Sunday, June 14, 2026

నివాసాలు దూరమైనా అప్పటికీ, ఇప్పటికీ అదే స్నేహం, ఆప్యాయత : వనం జ్వాలా నరసింహారావు

 నివాసాలు దూరమైనా 

అప్పటికీ, ఇప్పటికీ అదే స్నేహం, ఆప్యాయత

వనం జ్వాలా నరసింహారావు 

(జూన్ నెల 15, 2026)

ఉద్యోగరీత్యా హైదరాబాద్ నగరంలోనే స్థిరపడిన మాకు(నా 78 సంవత్సరాల, మా శ్రీమతి 73 సంవత్సరాల వయసులో) ఐదారు దశాబ్దాల క్రితంనాటి మధురాతి మధురమైన రోజులు మళ్లీ రావని అనిపిస్తుంది. అప్పటి ‘బంధాలుబాంధవ్యాలుబాధ్యతలు’ తలచుకునివర్తమాన పరిస్థితులతో పోల్చుకుంటే, మార్పు సహజమే అయినా, కించిత్ ఆవేదన అంతరాంతరాలను కలచివేస్తుంటుంది. ఈ నేపధ్యంలో, మా శ్రీమతి అక్కగారి కూతురు చినపాప (సత్యవతి) నిన్నటి రోజున మా ఇంటికి వచ్చిన సందర్భంగా, భోజనాల బల్ల దగ్గర వారిరువురి మధ్య మొదలైన మాటలు, నలభై, యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాయి. వారి మాటల్లో కేవలం ఇద్దరు సమీప బంధువుల పలకరింపు మాత్రమే లేదు. ఒక తరం జీవించిన అపురూపమైన జీవనశైలి ఉంది. ఒక అపూర్వమైన స్నేహగాథ ఉంది. ఈనాటి తరానికి దాదాపు ఊహకే అందని మానవ సంబంధాల గోరువెచ్చదనం ఉంది. కేవలం వారి సంభాషణ అక్షరీకరణే ఈ రాత. వడబోత, స్వంత కవిత్వం లేనేలేని రాత.  

ఉద్యోగరీత్యా 1974 ప్రాంతంలో నేను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మేము చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్ ప్రాంతాలలో ఉండేవాళ్లం. అలాగే, అశోక్‌నగర్ పరిసర ప్రాంతాల్లో మా బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరిగా వచ్చి స్థిరపడుతున్న సందర్భం కూడా అది. భండారు శ్రీనివాసరావు -నిర్మల దంపతులు, గీత-వనం రంగారావు కుటుంబం, తరువాత మా ఆవిడ అక్క కూతురు చినపాప (సత్యవతి) - ప్రసాద్ దంపతులు, భండారు రామచంద్రరావు కుటుంబం (భార్య విమలాదేవి), డాక్టర్ అయితరాజు మనోహర్ రావు (భార్య ఉష), మరి కొన్నాళ్లకు ఆయన అన్నగారు డాక్టర్ అయితరాజు రంగారావు (భార్య కరుణ) కుటుంబాలు కూడా హైదరాబాద్ వచ్చి అదే పరిసరాలలో అద్దె ఇళ్లల్లో వుండేవారు. మరికొంత మంది ఆత్మీయులు కూడా అదే పరిసరాల్లో నివసించడం వల్ల మా కుటుంబాల మధ్య అనుబంధం మరింత బలపడింది.

మేమంతా ముందు వెనుకల హైదరాబాద్ వచ్చిన మొదట్లో చాలా సంవత్సరాల దాకా, మా సమీప బంధువులుఒక్కోసారి ఉన్నతాధికారులైన వారి స్నేహితులు, మా ఇళ్లల్లో (చిన్న రెండు-మూడు గదులే) ఎలాంటి సౌకర్యం లేకపోయినా వుండి, మాతోపాటే తినిపనైన తరువాత వెళ్లిపోయేవారు. అదొక తరహా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి బందు వ్యవస్థ.

నాది భెల్ (BHEL) హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్‌గా చిన్న ఉద్యోగం. నా చిన్ననాటి సహాధ్యాయి, తరువాత కాలంలో నా భార్యకు చిన్న మేనమామగా పరిచయమైన భండారు శ్రీనివాసరావు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తా విభాగంలో విలేఖరిగా ఉద్యోగం. వనం రంగారావు నాకు కళాశాల సహాధ్యాయి, సమీప బంధువు, క్రికెట్ సహా ఆటగాడు, SBH ఉద్యోగి. ఎస్ హెచ్ ప్రసాద్ సెంట్రల్ బాంకులో సీనియర్ అధికారి. భండారు రామచంద్ర రావుగారు SBI లో ఉన్నతాధికారి. ప్రొబేషన్ అధికారిగా చేరి, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి.

శ్రీనివాసరావు దంపతులది ఎన్ని విధాలో, అరమరికలు లేకుండా అందరికీ సహాయపడే మనస్తత్వం. అప్పట్లో ఏచిన్న సమస్య వచ్చినా పరిష్కారం దొరికేది శ్రీనివాసరావు చేయి వేయడంతోనే. భార్య నిర్మల కూడా అంతే. రెండాకులు ఎక్కువే అనాలి. గీత పుట్టి పెరిగినది హైదరాబాద్ కావడాన తెలివితేటల పరంగా అభినందించాల్సిన వ్యక్తి. విమలాదేవి ఆడవారందరిలో పెద్ద. వయసులో అందరికంటే చిన్నదైన చినపాపకు, కిరాణా సామాన్ల దగ్గర నుండి, స్టీల్ సామాన్ షాపు వరకు ఏ దుకాణంలోనైనా అప్పు ఇప్పించే సామర్థ్యం వుండేది. తన దగ్గర డబ్బులు వున్నా, లేకపోయినా ఎవరడిగినా కాదనకుండా సర్దే సంస్కారం మెండుగా వున్న పెద్దమనసు. చిన్నా- పెద్దా, అందరికీ అన్ని రుగ్మతలకూ వైద్యుడు  డాక్టర్ అయితరాజు మనోహర్ రావు. ఆయన అన్నగారు డాక్టర్ అయితరాజు రంగారావు, చివరగా హైదరాబాద్ కు వచ్చినప్పటికీ, ప్రతివారికీ సహాయం చేయడానికి అందరికంటే ముందు వరసలో వుండేవాడు. ఇలా..ఇలా.. మా కుటుంబాలన్నీ ముందు వెనుకల హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయినాము.

అయితే మా కుటుంబాలన్నింటినీ ఒకే దారంతో కట్టిపడేసిన అసలైన (మహిళా) శక్తి మా ఇంటి ఆడవాళ్లే. మా ఆవిడ, చినపాప, దుర్గత్తయ్య (అమ్మఒడి), గీత, విమలత్తయ్య: ఈ ఐదుగురి స్నేహం గురించి ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. వీరి మధ్య బంధుత్వం ఎంత ఉందో, స్నేహం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేది. పిల్లలు స్కూలుకు, భర్తలు ఆఫీసులకు వెళ్లిపోయాక, అరగంటలో చినపాప మా ఇంటి గుమ్మం దగ్గర ప్రత్యక్షమవడం దాదాపు నిత్యకృత్యం. సమయపాలన అంటే ఏమిటో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. ఉదయం పది గంటలకల్లా వచ్చేసేది. మా ఆవిడ చినపాపతో కబుర్లు చెపుతూనే, ఇంటి పనులు ముగించుకుని, ఇద్దరూ కడుపునిండా భోజనం చేసి బయలుదేరేవారు. కొద్దిసేపట్లో దుర్గత్తయ్య ఇంటికి చేరేవారు.  అక్కడ ఆమె ఎంత బిజీగా వున్నా, అదంతా వీరిద్దరూ వచ్చేవరకే. పనుల అప్పగింతలు పూర్తి చేసి బజారు షికారుకు సిద్ధంగా వుండేది.

అక్కడి నుంచి పక్క ఇంట్లో వుండే గీత కూడా జతకలిసేది. అలా నలుగురి ‘చిక్కడపల్లి బజారు జైత్ర యాత్ర’ విజయవంతంగా మొదలయ్యేది. వాళ్లకు ముందుగా నిర్ణయించిన ఎజెండాలు ఉండేవి కావు. ఎలాంటి రూట్ మ్యాప్ లేదు. ఏం కొనాలి, ఎంత కొనాలి, ఎందుకు కొనాలి అనే లెక్కలు కూడా ఉండేవి కావు. దుకాణం ముందుగా కనిపిస్తే అది మొదటి గమ్యం. చెప్పులు కుట్టించే దుకాణం కనిపిస్తే అక్కడ ఆగేవారు. పిల్లల యూనిఫారం షూస్ (కొత్తవి కొనడం కుదిరేదాకా) బాగు చేయించేవారు. కిరాణా షాపు కనిపిస్తే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేవారు. లక్ష్మీ షోరూం కనిపిస్తే చీరెలు చూసేవారు. స్టీల్ సామాను దుకాణం కనిపిస్తే అటు మళ్లేవారు. బాంగిల్స్ షాప్ కనిపిస్తే ఇక ఆటే కాసేపు. కొనుగోలు వెనుక పెద్ద అవసరం ఉండకపోవచ్చు. కానీ కలిసి తిరగడంలో, చూసి ఆనందించడంలో లభించే సంతృప్తి మాత్రం అమూల్యం.

ఈనాటి మాల్స్‌, ఆన్‌లైన్ షాపింగ్‌లు, డిజిటల్ చెల్లింపుల యుగంలో పెరిగిన వారికి ఇది విచిత్రంగా అనిపించవచ్చు. కానీ రోజుల్లో జేబుల్లో డబ్బులు ఎక్కువగా లేకపోయినా, మనసుల్లో ఉదారత మాత్రం అపారంగా ఉండేది. ఒకరి దగ్గర డబ్బులు తక్కువైతే ఇంకొకరు చెల్లించేవారు. ఎవరు ఎంత ఇచ్చారనే లెక్కలు ఎవరూ పెట్టుకునేవారు కాదు. రిక్షా ఎక్కాల్సి వస్తే నలుగురూ (ఐదుగురూ?) ఒకే రిక్షాలో ఇరుక్కుని కూర్చుని నవ్వుకుంటూ వెళ్లేవారు. బాడుగ ఎవరు కట్టారన్నది మరుసటి రోజుకే మర్చిపోయేవారు. మధ్యలో ఆకలి వేస్తే సుధా హోటల్‌లో ఒక ప్లేట్ ఇడ్లీ, అర ప్లేట్ పూరీ, ఒక దోశ, ఏదో ఒకటి పంచుకుని తినేవారు. పంచుకోవడంలోనే రుచి ఉండేది. ఇప్పటిలాగా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఆర్డర్, బిల్లు, జీవితం అప్పట్లో లేదు. సంతోషం కూడా ఉమ్మడిగానే ఉండేది.

అలా తిరుగుతూ తిరుగుతూ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విమలత్తయ్య ఇంటికి చేరేవారు. ఆమె అందరికీ అత్తయ్యే. దుర్గ కూడా అందరికీ అత్తయ్యే. తలుపు తట్టేలోపే లోపల నుంచి స్వాగతం సిద్ధంగా ఉండేది. వేడివేడిగా ఫిల్టర్ కాఫీ చేతికి అందేది. తరువాత మొదలయ్యేవి ముచ్చట్లు. ఈనాటి భాషలో చెప్పాలంటేగాసిప్అనొచ్చు. అప్పట్లో అది లోకాభిరామాయణం. కానీ వాటిలో ఎప్పుడూ పరనింద ఉండేది కాదు. ఆత్మస్తుతికి ఆస్కారం అసలే వుండకపోయేది. ఎవరి ఇంట్లో ఏం జరిగింది, ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది వచ్చింది, ఎవరికి సంతోషం దక్కింది: అన్నీ ఇలాంటి విషయాలే.

మా ఆవిడ (ఇతరులు కూడా బహుశా) మాత్రం మధ్యాహ్నం మూడు గంటల సమయం అవుతూనే, ఆరు నూరైనా, నూరు ఆరైనా ఇంటికి చేరుకోడం తప్పనిసరి. కాసేపట్లో స్కూలుకు పోయిన పిల్లలు ఇంటికి చేరుకునే సమయం కాబట్టి అప్పటికల్లా అవసరాన్ని బట్టి బస్సు దగ్గరికి పోవడమో, ఇంటికి వారు రాగానే వారికి కావాల్సినవి ఇవ్వడమో జరిగేది. ఇది రోటీన్. ఒక్కొక్క రోజున చినపాప సరాసరి విమలత్తయ్య ఇంటికి పోయేదట. వారిద్దరూ దుర్గత్తయ్య ఇంటికి చేరుకునే సమయానికి మా ఆవిడ, గీతా రంగారావు కూడా అక్కడికే చేరుకునేవారు. మళ్లీ ఆరోజు ప్రస్తానం మొదలయ్యేది. షరా మామూలే. ఒక్కోరోజున కూరగాయలు కూడా కలిసే కొనేవారు.

శనివారం మా అబ్బాయి బేగంపేట పబ్లిక్ స్కూల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటన్నరకే బస్సులో అశోక్ నగర్ చేరుకునేవాడు. వీరి స్నేహం ఎలాంటిది అంటే, నలుగురూ, లేదా ఒక్కోనాడు ఐదుగురూ, అంతా కలిసి మా అబ్బాయి బస్సు వచ్చే సమయానికి బస్ స్టాప్ దగ్గర వుండేవారు రిసీవ్ చేసుకోవడానికి. సందర్భాన్ని కూడా వృధా చేయకుండాముచ్చట్లలోకాలక్షేపం చేసేవారు. బహుశా అప్పటి వారి సంభాషణలను ఎవరైనా అప్పట్లో అక్షరీకరణ చేనట్లయితే బ్రహ్మాండమైన బృహత్ హాస్యరసభరితమైన పుస్తకం అయ్యేదేమో.

ఒకరి ఆనందాన్ని నలుగురూ ఆనందించేవారు. ఒకరి కష్టాన్ని నలుగురూ పంచుకునేవారు. ఆర్ధిక ఇబ్బందుల గురించి కూడా చెప్పుకోవాలి. ఆరోజుల్లో ఎవరికి ఏచిన్న ఆర్థికపరమైన సమస్య వచ్చినా బంధుమిత్రులు తమకు ఆదుకునే తాహతు అంతగా లేకపోయినా, వున్నదాంట్లోనే సర్దుబాటు చేసేవారు. అడిగేవారు కూడా మొహమాట పడకపోయేవారు. అవసరమైతే ఐదు రూపాయలు, పది రూపాయలు కూడా ఒకరికొకరు ఇచ్చి ఆదుకునేవారు. పాలసీసాలకు, ఆడపిల్లల పెళ్లిళ్లకు, ఆసుపత్రుల ఖర్చులకుగాస్ సిలిండర్ కుబంధువులుస్నేహితులు డబ్బులు సర్దిన రోజులున్నాయి. అప్పట్లో చిన్న మొత్తాలకూ విలువ ఉండేది. కానీ వాటికంటే విలువైనది ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. అందరి జీతాలు అంతంత మాత్రమేకాని ఆప్యాయతలకు, అనురాగానికి కొదవలేదు. వారి స్నేహానికి ప్రతీకగా నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు మా ఆవిడ, చినపాప సంభాషణ జ్ఞాపకాలలో చెక్కుచెదరకుండా ఉన్నాయి.

ఇదంతా ఒక ఎత్తైతే, మా కుటుంబాలకు పెద్దవారైన మా మామగారు, అత్తగారు, కలిసికాని, విడివిడిగా కానీ హైదరాబాద్ లొ కొన్నిరోజులు ఉండడానికి వచ్చిన సందర్భాలలో విశేషాలకు మరొ రకమైన ప్రాధాన్యత వుండేది. ఐదుగురు స్నేహితులకు కూడా వారిద్దరూ పెద్దవారు, సమీప బంధువులే. ఒకసారి మా ఆవిడ, మా అత్తగారు, చినపాప కలిసి బజారుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇంటి దగ్గర ఆటో ఆగగానే పనిమనిషి పరుగెత్తుకుంటూ వచ్చి, బయట ఆరేసిన చీరెలన్నీ దొంగ ఎత్తుకెళ్లాడని చెప్పింది. సహజంగా ఎవరైనా దిగ్భ్రాంతికి గురవుతారు. కానీ మా అత్తగారు మాత్రం ఎంతో ప్రశాంతంగా, పోయిన చీరెలు తిరిగి రావు కదా! వాటికోసం ఎందుకు బాధపడాలి? అని చెప్పి ఆటోను ముందుకు సాగమన్నారు. ఒక్క మాటలో జీవితం మొత్తాన్ని తేలికగా తీసుకునే ఒక గొప్ప తత్వం దాగి ఉంది. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా నెమరేసుకున్నారు ఇద్దరు. సరే, మధ్యలో నవ్వులు కూడా.

మరోసారి గాంధీనగర్ దగ్గర ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్లడానికి మా ఆవిడ, దుర్గత్తయ్య, చినపాప సిద్ధమయ్యారు. వారితో పాటు మా అత్తగారు కూడా వస్తానన్నారు. ఇటీవలే ఆమెకు శస్త్రచికిత్స జరిగినప్పటికీ, ఇంట్లో కూర్చోవడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. మార్గమధ్యంలో డాక్టర్ మనోహర్‌రావు కనిపించి, ఇప్పుడే ఆపరేషన్ అయ్యింది. అమ్మను తీసుకెళ్లకుండా ఉండాల్సింది అని సరదాగా మందలించారు. మాట విన్నాక అందరూ నవ్వుకున్నారు. ప్రేమతో చెప్పిన మందలింపులకూ రోజుల్లో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉండేది.

చినపాపతో మా ఆవిడకు జరిగిన సంభాషణలో మరో సరదా జ్ఞాపకం కూడా వెలుగులోకి వచ్చింది. ఒకసారి మా మామగారు రాంరావుగారు వారి ఇంటికి వెళ్లారు. భోజనం చేయమని చినపాప ఆహ్వానించింది. సాధారణంగాNOఅనే అలవాటు లేని ఆయన సరే అన్నాడు. ఆమె ఎంతో శ్రద్ధగా చేసిన బెండకాయ కూరను వడ్డించింది. కానీ కూరలో ఉప్పూ, కారమూ సరిగా లేకపోవడంతో మామగారు తనదైన శైలిలో చినపాపనలభీమ పాకాన్నిసందర్భోచితంగా, సరదాగా వ్యాఖ్యానించారు. మాటను చినపాప మనసుకు పెట్టుకోలేదు. నవ్వుకుంటూ స్వీకరించింది. బహుశా సంఘటన వల్లేనేమో, తరువాత ఆమె చేసే బెండకాయ కూరకు కుటుంబమంతా అభిమానులయ్యారు. (వాస్తవానికి రాంరావుగారు అన్నమాటలు: నోరు లేని మొగుడు-ప్రసాద్- కాబట్టే నువ్వు కూర ఎలా చేసినా అదే రుచిగా తినిపోయాడు పాపం)  

ఐదుగురి స్నేహం కేవలం షాపింగ్‌లు, కాఫీలు, ముచ్చట్ల వరకే పరిమితం కాలేదు. ఎవరి ఇంట్లో పండుగ జరిగినా మిగతావాళ్లు ముందుండేవారు. సత్యనారాయణ వ్రతం అయినా, చిన్న శుభకార్యం అయినా, పిల్లల పుట్టినరోజు అయినా, కొత్త ఇంటి గృహప్రవేశం అయినా, తమ స్థోమతకు తగ్గట్టు బట్టలు, బహుమతులు తీసుకెళ్లడం వారి సంప్రదాయం. ఎవరి ఇంట్లో అనారోగ్యం వచ్చినా మిగతా నలుగురూ అక్కడే ఉండేవారు. ఎవరైనా ఆసుపత్రిలో చేరినట్లు తెలిస్తే బంధువులు కానీస్నేహితులు కానీతక్షణం హాజరవ్వాల్సిన పనులను పక్కన పెట్టి, వెళ్లి పరామర్శించి వచ్చేవారు. ఆపరేషన్ లాంటిది జరుగుతే ఆద్యంతం థియేటర్ ముందే వుండిపోయి పేషంట్ భర్తకో, భార్యకోతల్లిడంద్రులకో ధైర్యం చెప్తూ, అవసరమైతే రాత్రుళ్లు తోడుగా వుండేవారు. భౌతికంగా, మానసికంగా, చేతనైన విధంగా సహాయం చేసేవారు. నీ సమస్య - నా సమస్య  అనే భావన సహజంగా ఉండేది.

అలా సంవత్సరాలు గడిచాయి. దశాబ్దాలు మారాయి. పిల్లలు పెద్దయ్యారు. ఉద్యోగాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోయారు. ఇళ్లు దూరమయ్యాయి. వయసులు పెరిగాయి. అవసరాలు మారాయి. కాలం తన పని చేసింది. కానీ కాలం చేయలేకపోయిన ఒక పని ఉంది: అదే, వారి స్నేహాన్ని మార్చడం. ఈరోజు ప్రతిరోజూ కలుసుకునే అవకాశం లేకపోవచ్చు. గంటల తరబడి నడుచుకుంటూ బజార్లు తిరిగే శక్తి లేకపోవచ్చు. ఒకే రిక్షాలో ఇరుక్కుని ప్రయాణించే పరిస్థితులు లేకపోవచ్చు. కానీ వారి మాటల్లో ఇప్పటికీ అదే ఆప్యాయత వినిపిస్తుంది. ఒకరి పేరు ప్రస్తావనకు రాగానే మరొకరి కళ్లలో వెలుగు కనిపిస్తుంది. శరీరాలు దూరంగా ఉన్నా, మనసులు మాత్రం ఇప్పటికీ అశోక్‌నగర్ వీధుల్లోనే కలిసి నడుస్తున్నట్టుంటాయి.

చినపాపతో మా ఆవిడ మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నది ఇద్దరి సంభాషణ మాత్రమే కాదు. ఒక కాలం ప్రతిధ్వనిని విన్నాను. లెక్కలు లేని అనుబంధాలను చూశాను. అవసరానికి తోడు నిలిచే స్నేహం ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేసుకున్నాను. నిజానికి కాలం మారింది. ప్రపంచం మారింది. మన జీవనశైలి మారింది. కానీ ఇలాంటి స్నేహాలు మాత్రం కాలాన్ని జయిస్తాయి. అందుకే నేటికీ వారి గురించి ఆలోచించినప్పుడల్లా నా మనసులో ఒకే భావన మెదులుతుంది: దూరాలు పెరిగాయి, వయసులు పెరిగాయి, పరిస్థితులు మారాయి. కానీ వారి మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకటే. చినపాప, బుజ్జి, దుర్గత్తయ్య, గీత, విమలత్తయ్యల స్నేహం ద్వారా ఒక తరం జీవన విధానం, ఆర్థిక సరళత, పరస్పర ఆదరణ, బంధాల విలువ ఎంతో సహజంగా ప్రతిబింబించాయి. వీరి అపూర్వ స్నేహానికి అభినందనలు.

Saturday, June 13, 2026

Real-Life Learning Experiences that Touched the Heart : Vanam Jwala Narasimha Rao

 Real-Life Learning Experiences 

that Touched the Heart

Vanam Jwala Narasimha Rao

The Hans India (June 14, 2026)

{Listening to both was thoroughly enlightening and thought-provoking, combining lived experience with insights of deep academic and practical value. These recollections added a deeply human dimension to the discussion, proving that policy decisions ultimately shape flesh-and-blood lives in ways statistics cannot capture.} – Editor’s synoptic note

A recent informal evening gathering of a few like-minded friends gradually evolved into a significant milestone through conversations, reflections, and joint learning. The evening featured two fascinating, deeply human narratives described by two highly accomplished individuals: former civil servant Dr PV Ramesh and Telugu language journalist Mallepally Laxmaiah. The gathering included distinguished guests from diverse fields whose insights and contributions truly catalysed the discussion chronicles.

Listening to both chronicles was thoroughly enlightening and thought-provoking, combining lived experience with insights of deep academic and practical value.

Dr PV Ramesh captivated the audience through the sheer breadth of his experience and the candour of his reflections. A physician by education and an international development professional by practice, his remarkable journey spans nearly four decades across diverse domains, including public policy, public health, financial management, governance reform, organisational strategy, and sustainable development. Much of his service was dedicated to tribal regions, and participants listened with keen interest as he recalled being the first Sub-Collector of both Utnoor and Mulugu (Telangana) after they were constituted as separate sub-divisions.

These foundational assignments offered him a unique opportunity to engage closely with tribal communities and shape grassroots governance.

While much of the early conversation revolved around these administrative milestones, the focus seamlessly shifted to Mallepally Laxmaiah. A prominent Telugu journalist, public intellectual, and central figure in the Telangana Statehood movement, he captivated the table by sharing his own enthralling personal experiences rooted in grassroots advocacy for marginalized communities.

Among the many experiences Dr PV Ramesh shared, the most compelling was a deeply moving, real-life lesson for the next generation of civil servants. This defining moment occurred during his tenure as the historic first Sub-Collector of Mulugu, immediately after its transition into a sub-division. Serving in this role marks an IAS officer's critical first independent test, granting them vital Sub-Divisional Magistrate (SDM) powers to impact lives directly.

In this capacity, SDMs wield the authority to conduct magisterial inquests into suspicious deaths or custodial casualties. This specific incident from the very dawn of his administrative career held the gathering spellbound, rising completely above the ambient noise at the table. Ultimately, it was his delivery, marked by immense clarity, humour, and an extraordinary eye for detail, that brought the episode alive. The story itself dates back to his very first day as a 25-year-old Sub-Collector in the newly created Mulugu sub-division, fresh to the realities of public service.

Quite ironically the first day happened to be a Sunday. Having just arrived with little knowledge of the locality, he lacked both official accommodation and a clear idea of where the newly established office was located. Faced with limited options, he arranged a temporary stay in the zinc-roofed residence of a local electrical engineer. After a long journey and the initial formalities, he looked forward to some much-needed rest. However, fate had entirely different plans him.

No sooner had he settled down than a knock disrupted his rest. On opening the door, he found an urgent police constable requesting that he immediately accompany him to meet the District Superintendent of Police. Assuming it was a routine courtesy call nearby, Dr Ramesh readily agreed and stepped into the waiting vehicle. However, as the journey began and the vehicle continued to move farther and farther past the town limits, his curiosity quickly gave way to deep concern.

Driven by this concern, he repeatedly asked the accompanying personnel where they were headed. The response remained unchanged: ‘Nearby... nearby... almost there... reached, reached.’ As the journey progressed, daylight began to fade, and the surroundings gradually transformed into unfamiliar, increasingly isolated forest terrain. By the time they finally arrived at the destination, darkness had almost set in. There, he was received by the district’s top police officer, who appeared visibly relieved at his arrival.

Surrounded by a sizeable police contingent, the SP greeted him warmly and uttered words he remembers to this day: ‘Welcome, Ramesh. You are the only available Magistrate now.’

Until that moment, he had no idea why he had been brought there. The purpose soon became clear, that, he was required to conduct an inquest on a dead body, details withheld until then. Drawing upon his recent probationary legal training, Dr Ramesh politely declined, pointing out that he had been specifically instructed never to conduct an inquest after sunset.

Despite his refusal, the officer persisted, requesting that he at least view the body. Eventually, he agreed to take a look, which led to an unexpected trek through paddy fields and difficult terrain in near darkness. As fatigue set in over the considerable distance, those accompanying him literally supported him by his shoulders so that journey could continue. What happened once they finally reached the site, as Dr Ramesh himself observed with characteristic restraint, is a completely different story.

By ensuring his presence at the site, the police achieved their immediate objective, and the necessary legal formalities were eventually completed the following day. The return journey proved no less memorable. He again required physical assistance across portions of the difficult terrain before reaching the waiting vehicle. By the time he finally returned to Mulugu, it was around three o’clock in the morning. Yet, sleep had barely begun when another knock once again disturbed the silence.

Opening the door, he was astonished to find a DIG rank police officer, ranking above the district chief, waiting to invite him to breakfast as a gesture of gratitude for his timely assistance. Barely six weeks later, Dr Ramesh would be transferred as the first Sub-Collector of the newly created Utnoor sub-division following the Allampally encounter and the declaration of Adilabad as a ‘Model District.’ What began as an unexpected Sunday adventure thus became one of his earliest and most unforgettable lessons in the inherent unpredictability of public service.

Adding a touch of humour to this unforgettable lesson, Dr Ramesh revealed that a few days later, just before his transfer from Mulugu, he discovered that the destination to which he had been painstakingly led through fields and difficult terrain was not the four kilometres he was trickily made to believe, but less than a quarter of a kilometre away.

This disclosure evoked considerable amusement from the get-together, perfectly capturing the gentility of a young officer encountering the strategic realities of field administration for the very first time.

A particularly moving turn in the get-together was, when Mallepally Lakshmaiah recalled an episode that connected public policy with personal experience. 

Following Dr Ramesh’s riveting administrative account, the narrative transitioned seamlessly to Mallepally Laxmaiah, who remembered, how during Dr PV Ramesh’s tenure as Principal Secretary, Finance, he, along with another representative, had approached the Government seeking enhancement of the remuneration paid to Grama Sevakas, locally known in some areas as Neeradis or Sunkaris. Mallepally’s life work bridges grassroots activism with high-level public policy.

Lakshmaiah revealed that, Dr Ramesh processed the proposal, resulting in the monthly remuneration being doubled from Rs 3000 to Rs 6000. Recalling this decision in Dr Ramesh’s presence, Lakshmaiah became visibly reflective as he spoke about his father, whom he affectionately referred to as Ayya. His father had served as a Sunkari, following a hereditary family occupation, and had passed away nearly five decades ago. Though the remuneration in those days was a mere Rs 5 per month, he continued in the role with dedication, sustained by a sense of duty and tradition!!!

These recollections added a deeply human dimension to the discussion, proving that policy decisions ultimately shape flesh-and-blood lives in ways statistics cannot capture. They beautifully closed the loop of the evening, leaving the gathering with a profound reminder that true governance is measured not by the cold numbers in administrative files, but by its enduring impact on grassroots society. Thank you both.

హృద‌యాన్ని స్పృజించే నిజ జీవిత అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 హృద‌యాన్ని స్పృజించే నిజ జీవిత అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర దినపత్రిక (జూన్ నెల 14, 2026)

         ‘డాక్టర్ పివి రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో, గ్రామ సేవకుల (కొన్ని ప్రాంతాల్లో వీరిని ‘నీరడులు’ లేదా ‘సుంకరీలు’ అని పిలుస్తారు) వేతనాన్ని పెంచాలని కోరుతూ తాను, మరొక  ప్రతినిధితో కలిసి ప్రభుత్వాన్ని ఎలా సంప్రదించారో లక్ష్మయ్య గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యమ కార్యకలాపాలను ఉన్నత స్థాయి ప్రజా విధానాలతో అనుసంధానించడమే మల్లెపల్లి జీవిత లక్ష్యం.డాక్టర్ రమేష్ ఆ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదించడం వల్ల, వారి నెలవారీ వేతనం రూ. 3,000 నుండి రూ. 6,000కు రెట్టింపు అయ్యిందని లక్ష్మయ్య తెలిపారు. డాక్టర్ రమేష్ సమక్షంలోనే ఈ నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ, లక్ష్మయ్య తన తండ్రి గురించి (ఆయనను ప్రేమగా ‘అయ్య’ అని పిలుచుకునేవారు) ప్రస్తావించినప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు.. ‘ – సంపాదకుడు, ప్రజాతంత్ర

          ఇటీవల కొంతమంది భావ సారూప్యతగల స్నేహితులతో జరిగిన ఒక అనధికారిక సాయంత్రపు సమావేశం, ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆ సాయంత్రం, ఇద్దరు అత్యంత నిష్ణాతులైన వ్యక్తులు: మాజీ సివిల్ సర్వెంట్ డాక్టర్ పివి రమేష్ , తెలుగు భాషా పాత్రికేయుడు మల్లేపల్లి లక్ష్మయ్య, వివరించిన రెండు ఆసక్తికరమైన, లోతైన మానవీయ‌ వాస్తవ కథనాలు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన విశిష్ట అతిథులు పలువురు పాల్గొన్నారు, వారి అంతర్దృష్టులు, సహకారాలు ఈ చర్చల పరంపరకు నిజంగా ఊపునిచ్చాయి.

ఈ రెండు వాస్తవ కథనాలు ప్రత్యక్ష అనుభవాన్ని, లోతైన విద్యాపరమైన, ఆచరణాత్మక విలువలతో కూడిన అంతర్దృష్టులను క‌లిగించాయి. డాక్టర్ పివి రమేష్ విద్యాపరంగా వైద్యుడు. వృత్తిరీత్యా అంతర్జాతీయ అభివృద్ధి నిపుణుడు. ఆ విధంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా విభిన్న రంగాలలో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన తన ఉద్యోగ సేవలో అధిక భాగాన్ని గిరిజన ప్రాంతాలకే అంకితం చేశారు. ఉట్నూర్, ములుగు (తెలంగాణ) జిల్లాలను ప్రత్యేక ఉపవిభాగాలుగా ఏర్పాటు చేసిన తర్వాత, ఆ రెండింటికీ తానే మొదటి సబ్-కలెక్టర్‌గా పనిచేసిన కాలాన్ని గుర్తుచేసుకున్నప్పుడు, సమావేశంలో పాల్గొన్నవారు ఎంతో ఆసక్తిగా విన్నారు.

ఈ ప్రాథమిక బాధ్యతలు, గిరిజన వర్గాలతో సన్నిహితంగా మమేకమై, క్షేత్రస్థాయి పరిపాలనను తీర్చిదిద్దడానికి ఆయనకు ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించాయి. సమావేశ ప్రారంభంలో జరిగిన సంభాషణలో అధిక భాగం ఈ పరిపాలనా మైలురాళ్ల చుట్టూనే తిరిగినప్పటికీ, దృష్టి అప్రయత్నంగా మల్లెపల్లి లక్ష్మయ్య వైపు మళ్లింది. ప్రముఖ తెలుగు పాత్రికేయుడు, అణగారిన వర్గాల కోసం క్షేత్రస్థాయిలో చేసిన కృషి నుండి పుట్టిన తన ఉత్కంఠభరితమైన వ్యక్తిగత అనుభవాలను పంచుకుని పాల్గొన్నవారిని ఆకట్టుకున్నారు.

          డాక్టర్ పివి రమేష్ పంచుకున్న అనేక అనుభవాలు రాబోయే తరం సివిల్ సర్వెంట్లకు ఒక హృద్యమైన, వాస్తవ జీవిత పాఠాన్ని ప్ర‌భావ‌శీల‌కంగా అందించాయి. ములుగు ఉపవిభాగంగా (సబ్ డివిజన్) మారిన వెంటనే, చారిత్రాత్మకమైన మొదటి సబ్-కలెక్టర్‌గా త‌న ఉద్యోగ కాలంలో ఈ కీలకమైన ఘట్టం చోటుచేసుకుంది. ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపే ముఖ్యమైన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారాలను క‌ట్ట‌బెట్టిన ఉద్యోగ‌మ‌ది! ఈ హోదాలో, అనుమానాస్పద మరణాలు లేదా కస్టడీలో జరిగిన ప్రాణనష్టాల పై మేజిస్టీరియల్ విచారణ జరిపే అధికారం ఎస్డీఎంలకు (సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్) ఉంటుంది.

రమేష్ చెప్పిన ఈ వాస్తవ కథ, ప్రజా సేవలోని వాస్తవాలకు కొత్తగా పరిచయమైన ఆయన, 25 ఏళ్ల వయసులో కొత్తగా ఏర్పడిన ములుగు సబ్-డివిజన్‌లో సబ్-కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నాటిది. ఆ మొదటి రోజు ఒక ఆదివారం. ఆ ప్రాంతం గురించి పెద్దగా అవగాహన లేకుండా అప్పుడే అక్కడికి పోస్టింగ్ ద్వారా చేరుకున్న ఆయనకు, అధికారిక వసతి గానీ, కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయం ఎక్కడ ఉందనే స్పష్టమైన ఆలోచన గానీ లేదు. పరిమిత అవకాశాలు ఉండటంతో, ఆయన ఒక స్థానిక ఎలక్ట్రికల్ ఇంజనీర్ కు చెందిన‌ రేకుల కప్పు ఉన్న ఇంట్లో తాత్కాలికంగా బస ఏర్పాటు చేసుకున్నారు.

ఆయ‌న కుదురుకోగానే, తలుపు చప్పుడు త‌న విశ్రాంతికి భంగం కలిగించింది. తలుపు తెరిచి చూడగా ఒక కానిస్టేబుల్ నిల‌బ‌డివున్నాడు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను కలవడానికి వెంటనే తనతో పాటు రావాలని కోరాడు. అది దగ్గర్లో జరిగే ఒక సాధారణ మర్యాదపూర్వకమైన పలకరింపు అనుకుని, డాక్టర్ రమేష్ వెంటనే అంగీకరించి, సిద్ధంగా ఉన్న వాహనంలోకి ఎక్కాడు. అయితే, ప్రయాణం మొదలై, వాహనం పట్టణ హద్దులు దాటి ముందుకు వెళ్తున్న కొద్దీ, ఆయ‌నలోని ఉత్సాహం, ఆందోళ‌న‌గా మారింది.

తనతో పాటు వస్తున్న సిబ్బందిని వారు ఎక్కడికి వెళ్తున్నారని పదేపదే అడిగాడు. సమాధానం మారలేదు: ‘దగ్గరలోనే… దగ్గరలోనే… దాదాపుగా చేరుకున్నాం… చేరుకున్నాం, చేరుకున్నాం.’ ప్రయాణం సాగుతున్న కొద్దీ, పగటి వెలుగు మసకబారడం ప్రారంభమైంది. పరిసరాలు క్రమంగా అపరిచితమైన, మరింత ఏకాంతమైన అటవీ ప్రాంతంగా మారిపోయాయి. వారు చివరకు గమ్యస్థానానికి చేరుకునేసరికి, దాదాపు చీకటి పడింది. అక్కడ, జిల్లా పోలీసు ఉన్నతాధికారి అతనికి స్వాగతం పలికారు. త‌న రాక ఆయనకు ఉప‌శ‌మ‌నం క‌లిగించిన‌ట్టు స్పష్టంగా క‌నిపించింది.

ఆ ఎస్పీ, అతనికి ఆప్యాయంగా స్వాగతం పలికి, ‘స్వాగతం, రమేష్. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మేజిస్ట్రేట్ మీరే,’ అన్నారు. ఈ రోజుకీ త‌న‌కు గుర్తున్న మాటలవి అన్నారు రమేష్! ఆ క్షణం వరకు, తనను అక్కడికి ఎందుకు తీసుకువచ్చారో అతనికి తెలియదు. వ‌చ్చిన త‌ర్వాత‌ ఒక మృతదేహంపై పంచ‌నామా జరపవలసి ఉందన్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. దాని వివరాలు అప్పటి వరకు గోప్యంగా ఉంచారు. తన ఇటీవలి ప్రాథమిక న్యాయ శిక్షణను గుర్తు తెచ్చుకొని, డాక్టర్ రమేష్ సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ పంచనామా విచారణ జరపవద్దని తనకు ప్రత్యేకంగా సూచించారని పేర్కొంటూ, మర్యాదపూర్వకంగా తిరస్కరించారు.

తాను నిరాకరించినప్పటికీ, ఆ అధికారి పట్టు వదలకుండా, కనీసం మృతదేహాన్ని చూడాలని అభ్యర్థించాడు. చివరికి, అతను చూడటానికి అంగీకరించ‌డంతో, అది దాదాపు చీకటిలో వరి పొలాలు, కఠినమైన భూభాగం గుండా ఊహించని ప్రయాణానికి దారితీసింది. అంత‌టి దూరం ప్ర‌యాణించ‌డంతో ఒక్క‌సారిగా అల‌స‌ట ఆవ‌రించింది. దీంతో ప‌క్క‌నున్న‌వారు భుజాలు ప‌ట్టుకొని ఆస‌రా ఇచ్చారు. ఘటనా స్థలంలో అతని ఉనికిని నిర్ధారించడం ద్వారా, పోలీసులు తమ తక్షణ లక్ష్యాన్ని సాధించారు. అవసరమైన చట్టపరమైన లాంఛనాలు మరుసటి రోజు చివరకు పూర్తయ్యాయి. తిరుగు ప్రయాణం కూడా అంతే గుర్తుండి పోయేదిగా నిలిచింది.

చివరకు ములుగుకు తిరిగి వచ్చేసరికి, తెల్లవారుజామున సుమారు మూడు గంటలైంది. అయినప్పటికీ, నిద్ర మొదలైన కొద్దిసేపటికే, నిశ్శ‌బ్దాన్ని భంగం చేస్తూ మ‌రోసారి త‌లుపు చ‌ప్పుడు!!
తలుపు తెరిచి చూడగా, జిల్లా అధికారి కంటే ఉన్నత హోదాలో ఉన్న ఒక డిఐజి స్థాయి పోలీసు అధికారి, అతను సకాలంలో అందించిన సహాయానికి కృతజ్ఞతగా అల్పాహారానికి ఆహ్వానించడానికి వేచి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అల్లంపల్లి ఎన్‌కౌంటర్‌, ఆదిలాబాద్‌ను ‘మోడల్ డిస్ట్రిక్ట్’గా ప్రకటించిన అనంతరం, కేవలం ఆరు వారాల తర్వాత, కొత్తగా ఏర్పడిన ఉట్నూర్ సబ్-డివిజన్‌కు మొదటి సబ్-కలెక్టర్‌గా డాక్టర్ రమేష్ బదిలీ అయ్యారు.

అనుకోని ఆదివారం నాటి సాహస సంఘ‌ట‌న త‌న అత్యంత మరపురాని పాఠాలలో ఒకటిగా నిలిచింది. దీనికి హాస్యపు ఛాయలు జోడిస్తూ, డాక్టర్ రమేష్ ఒక విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే, కొన్ని రోజుల తర్వాత, ములుగు నుండి తన బదిలీకి కొద్ది రోజుల ముందు, పొలాల మ‌ధ్య‌నుంచి తనను తీసుకువెళ్లిన గమ్యస్థానం, నాలుగు కిలోమీటర్లు కాదని, పావు కిలోమీటరు కన్నా తక్కువ దూరంలోనే ఉందని చెప్ప‌డంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.

అదే సమావేశంలో మరొక హృదయాన్ని స్పందింప‌జేసే ఘట్టం ఏమిటంటే, మల్లెపల్లి లక్ష్మయ్య ప్రజా విధానానికి, వ్యక్తిగత అనుభవానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే ఒక సంఘటనను గుర్తు చేసుకోవడం. డాక్టర్ పివి రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో, గ్రామ సేవకుల (కొన్ని ప్రాంతాల్లో వీరిని ‘నీరడులు’ లేదా ‘సుంకరీలు’ అని పిలుస్తారు) వేతనాన్ని పెంచాలని కోరుతూ తాను, మరొక ప్రతినిధితో కలిసి ప్రభుత్వాన్ని ఎలా సంప్రదించారో లక్ష్మయ్య గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యమ కార్యకలాపాలను ఉన్నత స్థాయి ప్రజా విధానాలతో అనుసంధానించడమే మల్లెపల్లి జీవిత లక్ష్యం. డాక్టర్ రమేష్ ఆ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదించడం వల్ల, వారి నెలవారీ వేతనం రూ. 3,000 నుండి రూ. 6,000కు రెట్టింపు అయ్యిందని లక్ష్మయ్య తెలిపారు.

డాక్టర్ రమేష్ సమక్షంలోనే ఈ నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ, లక్ష్మయ్య తన తండ్రి గురించి (ఆయనను ప్రేమగా ‘అయ్య’ అని పిలుచుకునేవారు) ప్రస్తావించినప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబ వృత్తిలో భాగంగా సుంకరిగా పనిచేసిన ఆయన తండ్రి దాదాపు ఐదు దశాబ్దాల క్రితం కన్నుమూశారు. ఆ రోజుల్లో నెలవారీ వేతనం కేవలం రూ. 5 మాత్రమే అయినప్పటికీ, కర్తవ్య భావన, సంప్రదాయం పట్ల ఉన్న నిబద్ధతతో ఆయన ఆ బాధ్యతను అంకితభావంతో నిర్వహించారు.

ఈ జ్ఞాపకాలు చర్చకు ఒక మానవీయ కోణాన్ని జోడించాయి. గణాంకాలు వివరించలేని రీతిలో విధానపరమైన నిర్ణయాలు నిజమైన మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇవి నిరూపించాయి. పరిపాలనాపరమైన ఫైళ్లలోని కేవలం సంఖ్యల ద్వారా కాకుండా, క్షేత్రస్థాయి సమాజంపై చూపే దీర్ఘకాలిక ప్రభావం ద్వారానే నిజమైన పాలనను అంచనా వేయాలనే గొప్ప సందేశాన్ని అందిస్తూ ఆ సాయంత్రం కార్యక్రమం ముగిసింది. వీరిద్ద‌రికీ ధన్యవాదాలు.

(నా ఆంగ్ల వ్యాసానికి ప్రజాతంత్ర పత్రిక 

స్వేచ్చానువాదం చేసి ప్రచురించిన వ్యాసం)