Showing posts with label టంగుటూరి ప్రకాశం పంతులు. Show all posts
Showing posts with label టంగుటూరి ప్రకాశం పంతులు. Show all posts

Tuesday, May 7, 2013

పార్లమెంటు ఆవరణలో విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష: వనం జ్వాలా నరసింహారావు


పార్లమెంటు ఆవరణలో 
విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష

వనం జ్వాలా నరసింహారావు

పార్లమెంటులో విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష కనిపిస్తూనే ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, నిన్నటి ఎన్టీ రామారావును కలుపుకొంటే ముగ్గురు రాష్ట్ర నేతల విగ్రహాలు పార్లమెంటులో ఏర్పాటు చేశారు. దేశానికి ప్రధానులుగా పని చేసిన వారందరి విగ్రహాలు, చిత్రపటాలు ఉన్నా.. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. ఉత్తరాది వారు, నెహ్రూ గాంధీ కుటుంబీకులూ మాత్రమే ప్రధానులుగా ఎంపికవుతున్న సంప్రదాయాన్ని బద్దలు కొట్టి.. దక్షిణాది నుంచి-అదీ ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రధాని పదవి చేపట్టి, ఐదేళ్లూ మైనార్టీ ప్రభుత్వాన్ని నిరాటకంగా నడిపిన అపర రాజకీయ చాణక్యుడు పీవీ నరసింహారావు ఎవరికీ తీసిపోని మహానేత. తెలంగాణపరంగానే కాకుండా.. ప్రపంచంలోనే ఎన్నదగిన ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుగాంచిన పీవీ విగ్రహాన్ని ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని పలువురు కోరుకుంటున్నారు.

 ఇదిలా వుండగా, పార్లమెంటు ఆవరణలో, సెంట్రల్‌హాల్‌లో ఉన్న వివిధ నేతల విగ్రహాలు, చిత్రపటాల వివరాలు ఇలా ఉన్నాయి.


1. చంద్రప్తు మౌర్య, 2. పండిట్ మోతీలాల్ నెహ్రూ, 3. గోపాల కృష్ణ గోఖలే, 4. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, 5. అరబిందో ఘోష్, 6. మహాత్మా గాంధీ, 7. వైబీ చవాన్, 8. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, 9. పండిట్ గోవింద్ వల్లభ్ పంత్, 10. బాబూ జగ్జీవన్‌రామ్, 11. పండిట్ రవిశంకర్ శుక్లా, 12. ఇందిరాగాంధీ, 13. మౌలానా అబుల్ కలాం ఆజాద్, 14. నేతాజీ సుభాష్ చంద్రబోస్, 15. కే కామరాజ్ నాడార్, 16. ఆచార్య ఎన్‌జీ రంగా, 17. సర్దార్ వల్లభాయ్ పటేల్, 18. బిర్సా ముండా, 19. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, 20. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, 21. ఎస్ సత్యమూర్తి, 22. సీఎన్ అన్నాదురై, 23. గోపీనాథ్ బొర్డొలోయ్, 24. పీ ముత్తురామలింగ థేవర్, 25. ఛత్రపతి శివాజీ మహరాజ్, 26. మహాత్మా బసవేశ్వర, 27. మహారాజా రంజిత్ సింగ్, 28. షహీద్ హేము కలానీ, 29. సీహెచ్ దేవీలాల్, 30. మహాత్మా జ్యోతిరావు పూలే, 31. ఎన్టీ రామారావు.

పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లోని నేతల చిత్ర పటాలు

1. మదన్ మోహన్ మాలవీయ, 2. దాదాభాయ్ నౌరోజీ, 3. లోకమాన్య బాల గంగాధర తిలక్, 4. లాలా లజపత్ రాయ్, 5. మోతీలాల్ నెహ్రూ, 6. సర్దార్ వల్లభాయ్ పటేల్, 7. దేశబంధు చిత్తరంజన్ దాస్, 8.రవీంద్రనాథ్ ఠాగూర్, 9. సరోజినీ నాయుడు, 10. మౌలానా అబుల్ కలాం ఆజాద్, 11. డాక్టర్ రాజేంద్రప్రసాద్, 12. జవహర్‌లాల్ నెహ్రూ, 13. సుభాస్ చంద్రబోస్, 14. సీ రాజగోపాలచారి, 15. ఇందిరాగాంధీ, 16. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, 17. రామ్‌మనోహర్ లోహియా, 18. శ్యాంప్రసాద్ ముఖర్జీ, 19. రాజీవ్‌గాంధీ, 20. లాల్ బహదూర్ శాస్త్రి, 21. సీహెచ్ చరణ్‌సింగ్, 22. మొరార్జీ దేశాయ్, 23. వీడీ సావార్కర్.