Sunday, May 10, 2026

The Hermeneutics of Reconciliation on the Ontological Synthesis of the Vedic and the Dialectical : Aditya K. Roy (INTRODUCTION to: ‘Simplified and Faithful Rendering of the Adi Kavya’)

The Hermeneutics of Reconciliation

On the Ontological Synthesis of the Vedic and the Dialectical

Aditya K. Roy (April 8, 2026)

{INTRODUCTION to: ‘Simplified and Faithful Rendering of the Adi Kavya’

Valmiki Ramayana: The Greatest Epic (Bala and Ayodhya Kandas)

Authored by Vanam Jwala Narasimha Rao}

To introduce this volume is to engage with a text that functions less as a conventional translation and more as a dense, late-career intervention into the fractured intellectual history of the Indian subcontinent. My father’s project - a faithful rendering of Late Shri Vavilikolanu Subbarau’s Andhra Valmiki Ramayanam Mandaram, (which itself is a faithful rendering of the Adi Kavya - Valmiki’s Ramayan) into a contemporary English idiom - cannot be decoupled from the peculiar, layered consciousness of its architect.

We are presented here with a synthesis that resists the simplistic taxonomies of the modern era; it is a work produced by a mind that has spent seven decades navigating the jagged terrain between the deterministic moral universe of the Vedas and the materialist, transformative teleology of Marxist humanism. This is an intellectual exercise in ‘Both/And’ logic, a refusal to allow the analytical rigors of the political scientist to fully eclipse the primordial resonances of the shloka.

The document serves as a cartography of a complex internal migration. My father’s boundaried departures from the rural, orthodox rhythms of his origins did not result in the standard secular erasure so common in mid-century intellectualism. Instead, he initiated an arduous process of philosophical layering.

His commitment to a ‘People’s Democratic Secular society’ exists not in opposition to, but in a tense, dialectical conversation with the ‘living light’ of the ancestors. One must view this book as an attempt to resolve the cognitive dissonance of the post-colonial subject: the struggle to inhabit a world shaped by Das Kapital while remaining anchored to a soul nourished by the Gayatri Hymn. This is not a comfortable coexistence; it is a ‘Strangely Harmonious yet Deeply Paradoxical’ state of being that requires a constant recalibration of one’s moral and intellectual compass.

At the heart of this exercise is a rigorous interrogation of how tradition survives the pressures of globalized displacement. My father identifies the ‘inner landscapes’ of the Indian consciousness as being in a state of perilous erosion, yet his response is not a retreat into fundamentalism. Rather, he posits that the preservation of the sacred is a dynamic, often matriarchal, act of resistance against the sterility of the modern.

In his observation of my mother’s fifty-six-year ritualistic discipline, he identifies a ‘moral center’ that operates outside the ‘posture of command’ typical of patriarchal structures. His interpretation suggests that the ritual is not a stagnant repetition, but a sophisticated technology of familial and spiritual equilibrium: an autonomous space that he, as the erstwhile patriarch, has had to learn to respect through a ‘marching forward as partners.’

The intellectual weight of this work lies in its refusal to offer the reader a sanitized or singular truth. By invoking the ‘Akshaya Patra’--the inexhaustible vessel of Indian philosophical schools, alongside the dialectical materialism of the West, he creates a space for ‘beautiful uncertainty.’ He treats the Ramayana not as a static relic of piety, but as a living participant in the discourse of human dignity and social justice. This is an exercise in expansive humanism, where the metaphysical scaffolding of the Upanishads is utilized to support the weight of modern social critique.

Ultimately, my humble urge to the reader is to be prepared to acknowledge the subsequent text as a site of encounter. It challenges the reader to move beyond the binary of tradition versus modernity and to instead enter a multi-dimensional reality where the sacred and the revolutionary ‘nod to each other in recognition.’ It is a testament to an intellectual journey that has traded the safety of dogma for the complexity of synthesis, suggesting that our truest heritage lies not in the answers we inherit, but in the depth and layers of the questions we dare to sustain.

(‘Hermeneutics’ is the theory, methodology, and philosophy of interpretation, focusing on understanding written texts, human actions, and communication. ‘Ontological Synthesis’ refers to the process of combining, integrating, or unifying different conceptual frameworks, theories, or representations of existence into a single, cohesive structure-Author of Book)

సయోధ్య తరహా హర్మెన్యూటిక్స్

వేద, ద్వంద్వ సిద్ధాంత ఆత్మసంబంధ సమన్వయం  

ఆదిత్య కె. రాయ్ (ఏప్రిల్ 8, 2026)

ఈ (సింప్లిఫైడ్ and ఫెయిత్ ఫుల్ రెండరింగ్ ఆఫ్ ఆదికావ్య) పుస్తకానికి ముందుమాట ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈ పుస్తకం ఒక  సాధారణ ఆంగ్లానువాదం (translation) అని అనడం కంటే, భారత ఉపఖండంలోని విభిన్నమైన మేధో చరిత్ర (intellectual history) లో భాగంగా, విభజనల మధ్య లోతైన, కీలక దశలోని ఆలోచనాత్మక జోక్యం (late career intervention) ద్వారా చదువరులతో మమేకం కావడమే!

స్వర్గీయ శ్రీ వావిలికొలను సుబ్బారావు గారి ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం,’ ఆదికావ్యం (Adi Kavya) సంస్కృత వాల్మీకి రామాయణానికి నిష్ఠతో చేసిన తెలుగు అనువాదం. అలాగే మా నాన్నగారు ఆ ఆంధ్రవాల్మీకి రామాయణాన్ని ఒక ప్రాజెక్టుగా భావించి, వర్తమాన కాలానికి అనుగుణంగా, సమయోచితంగా అన్వయించుకుంటూ,  తదనుగుణంగా, ఇంగ్లీష్ భాషలోకి (contemporary English idiom) మార్చడం, గొప్ప కృషి. ఈ కృషిని, అంచెలంచెలుగా మారుతూ వస్తున్న ఆయన ఆలోచనా నిర్మాణంలోని ప్రత్యేకమైన, పలు పొరలతో కూడిన చైతన్యం (layered consciousness) నుండి వేరుచేయలేము.

ఇక్కడ మనకు కనిపించేది ఆధునిక యుగపు (modern era) సులభ వర్గీకరణలను (simplistic taxonomies) నిరాకరించే ఒక సమన్వయం (synthesis), వేదాల నిర్ణీత నైతిక విశ్వం (deterministic moral universe), మార్క్సిస్ట్ మానవతావాదం (Marxist humanism) లోని భౌతికవాద మార్పును లక్ష్యంగా పెట్టుకున్న దిశా భావనల (materialist transformative teleology) మధ్య ఏడు దశాబ్దాలుగా సాగిన ఆయన ఆలోచనా ప్రయాణం ఫలితం ఇది. ఇది ‘ఇదీ/అదీ’ (Both/And logic) అనే తర్క విధానం, రాజకీయ శాస్త్రవేత్త (political scientist) యొక్క విశ్లేషణాత్మక కఠినత (analytical rigor), శ్లోకంలోని మూలాధార ప్రతిధ్వనులను (primordial resonances) పూర్తిగా తొలగించనీయని విశిష్ట ధోరణి.

ఈ పుస్తకం ఒక క్లిష్టమైన అంతర్గత వలస ప్రయాణానికి (internal migration) పటముగా (cartography) నిలుస్తుంది. గ్రామీణ, సనాతన (orthodox) సంప్రదాయాల నుంచి ఆయన బయటకు వచ్చినప్పటికీ, మధ్య శతాబ్ద మేధో ప్రపంచంలో సాధారణంగా జరిగే లౌకిక నిర్మూలనం (secular erasure) ఆయనలో చోటు చేసుకోలేదు. బదులుగా, ఆయన తాత్విక పొరల నిర్మాణం (philosophical layering) అనే కఠినమైన ప్రక్రియను ప్రారంభించారు.

‘ప్రజల ప్రజాస్వామ్య లౌకిక సమాజం’ (People’s Democratic Secular society) పట్ల ఆయన నిబద్ధత, పూర్వీకుల ‘జీవన కాంతి’ (living light) కి వ్యతిరేకంగా కాకుండా, ఒక ఉద్రిక్త, మాండలిక సంభాషణ (dialectical conversation) రూపంలో ఉంటుంది. ఈ గ్రంథాన్ని వలసానంతర విషయ పరిజ్ఞానంలో(post-colonial subject) ఏర్పడే అభిజ్ఞా వైరుధ్యాన్ని(cognitive dissonance) పరిష్కరించే ప్రయత్నంగా చూడాలి. ‘దాస్ కాపిటల్’ (Das Kapital) ప్రభావంతో ఏర్పరుచుకున్న ప్రపంచంలో జీవిస్తూ, ‘గాయత్రి మంత్రం’ (Gayatri Hymn) ఆత్మతో అనుసంధానం కొనసాగించాలనే పోరాటం ఇది. ఇది సౌకర్యవంతమైన సహజీవనం కాదు, ‘వింతగా సమన్వయంగా ఉన్నా, లోతైన విరోధభరితమైన” (Strangely Harmonious yet Deeply Paradoxical) స్థితి.

ఈ రచనలో ప్రధానంగా సంప్రదాయం (tradition), గ్లోబలైజేషన్ (globalized displacement) ఒత్తిళ్ల మధ్య ఎలా నిలబడుతుంది అనే ప్రశ్నను పరిశీలిస్తుంది. భారతీయ చైతన్యంలో ఉన్న అంతర్గత ప్రపంచాలు (inner landscapes) క్షీణిస్తున్నాయని ఆయన భావించినప్పటికీ, ఆయన ప్రతిస్పందన మౌలికవాదం (fundamentalism) వైపు వెళ్లడం మాత్రం కాదు. పవిత్రత (sacred) పరిరక్షణను ఒక చురుకైన, ముఖ్యంగా మాతృస్వామ్య (matriarchal) ప్రతిఘటనగా ఆయన ప్రతిపాదిస్తారు.

వివాహానంతరం, మా అమ్మగారి యాభై ఆరు సంవత్సరాల ఆచారపరమైన క్రమశిక్షణ (ritualistic discipline) ను నిశితంగా గమనిస్తూ, ఆమెద్వారా కుటుంబంలో ఒక నైతిక కేంద్రం (moral center) ఉన్నదని గుర్తించారు నాన్నగారు. ఇది పితృస్వామ్య నిర్మాణాలలో కనిపించే ఆజ్ఞాపన, ఆదేశాత్మక ధోరణికి  (posture of command) వ్యతిరేకంగా, విరుద్ధంగా పనిచేస్తుంది. ఆయన వ్యాఖ్యానం ప్రకారం, ఆచారం (ritual) స్థిరమైన పునరావృతం కాదు, కుటుంబ, ఆధ్యాత్మిక సమతుల్యతను నిలబెట్టే ఒక సున్నితమైన సాంకేతికత (technology). దీనిని ఆయన భాగస్వామ్య భావనతో ముందుకు సాగుతూ (marching forward as partners) గౌరవించడం నేర్చుకున్నారు.

ఈ పుస్తక మేధో బలం (intellectual weight) పాఠకుడికి ఒకే ఒక శుద్ధమైన సత్యాన్ని (sanitized or singular truth) ఇవ్వకుండా ఉండడంలోనే ఉన్నది. భారతీయ తత్వ పాఠశాలల అనంతమైన పాత్ర (Akshaya Patra), పాశ్చాత్య ద్వంద్వ భౌతికవాదం (dialectical materialism) తో కలిపి, ‘అందమైన అనిశ్చితి’ (beautiful uncertainty) కి స్థలం సృష్టిస్తుంది. రామాయణాన్ని కేవలం ఒక సుస్థిరమైన భక్తి గ్రంథం (static relic of piety) గా, అవశేషంగా మాత్రమే కాకుండా, మానవ గౌరవం (human dignity), సామాజిక న్యాయానికి సంబంధించిన (social justice) చర్చలో ఒక సజీవ భాగస్వామిగా పరిగణించాలని సూచిస్తున్నారు నాన్నగారు.

ఇది విస్తృత మానవతావాదం (expansive humanism), ఉపనిషత్తుల ఆధ్యాత్మిక, తాత్త్విక నిర్మాణాన్ని, (metaphysical scaffolding of the Upanishads) ఆధునిక సామాజిక విమర్శ (modern social critique) ప్రాముఖ్యతను నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది.

చివరగా, పాఠకులకు నా వినమ్ర విజ్ఞప్తి: ఈ గ్రంథాన్ని ఒక సాక్షాత్కార స్థలంగా (site of encounter) స్వీకరించండి. సంప్రదాయం, ఆధునికత అనే ద్వంద్వాన్ని దాటి, పవిత్రత (sacred), విప్లవాత్మక ఆలోచన (revolutionary) పరస్పరం గుర్తించుకునే బహుముఖ వాస్తవికతలోకి ప్రవేశించండి. సిద్ధాంతాల భద్రతను (dogma) వదిలి సంశ్లేషణ, సమన్వయాల (synthesis) సంక్లిష్టతను స్వీకరించిన ఒక మేధో ప్రయాణానికి ఇది నిదర్శనం. మన నిజమైన వారసత్వం మనం పొందే సమాధానాలలో కాకుండా, మనం ధైర్యంగా కొనసాగించే ప్రశ్నల లోతు, వాటి పొరలలో ఉందని ఇది సూచిస్తుంది.

{{From my Published Book ‘Simplified and Faithful Rendering of the Adi Kavya’

Valmiki Ramayana: The Greatest Epic (Bala and Ayodhya Kandas)}}

(The Book is free of cost for all those who are interested to read. Mobile: 8008137012)

యదువంశంలో ముసలం, నారదుడు చెప్పిన విదేహార్షభ సంవాదం >>>>> శ్రీ మహాభాగవత కథ-85 : వనం జ్వాలా నరసింహారావు

 యదువంశంలో ముసలం, 

నారదుడు చెప్పిన విదేహార్షభ సంవాదం

శ్రీ మహాభాగవత కథ-85

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (మే నెల 11, 2026)

కంII              చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                               చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

బలరామ కృష్ణులు యుద్ధాలలో అనేకమంది రాక్షస వీరులను సంహరించారు. అది చాలక కృష్ణుడు, భూభారం మరీ ఎక్కువగా వుందని, పాచికలాట నెపంతో దుర్యోధనుడినీ, కౌరవపాండవ బలగాన్నీ, కురుక్షేత్ర సంగ్రామంలో అంతరింప చేశాడు. ఇదంతా చూస్తున్న మునులకు ఆనందం కలిగింది. పుణ్యాత్ములైన నందాదులు సంతోషించారు. యదువంశం లోని గొప్పగొప్ప వీరులు అతిశయాన్ని పొందారు. శ్రీకృష్ణుడి మహిమ ముల్లోకాలకూ తెలిసింది. తన అవతార కార్యం నెరవేరిందని అమితానందంగా వున్నాడు కృష్ణుడు. ఈ నేపధ్యంలో యాదవ బలాలు వృద్ధి చెంది, ఉన్నతిని పొంది, భూమి బరువు మోయలేని స్థితికి వచ్చింది.

శ్రీకృష్ణుడి దృష్టి యదుముఖ్యుల వైపు మళ్లింది. ఎవరికీ అపకారం చేయని తన భక్తులైన యాదవులను అంతం చేసే శక్తి తనకు తప్ప వేరొకరికి లేదనుకున్నాడు. తనలో తానే తర్కించుకున్న కృష్ణుడు, యాదవ బలాలకు పరస్పర విరోధాలు కల్పించి, కర్మపరిణామాలను వారివారికి కలగచేసి, అందరినీ అంతమొందించాలనుకుని, దానంతటికీ బ్రాహ్మణ శాపం మూలం కాగలదని నిశ్చయించాడు.

భూభారాన్ని తగ్గించేందుకు యదువంశాన్ని సహితం అంతం చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్న సమయంలో, ఆయన దగ్గరికి విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కాశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యులు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైన వారు ద్వారకానగరానికి వచ్చారు. వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా వారికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులను సమర్పించాడు. మునులంతా శ్రీకృష్ణుడి మహిమలను కొనియాడి, ఆయన్ను స్తోత్రం చేశారు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. మహర్షులు తమ పారవశ్యాన్ని ‘కంజదళాక్షా!’ అన్న సంబోధనతో వినయపూర్వకంగా స్వామికి విన్నవించుకున్నారు.

మునులంతా తన ఇంటికి ఏ లోక కల్యాణాన్ని కోరి పావనం చేశారని శ్రీకృష్ణుడు అడిగాడు వారిని. ఆయన దివ్య చరణారవిందాలను సందర్శించుకోవడం కంటే వేరే వ్యాప్యమైన ధర్మం తమకేమీ లేదని వారు సమాధానం ఇచ్చారు. వారంతా అక్కడి నుండి బయల్దేరి ద్వారకానగరానికి దరిదాపుల్లోనే వున్న ‘పిండతారకం అనే పిండారక పుణ్య తీర్థానికి పితృదేవతలకు తర్పణాలు విడవడానికి వెళ్లారు. అప్పుడే అక్కడికి కొందరు యాదవులు దురుకుతనంతో శ్రీకృష్ణజాంబవతిల కొడుకు సాంబకుమారుడిని          గర్భం దాల్చిన జవరాలి వేషం వేసి సింగారించి అక్కడికి వచ్చారు.

యాదవులు అంతటితో వూరుకోకుండా పిండారక తీర్థానికి వెళ్తున్న ఋషులను ఆపి, నెలలు నిండి పురిటికి సిద్ధంగా వున్న ఆ జవరాలి కడుపున పుట్టేది అబ్బాయా? అమ్మాయా? అని ప్రశ్నించారు. వారి వేళాకోళానికి ఋషులకు కోపం వచ్చింది. ‘యదువంశాన్ని తుదముట్టించడానికి ఈ పిల్ల కడుపున రోకలి పుడుతుంది అని శపించారు మునులు. సాంబకుమారుడి పొత్తికడుపుకు కట్టిన మూటలు విప్పేసరికి ముసలం ఒకటి నేలమీద పడింది. దాన్ని తీసుకుని కృష్ణుడి దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పారు.

మునుల శాపాన్ని అనుభవించాల్సిందేనని, యదువంశం నాశనం కావాల్సిందేనని అన్నాడు కృష్ణుడు. సముద్రం ఒడ్డున వున్న పెద్ద పర్వతం మీదున్న ఎత్తైన బండమీద యాదవులు తమ భుజ బలం కొద్దీ ఆ ఇనుప రోకలిని రాచి పొడి చేసి, సముద్రం నీళ్లలో కలిపి రమ్మని చెప్పాడు వాళ్లకు. వాళ్లు అలాగే ఆ ముసలాన్ని అరగదీసి, చివరకు మిగిలిన ఒక చిన్న ముక్కను సముద్రంలోకి విసిరేశారు. యాదవులు విసిరిపారేసిన ఇనుప ముక్కను ఒక చేప మింగింది. దాన్ని ఒక జాలరివాడు పట్టుకున్నాడు. దాని కడుపులో దొరికిన ఇనుప ముక్కను తన బాణం చివర ములికిగా పెట్టుకున్నాడు.

ఇదిలా వుండగా ఒకనాడు నారదుడు శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని వచ్చినప్పుడు వసుదేవుడు కలిశాడు. తనకు శ్రీ మహాభాగవతుల జీవిత కథలలోని ధర్మాలను చెప్పాలని అడిగాడు. బ్రహ్మానందనిలయమైన పరమపదాన్ని పొందగలిగే భాగవత ధర్మాలను వినిపించమని కోరాడు. ఆ ప్రశ్నకు నారద మహర్షికి అమితానందం కలిగింది. ఇది వేదశాస్త్రాల నిగ్గు తేల్చే ఒక గొప్ప ప్రశ్న అన్నాడు నారదుడు. శ్రీహరి గుణాలను గురించి చెప్పడమే ఆ ప్రశ్నకు సరైన సమాధానమని చెప్పాడు. పరమాత్మ స్వరూపుడైన వాసుదేవుడి మీద భక్తి కలిగించేదీ, అద్వితీయమైన పరబ్రహ్మపదాన్ని సంప్రాప్తింపచేసేదీ అయిన ‘విదేహార్షభ సంవాదం పేరుతో విదేహ నగర రాజు జనకుడికి, ఋషభదేవుడి కొడుకులైన తొమ్మిదిమంది అర్షభులకు మధ్య భాగవత ధర్మాలను గురించి జరిగిన సంభాషణను వసుదేవుడికి వినిపించాడు.

‘విదేహార్షభ సంవాదం వినిపించి నారదుడు వసుదేవుడితో ఇలా అన్నాడు. భాగవతోత్తముల కథలు విని వసుదేవుడు పాపాలన్నిటినీ పటాపంచలు చేసుకున్నాడని, ఆ పుణ్యఫలంగా ఆయనకు విశ్వ వ్యాప్తమైన విఖ్యాతి కలుగుతుందని, ఆమీదట కైవల్యపదం ఆయన్ను వరిస్తుందని, నారాయణుడు ఆయన కొడుకన్న వ్యామోహాన్ని విడిచి సాక్షాత్ విష్ణువని గ్రహించి ఆరాధించమని చెప్పాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అంటే లోక రక్షణార్థం అవతరించిన పరమ పురుషుడే అని అన్నాడు వసుదేవుడితో. దేవకీవసుదేవులు నారదుడి మాటలకు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుడిని పరమాత్మగా చూడసాగారు.                                         

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Saturday, May 9, 2026

TN Governor’s Discretion amounts to ‘Atypical’ Abuse >>>>> (Grit and Ideology in Tamil Nadu and West Bengal) : Vanam Jwala Narasimha Rao

 TN Governor’s Discretion amounts to ‘Atypical’ Abuse

(Grit and Ideology in Tamil Nadu and West Bengal)

Vanam Jwala Narasimha Rao

The Hans India (May 10, 2026)

            {In both states, enduring success has belonged to those who treated politics as ‘Systematic Commitment rather than a Purely Casual Engagement.’ Whether it is the disciplined ascent of Vijay or the decades of struggle by Mamata Banerjee, persistence has outweighed momentary popularity. Both regions demonstrate shifts across ideological spectrums, from anti-religious Dravidianism to Inclusive Secularism in TN, and from Left-wing dominance to Right leaning politics in WB} – Editor’s Synoptic Observation.

Across the diverse political landscape of India, few stories illustrate the interplay of grit, ideology, and ambition as vividly as the recent electoral transformations in Tamil Nadu (TN) and West Bengal (WB). Both states reveal a striking convergence with a difference in political method: sustained effort over decades, alliances of necessity, ideological shifts from Left to Right, alleged electoral manipulation, and the enduring tension between democratic aspiration and undemocratic practice. At the heart of these transformations lies one defining principle: ‘Grit over Pastime.’

For some, politics is fleeting engagement, while for others it is incessant struggle defined by perseverance, reinvention, and calculated disruption. TN political theatre has long been intertwined with ‘Silver Screen,’ categorized by either Grit or Pastime. Historically, many actors in TN entered political arena by leveraging their popularity, found roles within established systems, rarely altered the political equilibrium, and navigated through alliances rather than independently reshaping the structures of power.

Notable exceptions were Karunanidhi, MGR, Jayalalitha etc. who demonstrated that cinematic charisma, only when combined with organizational discipline and relentless effort, dismantles entrenched political orders. Their rise resulted from calculated engagement and a refusal to remain subordinate within existing frameworks.

Continuing this legacy, emergence of Thalapathy Joseph Vijay Chandrasekhar (Parents: Director SA Chandrasekhar and singer Shoba Chandrasekhar) and his party, Tamilaga Vettri Kazhagam, represents typical evolution of this tradition.

Vijay’s approach transcends celebrity politics. His ascent reflects a deliberate shift from symbolic presence to structural challenge, disrupting the long-standing duopoly of DMK and AIADMK that defined TN for over five decades. This disruption is both electoral and ideological. The political discourse of TN has long been shaped by Dravidian Ideology, often marked by criticism of ‘Sanatana Dharma and characterized by ‘Confrontational Atheism.’ Such rhetoric from the top DMK leadership contributed significantly to voter apathy.

Vijay signalled a significant recalibration. His articulation of an inclusive and temperate secularism, rooted in social justice yet respectful of spiritual plurality, marks a departure from rigid ideological binaries. By engaging with temples, churches, and dargahs alike, he has reframed secularism not as opposition to faith but as the coexistence of beliefs. This resonated well with younger voters under forty, disillusioned with entrenched narratives. In addition, contesting on its own across constituencies, TVK had broken the traditional ‘either or paradigm’ of TN politics.

This transformation also underscores a broader truth: alliances, or the refusal to enter them, are strategic tools. Where earlier actors merged into existing systems, the insistence by Vijay on autonomy echoes the ‘Disruptive Courage with Grit with Popularity,’ that enabled this recalibration. If the story of TN has been one of cinematic disruption, that of WB has been a chronicle of ideological evolution, marked by intense struggle, systemic control, and eventual transformation.

Before and after independence, WB state became fertile ground for Left politics. Mass movements were often led by Communist Cadre, gradually consolidating their influence. This culminated in the rise of the Left Front led by Communist Party of India (Marxist), which governed for 34 years, establishing one of the longest democratically elected communist regimes in the world. This dominance was shaped as much by grassroots mobilization as by the interventions of the Centre.

The frequent dismissal of non-Congress governments, chiefly by Indira Gandhi, set troubling precedents. Removal of the first elected Communist Government in the world through ballot, headed by EMS Namboodiripad in Kerala, signalled readiness to override democratic mandates. In WB, similar patterns followed. The United Front governments confronted repeated dismissals, often replaced by short lived Administrations or President’s Rule.

These interventions exposed the fragile nature of federalism and normalized the use of constitutional mechanisms for political ends. In the 1972 WB elections allegations of booth capturing, bogus voting, and counting irregularities cast a long shadow over democratic processes. The CPI (M) alleged systematic manipulation designed to prevent their ascent. Such practices, whether fully substantiated or not, contributed to a culture of mistrust still seems to repeat in subsequent electoral discourse, including the present.  

When political conditions shifted, the Left Front rose decisively to power in 1977, ushering in an era of stability under Jyoti Basu. His tenure, followed by Buddhadeb Bhattacharjee, provided continuity and governance that many viewed as a golden period. However, over time, the ideological rigidity and administrative inertia of the Left created space for disruption. That came in the form of Mamata Banerjee, whose rise was systematic, and built on decades of relentless struggle.

Much like the grit seen in the transformative leaders of TN, the journey of Mamata Banerjee involved shifting alliances, agitations, and strategic positioning. Whether aligning with Congress or BJP at different times, her objective remained constant: dismantling the ‘Left-wing Red Fortress.’ Her eventual success in 2011 marked a critical turning point. The fall of the Left Front demonstrated that even the most entrenched ideological regimes are vulnerable to persistent challenge.

The story of West Bengal continued. The BJP's rise as a formidable force marks a significant ideological evolution, moving from Left-wing dominance toward a vibrant narrative of national pride and cultural unity. This transition underscores a broader national trend where ideological boundaries are not static but ever dynamic, shaped by electoral strategy and public sentiment. Despite their differences, Tamil Nadu and West Bengal reveal common patterns that define Indian democracy.

In both states, enduring success has belonged to those who treated politics as ‘Systematic Commitment rather than Purely Casual Engagement.’ Whether it is the disciplined ascent of Vijay or the decades of struggle by Mamata Banerjee, persistence has outweighed momentary popularity. Both regions demonstrate shifts across ideological spectrums, from anti-religious Dravidianism to inclusive secularism in TN, and from Left-wing dominance to Right leaning politics in WB. Ideology, while important, often adapts to electoral realities.

Therefore, the underlying principle shall be: politics cannot be sustained as a platform of convenience. Those who endure, who build patiently at the grassroots, and who remain committed through defeat and uncertainty, ultimately shape history. Equally significant is ideological fluidity. Movements from Left to Right (WB), or recalibrations within Dravidian politics (TN), demonstrate that ideology must evolve with societal aspirations. Voters today respond to relevance, delivery, and inclusivity. The challenge for political actors is to balance strategic alliances.

Undemocratic acts, particularly ‘Gubernatorial Overreach,’ necessitate constant vigilance. Success requires moving beyond rhetoric to build a structured grassroots presence. As Tamil Nadu and West Bengal illustrate, resilient politics must transcend rigid labels, centering instead on public aspirations and the delicate balance between principle and pragmatism.

TN Governor Rajendra Arlekar’s initial, instant and blatant refusal to invite Vijay, despite his claim as leader of the single largest party, suggests a concerning stall of the democratic mandate. Historical precedents: Sanjiva Reddy inviting Charan Singh, Venkataraman inviting PV Narasimha Rao, Shankar Dayal Sharma inviting AB Vajpayee etc. set the standard for constitutional propriety. To uphold these democratic values, Governor Arlekar should follow suit and allow the floor of the House to decide the majority.  

In Indian democracy, inviting the leader of the single largest party or pre-poll alliance, by Governors or the President, is a convention generally followed. Governor Rajendra Arlekar’s rigid insistence on physical proof of 118 MLAs at Lok Bhavan, rather than permitting a floor test, creates an ‘Atypical Hurdle’ for a party clearly leading all others. This departure from democratic precedent undermines constitutional propriety and stalls the mandate in an unprecedented, institutionalized manner.

Ultimately, TVK’s Vijay secured formal support from Congress. The Left Parties (CPI and CPIM), in an attempt not to repeat past tactical errors as a face-saving measure, extended support to Vijay. With VCK oscillating, the grand finality appears clear: Vijay is poised to be Tamil Nadu’s next Chief Minister. Meanwhile, in a historic shift, Suvendu Adhikari has been sworn in as West Bengal’s first-ever BJP Chief Minister.

(Post Script: TVK’s Vijay along with Nine others sworn in as Chief Minister of Tamil Nadu today, the May 10, 2026, at 10 AM).

స‌రికొత్త ప‌థంలోకి త‌మిళ‌, బెంగాల్ రాజ‌కీయాలు! >>>>> వనం జ్వాలా నరసింహారావు

 స‌రికొత్త ప‌థంలోకి త‌మిళ‌, బెంగాల్ రాజ‌కీయాలు!

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర దినపత్రిక (మే నెల 10, 2026)

ఓర్పుతో నిలబడి, క్షేత్రస్థాయిలో ఓపికగా నిర్మించి, ఓటమి, అనిశ్చితిలో కూడా నిబద్ధతతో ఉండేవారే అంతిమంగా చరిత్రను మలుపు తిప్పుతారు. భావజాల ప్రవాహం కూడా అంతే ముఖ్యమైనది. వామపక్షం నుండి దక్షిణాంశం వైపు జరిగిన మార్పులు (పశ్చిమ బెంగాల్), లేదా ద్రావిడ రాజకీయాలలో జరిగిన పునఃసమీకరణలు (తమిళనాడు), భావజాలం కూడా సామాజిక ఆకాంక్షలతో పాటు పరిణామం చెందాలని నిరూపిస్తున్నాయి. నేటి వోటర్లు ఔచిత్యం, పనితీరు, సమ్మిళితత్వానికి స్పందిస్తున్నారు.’ – ప్రజాతంత్ర సంపాదకుడి క్లుప్త వ్యాఖ్య

భారత్‌లోని తాజా వైవిధ్య రాజకీయ ముఖచిత్రాన్ని, ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల పరిణామాలను పరిశీలించినప్పుడు పట్టుదల, సైద్ధాంతికత, ఆశయం ఒకదానితో మరొకటి స్పష్టంగా కలిసిపోయినట్టు అర్థమవుతున్నది. సంప్రదాయికంగా కొనసాగుతూ వస్తున్న రాజకీయ విధానాల్లో సమూల‌ మార్పులు చేసుకోవడం రెండు రాష్ట్రాల్లో కనిపించిన సారూప్య పరిణామం. దశాబ్దాలుగా చేసిన నిరంతర యత్నాల కారణంగా కూటముల ఏర్పాటు, క్రమంగా లెఫ్ట్ నుంచి రైట్ వైపునకు వచ్చిన మార్పులు, ఓటర్ల జాబితాల తారుమారు, ప్రజాస్వామ్య ఆకాంక్షకు, అప్రజాస్వామ్య పోకడలకు  మధ్య సంఘర్షణ వంటి అంశాలు ఈ రెండు రాష్ట్రాల్లోనూ కనిపించాయి. దశాబ్దాలుగా వచ్చిన ఈ మార్పులు ‘గత కాలంలో కొనసాగిన నిరంతర పట్టుదల’ అనే ప్రధాన సూత్రంపై ఆధారపడి చోటుచేసుకున్నాయన్నది యదార్థం.

కొందరికి రాజకీయాలు తాత్కాలిక వ్యాపకమ‌యితే, మరికొందరికి అది పట్టుదలతో కూడిన నిరంత‌ర  పోరాటం. తమిళనాడు రాజకీయ రంగం చాలా కాలంగా ‘వెండితెర’తో పెనవేసుకు పోయింది, దీనిని నాటి పట్టుదలతో కూడిన మ‌నో స్థైర్యం లేదా గ‌డ‌చిన కాలంగా వర్గీకరించారు. చారిత్రకంగా ప‌రిశీలిస్తే, తమిళనాడులోని చాలా మంది నటులు తమ ప్రజాదరణను ఉపయోగించుకుని రాజకీయ రంగంలోకి ప్రవేశించారు, స్థిరపడిన వ్యవస్థలలో పాత్రలు పోషించారు, చాలా అరుదుగా మాత్ర‌మే రాజకీయ సమతుల్యతను మార్చారు, లేదా మార్చగలిగారు. అధికార స్వరూపాలను స్వతంత్రంగా పునర్నిర్మించడం కంటే పొత్తుల ద్వారా ముందుకు సాగ‌డానికే చాలామంది ప్రాధాన్య‌త‌నిచ్చారు.

కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి వారు దీనికి ముఖ్యమైన మినహాయింపుగా చెప్పుకోవాలి. సినిమా ఆకర్షణను సంస్థాగత క్రమశిక్షణ, అవిశ్రాంత కృషితో కలిసినప్పుడు మాత్రమే అప్ప‌టివ‌ర‌కు పాతుకుపోయిన‌ రాజకీయ క్ర‌మంలో స‌మూల మార్పు తీసుకురావ‌డం సాధ్య‌మ‌ని వారు సోదాహరణంగా నిరూపించారు. వ్యూహాత్మక ప్రమేయం, కొనసాగుతున్న వ్యవస్థలకు లొంగి ఉండటానికి నిరాకరించడం వల్లే వారి ఎదుగుదల సాధ్యమైంది. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ, తలపతి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (తల్లిదండ్రులు: దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్, గాయని శోభా చంద్రశేఖర్), ఆయన స్థాపించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ‘తమిళగా వెట్రి కజగం’ పార్టీ ఆవిర్భావం, గత సంప్రదాయానికి, విలక్షణమైన పరిణామానికి మిశ్రమ ప్రతీకగా నిలుస్తుంది.

విజయ్ వైఖరి సెలబ్రిటీ రాజకీయాలకు అతీతమైనది. ఆయన ఎదుగుదలను, ప్రతీకాత్మక ఉనికి నుండి వ్యవస్థాగత సవాలు వైపు ఉద్దేశపూర్వకంగా మారడాన్నిగ‌మ‌నించ‌వ‌చ్చు. ఇది ఐదు దశాబ్దాలకు పైగా తమిళనాడును ఏలిన డీఎంకే, ఏఐఏడీఎంకేల దీర్ఘకాలిక కేవలం రెండే రెండు పార్టీల ఆధిప‌త్యాన్ని క‌చ్చితంగా దెబ్బ‌తీస్తున్నది. ఇది ఎన్నికల పరంగా, సైద్ధాంతిక పరంగా ఉన్నది. తమిళనాడు రాజకీయం చాలా కాలంగా ద్రావిడ భావజాలం ద్వారా రూపుదిద్దుకుంది.

ఇది తరచుగా ‘సనాతన ధర్మం’ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతూ ‘ఘర్షణణాత్మ‌క‌ నాస్తికత్వం’ తో కూడుకుని వుండడం గమనార్హం. డీఎంకే అగ్ర నాయకత్వం ప్ర‌ద‌ర్శించిన ‘సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉపయోగించిన వాక్చాతుర్యం ఓటర్ల ఉదాసీనతకు, డీఎంకే ఓటమికి గణనీయంగా దోహదపడింది. ఆ నేపధ్యంలో విజయ్ ఒక ముఖ్యమైన పునఃసమీకరణకు సంకేతం ఇచ్చారు. విజయ్ సామాజిక న్యాయం మూలాలు క‌లిగిన లౌకిక వాద ప్ర‌క‌ట‌న అత్యంత ప్రాధాన్య‌మైంది. ఆధ్యాత్మిక బహుళత్వాన్ని గౌరవించే సమ్మిళిత, మిత లౌకికవాదం పై ఆయన చేసిన ప్రకటన, పిడివాద‌ సైద్ధాంతిక ద్వంద్వాలకు దూరంగా ఉండటం  గ‌మ‌నార్హం.  దేవాలయాలు, చర్చిలు, దర్గాలతో సమానంగా మమేకమవడం ద్వారా, ఆయన ‘లౌకికవాదాన్ని విశ్వాసాల సహజీవనంగా’ పునర్నిర్వచించారు. ఇది, ఇప్ప‌టివ‌ర‌కు వినిపిస్తున్న వూకదంపుడు క‌థ‌నాలకు విసిగిపోయిన నలభై ఏళ్లలోపు యువ వోటర్లను చాలా బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా, అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేయడం ద్వారా, తమిళనాడు రాజకీయాల్లోని సాంప్రదాయ ‘ఇది లేదా అది’ అనే పద్ధతిని టీవీకే పార్టీ బద్దలుకొట్టింది.

ఈ మార్పు ఒక విస్తృత సత్యాన్ని కూడా నొక్కి చెబుతున్న‌ది: పొత్తుల్లో చేరడానికి నిరాకరించడం ఇక్క‌డ ప్ర‌ధానం. గతంలో నాయకులు ఉన్న వ్యవస్థలలో కలిసిపోగా, విజయ్ స్వయంప్రతిపత్తి పై పట్టుబట్టడం, ఈ పునఃసమీకరణకు వీలు కల్పించింది. నిజంగా ఇది ‘జనాదరణతో కూడిన విప్లవాత్మక సాహసాన్ని’ వెల్ల‌డిస్తుంది. తమిళనాడు కథ చలనచిత్ర విప్లవానికి సంబంధించినదైతే, పశ్చిమ బెంగాల్ కథ తీవ్రమైన పోరాటం, వ్యవస్థాగత నియంత్రణ, చివరికి పరివర్తనతో కూడిన సైద్ధాంతిక పరిణామ గాథగా నిలిచింది. స్వాతంత్య్రానికి ముందు, తరువాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వామపక్ష రాజకీయాలకు సారవంతమైన భూమిగా మారింది. ప్రజా ఉద్యమాలకు తరచుగా కమ్యూనిస్ట్ కేడర్ నాయకత్వం వహించి, క్రమంగా తమ ప్రభావాన్ని పటిష్టం చేసుకున్నది. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భావానికి దారితీసింది. ఇది 34 సంవత్సరాల పాటు పాలించి, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్ట్ పాలనలలో ముందు వరుసలో నిలిచింది. ఆధిపత్యం, కేంద్రం జోక్యాలు, క్షేత్రస్థాయి సమీకరణ ద్వారా పార్టీ రూపుదిద్దుకున్నది.

కాంగ్రెసేతర ప్రభుత్వాలను, ముఖ్యంగా ఇందిరా గాంధీ, పదేపదే ర‌ద్దు చేయ‌డం ఆందోళనకరమైన ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మైంది.  కేరళలో ఇఎంఎస్ నంబూదిరిపాద్‌ నేతృత్వంలోని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం, ప్రజాస్వామ్య సూత్రాల‌ను తుంగ‌లో తొక్క‌డం మాత్ర‌మే. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇలాంటి ధోరణులే కొనసాగాయి. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పదేపదే రద్దును ఎదుర్కొన్నాయి, వాటి స్థానంలో తరచుగా స్వల్పకాలిక ప్రభుత్వాలు లేదా రాష్ట్రపతి పాలనలు వచ్చాయి. ఈ జోక్యాలు సహకార సమాఖ్యవాదం  డొల్ల స్వభావాన్ని స్పష్టంగా బహిర్గతం చేశాయి.

రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ యంత్రాంగాలను ఉపయోగించడం స‌ర్వ‌సాధార‌ణమైంది. 1972 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బూత్ క్యాప్చరింగ్, బూటకపు వోటింగ్, వోట్ల లెక్కింపులో అవకతవకల ఆరోపణలు, సుస్థిర ప్రజాస్వామ్య ప్రక్రియలపై దీర్ఘకాలిక నీలి నీడ‌లకు కార‌ణ‌మ‌య్యాయి. తమ ఎదుగుదలను నిరోధించడానికి వ్యవస్థీకృత అవకతవకలు జరిగాయని సీపీఐ (ఎం) ఆరోపించింది. ఇటువంటి పద్ధతులు, పూర్తిగా నిరూపిత‌మైనా లేదా నిరూపితం కాక‌పోయినా, అప్రజాస్వామిక అపనమ్మకపు సంస్కృతికి దోహదపడ్డాయి, ఇది ప్రస్తుత ఎన్నికలతో సహా తదుపరి ఎన్నికల చర్చలలో ఇప్పటికీ పునరావృతమవుతున్నట్లు కనిపిస్తోంది.

రాజకీయ పరిస్థితులు మారినప్పుడు, 1977లో జ్యోతి బసు నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ నిర్ణయాత్మకంగా అధికారంలోకి వచ్చి, ఒక స్థిరత్వ రాజకీయ ప్రజాస్వామ్య శకానికి నాంది పలికింది. ఆయన పదవీకాలం, ఆ తర్వాత బుద్ధదేబ్ భట్టాచార్జీ పదవీకాలం, చాలా మంది స్వర్ణయుగంగా భావించే నిరంతరాయ పాలనను అందించాయి. కాలక్రమేణా, వామపక్షాల సైద్ధాంతిక కఠినత్వం, పరిపాలనా జడత్వం వామపక్ష విరుద్ధ విప్లవానికి ఆస్కారం కల్పించాయి. అది మమతా బెనర్జీ రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె ఎదుగుదల క్రమపద్ధతిలో సాగింది. దశాబ్దాల అవిశ్రాంత పోరాటంపై నిర్మించబడింది.
తమిళనాడు పరివర్తనాత్మక నాయకులలో కనిపించే పట్టుదలలాగే, మమతా బెనర్జీ ప్రయాణంలో  పొత్తులకు, ఆందోళనలకు  వ్యూహాత్మక స్థానం వుంది. వేర్వేరు సమయాల్లో కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, ఆమె లక్ష్యం స్థిరంగా ఒకేఒక్కతిగా సాగింది: ‘వామపక్ష ఎర్రకోట’ను కూల్చివేయడం. 2011లో ఆమె సాధించిన విజయం కీలక మలుపుగా నిలిచింది. లెఫ్ట్ ఫ్రంట్ పతనం, పాతుకుపోయిన సైద్ధాంతిక పాలనలు కూడా నిరంతర సవాళ్లకు లొంగిపోతాయని నిరూపించింది.

పశ్చిమ బెంగాల్ కథ అక్క‌డితో ఆగ‌లేదు. త‌ర్వాతి కాలంలో ఒక బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుదల మరొక ముఖ్యమైన సైద్ధాంతిక పరిణామానికి నిద‌ర్శ‌నం. ఇది వామపక్ష ఆధిపత్యం నుండి జాతీయ గౌర‌వం, సాంస్కృతిక ఐక్యత, జాతీయ హిందుత్వ అనే ఉజ్వల సైద్ధాంతిక గాథ వైపు సాగింది. ఈ పరివర్తన ఒక విస్తృత జాతీయ ధోరణిని స్పష్టం చేస్తున్న‌ది. దీని ప్రకారం సైద్ధాంతిక సరిహద్దులు స్థిరంగా కాకుండా, ఎన్నికల వ్యూహం, ప్రజాభావనలచే రూపుదిద్దుకుంటూ నిరంతరం మారుతూ ఉంటాయి. కొద్దిపాటి భేదాలు ఉన్నప్పటికీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వచించే ఉమ్మడి నమూనాలను ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి.

ఈ రెండు రాష్ట్రాలలోనూ, రాజకీయాలను ‘కేవలం సాధారణ ప్రమేయంగా కాకుండా, ఒక క్రమబద్ధమైన నిబద్ధత’ గా భావించిన వారికే శాశ్వత (లేదా తాత్కాలిక శాశ్వత) విజయం దక్కింది. తమిళనాడులో విజయ్ క్రమశిక్షణతో కూడిన ఎదుగుదల అయినా, పశ్చిమ బెంగాళ రాష్ట్రంలో మమతా బెనర్జీ దశాబ్దాల పోరాటమైనా, తాత్కాలిక ప్రజాదరణ కంటే పట్టుదలే పైచేయి సాధించింది. సుదూరంలో వున్న ఈ రెండు ప్రాంతాలు సైద్ధాంతిక వర్ణపటంలో మార్పులను ప్రదర్శిస్తున్నాయి: తమిళనాడులో మత వ్యతిరేక ద్రావిడవాదం నుండి సమ్మిళిత లౌకికవాదం వైపు,  పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ఆధిపత్యం నుండి జాతీయ హిందుత్వ (కుడిపక్ష) రాజకీయాల వైపు మార‌డం ఇందుకు నిద‌ర్శ‌నం.  సిద్ధాంతం ముఖ్యమైనదే అయినప్పటికీ, అది తరచుగా ఎన్నికల వాస్తవాలకు అనుగుణంగా మారుతుంద‌నేది గుర్తించాలి.

అందువల్ల,  రాజకీయాలను సౌలభ్యం కోసం పనిచేసే వేదికగా కొనసాగించలేమ‌నేది అంత‌ర్లీన సూత్రం.  ఓర్పుతో నిలబడి, క్షేత్రస్థాయిలో ఓపికగా నిర్మించి, ఓటమి, అనిశ్చితిలో కూడా నిబద్ధతతో ఉండేవారే అంతిమంగా చరిత్రను మలుపు తిప్పగలుగుతారు. భావజాల ప్రవాహం కూడా అంతే ముఖ్యమైనది. వామపక్షం నుండి దక్షిణాంశం వైపు జరిగిన మార్పులు (పశ్చిమ బెంగాల్), లేదా ద్రావిడ రాజకీయాలలో జరిగిన పునఃసమీకరణలు (తమిళనాడు), భావజాలం కూడా సామాజిక ఆకాంక్షలతో పాటు పరిణామం చెందాలని నిరూపిస్తున్నాయి. నేటి వోటర్లు ఔచిత్యం, పనితీరు, సమ్మిళితత్వానికి స్పందిస్తున్నారు.  అయితే వ్యూహాత్మక పొత్తులను సమతుల్యం చేయడమే రాజకీయ నాయకులకు ఉన్న సవాలు.

ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, ముఖ్యంగా ‘గవర్నర్ అధికార దుర్వినియోగం’, నిరంతర అప్రమత్తతను తప్పనిసరి చేస్తాయి. విజయం సాధించాలంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా, వ్యవస్థీకృత క్షేత్రస్థాయి ఉనికిని నిర్మించుకోవాలి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు నిరూపించినట్లుగా, దృఢమైన రాజకీయాలు కఠినమైన ముద్రలను అధిగమించి, ప్రజా ఆకాంక్షలు, సూత్రానికి, ఆచరణకు మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతపై దృష్టి పెట్టాలి.

ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్నప్పటికీ, విజయ్‌ను ఆహ్వానించడానికి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆరంభంలో, తక్షణ స్పందనగా, విచక్షణారహితంగా నిరాకరించడం ప్రజాస్వామ్య తీర్పు స్తంభించిపోయిందేమోనన్న భావనను సూచిస్తోంది. సంజీవ రెడ్డి చరణ్ సింగ్‌ను, వెంకటరామన్ పీవీ నరసింహారావును, శంకర్ దయాళ్ శర్మ అటల్ బీహారీ వాజ్‌పేయిని ఆహ్వానించడం వంటి చారిత్రక ఉదాహరణలు రాజ్యాంగబద్ధమైన సముచితత్వానికి నిబద్ధతతో కూడిన ప్రజాస్వామిక ప్రమాణాలను నిర్దేశించాయి. ఈ ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి, గవర్నర్ ఆర్లేకర్ కూడా అదే బాటలో నడిచి, ఆరంభంలోనే మెజారిటీని నిర్ణయించేందుకు సభా వేదికకు అవకాశం కలిపించినట్లయితే హుందాగా వుండేది.

 భారత ప్రజాస్వామ్యంలో, అతిపెద్ద పార్టీ లేదా ఎన్నికల ముందు కూటమి నాయకుడిని గవర్నర్లు లేదా రాష్ట్రపతి ఆహ్వానించడం అనేది సర్వ సాధారణంగా అనుసరించే ఒక సంప్రదాయం. ఫ్లోర్ టెస్ట్‌కు అనుమతించకుండా, లోక్‌భవన్‌లో 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని భౌతిక రుజువు చూపాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ నిర్ద్వందంగా పట్టుబట్టడం, మిగతా అన్ని పార్టీల కంటే స్పష్టంగా ముందంజలో ఉన్న పార్టీకి ఒక ‘అసాధారణమైన అడ్డంకి’ని సృష్టిస్తోంది. ప్రజాస్వామ్య సంప్రదాయానికి విరుద్ధంగా సాగే ఈ చర్య రాజ్యాంగబద్ధతను దెబ్బతీసి, అపూర్వమైన, వ్యవస్థీకృత పద్ధతిలో ప్రజా తీర్పును నిలిపివేస్తున్నది.

ఎట్టకేలకు, టీవీకేకి చెందిన విజయ్ కాంగ్రెస్ పార్టీ నుండి అధికారిక మద్దతును పొందారు. వామపక్ష పార్టీలు (సీపీఐ మరియు సీపీఐఎం), పరువు నిలుపుకునే చర్యగా గత వ్యూహాత్మక తప్పిదాలను పునరావృతం చేయకూడదనే ప్రయత్నంలో, విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. వీసీకే డోలాయమానంగా వున్నప్పటికీ తుది నిర్ణయం స్పష్టంగా విజయ్ కు మద్దతుగా మారింది. విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే, ఒక చారిత్రాత్మక మార్పులో, సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో అసాధారణ రాజకీయ మార్పు : వనం జ్వాలా నరసింహరావు

 పశ్చిమ బెంగాల్‌లో అసాధారణ రాజకీయ మార్పు

వనం జ్వాలా నరసింహరావు

(మే నెల 9, 2026)

యాభై ఏడు సంవత్సరాల క్రితం, 1969 సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో, నేను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, బర్ద్వాన్ జిల్లాలోని బోర్సెల్ గ్రామానికి అఖిల భారత కిసాన్ సభ (AIKS) సమావేశంలో పాల్గొనడానికి ఒక విద్యార్థిగా వెళ్లాను. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, వామపక్ష కూటమి సారథ్యం ప్రభావంతో, గణనీయమైన రాజకీయ, సామాజిక మార్పుల దశను ఆస్వాదిస్తున్నది. అదే సమయం, మావో సిద్ధాంతాల ప్రభావంతో చారు మజుందార్, కానూ సన్యాల్ నాయకత్వంలో నక్సల్బరి ఉద్యమం రూపుదిద్దుకుని, ఊపందుకుంటున్న సందర్భం కూడా.

బంగ్లా కాంగ్రెస్‌కు చెందిన అజోయ్ కుమార్ ముఖర్జీ, యునైటెడ్ ఫ్రంట్‌కు రెండోసారి నాయకత్వం వహిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) {సీపీఐ(ఎం)} ప్రధాన భాగస్వామ్య  శక్తిగా ఉన్న ఐక్య కూటమిలో ఆల్-ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ వంటి పార్టీలు కూడా భాగస్వాములయ్యాయి. మొదటిసారి 1967లో, మళ్లీ రెండవ వపర్యాయం 1969లో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి, పశ్చిమ బెంగాల్‌లో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న వామపక్ష రాజకీయాల బలాన్ని ప్రతిబింబించింది. అది అప్పటి వామపక్ష సిద్ధాంతాల పశ్చిమ బెంగాల్. ఆ సందర్భానికి పూర్తి భిన్నంగా నేడు, సిద్ధాంత పరంగా వామపక్షాలకు విరుద్ధమైన హిందుత్వ సిద్ధాంతానికి ప్రతీకైన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం భారత ప్రజాస్వామ్యానికి వున్నా ప్రత్యేకత.

చరిత్ర పుటలు తిరగేస్తేనే గాని పశ్చిమ బెంగాల్ రాజకీయ సంపూర్ణ ముఖచిత్రం అర్థంకాదు. ఆ రాష్ట్రానికి ఉద్యమాలు ఈ నాటివి కాదు. స్వాతంత్ర్య పోరాట కాలంలో, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక, శ్రామిక శక్తులను ఐక్యం చేసిన ఘనత పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి వున్నది. స్వాతంత్ర్యం రాక ముందే కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ లో ఉద్యమాలకు నాయకత్వం వహించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ బి సి రాయ్ వున్నప్పుడే, ట్రామ్ చార్జీలు పెంచినప్పుడు, కరవు వచ్చినప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. పి ఎల్ 480 పథకానికి వ్యతిరేకంగా విద్యార్థి పోరాటం, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరపాలని చేసిన ఎన్నో ఉద్యమాల ఫలితంగానే అక్కడి ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అభిమానం ఏర్పడి పెరుగుతూ వచ్చింది.

అలాగే, వామపక్ష, కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, 1952 నుంచి, పశ్చిమ బెంగాల్ లో బలపడ సాగాయి. వామ పక్ష రాజకీయ పార్టీలన్నీ ఐక్యమై, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించుకున్న నేపధ్యంలో, అనేక కష్ట, నష్టాలను అధిగమించుకుంటూ కొనసాగించిన సుదీర్ఘ ప్రజా పోరాటం ఫలితంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకత్వంలో, వామ పక్ష కూటమి, ఐదారు దశాబ్దాల క్రితమే మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటికీ, స్థిరపడ గలిగింది మాత్రం ఆ తర్వాత ఏడేళ్ల నుంచి మాత్రమే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నుంచి విడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కుంటూ, నాలుగు దశాబ్దాలపాటు ‘ఎర్రకోటకు బీటలు’ పడకుండా వామపక్షాలు జాగ్రత్త పడ్డాయి.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రఫుల్ల చంద్ర (పీసీ) ఘోష్ మొదటి ముఖ్యమంత్రికాగా,  బిధాన్ చంద్ర (బీసీ) రాయ్ 1948 లో పశ్చిమ బెంగాల్ మొదటి అధికారిక ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఆ నేపధ్యంలో 1967 లో పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ‘యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్’ పేరుతో ఒక కూటమి, ‘పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్’ పేరుతో మరో కూటమి ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల అనంతరం రెండూ కలిసి ‘యునైటెడ్ ఫ్రంట్ గా, బంగ్లా కాంగ్రెస్ నాయకుడు అజోయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు జ్యోతి బాసు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారప్పుడు. అజోయ్ ముఖర్జీ 15 మార్చ్, 1967 నుండి 2 నవంబర్ 1967 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

కేవలం తొమ్మిది నెలల కాలంలోనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. మూడు నెలల పాటు (2 నవంబర్, 1967-20 ఫిబ్రవరి, 1968 వరకు) పిసి ఘోష్ ను మరో పర్యాయం ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు. ఆయన పదవిలో నిలదొక్కుకోవడం కష్టం కావడంతో, ఏడాది కాలంపాటు రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం. ఏడాది తర్వాత, 1969 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగి, మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ ఎక్కువ కాలం అధికారంలో వుండనీయలేదు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 25, 1969 నుంచి మార్చ్ 19, 1970 వరకు ముఖ్యమంత్రిగా వున్న అజోయ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని రద్దుచేసింది.

అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా ‘పశ్చిమ బెంగాల్ వ్యవహారాల’ కాబినెట్ మంత్రిగా నియమించబడిన సిద్ధార్థ శంకర్ రే చాణక్య నీతిలో భాగంగా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేవలం 13 నెలల కాలంలోనే రెండో పర్యాయం రద్దు చేసింది కేంద్రం. తిరిగి మరి కొంతకాలం (మార్చ్ 19, 1970-ఏప్రిల్ 2, 1971) రాష్ట్రపతి పాలన విధించింది. ఏదేమైనా, 1971 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గతంలో మాదిరి "యునైటెడ్ ఫ్రంట్" గా కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు కలిసి పోటీకి దిగలేదు. సీపీఎం పార్టీ ఆలోచనా ధోరణికి అనుకూలమైన కొన్ని పార్టీలు సీపీఎం తో జతకట్టి పోటీ చేశాయి. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాకపోయినా, సీపీఎం అతి పెద్ద పార్టీగా, ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీగా అవతరించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అప్పటి గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడ్డారు. మరో పర్యాయం పి సి ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు (ఏప్రిల్ 2, 1971-జూన్ 28, 1971).

సీపీఎం రాష్ట్ర వ్యాప్త ఆందోళనను చేపట్టింది. ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రజాస్వామ్య పోరాటమే మార్గమని భావించింది. ఘోష్ మనుగడ కష్టమై పోవడంతో మళ్లీ రాష్ట్రపతి పాలన (జూన్ 28, 1971 నుంచి మార్చ్ 19, 1972 వరకు) విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పకడ్బందీ వ్యూహంతో మరో మారు ఎన్నికల్లో దిగి, సీపీఎం ప్రాబల్యాన్ని ఎలాగైనా తగ్గించాలన్న ఆలోచన చేసింది ఇందిరా గాంధి ప్రభుత్వం. ఆమె కనుసన్నల్లో సిద్ధార్థ శంకర రే ఆ ప్రణాళికను అమలు పరిచాడు. అధిష్టానం ఆశీస్సులతో ఐదేళ్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. 1972 ఎన్నికలు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చే రీతిలో జరిగాయి. బూతుల ఆక్రమణ, దొంగ ఓట్ల స్వైర విహారం, ఓట్ల లెక్కింపులో అవకతవకలు భారీ ఎత్తున జరిగింది. ఎట్టి పరిస్థితిలలోను సీపీఎం పార్టీ అధికారంలోకి రాకుండా కట్టుదిట్టమైన అ నైతిక చర్యలన్నీ అవలంబించింది అలనాటి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ.

సీపీఎం పార్టీ వామపక్ష కూటమికి సారధ్యం వహించి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఎన్నికలలో జరిగిన అక్రమాల కారణంగా, రిగ్గింగుకు వ్యతిరేకంగా, ఎన్నికలు జరిగిన రోజున దాదాపు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, ఆ పార్టీకి స్థానాలు తక్కువే వచ్చినా, ఓటింగ్ శాతం మాత్రం 28% వరకు వుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగు శాతానికి అనుగుణంగా సీట్లు వచ్చి వుంటే, సీపీఎం స్థానాల సంఖ్య 80 వరకుండేది. బలమైన ప్రతిపక్షంగా వుండి వుండేది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి 216 స్థానాలు, సీపీఎం కు కేవలం 14 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంత జరిగిన తర్వాత, ప్రజాస్వామ్యం అవహేళనకు గురైన తర్వాత, ఆ నేపధ్యంలో ఏర్పడిన శాసనసభలోకి ప్రవేశించరాదని తీర్మానించుకుంది సీపీఎం. శాసన సభ్యులుగా గెలిచిన ఆ పార్టీకి చెందిన వారెవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. నైతిక విలువలకు అనుగుణంగా ఐదేళ్లు జీతభత్యాల జోలికి పోలేదు.

ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితిని సడలించి 1977 లో సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పుడు, జనతా కూటమితో కలిసి పోటీ చేసిన సీపీఎం, ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో వామ పక్ష కూటమి విడిగా పోటీ చేసి, 243 స్థానాలను గెలుచుకుని, జ్యోతిబసు నాయకత్వంలో కాంగ్రేసేతర లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా ఐదు పర్యాయాలు లెఫ్ట్ ఫ్రంట్ ను ఎన్నికల్లో గెలిపించి, 23 సంవత్సరాలు (జూన్ 21, 1977-నవంబర్ 6, 2000) ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు, స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుని, బుద్దదేబ్ భట్టాచార్యకు వారసత్వం అప్పగించారు. ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును జ్యోతి బసు స్వంతంచేసుకున్నాడు.

1997 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించిన కుమారి మమత బెనర్జీ, అచిర కాలంలోనే, సీపీఎం కు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. సీపీఎం ను గద్దె దింపడానికి అవకాశం వున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. ఎన్డీయే తో జతకట్టింది. పడకపోతే బయటకొచ్చింది. 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్ట్-లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించ లేకపోయింది. లోక్ సభ సభ్యురాలిగా 2004 లో కేంద్ర మంత్రివర్గంలో చేరింది. పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేసింది. 2006 శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన స్థానాలు తక్కువే అయినా, పోరాటం కొనసాగించింది. అదే సంవత్సరం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఆందోళనలు చేపట్టింది. 2009 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా పోటీ చేసి, ఇరువురు కలిసి 26 స్థానాలను గెల్చుకున్నారు. తదనంతరం జరిగిన మునిసిపల్ ఎన్నికలు, కలకత్తా కార్పొరేషన్ ఎన్నికలు, తృణమూల్ కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చాయి.

నవంబర్ 6, 2000 నుంచి ముఖ్యమంత్రిగా బుద్దదేబ్ పదవిలో కొనసాగుతూ, తృణమూల్ కాంగ్రెస్ కు శాసనసభలో గెలుపు దక్కకుండా కాపాడుతూ వచ్చినా తప్పుకోక తప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీ యోధానుయోధుడుసిద్ధాంత కర్తఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు అని పేరు తెచ్చుకున్న సిద్ధార్థ శంకర రే మార్చి 191972 నుంచిజూన్‌ 211977 వరకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సారథ్యం వహించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయిందనాలి. 34 సంవత్సరాలపాటు తన అధికారాన్నంతా పణంగా పెట్టినా కాంగ్రెస్‌ సాధించలేనిదాన్నిఅచిర కాలంలోనే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ సాధించి 2011 ఎన్నికల్లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది.

మమతా బెనర్జీ ఆషామాషీగాహఠాత్తుగా అధికారంలోకి రాలేదు. ఎంతో కృషినిరంతర పోరాట ఫలితంగానే ఆమెకు ఆ అవకాశం ఇచ్చారు ఓటర్లు 2011 ఎన్నికల్లో. అలాగే మరో ఐదేళ్లపాటు తమ భవిష్యత్‌ను ఆమె చేతుల్లోనే పెట్టారు 2016, 2021 ఎన్నికలలో కూడా పశ్చిమ బెంగాల్‌ ఓటర్లు. మమత కేవలం ముప్ఫై ఏళ్ల వయస్సులోనే సీపీఎం దిగ్గజం సోమ్‌నాథ్‌ ఛటర్జీని ఓడించి తొలిసారి ఎంపీగా గెలిచింది. ఆ తరువాత ఓడినాగెలిచినాగెలిచినప్పుడు కేంద్రంలో మంత్రి పదవి అనుభవించినాకాంగ్రె్‌సతో కొంతకాలంబీజేపీతో కొంతకాలం జతకట్టినావేరుపడినాబెంగాల్‌ రాజకీయాలలో మాత్రం సుస్థిర స్థానాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. అదే ఆమెకు ఇప్పుడు విజయం చేకూర్చింది.

సీపీఎం పాలన పగ్గాలు జ్యోతిబసు చేతిలో వున్నంత కాలం మమత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇరవయ్యేడు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో ప్రజలు స్వర్ణ యుగం చూసి వుండవచ్చు. దరిమిలా బుద్దదేబ్ పాలనలో తృణమూల్ ఎదుగుదలకు ఆస్కారం లభించింది. ఇటీవల వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాలు, ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని అలనాటి కాంగ్రెస్ ఆధిపత్యం నుండి, వామపక్ష సిద్దాంతానికి, తదనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకత్త్వానికి మారి, ఇప్పుడు ఏకంగా మతతత్త్వ భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో అధీనంలోకి రావడం, బహుశా భారత దేశ ప్రజాస్వామ్యానికే స్వంతమేమో! తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం మిగిలింది.

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో మమతా బెనర్జీ (టీఎంసీ) నుండి సువేందు అధికారి (బీజేపీ) వరకు జరిగిన పరిణామాలు అత్యంత నాటకీయమైనవి. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలకడం, 2026 నాటికి సువేందు అధికారి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదగడం ఇందులో కీలక ఘట్టాలుకీలక పరిణామంలో భాగంగా, ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, నందిగ్రామ్ ఉద్యమంతో తృణమూల్ కాంగ్రెస్ బలోపేతానికి కారణమైన సువేందు అధికారి, TMC నాయకత్వంతో విభేదాల కారణంగా 2020 డిసెంబర్‌లో పార్టీని వీడి భారతీయ జనతాపార్టీలో చేరారు.

2021 ఎన్నికల్లో, మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌లో సువేందు అధికారి ఓట్ల తేడాతో ఓడించారు. తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచినప్పటికీ, సువేందు ‘జెయింట్ కిల్లర్’గా నిలిచి, బీజేపీ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. సువేందు అధికారి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా తన సంఘటనను బలోపేతం చేసుకుంది. టీఎంసీ పాలనపై అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, చొరబాటు వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు మరో చారిత్రాత్మక మార్పుకు దారి తీశాయి. సువేందు అధికారి మరోసారి మమతా బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో 15 వేల పైన ఓట్ల భారీ తేడాతో ఓడించారు.

BJP 200కు పైగా స్థానాలతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది, టీఎంసీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. నందిగ్రామ్ నుండి భవానీపూర్ వరకు మమతా బెనర్జీని వరుసగా రెండుసార్లు ఓడించిన సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా 2026 మే 9న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మమతా బెనర్జీ దశాబ్దాల పట్టు, సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ చేతిలోకి వెళ్ళింది. నందిగ్రామ్ ఉద్యమ నాయకుడే, ఆ ఉద్యమం ద్వారా వచ్చిన ముఖ్యమంత్రిని పదవి నుండి దించి, ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మార్క్సిజం-కమ్యూనిజం నుండి సుదీర్ఘ ప్రయాణం సాగించి చివరగా ‘జాతీయ  హిందూత్వ’ వైపు మళ్లాయి.