Showing posts with label వైఎస్సార్ కాంగ్రెస్. Show all posts
Showing posts with label వైఎస్సార్ కాంగ్రెస్. Show all posts

Monday, March 25, 2013

విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు: వనం జ్వాలా నరసింహారావు


విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు


పక్కా "అంచెలంచల అధికార వ్యూహం" తో జగన్ వర్గంగా ముద్రపడి, ఇటీవల ముగిసిన అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, ఓటు వేసిన తొమ్మిదిమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పైపార్టీ ఫిరాయింపుల  నిరోధక చట్టం కిందఅనర్హత  వేటు వేసేందుకు రంగం తయారవుతోంది. ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి వీరిని అనర్హులుగా ప్రకటించమని సభాపతికి విజ్ఞప్తి చేశారు. దానికి అవసరమైన డాక్యుమెంట్లను కూడా ఆయన సభాపతికి సమర్పించారు. కాంగ్రెస్ బాటలోనే పయనించేందుకు తెలుగుదేశం నాయకులు కూడా సిద్ధమవుతున్నవారు. నేడో-రేపో వీరందరినీ అనర్హులుగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఉపఎన్నికలు జరగడం, ఎవరి బలమెంతో తేలిపోవడం మనం చూడబోతున్నాం.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతేఅవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీసత్ సాంప్రదాయాలే మన్నా నెలకొన్నాయంటేఅలా ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగాచిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పని సరి. ఏ పార్టీ అధికారంలో వున్నావారి వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల ఆధారంగాఆ పార్టీ టికెట్ పై చట్ట సభకు ఎన్నికై సభాపతి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తితన మాతృ సంస్థ ఆలోచనా ధోరణి ప్రకారమే నడచుకుంటున్న అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పటికీ సమయం మించి పోలేదుప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభాపతిగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ఈ విషయంలోయావత్ భారత దేశం అభినందించే రీతిలోరాజ్యాంగ నిబంధనలకు లోబడిన ఒక సత్ సంప్రదాయం ఆవిర్భావానికి చొరవ తీసుకుంటే మంచిది.

చట్ట సభలకు ఎన్నికైన వారుఏ ఏ సందర్భాలలోసభ్యులుగా కొనసాగడానికి అనర్హులవుతారనే విషయంరాజ్యాంగంలో స్పష్టంగా వివరించ బడింది. సర్వ సాధారణంగా పేర్కొనే విషయాలకు అదనంగాపదవ షెడ్యూలులోపార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని కూడా వివరించబడిందిరాజీవ్ గాంధి ప్రధానిగా వున్నప్పుడుపార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1985 లో అమల్లోకొచ్చింది. నాలుగు వందలకు పైగా లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీముందు జాగ్రత్తగా రాజ్యాంగ సవరణ చేసిందన్న ప్రచారం కూడా జరిగిందప్పుడు. ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిస్వచ్చందంగాఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడుసహజంగా శాసన సభ సభ్యత్వం కూడా కోల్పోతారు. ఒక పార్టీ సభ్యుడుగా చట్ట సభకు ఎన్నికైన వ్యక్తిఎన్నికల అనంతరంమరో పార్టీలో చేరితన పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా సభ్యత్వానికి అనర్హులవుతారు. సభాపతిగా-ఉప సభాపతిగాలేదా శాసన మండలి అధ్యక్షుడుగా-ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వారికిపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీఅనర్హత వేటు పడకుండా చట్టం మినహాయించింది.


అదే విధంగాటికెట్ ఇచ్చిన పార్టీ అధికారికంగా జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగాశాసన సభలో జరిగే ఓటింగులో పాల్గొనక పోయినా-పాల్గొని వ్యతిరేకంగా ఓటేసినాసభ్యత్వానికి అనర్హులవుతారు. కాకపోతేఅలా చేయడానికి పార్టీ నుంచి ముందస్తుగా అనుమతి పొందినాలేకఅలా చేసిన పదిహేను రోజుల లోపు అధికారికంగా పార్టీ నాయకత్వం ఆ వ్యక్తిని మన్నించినాఅర్హతకు గురి కాకుండే అవకాశం వుంది. చట్టం మరో చిన్న వెసులుబాటు కూడా కలిగించింది. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన శాసన (లోక్ సభ) సభ సభ్యులలోమూడింట ఒక వంతు మంది,మూకుమ్మడిగా పార్టీ మారితే-వేరే పార్టీలో విలీనమైతేఆ చర్యకు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు వుంది. అయితేరాజ్యాంగ91 వ సవరణ ఈ నిబంధనను మార్చిమూడింట రెండు వంతుల సంఖ్య వుంటేనేవిలీనమైనట్లవుతుందని చెప్పింది. అలానే ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడుపార్టీ మొత్తం మరో పార్టీలో చేరితే కూడా ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు వుంటుంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన కొందరు శాసన సభ సభ్యులు విలీనానికి అంగీకరించకుండా వేరే పార్టీ పెట్టుకున్నాఒక ప్రత్యేకమైన గ్రూపుగా ఏర్పడినామినహాయింపుంటుంది.

అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా సభాపతి దే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిసభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనాన్యాయ స్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్ నిబంధనలను అమలు పరిచే విషయంలోతదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది. రాజకీయ పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలుకొత్తగా చేరిన వారి వివరాలుపార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలుపార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలుసంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి ఉపయోగ పడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులుయాంత్రికంగాతమ సభ్యత్వాన్ని కోల్పోరు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీచట్ట సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి,పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధిసంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరితగు విచారణ జరిగిన చేసిన తర్వాతేసభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు.

సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినాచట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారంరాజ్యాంగ పరంగాన్యాయ మూర్తులకు వుంది. తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిస్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేస్తే,సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూసరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయ స్థానం. లాంఛనంగా రాజీనామా చేయకుండాతనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలోస్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్ట సభ సభ్యుల విషయంలో కూడా, ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని1994 లోసుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదే విధంగాస్వతంత్రుడుగా గెలిచిఏదైనా పార్టీలో చేరిన వ్యక్తి కూడాఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు. పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలుసభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకుఅర్హత-అనర్హతలతో నిమిత్తం లేకుండాచట్ట సభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికిఎన్ని రకాల అవకాశాలుండాలో అన్ని రకాల అవకాశాలను చట్టం కలిగించింది. రాజకీయ పార్టీల "అధి నాయకులు" తమకు అనుకూలమని భావించిసభాపతికి ఫిర్యాదు చేయనంత కాలంఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం. అలా కాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసన సభ సభాపతి చొరవ తీసుకోవాలి.

తాత్కాలిక-శాశ్వతఆర్థిక-లేదా-పదవి లాభం కొరకుపార్టీ ఫిరాయింపులుమన దేశంలోని వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. విలువలకు తిలోదకాలిచ్చితనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించినమాతృ సంస్థకే ద్రోహం తలపెట్టడం నేరం. ఆ నేరానికి కనీసం శిక్ష అనర్హత వేటుపాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినాదాని అమలు అంతంత మాత్రమే. రాజీవ్ గాంధి హయాంలోచట్టం తేవడానికి ప్రధాన కారణంఅంతకు ముందుదేశ వ్యాప్తంగాఆయారాం-గయారాంల హవాలో అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం కావడమే. అయితేచట్టం తేవడం జరిగినప్పటికీ,ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. చట్టం అమలు బాధ్యత సభాపతిది మాత్రమే కావడంతో రాజకీయాలకు అతీతంగాసత్ సాంప్రదాయాలు నెలకొనక పోవడమే దీనికి కారణం. పార్టీ ఫిరాయింపులు యధేఛ్చగా కొనసాగుతూనే వున్నాయి. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే వున్నాయి. కోట్ల ధనం చేతులు మారుతూనే వుంది. ప్రజాస్వామ్యం విలువను అపహాస్యం పాలు చేయడానికి ఫిరాయింపు దారులు చట్టం లోని లొసుగులను ఇంకా వాడుకుంటూనే వున్నారు. రాష్ట్ర మాజీ గవర్నర్పాలనానుభవం దిట్టఇందిరా గాంధికి సన్నిహితుడుపీసీ అలెగ్జాండర్ఫిరాయింపుల చట్టం లోప భూయిష్టమైందని విమర్శించారు. పదవ షెడ్యూల్ లోని ఫిరాయింపుల చట్టాన్ని తిరగ రాసిఏ స్థాయి ప్రజా ప్రతినిధైనాతాను ఎన్నికైన పార్టీని వీడినట్లైతేప్రజల విశ్వాసం కోల్పోయినట్లుగా భావించితక్షణం సభ్యత్వానికి అనర్హుడైనట్లుగా ప్రకటించే విధంగా వుండాలని సూచించారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోనుదానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోనుఎన్నికల సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుంటే మంచిదే మో! ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలోపార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇవ్వడం సమంజసం. ఒక పార్టీఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించిఅమలుకు నోచుకోని అంశాల విషయంలోఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పార్టీలను వీడేవారికి ఇబ్బందులు తప్పవు. అదే విధంగాపదవ షెడ్యూల్ అమలు విషయంలోను,కనీసంసభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనాఎన్నికల సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొన కుండా,రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు. End


Friday, May 18, 2012

జగన్ ఆస్తులకు ఏం జరుగబోతోంది?: వనం జ్వాలా నరసింహారావు


జగన్ ఆస్తులకు ఏం జరుగబోతోంది?
సూర్య దినపత్రిక (19-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
అక్రమ మార్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కూడగట్టుకున్నారంటూ, హైకోర్టు ఆదేశాల మీదకు దర్యాప్తు చేపట్టి కొనసాగిస్తున్న సిబిఐ ఒకటి వెంట మరొక చార్జ్ షీట్ వేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. మొదటి చార్జ్ షీట్ కు సంబంధించిన కేసు వ్యవహారంలో ఒక అడుగు ముందుకు వేసి, కోర్టు ద్వారా నిందితులకు సమన్లు జారీ కూడా చేయించింది. సమన్లు అందుకున్న వారిలో సాక్షాత్తు మొదటి ముద్దాయిగా నమోదైన జగన్మోహన్ రెడ్డి కూడా వున్నారు. గత తొమ్మిది నెలలుగా కాశీ-రామేశ్వరం మజిలీ కథలలాగా అంచలంచలుగా మలుపులు తిరుగుతున్న సిబిఐ దర్యాప్తులో కీలకమైన అంశం జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, సాక్షి ఛానళ్లను నడుపుతున్న ఆర్థిక సంస్థల అకౌంట్‌లను స్థంబింప చేయడం. సుమారు వారం రోజుల క్రితం సిబిఐ తీసుకున్న ఈ నిర్ణయానికి అనేకులు మద్దతు తెలిపితే, కొందరు మాత్రం ఇదేదో పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించుకుని పోయే చర్య అని పబ్లిక్ గానే వాపోయారు. ధర్నాలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. ఐనా అంతగా స్పందన రాలేదు. సిబిఐ మరో అడుగు ముందుకు వేసింది. సంబంధిత జగన్ ఆస్తుల జప్తుకు అనుమతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాసింది. ఇదిలా వుండగా, సిబిఐ కోర్టులో అకౌంట్ల స్థంభనకు వ్యతిరేకంగా జగన్ దాఖలు చేసిన పిటీషన్‌కు చుక్కెదురవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
సాక్షి గ్రూపు సంస్థల బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. బ్యాంక్ ఖాతాలు (కరెంట్ అకౌంట్స్) స్తంభింప చేయడంవల్ల సంస్థ రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని, సంస్థల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి నెలసరి వేతనాల కోసం రూ.8కోట్లు, న్యూస్ ప్రింట్ కోసం రూ.20 కోట్లు, పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) కోసం రూ.7కోట్లు కలిపి మొత్తం నెలకు రూ. 35కోట్లు వ్యయం అవుతోందని, ప్రకటనలు, పత్రిక అమ్మకాల ద్వారా ఆమేరకు ఆదాయం కూడా ఉందని సాక్షి మీడియా సంస్థల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైకోర్టులో విచారణలో భాగంగా, సాక్షి పత్రిక, సాక్షి టీవీల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో చెప్పాలని, ఇతర ఆదాయ, వ్యయాల వివరాలను తమ ముందు ఉంచాలని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది. సీబీఐ తమ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. సాక్షి పత్రికలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని  కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కింది కోర్టు విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే తమ పిటిషన్లను తోసిపుచ్చిందని సాక్షి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఐతే, సాక్షిలో 20 వేల మంది ఉద్యోగులు లేరని, కేవలం 4,457 మంది మాత్రమే ఉన్నారని, ఇందుకు సంబంధించిన వివరాలను కార్మిక శాఖ నుంచి తీసుకున్నామని సిబిఐ న్యాయవాది పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్లు స్తంభింప చేయడం వల్ల సంస్థలకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీలేదు. నెల మధ్యలోనే ఉంది. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులకు ఇంకా చాలా రోజుల సమయం ఉంది. బ్యాంక్ అకౌంట్లు ఎందుకు స్తంభింప చేయాల్సి వచ్చిందో వివరిస్తూ కౌంటర్ వేస్తాం. అందుకు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశిస్తూ, తదుపరి విచారణను నెల 22కి వాయిదా వేశారు.
ఇదిలా వుండగా, సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్లకు ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో కొంత ఎదురుదెబ్బ తగిలింది. ప్రకటనలు ఆపేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. మేరకు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటనల నిలుపుదల మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఒకవైపు హైకోర్టులో ఖాతాల స్తంభన వ్యవహారం నడుస్త్రుండగానే, ఖాతాల స్తంభనతో ఈ పాటికే అదరగొట్టిన సిబిఐ మరో అడుగు వేసింది. జగన్ మీడియా ఆస్తులను జప్తు చేసే దిశగా పావులు కదిపింది. ఆ విధంగా ప్రభుత్వాన్ని సిబిఐ కోరడం, దానికి దాదాపుగా అనుమతి లభించడం చకచకా జరిగిపోయింది. తరువాయి భాగం, న్యాయస్థానాల అనుమతి లభించడమే. ఇలా గత రెండు-మూడు రోజులుగా కాశీ మజిలీ కథలో మరికొన్ని కీలక  పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ అక్రమాస్తుల, ఎమ్మార్ కుంభకోణంపై తాము జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ లేఖ పంపింది. కేసులతో సంబంధమున్న ఆస్తుల జాబితాను కూడా లేఖతో పాటు జత చేసింది. లేఖ తన దృష్టికి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి స్పందించారని, నిశితంగా పరిశీలించారని, చట్టపరమైన చర్యలకు అనుమతించారని మీడియా కధనాలొచ్చాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు హో మంత్రి కూడా సంబంధిత ఫైలును పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేసారని కూడా వార్తలొచ్చాయి. హోంమంత్రి, సీఎం సంతకాలు పూర్తి కావడంతో, అధికారిక కసరత్తు పూర్తయిందని, న్యాయశాఖ నుంచి కొన్ని వివరణలు తీసుకున్నారని, సిబిఐ కోరిన విధంగానే, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రా కంపెనీల ఆస్తుల అటాచ్‌ మెంట్‌కు అనుమతి లభించిందని పత్రికలు రాశాయి.  
అసలేం జరుగుతుంది? ఇదింతటితో ఆగుతుందా? ఇంకా ముందుకు సాగుతుందా? ఇంతటితో ఆగితే ఇంత గొడవెందుకు? ఖాతాల స్తంభన నాటినుంచి నేటిదాకా తీసుకుంటే, కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్‍లో జగన్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించబోతోందో దాఖలాలతో సహా కనిపిస్తోంది. ఖాతాల స్తంభనతో సిబిఐ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్పష్టమైన సంకేతం, ఇక జగన్‌ను ఏ మాత్రం సహించేది లేదని. పార్టీని, చివరకు సోనియాను దూషించినా మౌనం వహించిన అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదంటే దానికి కారణాలు అనేకం వుండవచ్చు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అతి ప్రధానమైన ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ పేరిట ఒక అసంతృప్తి జ్వాల ఆకాశమంత ఎత్తుకు ఎదిగి, చివరకు, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, యావత్ కాంగ్రెస్ పార్టీనే కబళించి వేసే స్థాయికి ఎదుగుతుంటే చూసి సహించే స్థితిలో అధిష్టానం లేదని నిరూపించాలనుకుందేమో చక చకా ఒకటి వెంట మరొకటి జరిగిపోసాగాయి. మొదట్లో ఒక చిన్న సమిధ అనుకున్న జగన్, పక్కలో బల్లెం అయిపోయాడు. ఇక లాభం లేదనుకున్న అధిష్టానం, ముఖ్యమంత్రిని, బొత్స సత్యనారాయణను, చిరంజీవిని ఉమ్మడిగా-కలిసి కట్టుగా రంగంలోకి దింపింది రాజకీయ పరంగా. ఒకవైపు వారి ముప్పేట రాజకీయ దాడి సాగుతుండగానే, మరొక వైపు ఆర్థిక మూలాలపై సిబిఐ దాడిని పురికొల్పింది అనుకోవాలి. ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏజన్సీ అని సర్ది చెప్పుకున్నా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగేదే కదా సిబిఐ!
జగన్‌కు ఎన్ని ఆస్తులున్నా తరగని ఆస్తి-ఆయన తండ్రి ఆలోచించి ఈయన చేతికిచ్చిన అపురూపమైన ఆస్తి "సాక్షి" పత్రిక, "సాక్షి" చానల్. జగన్ ఎప్పుడు, ఎక్కడ, ఏం చేసినా, ఏం చేయదల్చుకున్నా, అతనికి అనుకూలంగా ప్రచారం చేసే ఏకైక సాధనం ఆ రెండూను. జగన్ మీద ఎక్కడ ఈగ వాలినా, ఆ ఈగ వివరాలను తుచ తప్పకుండా అఖిలాంధ్ర ప్రేక్షకులకు, శ్రోతలకు, పాఠకులకు తెలియచెప్పే పదునైన ఆయుధం అది. ఆ రెండింటినీ ఎంతో ఆలోచించి మరీ జగన్‌కు సమకూర్చాడు రాజశేఖరరెడ్డి. జగన్ మిగిలిన ఆస్తుల వ్యవహారంలో, ప్రభుత్వం ఏ విధమైన జోక్యం చేసుకున్నా గొంతు చించుకుని అరిచే ఈ ఆయుధాలను నిరుపయోగం చేయకపోతే, ప్రయోజనం లేదనుకుంది కేంద్ర ప్రభుత్వం-దాని కనుసన్నలలో నడిచే సిబిఐ. అది తప్పా-ఒప్పా అంటే యుద్ధం మొదలైతే, ధర్మం-అధర్మం అనేవి రెండూ సమానమే అన్న నానుడి ఇక్కడ వర్తింప చేసుకోవాలి. అందుకే, గురిచూసి మరీ దెబ్బ కొట్టింది సిబిఐ. మూడింటి లో చార్జ్ షీట్లు, ఒక చార్జి షీట్లో సమన్లు, మరో వ్యవహారంలో ఖాతాల స్తంభన, ఈ లోపుగా మరో చార్జ్ షీట్. వెంట-వెంట మరికొన్ని చార్జ్ షీట్లు. ఇదే వ్యూహం. ముప్పేట దాడి. ఊపిరి సల్పుకోకుండా దాడి. దెబ్బమీద దెబ్బ. కోలుకునే లోపుగా మరో దెబ్బ. దెబ్బ తెలియకుండా మరో దెబ్బ. దిమ్మ తిరిగి పడిపోయీ-పడిపోకుండా దెబ్బ. ఇదీ పరిస్థితి.
ఖాతాల స్తంభనతో, తన వెంట జర్నలిస్టు సంఘాలను చేర్చుకుంది జగన్ మీడియా. పత్రికా స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందని వారితో ప్రచారం చేయించింది. పాత్రికేయులు రోడ్డున పడ్డారని వారితో గగ్గోలు పెట్టించింది. వాస్తవానికి పత్రికా స్వాతంత్ర్యానికి ఖాతాల స్తంభనకు సంబంధమే లేదు. జగన్ అక్రమంగా ఆస్తులను సమకూర్చుకున్నారని, అలా సమకూర్చుకున్న ఆస్తులతో పత్రికను, ఛానల్‌ను పెట్టారన్న ఆరోపణతో ఖాతాల స్తంభన జరిగింది. పత్రికలో ఫలానాది రాయాలనో-రాయొద్దనో ఆంక్షలు విధించితే అది పత్రికా స్వాతంత్ర్యానికి భంగం వాటిల్లినట్లవుతుంది కాని ఖాతాల స్తంభన ఎలా అవుతుంది? సమాధానం ఇవ్వకపోగా ఎదురుదాడికి దిగారు మద్దతు దార్లు. దెబ్బకు ఎదురుదెబ్బ అంటారు. అలాగే జరిగింది ఇప్పుడు. ఖాతాల స్తంభనతో ఆగకుండా, ఎదురుతిరిగిన నేరానికి, ఆస్తుల జప్తుదాకా వెళ్లింది వ్యవహారం ఇప్పుడు. అంతటితో ఆగకుండా, పెట్టుబడులు పెట్టిన వారి గుట్టు రట్టు చేయడం కూడా వేగంగా జరగ సాగింది. ఎనిమిదివందల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‍ను, ఆయనకు సహకరించిన బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసింది సిబిఐ. ఒక బడా పారిశ్రామిక వేత్తను అరెస్టు చేయడమంటే, దాని వెనుక ఎంతో పకడ్బందీ వ్యూహం వుండి తీరాలి. తీగ కదిలితే డొంక కదిలినట్లుగా, ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్‍తోనే ఆగకుందా, జగన్ కంపెనీలలో పెట్టుబడులు (అక్రమంగా) పెట్టిన ఇతరుల బండారం కూడా సిబిఐ బయటపెట్టే పనిలో పడింది. ఇక ముందుంది ముసళ్ల పండుగ!
ఇదంతా ఒక రాజకీయ-ఆర్థిక వ్యూహం. తనను దెబ్బ తీయాలనుకునే వారిని ఎదురు దెబ్బ తీయకుండా ఎవరూ వుండరు. అదే జరుగుతుందిప్పుడు. కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్మోహన్ రెడ్డి, తన మానాన తానున్నట్లయితే, అది వేరే సంగతి. అనవసరంగా పుట్టలో వేలు పెట్టాడు. "నా బంగారు పుట్టలో వేలు పెట్టితే నేను కుట్టనా" అంటోంది సోనియాగాంధీ! కుట్టించుకుంటాడా? కుడతాడా జగన్?End 


Thursday, September 1, 2011

వైఎస్‌ ఫోటో పుస్తకం - కథ కమామీషు ఎందుకీ అనాయాస ప్రయాస ?: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (2-09-2011)

మనది వారసత్వ రాజకీయ భారతం, పార్టీ ఏర్పాటుకు అందరూ మీన మేషాలు లెక్కించిన వారే, నిముషాల్లో ఏర్పాటైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అడ్డుకునేందుకే వైఎస్సార్‌ పుస్తకావిష్కరణ, జగన్‌కు చెక్‌ పెట్టే వ్యూహమేనా?-ఎడిటర్ సూర్య

రాజకీయాలతో పోటీపడగల (సరదా) క్రీడ బహుశా మరేదీలేదేమో! రాణించడం సంగతి పక్కన పెడితే, నేర్చుకోవడం కూడా అంతగా కష్టం కాని ఆట కూడా అదేనేమో! సాధారణంగా ఏ ఆట నేర్చుకోవాలన్నా, చిన్నతనంలోనే మొదలెట్టి తీరాలంటారు. మనిషి పెరిగి పెద్దయినాకొద్ది, నేర్చుకోవడానికి పిన్న వయసులో వుండే చురుకుదనం, తగ్గిపోతుందనేది నిపుణుల అభిప్రాయం. కొందరి విషయంలో-నేర్చుకోవడానికి అన్ని హంగులూ ఏర్పాటు చేసుకునే పుట్టు బంగారు బాతు కూనలకు, అంతో-ఇంతో జన్యుపరమైన నైపుణ్యం వున్న వారికి-మాత్రం, మరీ చిన్నతనంలో కాకపోయినా, ఏ వయసులోనైనా, అనుకున్నదే తడవుగా-కోరుకున్న ఆటలో ప్రావీణ్యం పొందడానికి అవసరమైన శిక్షణను పొందవచ్చు. అలా పొందినవారు మిగతా వారికంటే ఎక్కువగా రాణించవచ్చు కూడా. రాణించి, ఇతరుల అవకాశాలకు గండికొట్టవచ్చు. జాతీయ-అంతర్జాతీయ క్రీడల్లో వారి స్థానం పదిలం చేసుకోనూవచ్చు. మిగతా ఆటలకన్నా రాజకీయం ఆటలో మాత్రం ఇది నూటికి నూరుపాళ్లు నిజం. వారసత్వ రాజకీయాలకు నిలయమైన భారతావనిలో, అందునా ఆంధ్రా వనిలో, అది నూటికి వేయిపాళ్లు నిజం.

అశేష ప్రజాదరణ, లక్షలాది మంది అభిమానుల అండదండలున్న ఎన్ టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలలో దిగడానికి చాలాకాలం ఆలోచించాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ స్థాపించడానికి బహుశా ఎంతో తర్జన-భర్జన జరిగే వుంటుంది. సరే పెట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఆ మహానుభావుడికి సైతం గెలుపు-ఓటములు తప్పలేదు. ఆయనంత కాకపోయినా, దాదాపు అంతే మోతాదులో అభిమానుల బలం అపారంగా వున్న, చిరంజీవి కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి ఎంత వూగిసలాడిందీ అందరికీ తెలిసిందే. ఓటమి (స్వయంగా ఆయనే ఒక నియోజక వర్గంలో, ఆయన పార్టీ రాష్ట్రంలో) రుచితో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో విలీనం వరకు సాగిందిప్పటివరకు. ఇరవై సంవత్సరాల పాటు ఉన్నత పదవులను చేపట్టి, ఒక ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేసి మంచి పేరు గడించి, పదవీ విరమణ చేసి, ప్రభుత్వేతర సంస్థ గొడుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజోపయోగమైన అనేక కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ జయప్రకాశ్ నారాయణకు రాజకీయ పార్టీ పెట్టడానికి కనీసం నాలుగు సంవత్సరాల పాటు ఆలోచన చేయాల్సి వచ్చింది. గతంలో కాంగ్రెస్ నుంచి వేరుపడిన కొందరు నాయకులైనా, ఇతర పార్టీల నుంచి బయట కొచ్చిన మరికొందరైనా, వేరు కుంపటి పెట్టుకోవడానికి, మీన-మేషాలు లెక్కించే వారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ సంగతై తే, మిగిలిన రాష్ట్రాలలోనూ అంతే. అతిరథ-మహారథులనుకునే కురువృద్ధ రాజకీయ నాయకులు సహితం ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి చాలా సమయం తీసుకునే వారు. అలాంటిది, ఆంధ్ర ప్రదేశ్ లో, తనను కాదన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా, అర నిమిషమైనా ఆలోచించకుండా, దానికి ధీటుగా "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" ని స్థాపించి, అతి కొద్ది సమయంలోనే, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు అఖండ మెజారిటీతో ఎన్నికై, అదే పార్టీ నుంచి అంతే భారీ మెజారిటీతో తన తల్లిని శాసనసభకు కూడా ఎన్నిక చేయించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, కాంగ్రెస్ అధిష్టానానికి భయం లేకుండా వుంటుందా? భయాన్ని కప్పి పుచ్చుకుని, ఆయనను దెబ్బతీయడానికి, ఆ పార్టీ తన సర్వ శక్తులను ఫణంగా పెట్టకుండా వుంటుందా? అలా చేయడానికి, ధీటైన నాయకులను వెతుక్కోకుండా వుంటుందా? ఆ కోణంలో జరిగిన ఆలోచన పర్యవసానమే మొన్న ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ సంరంభం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి, ఎప్పుడైతే సొంత కుంపటి పెట్టారో, ఆ మరుక్షణమే, వైఎస్ బతికున్నప్పుడు ఆయన దూరంగా పెట్టిన-ఆయనకు దూరంగా వున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయక మహాశయులు కొందరు, జగన్ బలం లేనివాడుగా చిత్రీకరించేందుకు "అధిష్టానం వందిమాగధుల" పంచన చేరారు. వారి ద్వారా సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని కూడా ముందుకు తోసారు. రాజకీయ క్రీడ ప్రారంభమైంది. "అధిష్టానం ఆదేశిస్తే" జగన్మోహన్ రెడ్డిని "ఢీ" కొంటానని డీఎల్ రవీంద్రారెడ్డి ముందుకొచ్చారు. అఖండ విజయం తనదేనని-జగన్ కు డిపాజిట్ కూడా రాదని తొలుత మాట్లాడిన డీఎల్, ఆ తర్వాత తన మెజారిటీని తానే తగ్గించుకుంటూ, చివరకు తన డిపాజిట్ కోల్పాయారు. పాపం వివేకాకు అదే గతి పట్టించారు. నైతిక విలువలంటూ మంత్రి పదవికి రాజీనామా చేసిన వివేకా రెంటికి చెడ్డ... సామెతకు గురయ్యారు. అధిష్టానానికి ఎవరేంటో తెలిసొచ్చింది. ఎవరి బలం ఎంతో అవగాహన కొచ్చింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరో నిర్ణయానికొచ్చింది. పావులు కదపడం మొదలెట్టింది. కలిసొచ్చే రోజున...నడిచొచ్చే...అన్న చందాన, శంకర్ రావు కోర్టులో వేసిన కేసుతో సిబిఐ రంగంలోకి దిగడంతో, కాంగ్రెస్ పార్టీకి కొంత వెసులుబాటు వచ్చింది. దెబ్బమీద దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధమైంది. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతరం, క్రియాశీలక రాజకీయాలకు కొంత "బ్రేక్" ఇచ్చిన ఆయన సన్నిహితుడు-హితుడు కేవీపీ రామచంద్రరావు అధిష్టానం వేసిన "అంజనం" లో పెద్దలకు కనిపించారు. ఆయన కూడా అవకాశం కొరకు ఎదురు చూస్తుండడంతో, కార్యాచరణ ప్రణాళిక అమలు మొదలైంది. తొలి అంకం "పుస్తకావిష్కరణ" తో ప్రారంభమైంది. ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి జగన్ చేసిన తప్పిదాలను చట్టపరంగా వాడుకుంటున్న కాంగ్రెస్ ఆయన "రాజకీయ క్రీడ" కట్టడికి మరో దిక్కునుంచి ఈ విధంగా అడుగులు వేయ సాగింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై రూపొందించిన "వైఎస్ ఆర్-మాన్ ఆఫ్ పీపుల్" అనే ఛాయాచిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా మారడానికి ప్రధాన కారణం, వైఎస్ రాజకీయ వారసత్వం ఎట్టి పరిస్థితుల్లోను జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పడానికే! జగన్ కేవలం రాజశేఖర రెడ్డి "ఆస్తులకు" మాత్రమే వారసుడని ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్న వైఎస్ వ్యతిరేక కాంగ్రెస్ నాయకులు, ఆ వారసత్వం ఆయనకు ఆపాదించడానికి వెనుకనున్న కారణం, అదే ఆరోపణపై జగన్ ను ఇబ్బందుల పాలు చేయడమే. వ్యతిరేకుల వైఖరికి భిన్నంగా వైఎస్ అనుయాయులమని చెపుకుంటున్న వారి వ్యూహం మరో విధంగా వుంది. వైఎస్ రాజకీయ వారసత్వం తనదేనని ఆయన కుమారుడుగా జగన్ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ అభిమానులను- సన్నిహితులను, ఏదో ఒక కారణాన ఒకే వేదికపై తెచ్చి, సంఘటితం చేయడంతో పాటు, మరుగున పడిపోతున్న తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఆయనకు తెలియకుండానే, ఆయనతో ఈ కార్యక్రమం, ఆయనొక్కడే ఒంటి చేత్తో చేస్తున్నానన్న భావన కలిగించింది అధిష్టానం. ఫలితంగా భారీ స్థాయిలో పుస్తకావిష్కరణ తంతు నడిచింది. స్వయంగా కేవీపి పలువురిని ఆహ్వానించారు. సోనియాగాంధి కార్యక్రమంలో పాల్గొంటుందన్న ప్రచారమూ జరిగింది. వైఎస్ మరో దగ్గరి స్నేహితుడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా, సోనియా సభకు రాలేకపోయిన విషయాన్ని బహిర్గతం చేశారు. యావత్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యోధానయోధులు, కేంద్ర మంత్రి మండలిలోని ఉద్దండులు, రాష్టంలోని వైఎస్ అభిమాన భజన మండలి, వారు-వీరు అనే తేడా లేకుండా, సభలో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ రాజకీయ వారసులం తామే అంటూ ఉపన్యాసాలిచ్చారు. అవును మరి! వైఎస్ వల్ల అంతో-ఇంతో లబ్ది పొందిన వీరంతా ఆయన వారసులమని చెప్పుకోకుండా వుండే ధైర్యం వుందా? సోనియా గాంధీ ఢిల్లీలో వుండి వున్నట్లయితే ఆమె ఆ సభకు హాజరై వుండేదా? అనుమానమే! సోనియా కోరుకుంటున్నది తన సారధ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పార్టీలోని అందరినీ కూడగట్టుకుని జగన్ కు చెక్ పెట్టాలని తప్ప, వైఎస్ వారసులుగా మాత్రం కానే కాదు. ఒకవేళ ఆమె వైఎస్ వారసత్వంతో పటిష్టమయ్యే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలనుకుంటే, ఏనాడో ఒకనాడు జగన్మోహన్ రెడ్డినే ఆహ్వానింస్తుందికాని పరోక్షంగా ఇలా మాత్రం చేయదు. జగన్ ను, ఆయన ఎవరి వారసుడుగా చెప్పుకుంటున్నడో ఆ రాజశేఖర రెడ్డిని ఓడించడమే సోనియా లక్ష్యం అయ్యుండాలి.

అనుకున్నట్లే-ఆహ్వానించింది ఎవరైనా-పరోక్షంగా అధిష్టానం ఆశీస్సులున్నా లేకపోయినా-పిలుపు అందుకున్న వారు, అందుకోనివారు-వై ఎస్ రాజశేఖర రెడ్డి మీద నిజమైన ప్రేమ వున్న వారు, లేనివారు, అందరూ పుస్తకావిష్కరణ సభకు వచ్చారు. ఒకరిని మించి (మనసులో వుద్దేశం ఏదైనప్పటికీ) మరొకరు వై ఎస్ ఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా రాజశేఖర రెడ్డి విజయాల వెనుక కెవిపి రామచంద్ర రావు వున్నారన్న భావన కూడా వచ్చే ట్లు మాట్లాడారు వారంతా. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి-కేవీపీ రామచంద్ర రావులేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నొక్కి వక్కాణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, ప్రవాస వ్యవహారాల మంత్రి వాయలార్ రవి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కోశాధికారి, సీనియర్ నేత మోతీలాల్ వోరా తదితరులంతా వైఎస్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ వాది అని, సోనియాకు అత్యంత విధేయుడని కూడా పొగిడారు.

ఇంతకూ కెవిపి రామచంద్రరావు మనసులో ఏముంది? పుస్తకావిష్కరణ ఆలోచన ఆయనదేనా? రెండేళ్లు పనికిరాని ఆయన హఠాత్తుగా అధిష్టానానికి ఇప్పుదెందుకు అవసర మయ్యాడు? కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ "విభజించి పాలించు" అన్నదే వ్యూహం. జగన్ నుంచి వివేకాను విడదీసి లబ్ది పొందుదాం అనుకుంటే, అది బెడిసి కొట్టింది. రోశయ్యకు మొదలు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇస్తే ఆశించిన ఫలితాలు రావడం లేదు. శంకరరావు లాంటి వారి పాత్ర పరిమితమైనదే. రాజశేఖర రెడ్డి వ్యవహార శైలి పరిపూర్ణంగా తెలిసిన ఏకైక వ్యక్తి కెవిపి రామచంద్ర రావు మాత్రమే. జగన్ ఎలాగూ ఎదురు తిరిగాడు. ఆయనను సరాసరి యుద్ధంలో ఓడించడం అంత తేలికైన విషయం కాదనే ది అధిష్టానం పసికట్టింది. ఏ ఎత్తులు-జిత్తులతోనైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కెవిపి తెలివితేటలు తోడ్పడ్డాయో, వాటితోనే ఆయన కుమారుడికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే, ఈ పుస్తకావిష్కరణ తతంగం సాగింది. ఎలాగూ కేవిపికి "చంద్రగుప్తుడు"లాంటి పదవిపై కోరిక-కాంక్ష లేదు. ఆయన కోరుకునే "చాణక్యుడి పాత్ర" ఎందుకు ఆయనకే ఇవ్వకూడదనేది అధిష్టానం ఆలోచన. చాణక్య నీతిలో విజయం సాధిస్తే జగన్ ను కట్టడి చేయగలమనే ఆశతోనే ఇదంతా. ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు!

Wednesday, June 15, 2011

బొత్స రాజశేఖరీయం:వనం జ్వాలా నరసింహారావు

బొత్స రాజశేఖరీయం

సూర్య దిన పత్రిక (16-06-2011)

(సమన్వయ) కర్తవ్యం దిశగా వడి వడి అడుగులు

వనం జ్వాలా నరసింహారావు

అధిష్ఠానానికి మింగుడు పడని సమస్యలు! ... పట్టు బిగించడం కోసమే పదవుల పంపకం... బొత్స స్వామి కార్యం, స్వ కార్యం నిర్వహించగలరా? ... సీఎంకు హెచ్చరికలు, చురకలు!... ఇకనైనా బడుగులకు పాలనా పగ్గాలు లభించేనా!

బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం కావడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత, ఆ పార్టీలో తలెత్తిన విభేదాలు-వైషమ్యాలు-ధిక్కార స్వరాలు-నాయకత్వ లోపాలు-బహిరంగ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, అధిష్టానానికి తల బొప్పి కట్టించాయి. గత్యంతరం లేని పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి అధిష్టానానికి ఎదురు తిరిగారు. రోశయ్యను దింపి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్య మంత్రి పీఠంలో కూచోబెట్టడంతో, దింపుడు కళ్లెం ఆశ సహితం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి, పార్టీకి-పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, తల్లి విజయమ్మతో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయించి, వైఎస్సార్ కాంగ్రెస్ ను స్థాపించి, తండ్రి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించి ఎమ్మెల్యేలైన కొందరిని తన శిబిరానికి తెచ్చుకోవడం మొదలెట్టారు. కడప-పులివెందుల ఎన్నికలలో అఖండ విజయం, ఎమ్మెల్యేలు ఒకరి వెంట మరొకరు జగన్ శిబిరంలో కొంత రహస్యంగా-కొంత బహిరంగంగా చేరడం, కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడని సమస్యై పోయింది. ఈ లోపు దిగ్విజయ్ స్థానంలో పాత కాపు గులాం నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి, తనదైన శైలిలో కాయ కల్ప చికిత్స మొదలెట్టాడు. ఆ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని పాలనాపరంగా-పార్టీ పరంగా బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసింది అధిష్టానం. నాలుగు నెలల పైగా పెండింగులో పెట్టిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్య మంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవులను భర్తీ చేయడం జరిగింది.

తన జీవితాశయం రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం అని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్న బొత్స సత్యనారాయణ, గతంలో ఏ పిసిసి అధ్యక్షుడు చేయడానికి సాహసించని విధంగా, సమాంతరంగా "మంత్రి వర్గ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు" నిర్వహించడం ఆరంభించారు. ప్రభుత్వ పథకాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలుగా ప్రచారం చేయడంలోనే పార్టీకి లాభముంటుందని ఆయన గ్రహించడం వెనుక ఒక వైపు రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం, మరో వైపు పార్టీ అధ్యక్షుడుగా తాను బలపడడం, ఆయన జీవితాశయం నెరవేర్చుకోవడం కారణమై వుండాలి. సహచర మంత్రుల వద్దకు కూడా వెళ్ళి, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు. గ్రేట్ బొత్స గారు అనిపించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి పథకాలకు పునరుజ్జీవనం పోసే దిశగా బొత్స అడుగు వేయడం కూడా గమనించాల్సిన విషయం. ఉదాహరణకు, ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిని కలిసి, రాజీవ్ ఆరోగ్య శ్రీ-104-108 పథకాలకు నిధులు పెంచాలని, పటిష్టంగా అమలు చేయాలని కోరడం, కాంగ్రెస్ పట్ల ప్రజలకు సడలుతున్న నమ్మకాన్ని పునరుద్ధరించడమే కావచ్చు.

భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు, సూర్యుడి చుట్టూ తిరగడానికి మున్నూట అరవై ఐదు రోజులు పడుతుంది. "భూ భ్రమణం", "భూ పరిభ్రమణం" అని భౌగోళిక శాస్త్రవేత్తలు పిలిచే ఈ ప్రక్రియ ఏక కాలంలో జరుగుతుంది. ఇలాంటిదే మన సత్తిబాబు, పిసిసి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు నిర్వహించి నన్ని రోజులు (పోనీ నిర్వహించడానికి అధిష్టానం అవకాశం ఇచ్చి నన్ని రోజులు) చేయాల్సిన పని. రాష్ట్రంలోని బడా-చిన్న నేతలను కలవడానికి, కలిసి వారి మద్దతు కూడగట్టుకోడానికి, కట్టుకుని అధిష్టానం తనకు అప్పగించిన స్వామికార్యం-స్వకార్యం నెరవేర్చడానికి, జిల్లాల-మండలాల స్థాయిలో తిరగడానికి రోజుకున్న ఇరవై నాలుగు గంటలు సరిపోతాయో? లేదో? అలానే, తనను పిసిసి పీఠం మీద కూచోబెట్టిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి-వారి కోరికలు (ఏమన్నా వుండక పోతాయా!) తీర్చడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. భూ భ్రమణం-పరిభ్రమణం లాగా ఇటు రాష్ట్రంలోను, అటు ఢిల్లీ చుట్టూ చేయాలి. ఈ క్రమంలో ఆయన నుంచి అధిష్టానం ఆశించింది జరగకపోతే, అది మరో ప్రహసనంగా మారి పోవచ్చు కూడా.

"రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు-చెవులు కాంగ్రెస్ పార్టీనే సుమా!" అని పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరు క్షణంలోనే, బొత్స సత్యనారాయణ, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటిది చేయడం వెనుక, ఎటువంటి ని గూడార్థం ఇమిడుందని రాజకీయ విశ్లేషకులు శోధిస్తున్నారు. అసలింతకీ, ఆ విషయం ముఖ్య మంత్రికి తట్టిందో-లేదో మరి. పార్టీ పరంగా ప్రభుత్వానికి కళ్లు-చెవులు ఇప్పుడే పుట్టుకొచ్చాయా? లేక భూత-భవిష్యత్-వర్తమాన కాలాలలో ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలో వున్నా, పార్టీనే ప్రభుత్వపు కళ్ళు-చెవులుగా, ఆయా సందర్భాలలో ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారు భావించారా? లేదా? ఇవన్నీ సమాధానం దొరికీ-దొరకని భేతాళ ప్రశ్నలు. ఆయన మనసులోని భావాలే వైనా, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో చెట్టా-పట్టాలేసుకుని, కలిసి-మెలిసి పని చేసుకుంటూ, పార్టీని "మరింత బలోపేతం చేస్తాను" అని బొత్సా స్పష్టం చేయడం మాత్రం, (కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నా-అనుకోక పోయినా, పత్రికల వారందరు అనుకుంటున్నట్లు) ముఖ్య మంత్రికి కొంత రిలీఫ్ గానే భావించాలి! బొత్స మార్కు వ్యాఖ్య మరొక టి కూడా ఆశ్చర్యకరంగానే వుందనాలి. తాను ఎవరికీ చీఫ్ కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్య కర్తలకు, ఢిల్లీలో అధిష్టానానికి సంధాన కర్తగా మాత్రమే వ్యవహరిస్తానని శలవిచ్చారాయన. పనిలో పనిగా, తననింతవాడిని చేసిన "దైవం" సోనియా గాంధీకి, "పూజారి" గులాం నబీ ఆజాద్‌ కు, ఈ ఇరువురి మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి తనకు ఆ పదవి కట్టబెట్టడంలో తోడ్పడిన జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులందరి కీ, పేరు-పేరునా కాకపోయినా, ప్రత్యేకమైన తరహాలో సభా ముఖంగా ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు.

పార్టీ అభివృద్ది కోసం కాంగ్రెస్‌ పెద్దలు చెప్పినవి వింటానని-సూచనలు పాటిస్తానని, సీనియర్లతో అహర్నిశలు చర్చించి-పార్టీకి "పూర్వ వైభవం" తీసుకొస్తానని, ముఖ్యమంత్రితో కలసి "పార్టీని బలోపేతం చేస్తానని" కూడా బొత్స అంటున్నారు. తనకు "ఎలాంటి సొంత ఆలోచనలు లేవు" అని, "పార్టీ అధినేత్రి నిర్ణయమే తనకు శిరోధార్యం" అని, అనడంతో అధినేత్రి దృష్టిలో మరికొన్ని మార్కులు అదనంగా తెచ్చుకున్నారు. టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం చేస్తోన్న పథకాలు జనం లోకి పోవని, పరోక్షంగా ముఖ్య మంత్రికి ఒక "అఫెన్సివ్" చురక అంటించారు. అలా అంటూనే, మళ్లీ "డిఫెన్సివ్" గా, ముఖ్య మంత్రితో తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఇద్దరం కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని స్పష్టం చేశారు. బొత్స "అఫెన్సివ్" చురకలకు, "డిఫెన్సివ్" స్నేహ హస్తానికి అదే మోతాదులో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తనకు మధ్య ఎటువంటి భేదాభి ప్రాయ లేవని, భవిష్యత్తులోనూ ఉండవని (?) ఆయన స్పష్టం చేశారు. వారిరువురు తాము చెప్పిన దానిని ఆచరణలో చూపబోతున్నామని చెప్పడానికి సంకేతంగా, ఇద్దరూ కలసి గద-కత్తిని ఎత్తారు. మరో అడుగు ముందుకు వేసి, క్రికెట్ ఆటగాడైపోయారాయన కొంచెం సేపు. తాను, బొత్స, రాజ నరసింహ, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క (ఎవరు కెప్టెన్, వైస్ కెప్టెన్, ఓపెన్ బౌలర్, ఓపెన్ భాట్స్ మెన్? అనేది చెప్పలేదు) 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కోసం, "సెలెక్టర్" సోనియా గాంధీ ఎంపిక చేసిన ట్వెన్టీ-ట్వెన్టీ క్రికెట్ టీం సభ్యుల లాంటి వారమని అన్నారు. ముఖ్య మంత్రి తన టీంను క్రికెట్ టీంతో పోల్చడాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేశవ రావు తప్పుబట్టారు. 2014 ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాకుండా, "రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు" కూడా కృషి చేస్తామని సీఎం కిరణ్‌ చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా దేశ ప్రధానిగా వున్నారు కదా! ఆయనతో సంప్రదించి ముఖ్య మంత్రి ఆ ప్రకటన చేశారా? లేక, స్వయంగా ఆయన నిర్ణయమా అది? గతంలో రోశయ్యను, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని, వారింకా ముఖ్య మంత్రులుగా వుండగానే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రిని చేయాలని కొందరు కాంగ్రెస్ సభ్యులు (జగన్ ఇంకా కాంగ్రెస్ సభ్యుడుగా వున్నప్పుడు) డిమాండు చేయడంలో తప్పులేదే మో!

బొత్స సత్యనారాయణ, తెలంగాణ సమస్య విషయంలో ఆచి-తూచి మాట్లాడారు. తెలంగాణపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పిన దాంట్లో నిజాయితీ ఒకింత కనిపించినా, అదే వేదికపై, అఖిల తెలంగాణ ప్రజలు అసలు-సిసలు తెలంగాణ వాదిగా భావిస్తున్న కేంద్ర మంత్రి, మేధావి జైపాల్ రెడ్డి మాత్రం, తన మనసులో మాట బయట పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవాళ్లు ప్రాంతీయ వాదులు-ఉప ప్రాంతీయ వాదులు కాదని, ప్రపంచంలోనే కాంగ్రెస్‌ అతిపెద్ద జాతీయ పార్టీ అని (?), భారతీయ జనతాపార్టీ (తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తున్న) కి సైద్దాంతిక-భౌగోళిక శక్తి లేదని, కమ్యూనిస్టు పార్టీలకు భౌగోళిక శక్తి ఉంది కాని సైద్దాంతిక శక్తి లేదని, తన మేధ మధనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు వెల్లడి చేశారు. సరిగ్గా ఆరు నెలల క్రితం, కాంగ్రెస్ అధిష్టానం, రోశయ్య స్థానంలో ముఖ్య మంత్రిగా జైపాల్ రెడ్డి పేరును పరిశీలించిందన్న వార్తల నేపధ్యంలో, ఆయన అన్నట్లుగా ఢిల్లీ పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలకు (అధిష్టానం తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి తేనే తాను ముఖ్య మంత్రి పదవిని ఒప్పుకుంటానని జైపాల్ రెడ్డి అన్నట్లుగా!) నేటి వ్యాఖ్యలకు పొంతనే లేదు. సహజంగానే, జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో దుమారం లేపడం, ప్రత్యేకంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం, మరో మారు పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేదికాదని చెప్పడం, అసలింతవరకు కేంద్ర మంత్రివర్గంలో దీని గురించి చర్చకూడా జరగలేదనడం, చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటన వెనుక తన బాధ్యత ఏమీ లేదనడం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న మరో నాటకంలో ప్రధానాంశాలుగా పరిగణించాలి. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకునేవారి వాదన సమంజసమా? కాదా? అనే విషయం కాసేపు పక్కన పెడితే, జైపాల్ రెడ్డి ది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను జాతీయ వాదం కానే కాదని, నిఖార్సైన అవకాశ వాదమని, ఆయన ఎంత వేగంగా పార్టీలు మార గలరో అంతే వేగంగా మాటలను కూడా మార్చగలరని అనక తప్పదు. బోఫోర్సు కుంభకోణంలో అయన వేసిన రంకెలను కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆశీర్వచనాలుగా మార్చ గలిగిన సత్తా ఆయన కుంది. ప్రత్యేక రాష్ట్రం కోరడం జాతీయ వాదానికి ఎలా వ్యతిరేకమవుతుందో జైపాల్ రెడ్డే చెప్పాలి. భారత దేశం ఒక వైపు "ఏక కేంద్రక ప్రభుత్వమైతే", మరోవైపు "సమాఖ్య తరహా ప్రభుత్వం" కూడా. ఆ విషయం ఆయనకు తెలియదా?

ఈ నాటకీయ పరిణామాల మధ్య, రాబోయే రోజుల్లో ఏం జరుగబోతుంది? కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి? బొత్సను అధ్యక్షుడుగా చేయడం వెనుక రహస్యం ఏంటి? అధిష్టానం ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చగల సామర్థ్యం వుందా? ఒకవేళ వున్నా ఆయనను సజావు గా పనిచేయనిస్తారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఒక వైపు, జగన్ సవాళ్లు మరో వైపు బొత్సకు తలనొప్పిగా మారుతాయా? 2004 ఎన్నికలలో ఓడిపోయి, అంచలంచలుగా, రాజకీయ వ్యూహంలో తన చతురతను ప్రదర్శించుకుంటూ, 2009 ఎన్నికలలో గతంలో కంటే రెట్టింపు స్థానాలను సాధించి, 2014 ఎన్నికలొచ్చేసరికి అధికారం చేజిక్కించుకునే ధీమాతో ముందుకు సాగుతున్న తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఎదుర్కునేందుకు బొత్స సరిపోతా రా? ఇవన్నీ రాజకీయ విశ్లేషకుల ముందున్న ప్రశ్నలు.

పూర్వ వైభవం తెస్తానని బొత్స అంటున్నారు. పూర్వ వైభవం అంటే, 2004 కు ముందున్న వైభవమా? 2009 ముందు వైభవమా? అంత కంటే మరోటా? 1999 ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడుగా చేసిన వ్యూహాత్మకమైన తప్పులను, శాసన సభలో ప్రతి పక్ష నాయకుడుగా 2004 ఎన్నికలలో సరిదిద్దుకుని-తనకిష్టం లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం కుదుర్చుకుని, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల ఆధారంగా ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు రాజశేఖర రెడ్డి. అప్పట్లో పిసిసి అధ్యక్షుడుగా వున్న డి. శ్రీనివాస్ ను కాదని, ఆనవాయితికి విరుద్ధంగా రాజశేఖర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసింది అధిష్టానం. ఆయన చేసిన వాగ్దానాలను నమ్మి గెలిపించిన ఓటర్లు, అవి ఆయన అమలు పరిచి ధీమాగా 2009 ఎన్నికలలో కొత్త వాగ్దానాలేవీ చేయకుండా పోటీ చేసినప్పుడు, అదే ఓటర్లు అత్తెసరు మార్కులతో గెలిపించారు తప్ప అఖండ విజయం చేకూర్చలేదు. దాదాపు కాంగ్రెస్ పార్టీని ఓడించినట్లే ఒక విధంగా! అప్పట్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఇక ఇప్పుడు-భవిష్యత్ లో ఆయన నాయకత్వానికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అయిపోయారు. కడప ఎన్నికలలో అది నిరూపణ ఐంది కూడా. రెడ్డి నాయకులంతా ఆయన వెంట వెళ్దామంటున్నారు. అందుకే, కాంగ్రెస్ వల పన్నింది. ఆ వలలో చిరంజీవి పడ్డారు మొదలు. ఇప్పుడున్న వారిలో బొత్సకున్న నాయకత్వ లక్షణాలను గ్రహించిన అధిష్టానం ఆయనను అందలం ఎక్కించింది. వెనుకబడిన వర్గాల వారితో సహా, అన్ని వర్గాల వారిని, తన వెంట తిప్పుకోగల సమర్థుడాయన అని నమ్మింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు అగ్ర కులాలకు చెందిన నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళ రావు, కొణిజేటి రోశయ్య, భవనం వెంకటరాం, ఎన్ టీ రామా రావు, నాదెండ్ల భాస్కర రావు, చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కాగలిగారు. తన తర్వాత ముఖ్య మంత్రి కాగలిగిన అవకాశాలున్న అల్లూరి సత్యనారాయణ రాజును కాకుండా చేసే వ్యూహంలో భాగంగా దళిత కులానికి చెందిన వ్యక్తి దామోదరం సంజీవయ్యను, ముఖ్య మంత్రి అయ్యేందుకు సంజీవరెడ్డి మద్దతిచ్చారు. అలానే రాజారాం అవకాశాలను దెబ్బ తీశారు. కాకపోతే ఇందిరా గాంధి అండ దండలతో ఒక సారి టంగుటూరి అంజయ్య ముఖ్య మంత్రి కాగలిగారు. కాపులకు ఇంకా అవకాశం రానే రాలేదు. ఇకనైనా కాపు నాయకుడు బొత్సకు ఆ దిశగా భవిష్యత్ వుందేమో వేచి చూడాలి.

బొత్స సమర్థత, కార్య దక్షత నిరూపించుకోవాలంటే, రాష్ట్రంలో అందరినీ కలుపుకు పోయి, ఢిల్లీలో అందరి మన్ననలను పొందాలి. అందుకే రాష్ట్రంలో "భ్రమణం", ఢిల్లీ చుట్టూ "పరి భ్రమణం" తప్పదు. 2014 ఎన్నికలు-లేదా అంతకన్నా ముందే జరిగే అవకాశం వున్న ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీని గెలిపించు తాయా? గెలిపించినా బొత్సకు ముఖ్య మంత్రి పీఠం దక్కుతుందా? దక్కనిస్తారా? ఏమో! ఆల్ ద బెస్ట్!