Monday, August 30, 2010

పార్టీ వీడిన - పార్టీ చీల్చిన వారికి మాత్రమే రాజకీయ ఎదుగుదల : వనం జ్వాలా నరసింహారావు

సెప్టెంబర్ 3, 2010 న నాలుగో సారి
సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలు కానున్న సందర్భంగా


లాంఛనప్రాయంగా ముగియనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ఫలితం అందరూ ఊహించిందే. గత పన్నెండేళ్ల గా రికార్డు స్థాయిలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన సోనియా గాంధి వరుసగా నాలుగో పర్యాయం ఎన్నిక కానుంది. అసంతృప్తిని పసికట్టిన సోనియా అత్తగారి తరహా దిద్దుబాటలోనే పయనించి, చీలికకు శ్రీకారం చుట్టి, సమూల ప్రక్షాలణ చేసి, అసలు-సిసలైన వీర విధేయులను మాత్రమే తన వెంట వుంచుకుని, వారసత్వానికి మార్గం సుగమం చేయనుందా? నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసాధ్యం కాదు!

ఆంగ్లేయుల పాలనలోని భారతీయ సివిల్ సర్వెంట్-రాజకీయ సంస్కర్త ఎలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడైతే...... ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధి, చిక్కుల్లో పడ్డ పార్టీని, ప్రక్షాలణచేసి-పునర్నిర్మించి-పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధి మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అనూహ్య పరిస్థితుల్లో చేపట్టి, మైనారిటీ ప్రభుత్వానికి ప్రధానిగా సారధ్యం వహించి, ఐదేళ్లలో మెజారిటీ స్థాయికి తీసుకొచ్చినప్పటికీ, పార్టీ పరంగా అదృష్టాలు తారుమారయ్యేందుకు కారకుడయ్యాడన్న అప్రతిష్టను తెచ్చుకున్నాడు పీవీ నరసింహారావు. సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. జిత్తులమారిగా పేరున్న మరో వృద్ధ నాయకుడు సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. సీతారాం కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడే పరిస్థితులు తలెత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా "రక్షించమని" కొందరు నాయకుల అభ్యర్థన మేరకు, నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ "ప్రాధమిక సభ్యత్వం" స్వీకరించారు. అచిర కాలంలోనే, "రెండు నెలల అపారమైన అనుభవంతో", పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998 లో, కొందరు ఆమె "జాతీయత" ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత పన్నెండేళ్ల గా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా-మకుటంలేని మహారాణిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే "ఏకాభిప్రాయం".

నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. విధేయులు "అణిగిమణిగి" వుండి, దొరికిన దానితో సంతృప్తి పడుతుంటే, వ్యతిరేకులు అడపాదడపా ఎదురుతిరగకుండా వుండలేక పోయారు. మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్ ఎదురు తిరిగి పార్టీని వీడక పోయినట్లతే, ఏ నాటికీ "ప్రధాన మంత్రి" అయ్యేవారు కానే కాదు. జగ్జీవన్ రాం కు ఉప ప్రధాన మంత్రి దక్కే అవకాశమే వుండకపోయేది. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగలిగింది కాంగ్రెస్ పార్టీని వీడినందునే. వారే కనుక వీర విధేయతతో పార్టీలో కొనసాగినట్లైతే, ఒక ప్రణబ్ ముఖర్జీ వలెనో, గులాం నబీ ఆజాద్ లాగానో, అలాంటి మరి కొందరి వలెనో, మంత్రివర్గంలో స్థానంతో సరిపుచ్చుకోవాల్సిందే.

భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, అసంతృప్తులు, ధిక్కారాలు, ఎదురీతలు, చీలికలు అంతర్భాగాలే. చాలావరకు నెహ్రూ-గాంధి కుటుంబీకుల ఆధిపత్యం చుట్టూతా నే అవన్నీ చోటు చేసుకున్నాయనాలి. విశ్లేషించి చూస్తే, ఎదురు తిరగడమైనా - చీలిక తేవడమైనా, మోతీలాల్ నెహ్రూతో మొదలెట్టి, ఆ వారసత్వ పరంపరలో ప్రతి ఒక్కరు, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగా నో వీడడమో, చీల్చడమో, "మనస్సాక్షి చెప్పినట్లు" నడచుకోమని కార్యకర్తలను ప్రోత్సహించడమో-పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయమూ జగమెరిగిన సత్యం. దాని వల్ల దేశానికి మేలు జరిగి వుండొచ్చు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటై వుండొచ్చు. ఆ క్రమంలోనే ఆ వారసుల నాయకత్వం మినహా గత్యంతరం లేని అవసరం కూడా ఏర్పడింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యానికి ఆద్యుడైన ప్రధమ తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, లండన్ లో విద్యనభ్యసించి రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో చేరిన కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత వెనువెంటనే "అధ్యక్ష బాధ్యత" అప్ప చెప్పారు. వారసత్వానికి, రెండో తరం నాయకత్వానికి, బలమైన పునాదులు, లాహోర్ లో జరిగిన 44 వ ప్లీనరీలో, 1929 లోనే వేశారు. ఆ కుటుంబానికి రాజకీయ పరంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, ఆయన జీవించినంతవరకు, నెహ్రూను వ్యతిరేకించిన-వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్య లాంటి నాయకులందరినీ పార్టీలో మైనారిటీకి తగ్గించేందుకు సహకరించారనే ది వాస్తవం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అలనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలానీ చర్యలను తరచుగ ప్రశ్నించు తూ, తన ఆధిపత్యాన్ని నెహ్రూ ప్రదర్శించడం కూడా తిరుగుబాటు లాంటిదే. భారత దేశానికి "డొమినియన్ హోదా" విషయంలో, మోతీలాల్ పార్టీని వదిలి స్వరాజ్ పార్టీ స్థాపనకు తోడ్పడగా, కొడుకు గాంధి పక్షం వహించాడు. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే.

నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో పార్టీలో రెండు బలమైన వర్గాలుండేవి. ఇందిర అనుయాయులైన "సామ్యవాదులు", మొరార్జీ-తదితరుల నాయకత్వంలోని "సంప్రదాయ వాదులు" ఆధిపత్యం కొరకు బహిరంగంగానే విమర్శించుకునే వారు. 1967 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పటికీ, మెజారిటీ భారీగా తగ్గింది. పార్లమెంటరీ పార్టీ నాయకత్వానికి జరిగిన పోటీలో, ఆదినుంచీ నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్ ని ఇందిర ఓడించింది. మొరార్జీ తరహా సంప్రదాయ నాయకులు మరికొందరు ఇందిరకు విధేయత చూపారు అప్పట్లో. తప్పని పరిస్థితుల్లో తనను వ్యతిరేకించిన మొరార్జీ ని మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన ఆర్థిక శాఖనిచ్చింది ఇందిర. బాంకుల జాతీయం, రాజా భరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపధ్యంలో, మొరార్జీ దేశాయ్ తో సహా, హేమామేమీలైన "సంప్రదాయ వాదుల" ను బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, దానికి సారధ్యం వహించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వ ప్రధాన మంత్రి కాగలిగారు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగిన వారే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదగ గలుగుతారని నిరూపించారాయన.

మైనారిటీలో పడిన ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల-వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. బంగ్లాదేశ్ మీద సాధించిన విజయం నేపధ్యంలో జరిగిన 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకున్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీని వీడిన "యంగ్ టర్క్స్" ఎస్ చంద్రశేఖర్ ప్రధాన మంత్రి స్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిర మరో విమర్శకుడు, ఐ కె గుజ్రాల్ కూడా రాజీనామా చేసి ప్రధాన మంత్రి కాగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల పూర్వ రంగంలో, ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్ రాం ఆమెను ఎదిరించి పార్టీని వదిలి, "కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీ" ని స్థాపించి, జనతా కూటమితో కలిసి పోటీ చేయడం వల్లనే ఉప ప్రధాన మంత్రి కాగలిగారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. దురదృష్టవశాత్తు, ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. "వీర విధేయులు" దానికి మద్దతీయగా, "నిశ్సబ్ద వ్యతిరేకులు" మౌనం పాటించారు. సమయం కొరకు వేచి చూడ సాగారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధి కి వారసత్వం ఇచ్చింది. ఇక నాటినుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్ అని వాడుకలో పిలవడం, ఏఐసీసీ (ఐ) అని ఉపయోగించడం మొదలైంది.

ఇందిర హత్యకు గురికావడంతో, నెహ్రూ-గాంధి వారసత్వంలో నాలుగో తరం పార్టీ నాయకత్వం మొదలైంది. అప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్న రాజీవ్ గాంధి నాయకు డయ్యారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో, గతంలో ఎన్నడు సాధించలేనంత భారీ మెజారిటీతో రాజీవ్ పార్టీని గెలిపించారు. భారత జాతీయ కాంగ్రెస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరంలో 1985 లో, "ఇందిర కాంగ్రెస్ పార్టీ" అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ను, మంత్రివర్గంలో తీసుకుని ఆర్థిక శాఖను కేటాయించాడు. దరిమిలా వీపీ సింగ్ "ధిక్కార ధోరణి" ని సహించలేని రాజీవ్, తల్లి ఇందిర ఏ విధంగా మొరార్జీ ని తొలగించిందో, అలానే, సింగ్ శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. ఎప్పుడైతే "బోఫోర్స్" కుంభకోణానికి సంబంధించిన సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, రాజీవ్ ఆయనను ఆ శాఖనుంచి కూడా తప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989 లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికై, "నేషనల్ ఫ్రంట్" ప్రభుత్వానికి సారధ్యం వహించి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనే కనుక రాజీవ్ గాంధీకి "వీర విధేయుడి" గా వుండిపోయినట్లైతే, తన ఆర్థిక శాఖను కాపాడుకో గలిగే వాడే కాని, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగేవాడు కానే కాదు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో వున్న రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో ఆయన స్థానంలో పీవీ నరసింహారావు "ఏకాభిప్రాయ అభ్యర్థి" గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరకు చెందని వారికి, పార్టీ సారధ్యం-ప్రధాన మంత్రి పదవి రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. సోనియా తన చెప్పు చేతల్లో వుంటాడనుకున్న వ్యక్తి, సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో, భారత దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా మన్ననలందుకోవడం జరిగింది. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. సోనియా ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పలేదు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది.

సోనియా అధ్యక్ష పదవిని అనుకున్నంత సులభంగా అధిష్టించలేదు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వ నాయకత్వంపై నున్న వ్యతిరేకత ప్రభావం ఆమెపై కూడా సహజంగానే పడింది. పీవీ రావడంతో ఇక వారసత్వ రాజకీయాలు స్వస్తి అని భావించిన పలువురు కాంగ్రెస్ "ఆశావహులు" నిరాశకు గురయ్యారు. ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్, ఎన్నికల్లో కాంగ్రెస్ పక్ష ప్రధాని అభ్యర్థిగా, భారత దేశంలో పుట్టిన వారి పేరునే ప్రకటించాలన్న నినాదం లేవదీశాడు. ధిక్కార స్వరం వినిపించాడు. జన్మ తః ఇటలీ దేశస్తురాలైన సోనియాకు నెహ్రూ-గాంధి వారసురాలిగా ప్రధాని కాకూడదన్న భావం ఆయనకే కాకుండా మరి కొందరిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి "నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ" ని నెలకొల్పారు. స్థైర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్ ను తెర పైకి తెచ్చింది.

ఎన్నికల అనంతరం యూపీయే ప్రభుత్వానికి సారధ్యం వహించడానికి ఆమె తిరస్కరించి, ఆయనను ప్రధానిని చేసింది. ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆర్థిక మంత్రి హోదా రిజర్వ్ బాంక్ గవర్నర్ హోదాకంటే పెద్దే కాకుండా, రిపోర్టింగ్ అధికారిక స్థాయి కూడా. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకుంటాడా? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీయవచ్చునేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు.

తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగియగానే, ఆమె స్థానంలో కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ ను ప్రతిపాదించి, ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయ స్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా అమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా "కంట్లో నలుసుల" తోనే. సోనియాకు కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయ స్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే మంచిది. నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గురించి అందరూ మాట్లాడే వారే. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా వున్న ఏకె ఆంటోనీ ఒకప్పుడు పార్టీని వీడిన వాడే. ప్రణబ్ ముఖర్జీ పార్టీని వీడిన వాడే. ఇందిరకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (ఐ) నుంచి బయటకొచ్చి, భారత జాతీయ కాంగ్రెస్ (అర్స్) స్థాపించినప్పుడు అందులో చేరిన ప్రముఖుల్లో ఆంటోనీ ఒకరు. సోనియాకు సన్నిహితుడైన ప్రియరంజన్ దాస్ మున్షీ కూడా ఒకరు. ఆంటోనీ అంతటితో ఆగకుండా, కాంగ్రెస్ (ఎ) ను స్థాపించి, 1982 లో స్వగృహ ప్రవేశం చేసి, పార్టీలో క్రమశిక్షణను కాపాడే పనిలో వున్నాడు! సోనియా ఆదేశాలిచ్చిందన్న సాకుతో, మొయిలీలు-అహ్మద్ పటేల్లు-ప్రణబ్ ముఖర్జీలు, వారు చెప్పారని ఆంధ్రా నాయకులు, జగన్ కు మంచిచెపుతున్నట్లు నటిస్తూనే, ఆమెకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. అందుకే పార్టీలో చీలిక తప్పకపోవచ్చు.

భారత జాతీయ కాంగ్రెస్(ఆర్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరగాలంటే, జగన్ లాంటి యువ నాయకులను వెంట వుంచుకోవాల్నా? వదిలించుకోవాల్నా? అన్న ఆలోచన చేయకుండా సోనియా వుండే అవకాశాలు లేనే లేవు!

Thursday, August 26, 2010

Indian National Congress from Alan Octavian Hume to Sonia Gandhi : Vanam Jwala Narasimha Rao

Vanam Jwala Narasimha Rao

If it was Alan Octavian Hume, a civil servant in British India and a political reformer, who with the blessings of the Viceroy Lord Dufferin, to be credited for the birth of Indian National Congress, then it is Sonia Gandhi an Italian born Indian politician to be credited for not only reviving congress but also for returning it back to power. PV Narasimha Rao, who succeeded former Prime Minister Rajiv Gandhi after his assassination as Congress President headed a minority government after 1991 parliament elections. Though he converted the minority government in to majority, through sheer intelligence and political tactics, the congress fortunes dwindled and it lost elections in 1996. PV resigned first as party president and later as parliamentary party leader in favor of veteran Sitaram Kesri.

Several senior party stalwarts were in open revolt against Sitaram Kesri and quit the party, splitting into many factions. At that critical juncture on “popular party functionaries” demand Sonia Gandhi joined Congress as “Primary Member” and within two months she “accepted when offered” the party President Post despite her nationality was questioned. She remained the unquestionable leader for a record period of over 12 years as President and revived the Nehru-Gandhi dynasty. Her decision and consensus in the party are synonyms!

History of 125 year old Indian National Congress is the history for supremacy between “Loyalists” and “Opponents” of Nehru-Gandhi family. Morarji Desai, Vishwanath Pratap Singh, Chandrasekhar, Inder Kumar Gujral, would have remained as “Loyalists” to Nehru-Gandhi family and would have continued in the Congress led cabinets led by one of the heirs of that dynasty like a Pranab Mukherjee or a Ghulam Nabi Azad or an Ambika Soni or any one like them, had they not rebelled and left Indian National Congress of their times. They rebelled and were rewarded with Prime Ministerial berths. Jagjivan Ram revolted and could become Deputy Prime Minister. Neelam Sanjeeva Reddy would not have become President of India had he remained in Congress Party. Such of those leaders like Sharad Pawar, Mamata Benerjee, Karunakaran though rebelled and left the party, however, could not reach the peak, though they were rewarded with positions short of their expectations.

Rocking its own ship has been the culture of the Congressmen right from its inception more than 125 years ago. Perhaps, being the grand old party in Indian politics and also for its exceptional role being in the forefront during the freedom struggle dissidence and rebellion has been an in-built mechanism. It was but natural that the clashes of interests within the Congress were primarily confined and rotated round pro and anti Nehru-Gandhi clan! Beginning with Motilal Nehru, successive members of the family at one time or other rebelled against the then existing Congress Leadership or policies not liked by them and in the process regained strong hold and command over the party to become more powerful and indispensable.

Motilal Nehru was the founder patriarch of powerful political Nehru-Gandhi family. Having served twice as President of Indian National Congress, Motilal handed over the party presidency to his London educated son Jawaharlal Nehru who entered politics just a decade ago. For Nehru family members and admirers it was a transfer of power and laying foundation for the future Prime Ministerial berth. Mahatma Gandhi’s support, then and later, always remained with Nehru family and as long as he lived, everyone who opposed Jawaharlal were reduced to minority in the party! Sardar Vallabhai Patel, Subhash Chandra Bose, Tandon and Pattabhi Seetaaramayya were among them. After Independence Nehru’s supremacy show over Acharya Kripalani and his frequent questioning Nehru’s decisions were also rebellion within. Gaining supremacy within Congress had a typical Nehru-Gandhi style like in the case of Jawaharlal opposing his father’s preference for Dominion Status. While he remained in the party Motilal helped found the Swaraj Party. The family which produced three Prime Ministers and the fourth one in the waiting controlled Congress President for four decades and as many as twenty five times. Mrs. Sonia Gandhi leads the current Congress coalition government in India as the coalition’s Chair Person and as President of All India Congress Committee. Her son Rahul Gandhi is a powerful Member of Parliament and General Secretary of Congress Party.

Such skirmishes became more pungent leading to split in the Congress party not once, but twice when Indira Gandhi took over the reins as party chief as well as Prime Minister later. Conspiracies were always hatched either to challenge the Nehru-Gandhi legacy time and again or orchestrated by the family members when they smelt that they are being challenged. The like minded syndicate leaders like Kamaraj-Nijalingappa-Morarji Desai-Sanjeevareddy-SK Patil, either in combination or on their own caused the split in the party challenging none other than ‘iron lady’ Indira Gandhi, well known to Indian people. However, she managed to be triumphant overcoming all the hurdles put before, yet again due to her envious links to Nehru clan and unprecedented public image she enjoyed. History may even put it the other way, that, it was Indira who forced the split to do away with her opponents.

After her demise, her elder son Rajiv Gandhi, who took over the reins amidst turbulent times, too was a victim of similar conspiracies. Unlike his mother, who was known for her political maneuverings, Rajiv though new to Indian politics yet managed to survive turbulent times due to a strong coterie which vowed unstinted allegiance to his family to protect their interests. Vishwanath Pratap Singh, on the issue of Bofors walked out from the party and succeeded Rajiv as Prime Minister. Sonia Gandhi was not willing to take over the mantle, perhaps due to her inability to overcome that ghastly incident in which her husband was killed. She was also equally reluctant to oblige those Nehru-Gandhi family loyalists request to allow her young son, Rahul to take over the mantle.

Ironically, following the tragic Rajiv assassination, though reluctantly, the Congressmen hurriedly accepted P V Narasimha Rao to head the party signaling his chances of becoming Prime Minister if the party fares well in the general elections that were half-way-through. PV was also commonly referred to as the Chanakya of modern India for his ability to steer tough economic and political legislation through the parliament at a time when he headed a minority government. Being the AICC President, he was a rebel from within, and silently challenged the supremacy of Nehru-Gandhi family represented by Madam Sonia Gandhi. When the Indian National Congress split in 1969 Rao stayed on the side of the then Prime Minister Indira Gandhi and remained loyal to her during the Emergency period. He was also loyal and advisor to Rajiv Gandhi, though, was not trusted follower of Sonia Gandhi. He also broke convention by appointing a non-political economist and future prime minister, Manmohan Singh as his finance minister, who was the one and only choice of Sonia Gandhi to nominate as Congress parliamentary leader when she had to “sacrifice” left with no alternate. PV’s five year tenure witnessed many political upheavals within the party, with frequent clashes between pro and anti Gandhi-Nehru family’s dynastic rule.

PV paid for his doubted loyalty to Sonia and had to shed party chief’s post after Congress faced defeat in the 1996 elections to another senior Congress leader Sitaram Kesri. To prove his loyalty to Sonia and return the reward, Kesari forced PV to resign as Congress Parliamentary Party Leader. Sharad Pawar challenged Sitaram Kesri, the then nominee of Sonia, for the post of Congress President, and was unsuccessful.

Meanwhile pressure on Sonia increased from “Fundamental Loyalists” to take over party leadership and save from collapse putting the blame on PV. Kesari was unceremoniously pushed out and in 1998 Sonia, another Nehru-Gandhi family member sat on the Congress throne. Since then Sonia is heading the party and now all set to enter into record books of the party for holding the Chief’s post for more than a decade, uninterruptedly. In all, the Nehru-Gandhi family, held the record of holding party presidents’ post for more than 25 times and for nearly 40 years in its 125-year-old history.

Incidentally, even Sonia had to face anti Gandhi-Nehru group’s ire when party was set to win the 2004 polls. Pawar who served as Leader of Opposition in the dissolved 12th Lok Sabha demanded that the Congress Party needed to project someone born in India as the Prime Ministerial candidate and not the Italian-born Sonia Gandhi. He, supported by former Lok Sabha Speaker Sangma raised a banner of revolt on her nationality and formed Nationalist Congress Party. Unperturbed Sonia, instead, tactfully managed her ‘foreign nationality’ issue more bravely by naming an able administrator like Dr Manmohan Singh as Prime Ministerial candidate. Pranab Kumar Mukherjee who was the Finance Minister when Manmohan Singh was made Governor of Reserve Bank of India and in a way in higher position than him had no option except to settle as cabinet minister in his cabinet. After all in politics one has to wait for his or her chance to reach the “peak”. His ambition to become PM is still alive!

Pawar’s Nationalist Congress Party had to align with the Congress party to form a coalition government in Maharashtra. The alliance has endured at the national and state level to this day. After 2004 Lok Sabha elections, he joined the United Progressive Alliance government. His ambition to become PM is still alive!

But, now with Sonia’s plans of nourishing and making her son Rahul to succeed Dr Manmohan Singh as Prime Minister and support Manmohan’s candidature for President of India when it falls vacant, “Aspirants” to occupy them are silently becoming active once again. Plans to checkmate the dynastic rule at the Centre bringing on to the surface similar moves in the states, are now being intensified. Curtailing the claims of Congress Party MP Y S Jaganmohan Reddy who to succeed his father as his political heir could be a bigger plan. Jagan might have a got a “secret green signal” from anti Nehru-Gandhi Family “Sonia Loyalists”!

Sonia probably is aware of these moves. She has her own plans to counter the moves against her in atypical Indira way. May be she has found a tool in Jagan to overhaul the Indian National Congress at all levels and fill the posts with “Staunch Loyalists”. How and when she will wriggle out of the prevailing situation is anybody’s guess. The party is passing through difficult times and her final decision to succumb to those who opposed to dynastic rule may force her to prefer yet another virtual split in the century old party.

The split looks like imminent, if not irresistible either way! Is it going to be Indian National Congress (S) or Indian National Congress (R).

సహస్ర చంద్రుడు రాధాకృష్ణ : వనం జ్వాలా నరసింహారావు


గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్య శీలుడు, సమర్థుడు, నిబద్ధత కల వాడు, నిశ్చల సంకల్పుడు, కమ్యూనిస్టు సదాచారం మీరనివాడు, ప్రజలకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, సాహిత్యాభిలాషి, కోపమంటే ఎరుగని వాడు, ప్రతిభావంతుడు, వృత్తిలో నిపుణుడు, ప్రవృత్తిలో అసూయ లేనివాడు, వేదికపై ఉపన్యాసం ఇస్తే వైరి వర్గాలు కూడా మెచ్చుకునే సామర్థ్యం కల వాడు, మానవ విలువలకు కట్టుబడిన వాడు, పౌర హక్కులను కాపాడగలనని నిరూపించిన "షోడశ కళల" ను పుణికి పుచ్చుకున్న అరుదైన మహామనిషి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి. "సహస్ర చంద్ర దర్శనం" చేసుకుంటున్న సందర్భంగా ఆయనను గురించి తెలిసిన వారు-తెలియని వారు, తెలుసుకోవాల్సిన విషయాలెన్నో... ఎన్నెన్నో! "వైఆర్కెన" గా, "డాక్టర్ గారు" గా అందరూ పిలిచే ఈ మనిషి చిన్నతనం ‍నుండే నిరీశ్వరవాది. గోరా ప్రభావంతో హేతువాదం కూడా జోడైంది ఆయనలో. సహధర్మచారిణి కూడా, ఆయన బాటలోనే, వివాహమైన కొద్ది కాలంలోనే పయనించడంతో, ఇంట్లో పూజలు-దేవుళ్ల బొమ్మలు లేవు. ముగ్గురు పిల్లలకూ ఆయన అలవాట్లే అబ్బాయి. ఇంటికొకరు అన్నట్లు, పెద్ద కోడలు మాత్రం మంచి భక్తురాలైంది. అయితే, సాహిత్యాభిలాషైన వైఆర్కె్ పుస్తక పఠనం విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను నిరీశ్వర వాదాన్ని-హేతువాదాన్ని అంటిపెట్టుకునేంత "కన్సర్వేటివ్" కాదనాలి. ఆయన కన్సర్వేటివిజం అంతా, ఆహార పానీయాల్లోను, వేష భాషల్లోను, అలవాటున్నంతవరకు ధూమపానం చేయడంలోను మాత్రమే. ఐదు పర్యాయాలు జైలు జీవితం గడిపిన డాక్టర్ గారు, వరంగల్ జైలులో వున్నప్పుడు, తోటి ఖైదీల దగ్గర షడ్దర్శనాలు, భగవద్గీత, ఇస్లాం మతం, ఆయుర్వేద రహస్యాలు లాంటి విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు.

1985 లో పార్టీ సభ్యత్వం తీసుకున్న డాక్టర్ వైఆర్కెా, గత పాతికేళ్లలో, సీపీఎం రాష్ట్ర కమిటీలో, కార్యదర్శి వర్గంలో వున్నప్పటికీ, ఎన్నడూ ఆర్థిక పరమైన బాధ్యతలు తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత "ఆస్తి" సమకూర్చుకోలేదు. పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. పార్టీలో ఏ పదవినీ ఆశించని ఆయన, ఇచ్చిన బాధ్యతను ఎన్నడూ కాదనలేదు. వంట్లో శక్తి వున్నంతవరకు పార్టీకి సేవ చేసిన యలమంచిలి, ఎన్నికల పదవులపట్ల కూడా విముఖత చూపించినా, మూడు పర్యాయాలు ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. రెండు సార్లు సభ్యత్వం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు "బాధ్యత" గా ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కావాలని కూడా ఆయనెప్పుడూ కోరుకోలేదు సరి కదా, ఊహించనూలేదు. 1996 ఫిబ్రవరి నెలలో హాస్పిటల్లో పని చేసుకుంటున్నప్పుడు, మోటూరు హనుమంతరావు విజయవాడ నుంచి ఫోన్ చేశారు రాధాకృష్ణమూర్తికి. తెలుగు దేశం పార్టీతో అప్పట్లో వున్న అవగాహన ప్రకారం సీపీఎం కు కేటాయించే రాజ్యసభ స్థానానికి ఆయన పేరు ప్రతిపాదించనున్నందున, దానికి ఆయన అంగీకారం తెలపాల్సిందిగా కోరారు మోటూరి. తనకెందుకన్న వైఆర్కెప తో, "రాజ్యసభకు పంపుతామంటే వద్దంటారేంటి" అని ప్రశ్నించారాయన. చివరకు భార్యా పిల్లలను సంప్రదించి, సంకోచంగానే సమ్మతి తెలియ చేశారు డాక్టర్.

రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నెల నెలా పార్టీకి జమ కట్టాల్సిన మొత్తం పోను, మిగాతాదాంట్లో, తన కుటుంబ నిర్వహణకు ఖర్చుచేసి, మిగిలిందంతా "చిత్త శుద్ధి" తో పార్టీకి జమచేశారు. సభ్యత్వం అయిపోయిన తర్వాత వస్తున్న పెన్షన్ మొత్తాన్ని పార్టీకి ఇవ్వడం తో పాటు, తన తదనంతరం తన భార్యకు పంపితే, అది కూడా పార్టీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 1985 కు పూర్వం, అదీ సభ్యత్వం తీసుకోక ముందు, డాక్టర్ గారు సంపాదించిన ఆస్తిని ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇద్దరు కుమారులకు బదిలీ చేసి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారాయన. పిల్లలు సమకూర్చిన పైకంతో ఆయన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటున్నారు. పుస్తక పఠనం, రచనా వ్యాసంగం, మిత్రులతో కబుర్లు, పార్టీకి అవసరమైనప్పుడు సూచనలు-సలహాలు ఇస్తూ కమ్యూనిజాన్ని అభిమానిస్తూ, అందులోని మంచిని పది మందికి తెలియచేస్తూ, ప్రశాంత జీవితం గడుపుతున్న ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమే.

Tuesday, August 24, 2010

Hypocrisy touches its nadir! : Vanam Jwala Narasimha Rao


Perhaps, the great poet Bernard Shah was right when he said “World is a stage and we are all actors.’ But, many of us, who are hypocrites only, chose to criticize politicians, day-in and day-out, for their unethical and immoral acts. Did we ever dare introspect what way we are different from an immoral or unethical politician?

The other day I happen to attend a function of an NGO firm with which I was associated for quite some time. The NGO firm was started by none other than once icon of state IT industry-turned alleged economic offender Ramalinga Raju of Satyam Group. For genuine cause, he floated Emergency Management and Research Institute (EMRI) to help save lives of those who get trapped in various life threatening situations. Although, this great concept was developed by a committed medical and social practitioner, Dr A P Ranga Rao, Satyam Raju had heart and courage to take it further.

He got the toll-free telephone number 108 through former Chief Minister Dr Y S Rajasekhara Reddy and pressed few Ambulances into service for this unique charity work. Later, the state government headed by late Dr Reddy took the initiative under Public Private Project (PPP) and took it to greater heights. Being major fund giver of the scheme, the Rajasekhara Reddy government, not only increased the fleet of Ambulances vehicles from Raju’s 70 to PPP operated to 802, but also, ensured engraving of their beloved leader Rajiv Gandhi’s photo on all of them. This not only helped derive maximum political mileage in electoral battles, but also otherwise. Now, nine more states too emulated the concept and executing it to perfection. Two more have signed MoUs with EMRI.

That being the backdrop, during its fifth anniversary celebrations of the unique services, a function held with Chief Minister K Rosaiah as Chief Guest and others attended, what surprised me was that of the four speakers at the function, except for the Chief Minister, even for name sake took the name of his predecessor as well as Ramalinga Raju, the main architect of this unique project. All of them conveniently avoided to eulogize the person (or persons) who created and started these great services in the state.

Today, Ramalinga Raju, who is just out on conditional bail after being in the prison as an under trial for the alleged floundering of funds, is yet to be convicted by the special court. In such a scenario, does recalling his good work done become a crime?

Aren’t those whom he trusted and given an opportunity to take this unique concept to greater heights now scared to take his name even in their wildest dreams? If this is not hypocrisy, then what else is? I can understand if Rosaiah, as a seasoned politician had not taken the name of a tainted member, but what prevented others to pick up courage and acknowledge the man who helped them to form part of the unique scheme or service?

What amazes me more is that some of the speakers taking the name of former President Abdul Kalam as visionary of the scheme? But, who brought Kalam on the board of EMRI? Wasn’t Ramalinga Raju? Surprisingly he along with few more Governing Board members deserted EMRI after Raju’s propelled exit as its chairman. Why these guys shy away from this fact?

Does the Chief Minister insist the organizers of the said function sought a categorical assurance that they will not take the tainted Ramalinga Raju’s name as a precondition to preside over the function?

Apart from this, as a former consultant of EMRI and to the best of my knowledge, Ramalinga Raju never ever neither craved to call it Satyam’s 108 nor ever insisted to engrave his company’s name on these ambulances.

Contrary to this, today, the other major corporate giant, GVK, which came forward to fund the scheme as private partner, chose to have company’s name on these 108 service vehicles. Whether it was GVK’s insistence or the government’s gesture, none of us are aware of it!

The CEO of EMRI, who in the past quite often used to mention how he got entangled into this unique scheme showering praises on its founder Ramalinga Raju, too, conveniently ignored to take his name at the function. Even the video film which had shown August 15th, 2005 launch photo covered Raju and shown others! Hence, I wonder what way are we different from politicians? Does Shakesphere’s statement stand testimony, at least in this context!

ఓనమాలు దిద్దుకోండి! : వనం జ్వాలా నరసింహా రావు


వనం జ్వాలా నరసింహా రావు

కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో, ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థ" కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందని-ముందున్న వ్యవస్థ కూలిపోతుందని, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందని, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని జోస్యం చెప్పాడు. సోవియట్, చైనా దేశాల్లో శ్రామిక వర్గం అధికారంలోకి వచ్చేంతవరకు చాలావరకు ఆయన చెప్పినట్లే జరిగింది. ఆ తర్వాత కారణాలే వైనా, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ సిద్ధాంత పరమైన అధికారానికి దూరమైంది. చైనాలో కొనసాగుతున్న కమ్యూనిజం, మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలకు అదనంగా మావో ఆలోచనా విధానం చేర్చింది.

భారత దేశంలోని (ఉమ్మడి) కమ్యూనిస్టులు సోవియట్-చైనా భావాలకు అనుకూల-ప్రతికూల-మధ్యేవాద మార్గంలో ప్రస్థానం మొదలెట్టి, ఒక లక్ష్యం-ధ్యేయం లేకుండా పయనించడం జరిగింది. సిద్ధాంత పరంగా ఉమ్మడి పార్టీలో మొదలైన చీలిక, దరిమిలా, పేరుకే సిద్ధాంత పరంగా మారి, మితవాద-అతివాద-తీవ్రవాద-భావాలలో ముక్క చెక్కలైంది. పార్లమెంటరీ పంథా కోరుకున్న వర్గాలు ఏదో ఒక జాతీయ-ప్రాంతీయ పార్టీతో ఎన్నికల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని, అర-కొర స్థానాలను చట్ట సభల్లో సంపాదించుకోవడంతో సరిపుచ్చుకుంటున్నాయి. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రజల సమస్యలకు దూరమై, ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి దిగిపోయారు. చివరకు పరిస్థితి ఎలా మారిందో అంచనా వేయడానికి ఉదాహరణలుగా సీపీఐ నాయకుల దైవ దర్శనాలు, సీపీఎం నాయకుల దిద్దుబాటు చర్యల చొరవలు, చెప్పుకోవాల్సి వచ్చింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది సీపీఎం.

దిద్దుబాటు ప్రక్రియను పార్టీ అగ్రశ్రేణి నాయకత్వంతో ఆరంభించి, జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో సిపిఎం కేంద్ర కమిటీ తీర్మానించింది. ఆ నిర్ణయం అమలుకు సంబంధించిన సమాచారం లేదు. సీపీఎం పార్టీలో అవకాశ వాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్ర ప్రదేశ్ లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవన శైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.

కార్ల్ మార్క్స్ లాంటి మహా-మహానుభావులు, కారణజన్ములు, ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధన స్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఒక వైపు అలా ప్రాధాన్యమిచ్చినప్పటికీ, ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశద పర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు. హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత సిద్ధాంతంలో పేర్కొంటాడు. మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.

ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరి తో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ-లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, ఈ విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసి, శ్రామిక రాజ్యస్థాపన, వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తోంది.

ఈ నేపధ్యంలో, ఇప్పటికీ, అల నాడు మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను తు. చ తప్పకుండా పాటిస్తూ, నాలుగు దశాబ్దాలు పార్టీ సభ్యత్వం లేకపోయినా-తీసుకోక పోయినా, ఒకనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఆదేశం మేరకు సభ్యత్వం తీసుకుని, గత పాతికేళ్లగా పార్టీకి సేవ చేస్తూ, సమాజం తనకు అప్ప చెప్పిన ఇతర బాధ్యతలను నెరవేరుస్తున్న ఎనభై రెండేళ్ల కమ్యూనిస్టు యోధుడు-పౌర హక్కుల ఉద్యమ ఆద్యుడు-ప్రజా వైద్యుడు-మాజీ రాజ్య సభ సభ్యుడు, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న "సీమాంధ్ర-తెలంగాణ" వాసి, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి జీవన యానం కమ్యూనిస్టులకు-కమ్యూనిస్టే తరులకు ఆదర్శప్రాయం. సీపీఎం దిద్దుబాటు ఉద్యమానికి ఆయన లాంటి వారి అరుదైన జీవితం ప్రామాణికం. సీపీఎం పార్టీ తలపెట్టిన "దిద్దుబాటు" కార్యక్రమంలో భాగంగా స్పందించని "కామ్రేడ్లు" తప్పనిసరిగా డాక్టర్ జీవిత కథ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే!

సహస్ర చంద్రుడు డాక్టర్ యలమంచిలి... (దీని రెండో భాగం.. తరువాత)

Monday, August 16, 2010

"108-నూట ఎనిమిది సేవల" ఐదో వార్షికోత్సవం : వనం జ్వాలా నరసింహారావు


“రాజశేఖర రెడ్డి-రామలింగ రాజు” ప్రస్తావన లేని
108-నూట ఎనిమిది సేవల ఐదో వార్షికోత్సవం
వనం జ్వాలా నరసింహారావు
108 అత్యవసర సహాయ సేవల మాజీ కన్సల్టెంటు

సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో, తనంతట తానే స్వయంగా వెల్లడిచేసిన అంశాల ఆధారంగా, లొంగిపోయి, పందొమ్మిది నెలలకు పైగా జైలు జీవితం గడిపిన ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ రామలింగ రాజుకు, ఎట్టకేలకు, షరతులతో కూడిన బెయిల్ దొరికింది. బెయిల్ దొరికే ముందర, సీబీఐ న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్ షీట్ లో ఆయనపై మోపిన అభియోగాలకు లిఖిత పూర్వంగా ఇచ్చిన జవాబులో, తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని ఆయన పేర్కొన్న ట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఏదేమైనా విచారణ పూర్తయ్యేవరకూ నిజా-నిజాలు బయటపడవు. ఆయనకు బెయిల్ దొరకడానికి సరిగ్గా "ఐదు రోజుల క్రితం" ఆయన నెలకొల్పిన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో ఆరంభించి-పది రాష్ట్రాలకు వ్యాపించి-అంతర్జాతీయంగా భారత దేశానికి పేరు తెచ్చిన 108 అత్యవసర సహాయ సేవలు, ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా " ఐదో వార్షికోత్సవం" జరుపుకుంది. కాకపోతే, కోట్లాది రూపాయల విరాళాన్ని తన సొంత డబ్బులతో సమకూర్చి, కోట్ల విలువ చేసే భూమిని-భవనాలను ఆయన స్థాపించిన ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) కు ఇచ్చిన రామలింగ రాజు పేరు నామ మాత్రంగా కూడా ఆ ఉత్సవాల్లో ఎక్కడా వినిపించలేదు. ఆయన చైర్మన్ గా రాజీనామా చేసిన అనంతరం, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కానీ, అయన నియమించిన ఇ.ఎం.ఆర్.ఐ ముఖ్య కార్య నిర్వహణాధికారి కానీ ఆయనను కనీసం ఒక్కసారైనా ఆ సందర్భంగా గుర్తుచేసుకోక పోవడం శోచనీయం.

"కారే రాజుల్? రాజ్యముల్ గలుగవే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే?" అని బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో అన్నాడో లేదో కాని, తన గ్రంధంలో అలా-ఆ పాత్ర ద్వారా, బమ్మెర పోతన ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు జవాబు పోతన దగ్గరుందో లేదో కాని, తన జీవిత కాలంలోనే, తన "సిరి” ని (సంపద ఎలాగూ మహేంద్రా పరమైంది!) ఇతరులు మూట గట్టుకొని సమాజంలో (పేరు-ప్రతిష్టలతో) వెలిగి పోతుంటే, నిశ్శబ్దంగా కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేని దీనస్థితిలో వున్న రామలింగ రాజు సమాజానికి ఎలాంటి ప్రశ్నలు సంధించగలడనేది రాయడం పోతన లాంటి వారి తరం కూడా కాదని అనాలి. ఒక చోట చేసిన (సత్యం కంప్యూటర్స్ విషయంలో చేశాడో లేదో ఇంకా తేలాల్సి వుంది) నేరానికి, ఇంకో చోట కూడా (108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి) చేయని నేరానికి శిక్ష విధించడం న్యాయమేనా? అదే జరుగుతుందిప్పుడు.

"భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, దేశంలోని ప్రతి పౌరుడికి, అత్యవసర పరిస్థితుల్లో-ఎల్ల వేళలా, తక్షణ వైద్య సహాయం, నేరాల, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ కలిగించాలన్న ఆయన మహత్తర ఆశయాన్ని, ప్రభుత్వ ప్రయివేట్ పథకంగా మలిచి, ఆ సేవలను తొలుత మన రాష్ట్రంలో ఉచితంగా అందచేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పరిస్థితీ అంతే అనాలి. 108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం నుంచి అమలు దాకా ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు, అటు రాజు జైలుకు వెళ్లేంత వరకు, ఇటు రాజశేఖర రెడ్డి అకాల మరణం పాలయ్యేంతవరకు, త్రి కరణ శుద్ధిగా, ప్రయివేట్ పరంగా-ప్రభుత్వ పరంగా రాజు-రాజశేఖర రెడ్డి కృషిచేసిన విషయం, లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు దోహద పడే అత్యవసర సహాయ సేవల రూపకల్పన చేశారన్న విషయం, ఎవరిని అడిగినా చెబుతారు. కాకపోతే, ఆ సేవలను ప్రారంభించి అయిదేళ్లు పూర్తి చేసుకుని ఆగస్టు పదిహేనున వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి రోశయ్య మినహా ఒక్కరు కూడా వారిరువురి పేరు ప్రస్తావించక పోవడం దురదృష్టకరం. సభా ముఖంగా ప్రసంగం చేసిన సిఇఓ వెంకట్ తో సహా, ఏడాది క్రితం ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ కృష్ణారెడ్డి మర్యాద పూర్వకంగానైనా వారి పేర్లను జ్ఞప్తికి చేసుకోకపోవడంలోని అంతరార్థం ఏమిటో? అసలింతకీ, ఐదేళ్ల వార్షికోత్సవం జరుపుకుంది ఆ సేవల ప్రారంభానికా? లేక ఆ సేవలను ప్రారంభించిన ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఆవిర్భావానికా? ఈ రెండింటికి కాదన్న రీతిలో కొందరు వక్తలు ప్రసంగించారు. "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ 108 అంబులెన్సు సేవలు ప్రారంభమై ఐదేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమం" గా దీనిని అభివర్ణించడం విచారకరం.

హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్ లో జరిగిన "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ వార్షికోత్సవం" లో మాట్లాడిన సంస్థ చైర్మన్ జీవి కృష్ణారెడ్డి, ఐదేళ్ల కిందట 30 అంబులెన్సులతో ప్రారంభమైన 108 సేవలు, ప్రస్తుతం 752 కు చేరి, సుమారు డబ్బై వేల ప్రాణాలు కాపాడా మన్నారు. ఆ క్రమంలోనే, ఆయన, ఏ మహానుభావుడు ఆ సేవలను ప్రారంభించింది, ఎవరెవరి కృషి వల్ల 30 నుంచి 752 కు పెరిగింది (వాస్తవానికి మొత్తం అంబులెన్సులు 802) కొంచెమన్నా వివరించితే ఔదార్యంగా వుండేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోన్ చేస్తే ఇ.ఎం.ఆర్.ఐ సేవల బాధ్యతను స్వీకరించానని (తనంతట తానుగా ఇలాంటి మహత్తర సేవా కార్యక్రమం స్వీకరించే దాతృత్వ గుణం లేదని !) ఒప్పుకున్నందుకు అభినందించాలి ఆయనను. తర్వాత ప్రసంగించిన ముఖ్యమంత్రి రోశయ్య, 108 సేవలను రామలింగ రాజు సొంత నిధులతో ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించడానికి ప్రభుత్వ సాయం కోరిన విషయాన్ని, కోరిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 95% వ్యయం భరించడానికి ఒప్పుకున్న విషయాన్ని, "సత్యం సంస్థ సమస్యల్లో వున్నప్పుడు" జీవీకే గ్రూప్ నిర్వహణ బాధ్యతను చేపట్టిన విషయాన్ని వివరించి, రాజు ప్రస్తావన, రాజశేఖర రెడ్డి ప్రస్తావన తేకపోతే, జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ (చైర్మన్, సిఇఓ లతో సహా) తో పాటు అఖిలాంధ్ర ప్రజానీకం వారిద్దరినీ మరిచి పోయినట్లే అనుకోవాలి.

అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి, వెంకట్ చంగవల్లి కూడా రామలింగ రాజు, రాజశేఖర రెడ్డిల ప్రస్తావన తేకుండా వార్షికోత్సవ ప్రసంగం చేయడం. 2005 కు పూర్వం అత్యవసర సహాయ సేవల గురించి కాని, అధునాతన అంబులెన్సుల గురించి కాని, 108 నంబర్ గురించి కాని, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల గురించి కాని, అంబులెన్స్ పైలట్ల గురించి కాని భారత దేశంలో ఎవరూ విని వుండరని చెప్పారే తప్ప, అవన్నీ కార్యరూపం దాల్చడానికి కారణ భూతులైన వారెవరో చెప్పకపోవడం బాధాకరం. కనీసం ఆయనైనా సంస్థ ఆవిర్భావం నాటినుంచి, నేటి దాకా, దాని వెనుక నున్న ఓ నలుగురైదుగురి పేర్లనన్నా "ఐదేళ్ల వార్షికోత్సవం" లో ప్రస్తావించినట్లతే బాగుండేదేమో ! వెంకట్ సంస్థ సిఇఓ బాధ్యతలు చేపట్టే నాటికే, ఏడాది పూర్తిచేకోవడమే కాకుండా, ఎన్ని రకాల పునాదులో వేయడం జరిగింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేంద్రం ఏర్పాటు, ప్రోటోకాల్స్ రూపకల్పన, అంబులెన్స్ డిజైన్ కు అంకురార్పణ లాంటి పలు విషయాల్లో పురోగతి అంతో ఇంతో జరిగింది. రాజు గారికి సహాయం చేసిన-సలహాలనిచ్చిన వారెందరో వున్న విషయం వెంకట్ కంటే ఇతరులకు ఎక్కువ తెలియదు. ఐదేళ్లకోసారి, పదేళ్లకోసారి జరిగే ఇలాంటి కార్యక్రమాల్లో వారి నొక్క సారి జ్ఞప్తికి తెచ్చుకోవడం కనీస మర్యాద. రామలింగ రాజు సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చిన పూర్వ రంగంలో, ఆ తర్వాత కొంత కాలం, మీడియా ముఖంగా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు కంట తడి పెట్టిన వెంకట్ కనీసం ఆయన గురించి ఒక్క మాటన్నా చెప్పకపోవడానికి బలవత్తరమైన కారణం వుండి వుండాలి.

కార్యక్రమం ఆరంభంలో ఇ.ఎం.ఆర్.ఐ ప్రస్థానం పై చూపించిన వీడియో ఫిల్మ్ లో, రాజు గారి ప్రోద్బలంతో చైర్మన్ ఎమిరిటస్ గా కొంతకాలం వున్న కలాం సూక్తులను వినిపించగా లేంది, రాజు చెప్పిన ఒకటి-రెండు మాటలను వల్లె వేస్తే వచ్చిన ప్రమాదమేంటో వెంకట్ మాత్రమే చెప్పగలరు. ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగరాజు తన పదవికి రాజీనామా చేయడంతో, అంతవరకు ఆయన ఆహ్వానం మేరకు ఇ.ఎం.ఆర్.ఐ బోర్డ్ సభ్యులుగా వున్న వారిలో చైర్మన్ ఎమిరిటస్ గా వున్న మాజీ రాష్ర్ట్రపతి భారత రత్న ఏ.పీ.జె అబ్దుల్ కలాంతో సహా నలుగురు మినహా అందరూ రాజీనామా చేశారు. ఆపదలో ఆదుకోలేని వారి ఆప్త వాక్యాలు ఎవరికి కావాలి? కలాం వాక్యాలతో మొదలైన వీడియో చిత్రంలో, చూపించాల్సిన వాటిలో, దివంగత ముఖ్యమంత్రికి 108 అత్యవసర సహాయ సేవల అంబులెన్సులతో వున్న అనుబంధానికి సంబంధించిన ఒకటి రెండు అంశాలుంటే బాగుండేదేమో! రామలింగ రాజు "విజన్" గురించి ఒక నాడు పదే-పదే పలు సందర్భాల్లో ప్రస్తావించిన వెంకట్, ఈ నాడు తొమ్మిది రాష్ట్రాల్లో ఆ సేవలు లభ్యమవడానికి ఆ "విజన్" ప్రధాన కారణమన్న విషయం చెప్పి వుండాల్సింది. అప్పట్లో రాజీనామా చేయకుండా, ఇప్పటిదాకా గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా సేవలందిస్తున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణను వేదిక పైకి ఆహ్వానించి, కనీసం ఆయన ద్వారానన్నా అత్యవసర సహాయ సేవల ఆవిర్భావ-ఆరోహణల గురించి చెప్పించినట్లైతే బాగుండేది.

ఇవ్వాళ 108 అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్కటి కూడా "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ" అవతారంలో వచ్చినవి కాదు. ఆ రాష్ట్రాలన్నీ రామలింగ రాజు చైర్మన్ గా వున్నప్పుడే ఆ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ ద్వారా పొందాయి. వాస్తవానికి, అలా పొందిన పది రాష్ట్రాల్లో (కారణాలు ఏవైనా) జీవీకే బాధ్యతలు స్వీకరించిన తర్వాత "రాజస్థాన్" ఉపసంహరించుకుంది. సేవల విస్తరణకు ఎవరు కారణమో చెప్పకపోయినా, ఉపసంహరణకు బాధ్యులెవరో చెప్పినా బాగుండేదేమో! వీటన్నింటి కన్నా గమనించాల్సిన విషయం, సంస్థ చూపించిన వీడియోలో, ఆగస్టు పదిహేను 2005 న ప్రప్రధమంగా అత్యవసర సహాయ సేవలు ఆరంభమైన సందర్భంలో (నేటి ఐదేళ్ల వార్షికోత్సవం జరుపుకోవడానికి కారణమైన రోజు!) తీసిన ఫొటోలో రామలింగ రాజు ఫొటోని "కవర్" చేసి చూపడం! ఆ నాటి ఆ ఫొటోలో దయానిధి మారన్, రాజశేఖర రెడ్డి, రోశయ్యల సరసన రామలింగ రాజు వున్నప్పటికీ, ఆ ఫొటోని జనవరి 9, 2009 కి పూర్వం వెంకట్ కొన్ని వందల-వేల సార్లు అనేక సందర్భాల్లో చూపించినప్పటికీ, ఐదేళ్ల వార్షికోత్సవంలో ఆయన్ను తప్ప అందరినీ చూపించారు. ఇంకా నయం మారన్ ను, రాజశేఖర రెడ్డిని కూడా కత్తిరించలేదు!

ప్రపంచంలోనే ప్రప్రధమంగా సత్యం రామ లింగరాజు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి పుణ్యమా అని లక్షలాది ప్రాణాలను కాపాడడానికి ఉద్దేశించబడిన ఈ అత్యవసర సహాయ సేవలు, వ్యక్తిగత పట్టింపులకు-పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన-అమలు చేయాల్సిన ఈ సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో కావు-కాకూడదు. రాజు ఆలోచనలు కార్యరూపంలోకి తేవడానికి ఏడాదికి పైగా తోడ్పడిన వారిలో, ఆయనే స్థాపించిన హెచ్.ఎం.ఆర్.ఐ (104 సేవలు) సిఇఓ గా ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ బాలాజి, ఆరోగ్య-వైద్య సంబంధమైన విషయాల్లో కీలకమైన సలహాలనిచ్చిన డాక్టర్ ఎ. పి. రంగారావు, వెంకట్ కు పూర్వం సిఇఓ గా పనిచేసి మొదటి అవగాహనా ఒప్పందంపై సంతకం చేసిన వారణాసి సుధాకర్ లాంటి కొందరిని వార్షికోత్సవంలో గుర్తుచేసుకుంటే బాగుండేదేమో! వీరి లాంటి ఎందరో కలిసి రూపొందించిన ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ పథకమే 108-అత్యవసర సహాయ సేవలు. కనీస మర్యాదకోసమైనా రాజు కుటుంబ సభ్యులను ఆహ్వానించి వుండాల్సింది. రామలింగ రాజు పేరును రోశయ్య ప్రస్తావించగా లేని భయం సంస్థ చైర్మన్ కు, సిఇఓ కు ఎందుకుండాలనో వారికే తెలియాలి. బహుశా కావాలనే అలా చేశారే మో? "చీమల పుట్ట పాములపాలైనట్లు", ప్రస్తుతం వారెవరినీ అనుకున్నవారు లేకపోవడం దురదృష్టకరం. రామలింగ రాజు అంబులెన్స్ పైన తన పేరు గాని, తన సత్యం సంస్థ పేరు కానీ వుండాలని మాటమాత్రంగానైనా అనలేదు. ఇప్పుడేమో అవే అంబులెన్సులు ఒకరి సొంత ఆస్తిలాగా రోడ్లపై తిరుగుతున్నాయి.

Friday, August 13, 2010

ఆనంద - విషాదాల మధ్య భారత స్వాతంత్య్రం : వనం జ్వాలా నరసింహారావు


బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600 సంవత్సరంలో రాయల్‌ చార్టర్‌ ద్వారా జరగడంతో మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు అంకురార్పణ మొదలైంది. డచ్‌, బ్రిటిష్‌ కంపెనీలతో పాటు అడుగుపెట్టిన ఫ్రెంచ్‌ కంపెనీ అంతగా పురోగతి సాధించ లేకపోయింది. జహంగీర్‌ వంటి మొఘల్‌ చక్ర వర్తులతో బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రతినిధులు సత్సంబంధాలు పెంపొందించుకోసాగారు. దరిమిలా సూరత్‌ లోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ వెలిసింది. బాంబే, ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడంతో, పదిహేడవ శతాబ్ది ఆరంభానికల్లా, వాణి జ్యపరంగా పటిష్ఠమైన స్థితికి చేరుకున్నారు ఆంగ్లేయులు.

మొఘలాయి సామ్రాజ్యం-దాని చక్రవర్తి ఔరంగజేబు పతనంతో భారతావనిలో చోటుచేసుకున్న అనిశ్చిత స్థితి బ్రిటీష్ వారికి కలిసొచ్చిందనాలి. నాదిర్ షా లాంటి వారి దండయాత్రలు మొదలయ్యాయి. ఢిల్లీలో రక్తపాతం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ వదిలి వెళ్లిన నాదిర్ షా, తన వెంట, మొఘల్ సామ్రాజ్య గుర్తుగా మిగిలిన "నెమలి సింహాసనం" తీసుకెళ్లాడు. ఒకటి వెంట మరొకటిగా ఏడు దండయాత్రలు జరిగాయప్పట్లో. కష్టాల కడలిలో మునుగున్న భారతదేశంలో బ్రిటీష్ ఆధిపత్యానికి మార్గం సుగమం అయింది. అప్పటికే, బ్రిటీష్ ప్రభుత్వ ఆదాయంలో పది శాతానికి పైగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచే రాసాగింది. ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి మధ్య సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో విజయం సాధించిన బ్రిటన్ భారత దేశంలో అధికారానికి చేరువై, సిపాయిల తిరుగుబాటు నాటికి పట్టు సాధించింది.

1857 నాటి సిపాయిల తిరుగుబాటులో మొఘలాయుల చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మి బాయి లాంటి వారు పాల్గొన్నారు. బ్రిటన్ లోని పార్లమెంటరీ ప్రభుత్వం, అప్పటివరకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్థానంలో, నేరుగా పాలన సాగించాలని నిర్ణయం జరిగింది. వాస్తవానికి, సిపాయిల తిరుగుబాటు పూర్వ రంగంలోనే, ఒక మోస్తారు సాంస్కృతిక విప్లవం, భారతావనిలో వేళ్లూనుకోవడమే కాకుండా, రాజకీయ చైతన్యానికి కూడా బీజాలు పడ్డాయి. 1885 లో లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. ఆదిలోని కాంగ్రెస్ మితవాద భావాల అధినాయకత్వం ఒక వైపు బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే, మరొక వైపు, పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతకు పునాదులు వేయ సాగింది. బెంగాల్ విభజన నిర్ణయం దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. నోబెల్ బహుమతి గ్రహీత రబీంద్రనాథ్ ఠాగూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారప్పట్లో. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. ఉద్యమకారులపై ప్రభుత్వ దమన కాండ తీవ్రతరమైంది. పంజాబ్ నుంచి లాలా లజపత్ రాయ్, సర్దార్ అజిత్ సింగ్ ల బహిష్కరణ, బాల గంగాధర తిలక్, అరబిందో ఘోష్ ల నిర్బంధం, బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళన, భారత జాతీయోద్యమానికి పునాదులు బలంగా నాటాయి. ఆద్య తన భవిష్యత్ లో, స్వాతంత్ర్యోద్యమం ఊపందుకునేందుకు సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి.

ప్రధమ ప్రపంచ సంగ్రామంలో బ్రిటన్ కూరుకుపోయిన సమయంలోనే, స్వదేశీ ఉద్యమం బలపడ సాగింది. పూనా కేంద్ర కార్యాలయంగా, హోం రూల్ లీగ్ స్థాపించిన తిలక్ దేశ వ్యాప్తంగా పర్యటించి, దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉద్యమించాలని చేసిన విజ్ఞప్తికి అన్నీ బీసెంట్ సహకారం లభించింది. హోం రూల్ ఉద్యమ లక్ష్యం పూర్ణ స్వరాజ్యమనేది స్పష్టమైపోయింది ఆంగ్లేయ పాలకులకు. ఇంతలో, మహాత్మా గాంధి నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమం బలపడ సాగింది. ఆయన "అహింస" నినాదంతో దూసుకు పోయారు. దక్షిణాఫ్రికాలో ఆపాటికే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధి, బాంబేలో కాలుపెట్టిన వెనువెంటనే, జాతీయోద్యమానికి నాయకత్వం వహించమన్న నినాదం మొదలైంది. గాంధీ నిర్ణయం తీసుకునే లోపుగానే, రౌలట్ చట్టం తీసుకొని వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం, విచారణ జరపకుండా, రాజకీయ ఖైదీలను శిక్షించి, జైలుకు పంపించే అధికారాన్ని ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకిచ్చింది. విశ్వసనీయతను కోల్పోయిన ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, "ఆత్మ గౌరవం" నినాదంతో. సత్యాగ్రహ ఉద్యమానికి పిలుపిచ్చారు మహాత్మా గాంధి.

పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో, ఏకైక ఇరుకైన ద్వారమున్న ఒక ప్రదేశంలో, బైసాఖి పండుగను జరుపుకునేందుకు శాంతియుతంగా సమావేశమైన అమాయక ప్రజలపై దారుణ-మారణ కాండ జరిపించాడు జనరల్ డయ్యర్. వేలాదిమంది మరణించారా సంఘటనలో. దేశ వ్యాప్తంగా విషాదం చోటు చేసుకున్న ఆ సంఘటన దరిమిలా, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు మహాత్మా గాంధి. ఆబాల గోపాలం మద్దతు లభించిందా ఉద్యమానికి. లక్షలాది మంది ప్రజలు, తారతమ్యాలు మరిచి, ఒక్క మాట మీద నిలబడి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దురదృష్ట వశాత్తు చౌరీచౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు ప్రజాగ్రహానికి గురై చంప బడడంతో, గాంధి ఉద్యమాన్ని నిలుపుదల చేశారు. ఆ నిర్ణయం వల్ల గాంధీని కొందరు విమర్శించినప్పటికీ, ఆయన తిరుగులేని నాయకత్వం కొనసాగింది. ప్రజల హృదయాల్లో ఆయనపై నున్న అభిమానం చెరిగిపోలేదు. జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ నినాదంతో త్రి వర్ణ పతాకాన్ని రావి నది ఒడ్డున ఎగురవేయడం, శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధి మొదలెట్టేందుకు సంపూర్ణ మద్దతును భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించడం, స్వతంత్రం పొందే దిశగా కదిలేందుకు దోహద పడింది.

గాంధీజీ పిలుపు మేరకు ఆరంభం కానున్న శాసనోల్లంఘన ఉద్యమం రూపురేఖలెలా వుండబోతున్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి కేవలం భారతీయులలోనే కాకుండా, బ్రిటీష్ ప్రభుత్వంలోనూ కలిగింది. అనుకున్న రోజునే, సబర్మతీ ఆశ్రమం నుంచి, ఉప్పు సత్యాగ్రహం కొరకు "దండి" యాత్ర గాంధీ సారధ్యంలో మొదలైంది. దాన్నంత పెద్దగా పట్టించుకోవద్దుకున్న బ్రిటీష్ ప్రభుత్వానికి ఉద్యమం ఉధృతం అవగాహనైంది. అరెస్టుల పర్వం మొదలైంది. గాంధి, త్యాబ్జీ, సరోజినీ నాయుడు లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. "బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అదుపుచేసేందుకు ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, అదరకుండా-బెదరకుండా, ఎదురుతిరగకుండా, వెనుకంజ వేయకుండా, భారతీయులు ముందుకు సాగడంతో, ఆంగ్లేయులు శక్తిలేని వారై పోవడం-భారతీయులు అజేయులు కావడం జరిగింది" అని శాసనోల్లంఘనం గురించి లూయి ఫిషర్ వర్ణించారు.

లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులెవరు హాజరు కాకపోవడంతో, నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ గాంధీజీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇరువురి మధ్య సమావేశం జరిగింది. గాంధి-ఇర్విన్ ఒప్పందం దరిమిలా రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు గాంధి. నిరాశతో స్వదేశానికి రావడం మినహా ఒరిగిందే మీ లేదు. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో ఆంగ్లేయులకు మద్దతిచ్చి, ప్రతిఫలంగా, సంపూర్ణ స్వరాజ్యం పొందాలని భారత జాతీయ కాంగ్రెస్ భావించింది. ఇంతలో, జిన్నా ముస్లిం లీగుతో, కాంగ్రెస్ నాయకత్వానికి అభిప్రాయ బేధాలొచ్చాయి. పాకిస్తాన్ ఏర్పాటు తన లక్ష్యంగా ప్రకటించాడు జిన్నా. యుద్ధానంతరం డొమైన్ హోదా కల్పిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గాంధి తిరస్కరించడంతో 1947 వరకు పరిష్కారం దొరకని స్థితికి పరిస్థితులు చేరుకున్నాయి.

గాంధీజీ నాయకత్వంపై భారత జాతీయ కాంగ్రెస్, ప్రజలు, యావత్ భారతావని, అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆయన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమానికి, విజయమో-వీర స్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నాటినుంచి కౌంట్ డౌన్ మొదలైంది. స్వాతంత్ర్యం సిద్ధించే సూచనలు కనపడ సాగాయి. 1946 లో లార్డ్ మౌంట్ బేటన్ ఢిల్లీకి రావడంతో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నేర్చుకున్న పాఠాలతో భారత దేశాన్ని వదిలిపెట్టి పోవాలన్న నిర్ణయానికొచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. హఠాత్తుగా వదిలిపెట్టకుండా, అధికార మార్పిడికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను మౌంట్ బేటన్ కు అప్ప చెప్పిన బ్రిటీష్ ప్రభుత్వం, భవిష్యత్ లో భారత దేశంతో సత్సంబంధాలు కొనసాగేట్లు చూడమని సూచించింది. విభజన తప్పని పరిస్థితులు అప్పటికే చోటు చేసుకున్నాయి.

అశేష ప్రజానీకం ఎదురు చూసిన రోజు ఆనంద-విషాదాల మధ్య రానే వచ్చింది. ఆగస్టు పదిహేను 1947 అర్థ రాత్రి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగింది భారత దేశానికి. మరో రెండు రోజులకు పాకిస్తాన్ మరో స్వతంత్ర దేశంగా ఏర్పాటవడంతో భారతావని రెండుగా చీలిపోయింది. చీలిక కోరుకున్న వారిలోను, కోరుకోని వారిలోను, ఎందరో తమకిష్టం వున్నా-లేకపోయినా, తర-తరాలుగా తాముంటున్న ప్రదేశాలను వదిలి, సుదూరంగా వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. జాతి పిత మహాత్మా గాంధికి మాత్రం, తాను కోరుకున్న స్వతంత్రం సిద్ధించినా, కోరుకున్న రీతిలో సిద్ధించనందుకు సంబరాలకు దూరంగా, శాంతిని కాంక్షిస్తూ గడిపారు. ఢిల్లీలో వుండమని ఆయనకు చేసిన విజ్ఞప్తికి స్పందించలేదాయన. “సంబరాలు జరుపుకునేందుకు ఏం మిగిలింది? దేశ విభజన తప్ప” అన్నారాయన. ఆగస్టు పదిహేను అర్థ రాత్రి జవహర్లాల్ నెహ్రూ "ట్రిస్ట్ విత్ డెస్టినీ" ఉపన్యాసం వినకుండా నిద్రించిన మహాత్మా గాంధి తెల్లవారు ఝామున నిద్రలేచి, ఆయన వుంటున్న "హైదరీ హౌజ్" నుంచి మార్నింగ్ వాక్ కు బయలు దేరగానే ఆయన్ను ఒక్క సారన్నా చూద్దామని అశేష జన వాహిని ఆయనను అనుసరించారట. నడక ముగించుకుని తిరిగి రాగానే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వపు నూతన మంత్రివర్గం ఆయన ఆశీస్సులకొరకు వచ్చారట. "ముళ్ళ కిరీటాన్ని" ధరించమని వారితో అన్నారట గాంధి. అహింసకు కట్టుబడమని, అసత్యం పలకొద్దని, వినయ విధేయతలతో మెలగమని, సహన శీలంతో మసలుకోవాలని, అధికారం అంటే అప్రమత్తంగా వుండాలని, భారతదేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న పేద గ్రామీణులకు సేవచేసేందుకే అధికారమని వారికి బోధించారట మహాత్ముడు. ఆయన బోధనలను కొన్నైనా గుర్తుంచుకున్నప్పుడే, స్వతంత్ర భారతదేశంలో వుండే అర్హత మనకుందనుకోవాలి. ఆగస్టు పదిహేనున ఇదే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి.

Monday, August 9, 2010

కాంగ్రెస్‌లో ఎవరికి వారే, యమునా తీరే!-వనం జ్వాలా నరసింహారావు

-విభజించి పాలించే విధానం
-అధిష్ఠానాన్ని ఖాతరు చేయని రాష్ట్ర నేతలు
-సమ్మతి- అసమ్మతి ముఠాలు
-సీమాంధ్ర- తెలంగాణ విభేదాలు
-పార్టీని బలోపేతం చేసే దిశగా లేని చర్యలు
-ముదిరి పాకాన పడ్డ జగన్‌ వ్యవహారం

చివరికి, అనుకున్నది- అయినదీ ఒకటే అన్నట్లుగా ఉంది, నిన్న- మొన్న జరుగుతున్న సంఘటనలు విశ్లేషించి చూస్తే. జగన్‌ కాంగ్రెస్‌ను వదలక ముందే, ఆయనకు మద్దతుగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారనేది బయ టపడక ముందే, అలా పోవాలనుకున్న వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ముందు కొచ్చారు చిరంజీవి. ఎలాగూ ఎంఐఎం అండ కాంగ్రెస్‌ పార్టీకి ఉండనే ఉంది. వాళ్లు మద్దతు ఇస్తామనడం బాగానే ఉంది కాని, రోశయ్య వెంటనే దానికి అంగీ కరించినట్లు మాట్లాడడమే కొంత అనుమానాలకు దారి తీస్తుందనాలి. ఒక వైపు తన ప్రభుత్వానికి ఏ ఢోకా లేదంటూనే, తక్షణం వచ్చిన ముప్పేమీ లేదంటూనే, ఔదార్యంతో ఎవరైనా మద్దతిస్తా మంటే తప్పకుండా తీసుకొంటామనడంలో అంతరార్థం మాత్రం- అసలు సిసలైన కాంగ్రెస్‌ వ్యవహార శైలిలోనే ఉందనాలి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో సంభవి స్తున్న పరిణామాలు పార్టీని బలోపేతం చేసే దిశగా ఎంతమాత్రం సాగడంలేదు.

ఆ పరి ణామాలకు ఫలానా వారే బాధ్యులనడం, ఫలానా వ్యక్తులనే ఎత్తి చూపడం సాధ్యం కాదు. శ్రీ కృష్ణ కమిటీకి అభిప్రాయం చెప్పి వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు- మంత్రులతో సహా, తెలంగాణ వాదులను దేశ ద్రోహులు గా అభివర్ణించడాన్ని టీఆరెస్‌తో సహా, కాం గ్రెస్‌ తెలంగాణ నాయకులందరూ తప్పు బట్టారు. తమది దేశ ద్రోహమైతే, తమ ఉమ్మడి నాయకురాలు సోనియా గాంధీదీ దేశ ద్రోహమే అనే వరకూ కాంగ్రెస్‌ జగడం సాగింది. ఇలా బాహాటంగా ఒకరి నొకరు విమర్శించుకున్నప్పటికీ, క్రమశిక్షణ చర్యలు మ్రాతం ఏ ఒకరిద్దరు కాంగ్రెస్‌ నాయకులకో పరిమితమై పోవడం గమ నార్హం. అయినా క్రమ శిక్షణకు, క్రమ శిక్షణా రాహిత్యానికి మారు పేరైన నూట ఇరవై అయిదేళ్ల కాంగ్రెస్‌ పార్టీకి ఇవన్నీ మామూలే నంటున్నారు విశ్లేషకులు. సాక్షాత్తు రాజీవ్‌ గాంధీనే పార్లమెంటులో ఉరి తీయాలని అన్న వారికే కాంగ్రెస్‌ లో ఉన్న తాసనం వేయగా లేనిది, ఇతరుల క్రమశిక్షణ గురించి మా ట్లాడే అర్హత క్రమశిక్షణా సంఘానికి ఎక్కడిది అని ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ వాది ప్రశ్నించే దాకా వెళ్లింది.

భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆంగ్లేయుల ‘విభజించి పాలిం చే విధానం’ వారసత్వంగా అబ్బిందనాలి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులతో సహా సాధారణ కార్యకర్తలకు కూడా అధిష్ఠానం అంటే ఏ మాత్రం భయం లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. ఒక వైపు రోశయ్య- జగన్‌ వర్గాలుగా, మరో పక్క సీమాంధ్ర-తెలంగాణ వాదు లుగా, ఇంకో దిక్కున ఒకే ప్రాంతంలోని సమ్మతి- అసమ్మతి ముఠాలుగా, ఒకే జిల్లాలో రెండు చీలికలుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు బాహాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధిష్ఠానం కూడా తన వంతు రెచ్చగొట్టే విధానం అవలంబి స్తున్నదేగాని, పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. కాకపోతే, అప్పుడప్పుడూ, ఒకరిద్దరి మీద తాత్కాలికంగానో- తాత్కాలిక శాశ్వతం గానో వేటు వేయడం జరుగుతున్నది. అంబటిపై తక్షణ చర్యైనా- పాల్వాయిపై అర్థంలేని మౌనమైనా, గోనె-యాష్కీల మధ్య తలదూర్చక పోవ డమైనా, రాయపాటి- కన్నా విభేదాలను నాన్చడమైనా, సర్వే- శంకర్రావులను పురిగొల్పడమైనా అధిష్ఠానం ఎత్తుగడల్లో భాగమేనేమో !

వైఎస్‌ జగన్మోహన రెడ్డి, ఏది జరిగినా తన మంచికేనన్న దృక్పథంతో, ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి దూసుకుపోతున్నాడు. ఈ సుదీర్ఘ యాత్రలో- చాలా భాగం సంయమనంతో ఉపన్యాసాలిచ్చినప్పటికీ, మనసులో మాట బయట పెట్ట దల్చుకున్నప్పుడు, వెనుకా-ముందు చూడకుండా మాట్లాడడం భవిష్యత్‌ సంకేతాలకు నిదర్శనమనవచ్చు. సహనం కోల్పోయే సమయం ఆసన్నమైందన్న సంకేతాలనూ ఇస్తున్నాడు. మొత్తమ్మీద జగన్‌ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఓదార్పు యాత్రలో ఆయనేం మాట్లాడాడన్నది ప్రధానం కానేకాదు. ఆయన వేరు కుంపటి పెట్టినా- పెట్టక పోయినా మునుపెన్నడూ లేని విధంగా పార్టీ సంక్షోభంలో పడిపోతున్నదనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ఒక్కసారి ఓడితే మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే ఆ మినహాయిం ఉంది ఇంతవరకు. బహుశా ఇక ముందు ఇక్కడ కూడా, జాతీయ కాంగ్రెస్‌ మనుగడ ఏదో ఒక ప్రాంతీయపార్టీపై ఆధారపడే రోజు లు రాబోతున్నాయేమో!

ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహచరుడు, కాపు వర్గానికి చెందిన నాయ కుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్‌ చేసిన వైనం కాంగ్రెస్‌ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేశాడన్న ఆరోపణతో రాంబాబును సస్పెండ్‌ చేసింది అధిష్ఠానం. అంతేకాదు, జగన్‌ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్‌ ధిక్కార ధోర ణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్ఠంగా వ్యక్తమైంది. అంత టితో ఆగకుండా జగన్‌ మరో వీరాభిమాని, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ కార్యదర్శి గట్టు రామచందర్రావుకు ఉద్వాసన జరిగింది. మరో జగన్‌ వీరాభిమాని కొండా సురేఖ- రోశయ్యను చేతకాని సీఎం అంటూ పత్రికలకెక్కారు. వీరందరినీ సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. వారిదే క్రమశిక్షణా రాహిత్యమంటూ అంబటి అండ్‌ కంపెనీ పత్రికలకెక్కింది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌లో వినిపిస్తున్న ధిక్కార స్వరాలు, అసంతృప్తి జ్వాల లు భారత కాంగ్రెస్‌ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుకు తెస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలో ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపో వడం, స్వగృహ ప్రవేశం చేసి- గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం వంటివి ఆది నుంచీ కనిపిస్తున్నవే. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు ఒకటయ్యా రని అంటారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పో యి, కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతుల ఓటమి దిశగా కొందరు కాంగ్రెస్‌ నాయ కులు పావులు కదిలించారు. ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్‌ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీ యాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్య క్షుడయ్యారు.

1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల, విబి రాజుల మద్దతు నీలం సంజీవరెడ్డికి లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సివచ్చింది. నీలం సంజీవరెడ్డి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి లాగ డమే మంచిదని భావిం చిన జవహర్లాల్‌ నెహ్రూ, పథకం ప్రకారం యుఎన్‌ ధేబర్‌ స్థానంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా 1960లో నీలంను నియ మించారు. 1962 లో, ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి పంపారు. ఆయన వారసుడిగా 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ము ఠా రాజకీయాలకు తెర లేచింది.

ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమ ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానం లో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమ ర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత ఇందిర మంత్రివర్గంలో హోం మినిస్టర్‌ గా పని చేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌-ఐ)ని మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో కనీసం గెస్ట్‌ హౌజ్‌ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రిపదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా పని చేశారు.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభిం చేది. అసమ్మతి పుణ్యమా అని అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ను, 1989లో మరో పర్యాయం పీసీసీ అధ్యక్షుడుగా, గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైంది. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి ముఖ్య మంత్ర య్యారు.

ఆయన్నూ ఉండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డి ని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డా రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్‌ను అధికా రంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లుగా వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి.

Saturday, August 7, 2010

స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో.... వనం జ్వాలా నరసింహా రావు

ఆగస్ట్ 9 న "క్విట్ ఇండియా" ఉద్యమం మొదలైన సందర్భాన్ని స్మరించుకుంటూ....


బ్రిటీష్ వలస పాలన నుండి భారత దేశానికి విముక్తి కలిగించేందుకు జరిగిన "ప్రప్రధమ స్వతంత్ర సంగ్రామం"-1857 నాటి సిపాయిల తిరుగుబాటు పర్యవసానంగా, ఆంగ్లేయుల దోపిడీ విధానంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫ్యూడల్, జమీందారీ వర్గాలను పురికొల్పడం ద్వారా, బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానం ఆరంభమైంది. పాశ్చాత్య ధోరణులు విపరీత పుంతలు తొక్కుతూ, జాతీయ వ్యతిరేక భావాలకు దారితీయడంతో, సహించలేని పలువురు సంఘ సంస్కర్తలు, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి పూర్వ రంగంలో, బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం, థియోసాఫికల్ (బ్రహ్మ విద్య) ఉద్యమం, రామ కృష్ణా మిషన్ లాంటి పునరుజ్జీవన-పునర్వికాస ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.

లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానంలో భాగమే. అయితే, ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందేందుకు, తమ ఆశీస్సులతోనే ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ ముసుగులో, భారత జాతీయ ఉద్యమం వేళ్లూనుకుంటున్న సంగతి అర్థం చేసుకోలేకపోయింది బ్రిటీష్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, "మాడరేట్లు" గా పిలువబడే మితవాద భావాల నాయకులు పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేశారు. బ్రిటీష్ వారి పద్ధతులను పూర్తిగా వ్యతిరేకించే దశకు అలనాటి మాడరేట్లు చేరుకోలేదప్పటికి. బ్రిటీష్ పాలకులు న్యాయంగా, ధర్మంగా వ్యవహరిస్తున్నారని కూడా అప్పట్లో వారి నమ్మకం. భావ స్వాతంత్ర్యానికి, పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగినప్పుడు జరిపిన పోరాటంలో తిలక్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. మాడరేట్ల ప్రభావం క్రమేపీ క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, పార్టీలో తీవ్రవాదుల ప్రాబల్యం మొదలయింది. అదికూడా ఒక విధంగా బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానానికి అనుకూలంగానే కనిపించింది పాలకులకు.

లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ, భారతీయ యువత, స్వదేశీ ఉద్యమం చేపట్టింది. అరబిందో, తిలక్, బిపిన్ పాల్ సహాయ నిరాకరణకు ఇచ్చిన పిలుపే, భవిష్యత్ లో మహాత్మా గాంధి, పెద్ద ఎత్తున చేపట్టారు. పూర్ణ స్వరాజ్యం-స్వపరిపాలనాధికారం కావాలంటూ, బాలగంగాధర తిలక్-ఇతర అతివాద నాయకులు నినాదం లేవనెత్తటాలు. 1907 లో, కాంగ్రెస్ పార్టీలో చీలి కొచ్చి, మాడరేట్లు అతివాదులనుంచి విడిపోయారు. మాడరేట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా, అతివాదులపై మరిన్ని ఆంక్షలు విధించ సాగారు బ్రిటీష్ పాలకులు. "విభజించి పాలించే" దిశగా మరో అడుగు వేసింది ప్రభుత్వం.

భారత రాజకీయాలలో మహాత్మా గాంధి ప్రవేశించిన తర్వాత స్వాతంత్ర్యోద్యమంపై ఆయన ప్రభావం పడింది. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసిన పిదప, బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రౌలట్‌చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటి సారి జాతీయ స్థాయిలో "సత్యాగ్రహం" ఉద్యమానికి పిలుపునిచ్చారు గాంధి. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు వ్యతిరేకించినప్పటికీ, ఉద్యమం జరపాలన్న తీర్మానానికి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు.

"శాసనోల్లంఘనం" ఉద్యమానికి నాంది పలికిన గాంధి, చౌరీ చౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు మరణించడంతో, సహాయ నిరాకరణకు ఏక పక్షంగా స్వస్థి చెప్పారు. దరిమిలా, నవంబర్-డిసెంబర్, 1922 లో జరిగిన కలకత్తా, గయ కాంగ్రెస్ సమావేశాలలో చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రభృతులు ఒక వైపు, రాజాజీ, అన్సారి ప్రభృతులు మరో వైపు వాదించారు. మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు. తండ్రి మోతీలాల్ స్థానంలో లాహోర్ లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన జవహర్ లాల్ నాయకత్వంలో, డిసెంబర్ 31, 1929 అర్థ రాత్రి, నూతన సంవత్సరం ఆరంభమవుతుండగా, "పూర్ణ స్వరాజ్" నినాదంతో, త్రి వర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక అప్పటినుంచి "సత్యాగ్రహ శకం" ఆరంభమయిందనాలి.

ఫిబ్రవరి 1930 లో సబర్మతి ఆశ్రమంలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, శాసనోల్లంఘన ఉద్యమం విషయంలో నిర్ణయాధికారం గాంధీజీకి వదిలింది. మార్చ్ 12, 1930 న చారిత్రాత్మక దండి సత్యాగ్రహానికి నాంది పలికారు. అప్పటికింకా గాంధీని అరెస్ట్ చేయలేదుగాని, వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది. ఏప్రిల్ 5, 1930 నాటికి దండి చేరుకుంది గాంధీజీ బృందం. సముద్రపు ఒడ్డున పిడికెడు ఉప్పును చేతబట్టి, "ఉప్పు చట్టాన్ని" ఉల్లంఘించామని, ఇక ముందు చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి పౌరుడు తాము అనుకున్న స్థలంలో ఉప్పు తయారు చేసుకోవచ్చని పిలుపిచ్చారు. ఉప్పు కర్మాగారాలపై దాడి చేస్తామని మరో లేఖను వైస్రాయ్ కు రాయడంతో, గాంధీజీని అరెస్ట్ చేసి ఎర వాడ జైలుకు తరలించింది బ్రిటీష్ ప్రభుత్వం. వందల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం కొనసాగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని చట్టవిరుద్ధ సంస్థగా పేర్కొంటూ, మోతీలాల్ నెహ్రూను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. "విభజించి పాలించే" విధానాన్ని నమ్ముకున్న బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీని ఒంటరి వాడిని చేసి, ఇతరులను నిర్బంధించి ఉద్యమానికి గండి కొట్టాలని తలచింది. అయినా వారి కోరిక సఫలం కాలేదు.

గాంధి-ఇర్విన్ మధ్య కుదిరిన ఒప్పందం అమలులో పూర్తిగా విఫలమైంది. ఇంగ్లాండ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ, రిక్త హస్తాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి నాయకులను మరోసారి అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జనవరి 4, 1932 న గాంధీజీతో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులను అరెస్ట్ చేయడంతో సహా, కాంగ్రెస్ పార్టీని చట్ట వ్యతిరేక సంస్థగా నిర్ణయించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 1940 లో, భావ స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటూ, కాంగ్రెస్ నాయకత్వం సత్యాగ్రహానికి దిగింది మరో సారి. మొదటి సత్యాగ్రహి వినోభా భావే కాగా, జవహర్లాల్ నెహ్రూ ఆయన తర్వాత సత్యాగ్రహి. అరెస్టయిన నెహ్రూకు నాలుగేళ్ల కారాగార శిక్ష పడింది. జులై 14, 1942 న, వార్దాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, "క్విట్ ఇండియా" డిమాండ్ చేయాలని తీర్మానించింది. ఆగస్ట్ 7, 1942 న బాంబేలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆ మర్నాడు ఆగస్ట్ 8, 1942 న, జవహర్లాల్ నెహ్రూ ప్రవేశ పెట్టిన, "క్విట్ ఇండియా" తీర్మానాన్ని ఆమోదించింది. సర్దార్. వల్లభాయ్ పటేల్ తీర్మానాన్ని బలపర్చారు. తీర్మానంలో చివరగా "స్వతంత్ర భారతదేశం కావాలన్న వాంఛ వున్నప్పటికీ, దానికి సామూహిక ప్రజా ఉద్యమం చేపట్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టాలన్న ఉద్దేశం లేదు. అధికారం ఎప్పుడొచ్చినా, అది ప్రజలకే చెందుద్తుంది" అని పేర్కొనడం జరిగింది. కాకపోతే స్వతంత్రం వచ్చిన నలభై సంవత్సరాల వరకు అధికారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే వుంది. తీర్మానం ఆమోదించిన మరుక్షణమే మాట్లాడిన గాంధీజీ, తాను "తక్షణమే, వీలుంటే ఆ రాత్రే-తెల్లవారే లోపునే" స్వరాజ్యం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. స్వతంత్రం కంటే తక్కువైనదేదీ తనకు అంగీకారం కాదని కూడా స్పష్టం చేశారాయన.

ఆగస్ట్ 8, 1942 న తెల్లవారక ముందే, ప్రభుత్వం వేసుకున్న పటిష్ఠమైన ప్రణాళిక ప్రకారం, గాంధీజీ తో సహా కాంగ్రెస్ నాయకులందరినీ నిర్బంధంలోకి తీసుకుని, రహస్య ప్రదేశాలకు తరలించింది ప్రభుత్వం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎక్కడ దొరికితే అక్కడే అరెస్ట్ చేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా వున్న అన్ని సంస్థలను, వ్యవస్థలను నిషేధించింది. ఖాదీ-హరిజన సంస్థల లాంటి సాంఘిక కార్య కలాపాలను కూడా నిషేధించింది. ప్రజలనుంచి కూడా అదే మోతాదులో ప్రతిఘటన ఎదురైంది. బొంబాయిలో పోలీసు హెచ్చరికలను లక్ష్య పెట్టకుండా అరుణా ఆసఫ్ అలీ ఝండా ఎగుర వేసింది. ఒక వైపు "క్విట్ ఇండియా" ఉద్యమం, మరో పక్క "ఆజాద్ హింద్ ఫౌజ్" ప్రభావం, ఇంకో దిశగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఓటమి, ప్రభుత్వాన్ని కలవర పరిచాయి. చర్చిల్ వారసుడు క్లెమెంట్ అట్లీ, త్రి సభ్య కాబినెట్ కమిటీని నియమించి, ఆ కమిటీ భారత దేశాన్ని సందర్శించనున్నదని ఫిబ్రవరి 19, 1946 న ప్రకటించారు. కమిటీతో చర్చలకు పాకిస్తాన్ ఏర్పాటు ప్రాతిపదిక కావాలని జిన్నా అభిప్రాయ పడ్డారు. త్రి సభ్య కాబినెట్ మిషన్ తో రాజకీయ నాయకుల చర్చలు సఫలం కాలేదు. ఇంతలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన బడుగు-దళిత వర్గాల వ్యక్తితో కలిపి ఆరుగురు హిందువులు, ముస్లింలీగుకు చెందిన ఐదుగురు ముస్లింలు, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీ-మొత్తం పద్నాలుగురుండే మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించాడు వైస్రాయ్. ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించడంతో, తాత్కాలికంగా, అధికారులతో కూడిన ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు వైస్రాయ్. తదనంతరం, వైస్రాయ్ ఆహ్వానం మేరకు, ఆరుగురు హిందువులతో, ముగ్గురు ముస్లింలతో, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీలతో జవహర్లాల్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం సెప్టెంబర్ 2, 1946 న అధికారాన్ని చేపట్టింది. అక్టోబర్ చివరి వారంలో ముస్లిం లీగ్ కూడా ప్రభుత్వంలో చేరింది. కాకపోతే షరతులతో చేరింది. అధికారం నడుపుతున్నది మంత్రివర్గం తరహా ప్రభుత్వంగా పరిగణించ రాదనీ, అది కేవలం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాత్రమేనని ముస్లిం లీగ్ వాదన.

1946-1947 మధ్య కాలంలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భారీ సంఖ్యలో హిందువులకు ప్రాణ-ఆస్తి నష్టం కలిగింది. నవంబర్ 1946 లో గాంధీజీ నవొకాళీకి వెళ్లి, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలు పరిస్థితిని కుదుట బర్చాయి. దేశ విభజన జరగాలన్న మౌంట్ బేటన్ ప్రణాళికకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. గాంధీజీకి విభజన ఇష్టం లేదు. వ్యతిరేకిస్తే విప్లవం మినహా మార్గాంతరం లేదని కూడా ఆయనకు తెలుసు. రెండు దేశాల జిన్నా వాంఛ నెరవేరనున్న తరుణంలో, స్వతంత్రం సిద్ధించనున్న తరుణంలో, లక్షలాది హిందువులు, ముస్లింలు తరతరాలుగా నివసిస్తున్న ప్రాంతాలను-అనుభవిస్తున్న తాత-ముత్తాతల ఆస్తులను వదిలి "శరణార్థుల కాంపుల" లో ఇతరుల దయాదాక్షిణ్యాలతో జీవించాల్సిన పరిస్థితులు కలిగాయి. అలనాటి సంఘటనలను "భారత మాత ఆత్మ సంక్షోభం" గా అభివర్ణించారు జవహర్లాల్ నెహ్రూ.

లక్షలాది భారతీయుల ఇక్కట్ల-త్యాగాల ఫలితంగా, ఆగస్ట్ 14-15 అర్థ రాత్రి సమయంలో, పాకిస్తాన్ భూభాగం భారత దేశం నుంచి విడిపోయిందన్న అశేష జన వాహిని మనస్థాపం మధ్య సంపూర్ణ స్వతంత్రం సిద్ధించింది భారతావనికి. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఆగస్ట్ 9, స్వాంతంత్ర్యం వచ్చిన ఆగస్ట్ 15 భారతీయులకు అసలైన పండుగ దినాలు.