10 states. He continues to lead EMRI despite Raju’s absence.

Much greater than these souls, was the former Chief Minister of Andhra Pradesh, Dr Y S Rajasekhara Reddy, who understood well the importance of the scheme as a doctor to save people of his state. The first-ever Public-Private Partnership health scheme started paying rich dividends as it helped save thousands of people. The concept inventor, the entrepreneur Raju, the management experts and the former Chief Minister ably supported by the then Chief Secretary J. Harinarayana as well as the then Principal Secretary Health PK Agarwal and Commissioners CBS Venkataramana & Anil Punitha carried forward the scheme further. If the EMRI concept was to help people trapped in emergency situations like ‘accidents’ or ‘sudden sickness’ reaching quickly to hospitals to provide emergency care free of cost, then the HMRI is meant to provide other than emergency health care.

In brief, These PPP Models-the Emergency Health Transportation, Health Information Help Line, Fixed Day Mobile Health Clinics and Telemedicine Center have resulted in either saving lives in emergency or helped people to plan to save their own lives preventively.

These two schemes were incorporated into the government’s Rajiv Arogya Sree, which also provides insurance cover, and are being implemented successfully in the state government. These schemes not only won many accolades from the Centre, but also from international community. As a hardcore doctor, the former Chief Minister thought providing basic Medicare is the responsibility of the government and agreed to fund cent operational expenditure (which progressively was raised from nominal to Cent Percent with his personal initiative and intervention).

Chief Minister Rosiah who as Helath Minister and Finance Minister not only supported the schemes but also provided the required funds for all the schemes under the Rajiv Arogyashri.

Other states were quick to replicate in their respective states. Believe it or, one should not shy away if a developed nation and world’s super power United States of America, too had taken a leaf out of our health scheme as the second non-white leader introducing similar Health Bill in that country.

But, today, if one has to go by the channel’s report and media stories, the 108 services are being starved of funds and the government apparently is in a mood to stop its share to support the scheme. GVK who agreed to shoulder the Private Part of the responsibility, as per the channel reports is also passive in providing funds as far as AP is concerned for reasons better known to him. Well what is the truth behind the news is anybody’s guess.

I am sure and confident that, Rajashekara Reddy’s successor, K Rosaiah, who promised not to dilute the schemes of his predecessor would initiate steps to see that the PPP services in the Health and Emergency sector are not suffered even for a minute. He as the one who evinced keen interest as the Health Minister to sign the MoU s would shoulder the responsibility to prove the Channel’s report and media stories are wrong. He should check the facts whether the Finance and Family Welfare departments have stopped funding these two unique institutions, which wedded for yeoman service.

The best way to channelize the funds would be to create a Permanent “Health and Emergency Care Developmental Fund” by pooling NRHM, State Government and Private Contributions from many but not from one single source. For such huge schemes one Raju or one GVK means "dependence in uncertainty". The operational Expenditure need to be finalized through consensus between EMRI-HMRI management and Government well in advance before the financial year commences and the agreed fund has to be deposited in a Bank account to be Jointly operated by CEO s of EMRI, HMRI and Commissioner Family Welfare. Accountability mechanisms could be worked out.

Such an arrangement do not require a Private Partner like GVK but would certainly require management experts as CEOs like Dr Balaji Utla and Venkat Changavalli. Let the PPP concept be dynamic and not static for ever with the boundaries well defined.

Any deviation from the implementation of the scheme that, brought name and fame, besides great satisfaction of serving the people in true sense and any delay in releasing operational expenditure, would send wrong signals to the people. What would be the outcome of it cannot be assessed. If these schemes fail now in future it would be difficult to bring them back again.