Monday, May 31, 2021

ప్రగతి సుమాలు, సంక్షేమ ఫలాలు : వనం జ్వాలా నరసింహారావు

 ప్రగతి సుమాలు, సంక్షేమ ఫలాలు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (01-06-2021)

తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు నీళ్లు, నిధులు, నియామకాల నినాదమే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న నాడే తెలంగాణ ప్రజలకు అన్నిరంగాల్లో న్యాయం జరుగుతుందని ఉద్యమ నేతగా ఉన్నపుడే చెప్పారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అనంతరం, స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2021 జూన్ వరకు ఏడేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షోభ సమయాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆపకుండా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే, ఈ విషయం మనకు కండ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల్లో సహజంగానే పేదరికం అధికం. వీరంతా రోజువారీ పనులు చేసుకుని కడుపు నింపుకొనే వారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి వసతి లేక వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైపోవడంతో రైతులు కూడా పేదరికం అనుభవించాల్సిన దుస్థితి ఉండేది. కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలేని దుర్భర పరిస్థితులను పేదలు అనుభవించేవారు. ఇక్కడ రోజూ ఆకలి చావులే. తెలంగాణ ఏర్పడే నాటికి ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండేది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆకలి చావులనేవి ఉండకూడదని, పూర్తి జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంకల్పించారు. అందుకే, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.40 వేల కోట్లతో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో పేదలకు జీవన భద్రత ఏర్పడింది. వారు పస్తులుండాల్సిన పరిస్థితి తప్పింది. అతి తక్కువ సమయంలోనే దేశంలో మరెవ్వరూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది.

ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నాటి తెలంగాణ ప్రాంతానికి, అన్ని రంగాల్లో అనూహ్య అభివృద్ధిని సాధించి, అన్ని రాష్ట్రాలకూ దిక్సూచిగా మారిన నేటి తెలంగాణకు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

అప్పుడు కరెంటు కోతలు, కాలిపోయే మోటార్లు, కరంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక, బావుల దగ్గరే రైతులు నిద్రించే దుస్థితి ఉండేది. నేడు 24 గంటలూ రైతుల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా నాణ్యమైన కరెంటు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

ఆనాడు ప్రాజెక్టులన్నీ సర్వేలకే పరిమితమై, భూములన్నీ నీరందక బీడులుగా మారి పడావు పడితే, నేడు ప్రాజెక్టులు దాదాపు పూర్తవుతూ మారుమూల టేల్ ఎండ్ చివరి భూములకూ నీరందిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యమైతే, నేడు తెలంగాణలో అవి మచ్చుకైనా కానరావడం లేదు. అప్పడు వ్యవసాయం దండుగ అని ఆనాటి పాలకులు అంటే నేడు  పండుగగా మార్చి చూపారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. రైతులు నాడు లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు పండించగలిగితే, నేడు కోటికి పైగా ఎకరాల్లో రెండు పంటలూ పండిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో  పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారితే, స్వరాష్ట్రంలో పైసా ఖర్చు లేకుండా పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయి గురుకుల విద్యను అందుకోగలుగుతున్నారు. అప్పుడు విద్యార్థులు దొడ్డుబియ్యంతో వండిన పురుగుల అన్నం తినలేక రోగాల బారిన పడితే, ఇప్పడు సన్నబియ్యపు అన్నం తిని ఉల్లాసంగా చదువుకుంటున్నారు.

ఆనాటి పరిస్థితుల్లో ఆడపిల్ల పుడితే చాలు, ఆమె నెత్తిమీద-గుండెమీద కుంపటి అనుకుంటే, ఈనాటి పరిస్థితుల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింట్లో ఆడపిల్ల పెళ్లి ఓ పండుగలా జరుగుతున్నది.  అప్పడు రహదారులు నరకానికి నకళ్లుగా మారి, గ్రామాలకు బస్సులు వెళ్లలేని పరిస్థితులుంటే, ఇప్పడు రోడ్లన్నీ ఎక్కడికక్కడ అద్దంలా రూపుదిద్దుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్షేత్రస్థాయి ఉద్యోగులు తక్కువ వేతనాలతో బతుకీడ్చాల్సి వస్తే, స్వరాష్ట్రంలో గౌరవప్రద వేతనాలతో ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. అప్పుడు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పైసా పైసాకు దేబిరించాల్సి వస్తే, ఇప్పుడు అవి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ప్రభుత్వ నిధులందుకుంటూ, అభివృద్ధి పథంలో ముందున్నాయి.

పరిపాలనా సంస్కరణలు లేక ఉమ్మడి పాలనలో జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిరావడం దూరభారం అయితే, ఇపుడు పెరిగిన జిల్లాలతో పరిపాలనా విభాగాలన్నీ ప్రజలకు చేరువయ్యాయి.  ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణను కల్లోల ప్రాంతంగా మారిస్తే, స్వరాష్ట్రంలో తెలంగాణ శాంతిభద్రతలకు కేరాఫ్ అడ్రస్ గా, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా  నిలిచింది. అప్పడు అడవుల నరికివేతతో ఎడారి వాతావరణం కనిపిస్తే, ఇప్పడు తెలంగాణ నేలంతా పచ్చదనం అలుముకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వందల పరిశ్రమలు మూతపడితే, ఇప్పడు ప్రభుత్వ అనుకూల విధానాలతో వేలాది పరిశ్రమలు తరలివస్తున్నాయి. అప్పడు నిత్య కర్ఫ్యూలతో మన రాజధాని ఆగమయితే,  ఇప్పడు తెలంగాణలో శాంతియుత సహజీవనం సాగుతున్నది.

దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అంశాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నది.  సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. విద్యుత్ సరఫరా విషయంలో కూడా అంతే. తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధిక వృద్ధి రేటు సాధించింది. విద్యుత్ వినియోగం కూడా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సగటుకన్నా అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. మిషన్ భగీరథ పథకం ద్వారా 100 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా నీరందిస్తూ మంచినీటి సరఫరాలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. గ్రామీణాభివృద్ధిలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. అన్ని గ్రామాల్లో నర్సరీలు, డంపు యార్డులు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే, అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు కూడా సమకూర్చడం జరిగింది.

ఇక ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అత్యుత్తమ సేవలందిస్తున్న మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతి ఆయోగ్ ప్రకటించింది. ప్రపంచంలోనే నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ నంబర్ -1 అని జెఎల్ఎల్ ప్రకటించింది. ఐటి ఎగుమతుల వృద్ధిరేటులోనంబర్ వన్ స్థానంలో నిలిచింది. 17 శాతం వృద్ధిరేటుతో 1 లక్షా 10 వేలకు పైగా విలువైన ఎగుమతులు జరిగాయి. సుస్థిరాభివృద్ధి సాధిస్తున్న మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని నీతి ఆయోగ్ ప్రకటించింది. సిసి కెమెరాల వినియోగం, నేరాల నియంత్రణలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నది. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో దాదాపు రెండొంతులు అంటే, తెలంగాణలో 6 లక్షల కెమెరాలున్నాయి. తద్వారా నేరాల నియంతిస్తున్నారు.

నీటి పారుదల రంగంలో తెలంగాణ అగ్రస్థానంలోనే ఉన్నది. అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరంను కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసి, ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చిన్ననీటి వనరులు, చెరువుల పునరుద్ధరణకు, అభివృద్ధికి అత్యధిక కృషి చేసిన రాష్ట్రం తెలంగాణ  అని నీతి ఆయోగ్ ప్రకటించింది.

ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంలో కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రైతుకు పంట పెట్టుబడి అందించేందుకు రెండు పంటలకూ కలిపి ఒక్కో ఎకరానికి 10 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భారీ స్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలిచ్చింది. ఆడపిల్ల పెళ్ళికి ఒక్కొక్కరికి రూ. లక్షా 116  చొప్పున ఎక్కువ సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నిలిచింది.

ఇతర వర్గాల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ ముందున్నది. జర్నలిస్టులకు రూ. 60 కోట్లు, న్యాయవాదులకు రూ. 100 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ – ప్రతీ ఏటా 100 కోట్లు అందజేస్తున్నది. రాష్ట్రలో అత్యధికంగా 959 రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యాబోధన అందుతున్నది. డబుల్ బెడ్రూం ఇండ్ల ద్వారా పేదలకు గూడు కల్పిస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడంలో ముందున్నది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున సాయం అందిస్తున్నది.

కులవృత్తులకు చేయూతలో భాగంగా గొల్ల కుర్మలకు 77 లక్షల గొర్రెల పంపిణీ చేసింది. చేపలు, రొయ్యలను రాష్ట్రంలోని నీటివనరుల్లో పెంచి బెస్త, ముదిరాజ్, గంగపుత్రులకు జీవనోపాధి కల్పిస్తున్నది. చేనేత కార్మికులకు ఎక్కువ సాయం అందిస్తూనే నూలు, రంగులు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. ప్రమాదానికి గురైన సందర్భంలో  గీత, మత్స్యకారుల ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల సాయం అందిస్తున్నది. ప్రకృతి వైపరీత్యాల మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు సాయం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.6 లక్షల సాయం అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

అత్యంత వెనుకబడిన (ఎంబిసి)ల అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ కరెంటు సబ్సిడీలు అందజేస్తున్నది. 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నది. సెలూన్లు, లాండ్రీలకు కూడా దీన్ని విస్తరించింది. మైక్రో ఇరిగేషన్ కు  80 నుంచి వంద శాతం వరకు సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. గర్భిణీలకు కేసీఆర్ కిట్స్ ద్వారా రూ.15వేల వరకు సాయం అందిస్తున్నది. అతి భారీ ఐ స్క్రీనింగ్ డ్రైవ్ కంటి వెలుగులో 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు చేయడమేగాక, అవసరమైన వారికి కండ్లద్దాలు, మరొకొందరికి ఆపరేషన్లు కూడా చేయించి, అన్ని రాష్ట్రాల ప్రశంసలందుకున్నది తెలంగాణ.

సింగరేణి బొగ్గుగని కార్మికులకు లాభాల్లో 28 శాతం వాటా ఇస్తూ, ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ వేతనాలున్న హోంగార్డుల వేతనాలు పెంచి, ప్రతి ఏటా రూ.1 వెయ్యి చొప్పున పెంచుతున్నది. దీంతో ఇపుడు రూ. 23 వేల వరకు వేతనం అందుతోంది.  తక్కువ సమయంలో ఎక్కువ పరిపాలనా సంస్కరణలు చేపట్టిన తెలంగాణలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు ఏర్పాటై ప్రజలకు ప్రభుత్వ పాలన అందుబాటులోకి వచ్చింది.

అదేవిధంగా చిన్న ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచిన ప్రభుత్వం, వారి కుటుంబాలను ఆదుకున్నది. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, వి.ఆర్.ఏ.లు, వి.ఏ.ఓ. లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, ఆశావర్కర్లు తదితరుల వేతనాలను దేశమంతటా పరిశీలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇక అత్యధిక నియోజకవర్గ అభివద్ధి నిధులు కేటాయిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ.3 కోట్ల నిధుల చొప్పున అందుతున్నాయి.

ఇలా ఏడేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, నిధుల లోటులేకుండా పనులు జరిపిస్తూనే, వాటిపై ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుందనడంలో అతిశయోక్తి లేదు.  

Sunday, May 30, 2021

శ్రీరాముడిని తనతో పంపమని దశరథుడిని అడిగిన విశ్వామిత్రుడు.....శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-58 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడిని తనతో పంపమని దశరథుడిని అడిగిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-58

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-05-2021)

ఇలా తనను ప్రార్థించిన దశరథుడిని సంతోషంతో - వికాసంతో చూసిన విశ్వామిత్రుడు రాజును చూసి అంటాడీవిధంగా: " ఓ రాజేంద్రా! రఘువంశం సత్యసంధతకు, దాన మహిమకు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. అంత గొప్ప వంశంలో పుట్టిన నువ్వు ఈ రెండింటిలో దయాశతిశయంతో నన్ను మరచిపోయేటట్లు చేసావు. నీవంశమేమో సూర్యవంశం. కులగురువేమో వశిష్ఠుడు. నీగుణాలేమో లెక్కలేనన్నివి. ఇలాంటి నువ్వు ఎలామాట్లాడాలో, అలానే పలికావు. నేనేదికోరినా తప్పక ఇస్తానంటున్నావు. నా మనసులో వున్నదాన్నే నేనడుగుతాను. నా కోరికను నీవు నెరవేర్చి, దశరథుడు ఎట్టి సంకట సమయంలోనూ, ఆడితప్పేవాడు కాదన్న కీర్తిని సంపాదించుకో. ఇక నేను చెప్పాలనుకొంది చెప్తా విను. నేనిప్పుడొక యజ్ఞం చేద్దామని సంకల్పించుకొని, దీక్ష పూనాను. దాన్ని ఏవిధంగానైనా విఘ్నం చేయాలని మారీచ - సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారు”.

“వాళ్ళిదరూ కామరూపులు - దయాదాక్షిణ్యాలు లేనివారు - అస్త్ర లక్షణాలు తెలిసున్నవారు - మహా బలవంతులు - గురి తప్పక కొట్టగలిగే వారు. వాళ్ళేం చేస్తారంటావేమో? నెత్తురుని, మాంసాన్ని –కుప్పలు కుప్పలు గా యజ్ఞ వేదిక మీద గుమ్మరిస్తారు. సదస్యులను, వచ్చిన మునులను తన్ని, మేం చూస్తుండగానే చంపుతారు. వాళ్ళీవిధంగా యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నందువల్ల, ఉత్సాహమంతా పోయి, కష్టపడి నా ఆశ్రమాన్ని వదలి, నువ్వు సహాయం చేస్తావేమోనని అడుగుదామని ఆశతో వచ్చాను. నేను బాణం పట్టగలను కదా - శాపం పెట్టగలను కదా - ఎందుకు వారిని విలువిద్యతో జయించకూడదు - ఎందుకు శాపం పెట్టి చంపకూడదు అని నీవడుగవచ్చు. ఆపాపాత్ముల బల గర్వాలను అణచి వారిని యమలోకానికి పంపడానికి నాకు కష్టంకాదు. కాని, యజ్ఞ దీక్ష సమయంలో, నేను కోపంతో విల్లు పట్టకూడదు - శపించనూ కూడదు. మిగతా రోజుల్లో దండించుదామంటే వాళ్ళు రారు. యజ్ఞ సమయంలోనే వారిని దండించాలి".

తాను చెప్పదలుచుకొన్న విషయాన్ని కొనసాగిస్తూ విశ్వామిత్రుడు: " నాకు కావాల్సిన సహాయం ఏంటంటావా? పెద్దవాడివైన నీకు, నేను శ్రమివ్వదల్చుకోలేదు. కమలాలమీద తుమ్మెదల్లాగా, ముద్దైన ముఖం మీద ముంగురులతో, అందమైన జునపాలతో, బలానికి స్థానమైన నీ గారాల కొడుకు శ్రీరామచంద్రమూర్తిని-సత్యపరాక్రముడిని నాకివ్వు.రాక్షసులతో యుద్ధమన్నావుకదా! ఆరాక్షసులు మాయావులంటివికదా!మహాబల పరాక్రమ సంపన్నులంటివికదా! అస్త్ర వేదులని కూడా అన్నావుకదా! అలాంటప్పుడు, వాళ్ళతో యుద్ధంచేసేందుకు, జానెడు పిల్లవాడిని తీసుకొనిపోతే ప్రయోజనమేంటని నీకు అనుమానం రావచ్చు. నేను కాపాడుతున్నంతవరకూ, నీ కొడుకు, మారీచాది రాక్షసుల సమూహాన్ని సులభంగా చంపగలడు. వారి బలం -అతిశయం ఎంతదైనా, దయా ధర్మాలనే గుణాలు అసలే లేనందువల్ల, నీచులైనందువల్ల, అసాధ్యులుకారు. అయినప్పటికీ, వారిని చంపగల బలశాలి, ఒక్కశ్రీరాముడేకాని మరెవ్వరూలేరు. నా యజ్ఞాన్ని రక్షించగల సమర్థుడైన శ్రీరాముడిని నావెంటపంపు. నువ్వీకార్యాన్ని నెరవేరుస్తే, నీ కొడుకుకు నేనెన్నో శుభాలు కలిగిస్తాను. రాముడు లోకంలో విశేషమైన కీర్తిమంతుడిగా ప్రకాశిస్తాడు. వారెంత బలవంతులైనప్పటికీ, పాపాత్ములు - ధర్మహీనులు అయినందున, యుద్ధంలో శ్రీరాముడిని ఎదిరించి నిలువ లేరు. పాపం ఎంత బలంగా వున్నా ధర్మమే గెలుస్తుంది. రాముడు పసిబాలుడనీ - యుద్ధం చేసే శక్తిలేనివాడనీ, పుత్రుడిపైవున్న మోహాన్ని వదిలిపెట్టు. రాక్షసులు నీ కొడుకు ఎదుట నిలవలేరని ప్రమాణంచేసి చెప్తున్నాను" అని అంటాడు.

సంసారిగా వున్న దశరథుడికి పుత్రుడిపై మోహమెందుకుండదు? ఆయనకొడొకు బలాబలాలు, ఆయనకన్నా ఎక్కువగా విశ్వామిత్రుడికెట్లా తెలుసును అన్న సందేహం కలగొచ్చు. శ్రీరాముడు పేరుకే దశరథుడి కొడుకు - నిజానికి లోకాలకెల్ల తండ్రి. ఆవిషయాన్నే చెప్తూ, శ్రీరాముడు లోకాన్ని ఉద్ధరించడానికై పుట్టాడు కాని, దశరథుడి ఇంట్లో సుఖపడడానికి కాదంటాడు విశ్వామిత్రుడు. శ్రీరాముడు తన కొడుకని దశరథుడికెంత ప్రేముందో, జగజ్జనకుడైన ఆయనకు అంతకన్నా ఎక్కువ ప్రేమ లోకంమీదుంది. సత్య మెరుగని దశరథుడు శ్రీరాముడిని తనకుమారుడనే తలబోస్తున్నాడనీ, సత్యమెరిగిన తనలాంటివారు, ఆయనను భగవంతుడిగా చూస్తున్నారనికూడా అంటాడు. ఆయన అందరి సొత్తుకాని, కేవలం దశరథుడొక్కడి సొత్తుకాదని విశ్వామిత్రుడు స్పష్ఠంచేస్తాడు.

"రాజేంద్రా! శ్రీరాముడి సత్య పరాక్రమం నాకు తెలుసు. కావాలంటే వశిష్ఠుడిని అడుగు. అంతటితో తృప్తికలగపోతే ఇక్కడున్న తపస్వులనందరినీ అడుగు - వీరందరికీ శ్రీరాముడి మహిమ తెలుసు. నీకు ధర్మాన్ని అభివృద్ధిచేసి వూర్ధ్వలోకసుఖం అనుభవించాలని వుంటే - మంచి కీర్తివంతమైన ఐహిక ఫలాలను అనుభవించాలని వుంటే, శ్రీరామచంద్రుడిని నాతో పంపు. పనికిమాలిన సందేహాలన్నీ వదిలిపెట్టు. పంపకపోతే నీకింక ఇహ-పరాలుండవు. వశిష్ఠుడు - ఇతర పురోహితులు, సుమంత్రుడు - ఇతర మంత్రులు, నీ కొడుకును నా వెంట పంపమని అంటేనే పంపు. వాళ్ళు వద్దంటే మానేయి. నేను చేయబోయే యజ్ఞం పూర్తవడానికి ఈ రోజునుండి పది రోజుల సమయముంది. ఈ యజ్ఞం రాక్షసులవల్ల విఘ్నం కాకుండా కాపాడబడాలి. దీక్షా కాలం మించిపోక ముందే నీ కొడుకును నా వెంట పంపు" అని తాను చెప్పదల్చుకొన్నది పూర్తిగా చెప్పి, యజ్ఞం పేరుతో శ్రీరాముడిని తన వెంట తీసుకొనిపోయి, వారితో మారీచ - సుబాహులను చంపించి, వారికి శ్రేయస్సు కలిగించాలని తాను తలంచిన విషయాన్నంతా చెప్పి, దశరథుడి సమాధానం కొరకు మౌనం దాల్చాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తన వెంట పంపమన్న మాట వినగానే దశరథుడి ముఖం విలవిల బోయింది. పెద్దాయనకు మాట ఇచ్చానే! ఎట్లా తప్పాలి! మాటతప్పకుండా శ్రీరాముడి నెట్లా పంపాలి? పంపితే రాముడిని విడిచి ఎట్లా బతకాలి? ఇప్పుడు అవునంటానికీ లేదు - కాదని అంటానికీ లేదని తనలో తానే అనుకుంటూ, విశ్వామిత్రుడి మాటలు విన విననట్లు, విషాదంగా కూర్చొన్నాడు దశరథుడు. కాసేపయింతర్వాత తననే మ్మనకపోతాడానన్న ధైర్యంతో వేచిచూసినప్పటికీ, విశ్వామిత్రుడి నోట అలా రాకపోయే సరికి, ఆశ వదలి గుండెలు పగిలి దుఖఃసముద్రంలో మునిగి - స్మృతి తప్పి పడిపోయాడు దశరథుడు.  

Saturday, May 29, 2021

Brahmins as Reformers : Vanam Jwala Narasimha Rao

 Brahmins as Reformers

Vanam Jwala Narasimha Rao with VJM Divakar

Hans India (30-05-2021)

The Caste system as a social hierarchy is still prevalent today.  Brahmin is said to be the highest Varna in Vedic Hinduism. The Brahmin Varna consists of priests, and individuals and are separated into sub-castes called Gotras. Religious and cultural diversity divides Brahmins into these sub- castes. Only some are priests whereas others have held professions as educators, law makers, scholars, doctors, writers, poets, land owners, and politicians. Brahmin came from the term Brahman, which is a magical force. The Rig Veda is one of the most sacred Hindu scripture, and it contains the mythological origin of the Brahmin.

In this backdrop, if we study and analyze the role played by Brahmins in the two Telugu states, we can come to a safe conclusion that Brahmins played a vital role in the evolution of the modern society in whatever capacity they were. Revolutionary social reforms took place in the Telugu States in the past and are taking place even today, thanks to the pro-active role played by the Brahmins. From social reforms to modern science, from literature to cinema, from politics to public administration, from spirituality to communism, from traditional values to progressive thinking, the Brahmins played their role perfectly to the precision. This is an attempt to record albeit briefly about the great Brahmin personalities who have contributed and enriched our society at every stage.

To name few among them were: Swami Ramanand Tirtha, Kaloji Narayana Rao, Pamulaparthi Venkata Narasimha Rao, Daasarathi Krishnamacharya, Kondapalli Seshagiri Rao, Dr Burgula Ramakrishna Rao, Pamulaparthi Sadashiv Rao, Rau Bahadur Kandukuri Veereshalingam Pantulu, Gurajada Venkata Apparao, Chilakamarthi Lakshmi Narasimham, Kallakuri Narayana Rao, Gidugu Venkata Ramamurthy, Tanguturi Prakasam Pantulu, Tenneti Viswanadham, Srirangam Srinivasa Rao, Devulapalli Venkata Krishnasastri, Bellary Raghava, Bhandaru Acchamamba,  Dr Yellapragada Subbarow, Durgabai Deshmukh and so on.          

Swami Ramanand Tirtha, leader of the Hyderabad State Congress, born on 3 October 1903 and died on 22 January 1972, was a freedom fighter, educator and social activist who led the Hyderabad liberation struggle during the reign of Osman Ali Khan, the last Nizam of Hyderabad State. He created a revolutionary movement to integrate Hyderabad State with the Indian Union in 1948.

Kaloji Narayana Rao born on 9 September 1914 and died on 13 November 2002 was an Indian poet, freedom fighter, anti-fascist and political activist of Telangana. He was awarded the Padma Vibhushan in 1992. The Telangana government honored Kaloji's birthday as Telangana Language Day. During his student days and later, he was deeply influenced by and participated in popular movements of the time, like the Arya Samaj Movement, especially in the domain of civil rights. Considered by many to be a freedom fighter he was part of the freedom movement of Hyderabad State and underwent imprisonment under the Nizam.

Pamulaparthi Venkata Narasimha Rao born on 28 June 1921 and died on 23 December 2004, was often referred as the modern day Chanakya and Polyglot. PV’s ascendancy to the prime Ministership was politically significant in that he was the first from South India to held this post. He led an important administration, overseeing a major economic transformation and several home incidents affecting national security of India. Rao was personally responsible for the dismantling of the License Raj.  He is often referred to as the Father of Indian Economic Reforms.

Daasarathi Krishnamacharya popularly known as Daasarathi born on 22 July 1925 and died on 5 November 1987 was a leading Telugu poet, united AP State Poet Laurent and a very famous Telugu film lyricist and writer. As a volunteer in the left-wing Andhra Mahasabha movement, Daasarathi travelled from village to village in Telangana to enlighten the public. Mahatma Gandhi and Kandukuri Veereshalingam influenced him. However, he joined the political left, as most of his friends were leftists and communist revolutionaries.

Kondapalli Seshagiri Rao born on January 22, 1924 and died on July 26, 2012) was a very famous artist, painter and was trained in Santi Niketan. He was a teacher in the JNTU College of Fine Arts, Hyderabad.

Dr Burgula Ramakrishna Rao born on 13 March 1899 and died on 15 September 1967 was the first elected Chief Minister of the erstwhile Hyderabad State. He was among the Telugu-speaking leaders to resist the Nizam in the princely state of Hyderabad. Burgula was one of the founding members of the Hyderabad State Congress. He was also involved in promoting the library movement in the State. He eradicated the system of Jaghirdar and makthedar in Telangana and introduced the law of tenancy and became the first Indian land reformer.

Pamulaparthi Sadashiv Rao born on 17 July 1921 and died on 26 August 1996 was a thinker, philosopher, and freelance journalist. He started the monthly magazine Kakatiya Patrika in 1944 in Warangal along with his cousin PV Narasimha Rao, later Prime Minister of India.

Rau Bahadur Kandukuri Veereshalingam Pantulu born on 16 April 1848 and died on 27 May 1919 was a social reformer. He is considered as the father of the Telugu Renaissance movement. He was one of the early social reformers who encouraged the education of women and the remarriage of widows.  He also fought against child marriage and the dowry system. He is often considered as the Raja Ramamohan Roy of Andhra. Considering literature as an instrument to fight against social evils, his writings also reflected the same.

Gurajada Venkata Apparao born on 21 September 1862 and died on 30 November 1915 was a noted Indian playwright, dramatist, poet, and writer known for his works in Telugu theatre. He was one of the pioneers of Indian theatre. In 1897, his famous book Kanyasulkam was published by Vavilla Ramaswamy Sastrulu and Sons.

Chilakamarthi Lakshmi Narasimham born on 26 September 1867 and died on 17 June 1946 was a romantic and a social reformer in the tradition founded by Veereshalingam. He was active in the Indian independence movement; he eschewed "foreign cloth" and wore Khadi dhoti, shirt, coat and turban.

Kallakuri Narayana Rao born on 28 April 1871 and died on 27 June 1927 was social reformer, play writer, Cinematographer and nationalist. His novel "Varavikrayam" is about the Dowry system prevalent in British India. The film Varavikrayam is based on the novel and play of the same name by him. Gidugu Venkata Ramamurthy born in 1863 and died in 1940 was a Telugu writer and one of the earliest modern Telugu linguists and social visionaries during the British rule.

Tanguturi Prakasam Pantulu born on 23 August 1872 and died on 20 May 1957 was an Indian politician and freedom fighter, Chief Minister of the Madras Presidency, and subsequently became the first Chief Minister of the new Andhra state, created by the partition of Madras State along linguistic lines. He was also known as Andhra Kesari.

Tenneti Viswanadham born in 1896 and died in 1979 was a political figure from Visakhapatnam. He took an active part in India's struggle for independence. He is remembered now for his role in the establishment of a modern and shore-based steel plant at Visakhapatnam.

Srirangam Srinivasa Rao born on 30 April 1910 and died on 15 June 1983, popularly known as Sri Sri, was an Indian poet and lyricist who is known for his works in Telugu literature and films. Noted for his anthology Maha Prasthanam, Sri Sri is a recipient of a National Film Award, a Nandi Award and a Sahitya Academy Award.

Devulapalli Venkata Krishnasastri born on November 1897 and died on 24 February 1980 was a Telugu poet, playwright and translator. He is known as Andhra Shelley. Bellary Raghava born on 2 August 1880 and died on 16 April 1946 was an Indian playwright, thespian and film actor, known for his works predominantly in Telugu theatre and cinema. Bhandaru Acchamamba born in 1874 and died in 1905 was one of the pioneers in the early stages of women's movement. She is regarded as one of the early feminist historians in India.

Dr Yellapragada Subbarow born on 12 January 1895 and died on 8 August 1948 was a pioneering Indian biochemist who discovered the function of adenosine triphosphate (ATP) as an energy source in the cell, developed methotrexate for the treatment of cancer and led the department at Lederle laboratories in which Benjamin Minge Duggar discovered chlortetracycline (Aureomycin) in 1945.

Durgabai Deshmukh born on 15 July 1909 and died on 9 May 1981 was a freedom fighter, lawyer, social worker and politician. She was a member of the Constituent Assembly of India and of the Planning Commission of India. A public activist for women's emancipation, she founded the Andhra Mahila Sabha in 1937.

Thus, number of Brahmins contributed their lot to the society in their own way, often selflessly. From the Vedic period to the present day, Brahmins do contribute to the society for its welfare, progress, development and its overall wellbeing. No one could ever ignore them or their supreme sacrifice for the sake of society. End

వైవస్వతుడి వృత్తాంతం, ప్రళయప్రకారం, నారాయణుడి మహిమ .... (ఆస్వాదన-22) : వనం జ్వాలా నరసింహారావు

 వైవస్వతుడి వృత్తాంతం, ప్రళయప్రకారం, నారాయణుడి మహిమ

(ఆస్వాదన-22)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (30-05-2021)

బ్రాహ్మణులతో, ధౌమ్యుడితో పాండవులు కామ్యకవనం చేరి అక్కడ యథోచిత కర్తవ్యాలు నెరవేరుస్తుండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి పాండవుల దగ్గరికి వారిని చూడడానికి వచ్చాడు. పాండవులను శ్రీకృష్ణుడు కుశల ప్రశ్నలు వేస్తున్న సమయంలోనే మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చాడు. పాండవుల యోగ క్షేమాలను విచారించాడు. కాసేపటికి నారదుడు కూడా వచ్చి, పాండవులకు పుణ్యకథలు చెప్పమని మార్కండేయుడికి సూచించి వెళ్లిపోయాడు. చెడ్డవారు ఎందుకు సౌఖ్యాలు అనుభవిస్తున్నారని, మంచివారికే ఎందుకు దుఃఖం ప్రాప్తిస్తుందని ధర్మరాజు మార్కండేయుడిని ప్రశ్నించాడు. జవాబుగా మార్కండేయుడు, పూర్వకాలంలోలాగా కాకుండా, కాలం గడుస్తున్న కొద్దీ, మనుష్యులలో కామం, క్రోధం లాంటి దుర్గుణాలు ప్రవేశించి వారి ప్రవర్తనలో మాయ చొరబడిందన్నాడు.

ఈ నేపధ్యంలో, మనుజులు తాము చేసిన పుణ్యపాపఫలం ఏవిధంగానైనా సరే అనుభవించక తప్పదని, శరీరం నశించినా కర్మఫలం ఎన్నటికీ నశించదని అన్నాడు. కొందరు భూలోకంలో సౌఖ్యం అనుభవిస్తారని, కొందరికి పరలోక సౌఖ్యం కలుగుతుందని, కొందరికి ఇహపరాలలో మేలు కలుగుతుందని, కొందరికి ఇహపర సౌఖ్యాలు రెండూ దక్కవని చెప్పాడు. ధర్మ మార్గాన్ని అనుసరించి, మంచి కర్మలను ఆచరించి, మెచ్చదగిన యజ్ఞాలను చేసే మంచివారు భూలోకంలో, పరలోకంలో సౌఖ్యాలను అనుభవిస్తారని అన్నాడు మార్కండేయుడు.

ఆ తరువాత మార్కండేయుడు ధర్మరాజుకు బ్రాహ్మణ ప్రభావం తెలియచేసే వృత్తాంతాన్ని ఒకటి చెప్పాడు. అందులో భాగంగా హైహయవంశానికి చెందిన రాజకుమారుడు ధుంధుమారుడి గురించి చెప్పాడు. అలాగే బ్రాహ్మణుల క్షత్రియుల స్వభావాలను వివరించే అత్రి అనే బ్రాహ్మణ శ్రేష్టుడి గురించి, అతడికి గౌతముడితో జరిగిన సంవాదం గురించి, వారిద్దరిలో అత్రి వాదన సరైందని సనత్కుమారుడు చెప్పడం గురించి వివరించాడు. అలా చెప్తూ సనత్కుమారుడు, బ్రాహ్మణుల తేజస్సు, క్షత్రియుల గొప్పదనం, ఒకదానిమీద మరొకటి ఆధారపడి వున్నాయన్నాడు. క్షాత్రబలం లేని బ్రాహ్మణ శక్తి, బ్రాహ్మణశక్తి లేని క్షాత్రం రాణించలేదని, క్షత్రియుడు బ్రాహ్మణులను పూజించడం వల్ల తేజస్సును ఆర్జించి, పాపాలను పోగొట్టుతాడని సనత్కుమారుడు అన్న మాటలను ధర్మరాజుకు చెప్పాడు మార్కండేయుడు. ఆ తరువాత సరస్వతీ గీత అనే ఇతిహాసాన్ని వినిపించాడు. అందులో అనేకమైన ధర్మ సూక్ష్మాలున్నాయి.

తదనంతరం ధర్మరాజుకు వైవస్వతుడి వృత్తాంతం చెప్పాడు మార్కండేయుడు. వైవస్వతుడు ఒకనాడు చెరువులో స్నానం చేస్తుంటే ఒక చేప తనను రక్షించమని కోరింది. తనను ఆ చెరువు నుండి వేరే చోటుకు తరలించమని అన్నది. వైవస్వతుడు ఆ చేపను ఒక నూతిలో వేశాడు. కొన్నాళ్లకు శరీరం పెరిగిన చేపకు ఆ నూతి సరిపోక తనను అక్కడి నుండి మార్చమన్నది. దాన్నొక పెద్ద బావిలోకి మార్చాడు వైవస్వతుడు. ఇంకా పెరిగిన ఆ చేపను గంగ మడుపులో, అక్కడి నుండి సముద్రంలో వదిలాడు. తనకు చేసిన ఉపకారానికి వైవస్వతుడికి మేలు చేస్తానన్నది చేప.

త్వరలో ప్రళయ కాలం సమీపిస్తున్నది కాబట్టి ఒక పెద్ద ఓడను నిర్మించమని, అందులో ధాన్యాలను సేకరించి వుంచాలని, వైవస్వతుడు సప్త మహర్షులతో పాటు ఆ ఓడ ఎక్కి సముద్రం చేరేటప్పుడు తనను స్మరించుకోవాలని చేప చెప్పింది. అప్పుడు తాను పెద్ద కొమ్ముకల చేప ఆకారంలో కనిపించి ఉపకారం చేస్తానని చెప్పింది. వైవస్వతుడు అలాగే చేశాడు. ప్రళయకాలంలో చేప ఓడను సముద్రం మధ్యలోకి ఈడ్చుకుని పోయింది. అదేసమయంలో సముద్ర జలాలు దిక్కులన్నీ ఆక్రమించి, జగాలన్నిటినీ ముంచేశాయి. ప్రపంచం అంతా ఒక సముద్రంలాగా మారిపోయింది.

అనేక వేల సంవత్సరాలు చేప సముద్రం మధ్యలో ఆ ఓడను లాగింది. వరద తగ్గు ముఖం పట్టిన తరువాత ఓడను హిమాలయ పర్వత శిఖరం దగ్గరికి చేర్చింది. పర్వత శిఖరాన ఓడను కట్టమని వైవస్వతుడికి, సప్తర్షులకు చెప్పింది చేప. వారు ఆలాగే చేశారు. తాను సమస్త విశ్వాన్ని సృష్టించి పాలిస్తున్న ఏకైకప్రభుడినని, మత్స్యరూపంలో వాళ్ళను కాపాడానని అన్నది ఆ చేప. వైవస్వత మనువు భవిష్యత్తులో చరాచర జగత్తును సృష్టిస్తాడని చెప్పి చేప మాయమైంది. అప్పుడు వైవస్వతుడు గొప్ప తపస్సు చేసి, దేవతలకు, రాక్షసులకు, మనుజులకు సంబంధించిన జగత్తులను సృష్టించాడు. ఆ తరువాత ధర్మరాజు కోరడంతో, మార్కండేయుడు ప్రళయప్రకారం వివరించాడు.    

కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలనే నాలుగు యుగాలు కలిసి 12 వేల దివ్య సంవత్సరాలవుతాయి. దీన్నే ఒక మహాయుగం అంటారు. ఒక వేయి మహాయుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుంది. బ్రహ్మ దివసపు చివరి నూరు సంవత్సరాలు అనావృష్టి ఏర్పడుతుంది. అప్పుడు సూర్యుడి వేడిమివల్ల ముల్లోకాలు అల్లల్లాడి పోతాయి. ఆ తరువాత మిక్కుటంగా కురిసే వాన వల్ల మహాగ్ని అంతా చెదిరి పోతుంది. ఏరులు, నదులు, సముద్రాలు నీటితో నిండి ప్రవహిస్తాయి. భూగోళమంతా నీటితో నిండి పోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం వీచిన పెనుగాలి మేఘాలను చెదరగొట్టి అణచి వేస్తుంది. బ్రహ్మదేవుడు భయంకరమైన వరద నీటిమధ్యన పద్మం మీద నిద్రిస్తాడు. ఇలాంటి కల్పాంతాలు ఎన్నో గడిచాయి.

ఆ సమయంలో ఒక మర్రిచెట్టు ఆకు పాన్పు మీద ఒక చిన్ని బాలకుడు ఒంటరిగా నిదురిస్తూ మార్కండేయుడికి కనిపించాడు. అతడెవరని ఆలోచించాడు ఆయన. ఆ బాలకుడిని చేరబోయాడు. తన దేహంలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకొమ్మని మార్కండేయుడికి చెప్పాడు ఆ బాలకుడు. అప్పుడు బలవంతంగా నెట్టి వేయబడ్డట్లుగా మార్కండేయుడు బాలకుడు నోట్లోకి పోయి, కడుపులో ప్రవేశించాడు. సమస్త లోకాలను ఆ బాలుడి కడుపులో చూశాడు మార్కండేయుడు. అలా ఆ మహాత్ముడి కడుపులో నూరు సంవత్సరాలున్నాడు. ఆ బాలకుడి పాదాలను ధ్యానించాడు. తన నోటి నుండి బాలకుడు మార్కండేయుడిని బయటకు తెచ్చాడు. తన పొట్టలో విశ్రాంతి తీసుకున్నావా? అని అడిగాడు బాలకుడు. ఆయన పొట్టలో సకల చరాచర సృష్టిని చూశానని చెప్పాడు మార్కండేయుడు.

నారాయణుడు మార్కండేయుడికి తన ప్రభావాన్ని వివరంగా చెప్పాడు ఇలా: ‘వేల్పులు, ఋషులు కూడా నా మహిమను తెలుసుకోలేరు. నా ప్రభావాన్ని, మహిమను చెప్తా విను. జలాలకు పర్యాయ పదం నారములు. నాకు జలాలు స్థానం. అందువల్ల నాకు “నారాయణుడు” (నారములు స్థానంగా కలవాడు) అన్న సార్థక నామధేయం ఏర్పడింది. ఆ విధమైన నారాయణుడినైన నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, పాలించేవాడిని, జ్ఞానంతో కూడిన ఆనందం కలవాడిగా వుంటూ, ఈ లోకాలన్నిటినీ క్రమంగా సృష్టిస్తాను. నేనే ఏలుకుంటాను. తగిన సమయంలో నేనే లయం చేస్తాను. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, ఇతరులంతా నా అంశను పంచుకున్న నా ప్రతినిధులే. భూమి నా పాదాలు, అగ్నిహోత్రుడు నా ముఖం, సూర్య చంద్రులు నా నేత్రాలు, ఆకాశం నా శిరస్సు. ఇలా అద్భుతాకారం ధరించి నేను విలసిల్లుతాను’.

‘ప్రళయ కాలంలో సముద్రంలో మునిగిన సమస్త భూగోళాన్ని వరాహ రూపం ధరించి ఉద్ధరించింది నేనే. ఈ సమస్త భూమండలాన్నీ మనోజ్ఞమైన వేయిపడగల మీద  ఆదిశేషుడి రూపంలో ధరిస్తున్న వాడిని నేనే. బాడబమనే అగ్నినై సప్తసముద్రాల నీటిని నేనే తాగుతాను. వాటిని ప్రళయ కాలంలో విడిచి పెట్టుతాను. సృష్టి ఆరంభించే సమయంలో నా నోటి నుండి, భుజాల నుండి, తొడల నుండి, పాదాల నుండి నాలుగు వర్ణాలను సృష్టిస్తాను. అలాగే నాలుగు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం నా ముఖాల నుండి ఉద్భవిస్తాయి. ఇవన్నీ చివరకు ప్రళయకాలంలో నన్నే చేరుతాయి. మహర్షులు ముక్తికొరకై నన్నే ఆరాధిస్తారు. సమస్తమైన నక్షత్రాలు, తారలు, ఆకాశం, వాయువులు, దిక్కులు అన్నీ నా ఆకృతులే. నేను నిత్య సంతోషినై పవళించి వుంటాను’.

‘ఈ జగత్తులో సుస్పష్టంగా వ్యక్తమై కనిపిస్తున్నది అంతా నేనే. ఈ జగత్తులో అవ్యక్తమై లేనిదిగా తట్టేది అంతా నేనే. లోకంలో ఎప్పుడు ధర్మానికి కీడు ఏర్పడుతుందో, ఎప్పుడు అధర్మం విజృంభిస్తుందో, ఎప్పుడు రాక్షసులు క్రూరులై అతిశయిస్తారో, ఎప్పుడు వేల్పులు హీన స్థితికి దిగజారుతారో, అప్పుడు మంచి కులానికి సంబంధించిన వారి ఇండ్లలో జన్మించి, దేవతలను, దేవేంద్రుడిని కాపాడి, యథాప్రకారం ధర్మ మార్గంలో నిలబెట్టుతాను. నాలుగు యుగాలలో నేను ఆరాధించతగిన ధర్మాన్ని నెలకొల్పుతాను. ప్రళయ కాలంలో యముడి రూపం ధరించి సృష్టిని అంతటినీ నేనే సంహరిస్తాను. ముల్లోకాలను సృష్టించే బ్రహ్మదేవుడు కూడా నాలో సగం అంశం మాత్రమే’.

‘నారాయణుడు అనే నేను వేయి మహాయుగాల వరకు బాలరూపం ధరించి, వటపత్రశాయినై, ప్రపంచాన్ని అంతా ఆవరించిన ఒకే ఒక సముద్రం మీద యోగనిద్రలో మునిగి వుంటాను. ఇక మున్ముందు నా బొడ్డు తామరలో నిద్రిస్తున్న బ్రహ్మదేవుడు మేల్కొని, జగత్తులను సృష్టిస్తాడు’.

సాక్షాత్తు నారాయణుడు చెప్పిన వాటికి తాను ప్రత్యక్ష సాక్షినని మార్కండేయుడు చెప్పాడు ధర్మరాజుకు. ఆ బాలదేవుడే శ్రీకృష్ణుడని అన్నాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)