Monday, January 30, 2017

పిబరే రామరసం! .....వనం జ్వాలా నరసింహారావు

పిబరే రామరసం!
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ (31-01-2017)

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, భద్రాచల దేవాలయ నిర్మాణానికి కారకుడు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడు, ఒకనాటి కంచర్ల గోపన్న నామధేయుడు, భక్త రామదాసుగా ఆబాలగోపాలానికి చిరపరిచితుడైన మహనీయుడి జయంతిని పురస్కరించుకుని, కేవలం జయంతి ఉత్సవాలు మాత్రమే ప్రభుత్వ పరంగా జరిపించి సరిపుచ్చుకోకుండా, ఆయన పేరుమీద అత్యంత వేగంగా నిర్మించిన "భక్తరామదాసు నీటిపారుదల ప్రాజెక్టు" కు పాలేరు దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం...జాతికి అంకితం చేయడం, యావత్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా వాసులకు గర్వకారణం అనాలి.

భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న పుట్టిన నేలకొండపల్లి గ్రామం ఖమ్మం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం కోదాడ రహదారిపై ఉంటుంది. తండ్రి లింగన మంత్రి, తల్లి కామాంబ. ఆత్రేయస గోత్రీకులు.....ఆరువేల నియోగి బ్రాహ్మణులు. బార్య కమల, కుమారుడు రఘురాముడు. నేలకొండపల్లిలోని వేణుగోపాలస్వామి వారి వరప్రసాదంగా పుట్టారని భావించిన తల్లిదండ్రులుగోపన్నగా నామకరణం చేశారు. నేటికి ఆ వూళ్లో వేణుగోపాలస్వామి దేవాలయం వైభవంగా భక్తులను ఆకర్షిస్తూనే వుంది. రామదాసు జన్మతిధి గురించి కొన్ని భిన్నవాదనలు ప్రచారంలో ఉన్నవి. అనేక చారిత్రక పరిశోధకుల అధ్యయనాల ఆధారంగా రామదాసు  1620లో జన్మించి వుండవచ్చని కొందరంటుంటే, మరికొందరు 1633 లో జన్మించారని నమ్ముతారు. ఏదేమైనా ఆయన జన్మ తిథి మాఘశుద్ధ తదియ...జన్మనక్షత్రం పూర్వాభాధ్ర అని నిర్థారణ జరిగింది. ఈ ఏడాది ఇది జనవరి 31 న వచ్చింది. ఇదే విధంగా ఆయన ఆరాధనోత్సవాలు వైశాఖ మాసం మొదట్లో, అంటే, సాధారణంగా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు.

జగమెరిగిన పాత్రికేయులు స్వర్గీయ జీ కృష్ణ రాసిన "ప్రముఖ వాగ్గేయకారులు" పుస్తకంలో భక్త రామదాసు గురించి అనేక విషయాలు తెలుస్తాయి. కంచర్ల గోపన్న కుత్బ్ షాహీల కాలంలో, తాసీల్దారుగా, భద్రాచలం సమీపంలోని పాల్వంచలో పనిచేసేవాడు. రామ భక్తుడైనందున వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. నేలకొండపల్లి సమీపంలో నాయకులగూడెం అనే వూళ్లో రఘునాధ భట్టరు అనే వైష్ణవ స్వామి గోపన్నను వైష్ణవ మతంలో చేర్చాడు. అన్నమయ్య కూడా ఇలానే స్వీకరించాడని అంటారు. వైష్ణవ మతం స్వీకరించిన నాటి నుంచి ఆయన పేరు రామదాసుగా మారింది. ప్రభుత్వంలో కొలువు చేస్తూనే, తరచూ భద్రాచలం వెళ్తుండేవాడు. ఆవేశం కొద్దీ కీర్తనలు తానే రాసి పాడేవాడు. ఆయన తదనంతరం కొందరు పండితుల పుణ్యామా అని ఆయన కీర్తనలు ఏర్చి-కూర్చి కొన్ని సంకలనం చేయడం జరిగింది. రామదాసు గోల్కొండ మంత్రులైన అక్కన్న-మాదన్నలకు మేనల్లుడు. రాముడి మీద వున్న భక్తితో ప్రభుత్వ ధనంతో గుడి కట్టించారనీ, దానికి కోపగించిన అబుల్ హసన్ తానీషా ఆయనను జైలులో పెట్టించారనీ, స్వయంగా శ్రీరాముడే వచ్చి తానీషాకు కనిపించి రామదాసును విడుదల చేయించాడనీ అంటారు. దానికి తగిని ఆధారాలు కూడా వున్నాయి కాబట్టి నమ్మాలి.

భక్త రామదాసుకు సంస్కృతం, తెలుగు...రెండింటిలోనూ పాండిత్యం వుంది. రెండు భాషల్లోనూ కవిత్వం రాశారు. వీటిని శతక ప్రక్రియకు చెందిన "దాశరధి శతకం", నిబంధ పద రచనకు చెందిన "తెలుగు సంస్కృత కీర్తనలు", వృత్త పదానికి చెందిన "పాహిరామ ప్రభో" అనే  దీర్ఘ వృత్తం, అనిబంధ కవిత్వానికి చెందిన ఒక "సంస్కృత చూర్ణిక" శీర్షికలతో నాలుగు భాగాలుగా విభజించవచ్చని దాశరథుల బాలయ్య గారు రాసిన ఎంఫిల్ సిద్ధాంత వ్యాసంలో పేర్కొనడం జరిగింది. బహుళ ప్రచారం పొందిన 103 పద్యాల దాశరధి శతకంలో మకుటం "దాశరధీ కరుణాపయోనిధీ". ఇక "పాహిరామ ప్రభో" వృత్త పదం "పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో...పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో!" అంటూ ప్రారంభమై, "పాహిశ్రీరామ నీ పాద పద్మాశ్రయుడ....పాలింపుమా భద్రశైల రామప్రభో!" అంటూ ముగుస్తుంది. కీర్తనలలో "అదిగో భద్రాద్రీ గౌతమి", అబ్బబ్బ దెబ్బలకు తాళ లేరా", "ఇక్ష్వాకు వంశ తిలక ఇకనైన పలుకవె", "ఏ తీరుగ నను దయ జూచెదవో", "తక్కువేమి మనకు", "నను బ్రోవమని చెప్పవే", "పలుకే బంగారమాయెనా", "రామాచంద్రులు నాపై చలము చేసినారు-సీతమ్మ! చెప్పవమ్మా" లాంటివి అందరూ పాడుకునే అపురూప కీర్తనలు.


ఇదంతా గతం....ఇక వర్తమానానికి వస్తే....భక్త రామదాసును మరువలేని ఆయన పుట్టిన గ్రామస్తులు సుమారు  55 సంవత్సరాల క్రితం (1955-1961) నేలకొండపల్లిలో, రామదాసు నివసించిన స్థలంలో ఆనాటి గ్రామ సర్పంచ్ స్వర్గీయ పెండ్యాల సత్యనారాయణ రావు నేతృత్వం లో భక్తరామదాసు ధ్యాన మందిరం నిర్మించారు. రామదాసు వాడిన బావికుడా నేటికి ఆ స్థలంలోనే వుంది. అయితే, కారణాలు ఏవైనా, ఆ మందిరం చాలా కాలం ఖాళీగా వుండిపోయి, సామాజిక అవసరాలకు ఊపయోగించారు. దరిమిలా, పెండ్యాల సత్యనారాయణ రావు మరికొందరు గ్రామస్తులు కలిసి రామదాసు స్మారక కమిటిని ఏపాటు చేసి, 1974 సంవత్సరం నుంచి  భక్తరామదాసు స్మారక ఉత్సవాలను జరిపించ సాగారు. నాల్గవ వార్షికోత్సవం లో, అంటే 1977 వ సంవత్సరంలో, శ్రీ సీతారామ చంద్ర లక్ష్మణ స్వామి వారి శిలా విగ్రహాలనురామదాసు శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ధూప-దీప నైవేద్యాది కైంకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్ల తరువాత 1986 లో స్వర్గీయ భీకంసింగ్, స్వర్గీయ రావులపాటి రంగారావు, స్వర్గీయ గండికోట శేషభూషణ రావు, స్వర్గీయ గండికోట రాజేశ్వరరావు, పెండ్యాల రాంమోహన్ రావు, మరికొందరు భక్తులు కలిసి "శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం" అనే సంస్థను స్థాపించి, ఆరాదనోత్స్తవాలను, చేయడం ప్రారంభించారు. అదే సంస్థ ఈ నాటికీ మాఘశుద్ధ తదియ రోజున రామదాసు జయంతిని, వైశాఖ మాసం ప్రారంభంలో ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఆద్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

2000 సంవత్సరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో, నాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎ గిరిదర్, పోలీసు సూపరిండెంట్ పి సీతారామాంజనేయులు చొరవతో ద్యాన మందిరం ఆధునీకరించబడి, ప్రఖ్యాత సంగీత విద్యాంసులు స్వర్గీయ బాలమురలీకృష్ణ చేతులమీదుగా పునః ప్రారంబించబడింది. 2007 సంవత్సరంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్తానం దీన్ని దత్తత తీసుకొని నిర్వహిస్తున్నారు. ఒక అర్చకుని నియమించి జీతం, పడితరాన్ని ఇస్తూ నిత్య పూజలు, దూప, దీప, నైవేద్యాది కైంకర్యాలు జరిగేటట్లు చూస్తున్నారు. శ్రీరామనవమి, దసరా, ధనుర్మాస ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ జరగాల్సిన మోతాదులో జరగడం లేదని గ్రామస్తులంటున్నారు. ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయని వారి అభిప్రాయంగా అర్థమవుతోంది.

చేయాల్సిన పనులెన్నో వున్నాయని, నేలకొండపల్లి లోని భక్త రామదాసు ద్యాన మందిరాన్ని ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని, భక్తులను, పర్యాటకులను అక్కడికి వచ్చేట్లుగా చేయాలని, మందిరాన్ని పూర్తి స్థాయి దేవాలయంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లోగడ ఒకసారి రామాలయ నిర్మాణానికి ప్రయత్నం కూడా జరిగింది. ఈ విషయాన్ని కూలంకుషంగా పరిశీలన జరిపి పెద్దలు, పండితులు సలహా మేరకు తగు నిర్ణయం తీసుకోవాలంటున్నారు. సంగీత, సాహిత్య, భక్తి కార్యక్రమాల నిర్వహణకు అనుగుణంగా ఉండే అధునాతన సౌకర్యాలతో కూడిన సమావేశమందిరాన్ని నిర్మించాలనీ, అతిధులు, భక్తులు, కళాకారుల సౌకర్యం కోసం కొన్ని విశ్రాంతి గదులను నిర్మించాలని, ఒక చక్కని పార్కుని అభివృద్ధి చేసి, దీనిలో రామాయణ కథలకు, రామదాసు జీవిత విశేషాలకు సంబందించిన విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ప్రముఖ చిత్రకారులతో రామదాసు జీవిత విశేషాలను, కొన్ని కీర్తనలకు అనుగుణంగా వుండే చిత్రాలను వేయించి ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనీ గ్రామస్తుల అభిప్రాయం. రామదాసు కీర్తనలను, దాశరథి శతక పద్యాలనూ శిలఫలకాలపై చెక్కించి సమావేశ మందిరపు గోడలకు అతికింప చేస్తే బాగుంటుంది కూడా. వివిధ గ్రంథాలయాలలో నిక్షిప్తమై వున్న రామదాసు సాహిత్యాన్ని, గ్రంథాలను వ్యాసాలను సేకరించి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ గ్రంథాలయం పాఠకులకు పరిశోధకులకు ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం చేస్తున్నట్లే, ప్రతి సంవత్సరం మాఘశుద్ద తధియ రోజు నుండి మూడు రోజులు రామదాసు జయంతి ఉత్సవాలు, వైశాఖ మాస ప్రారంభంలో మూడు రోజుల రామదాసు ఆరాధనోత్సవాలు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా నిర్వహించాలి. తద్వారా రామదాసు గారికి తగిన నివాళి అర్పించినట్లు అవుతుంది.

రామదాసు కీర్తనలను భజన మండపంలో పాడేవారిని గుర్తించి వారిని ప్రోత్సహించాలి. సంగీత విద్వాంసులు, సంగీతాభిమానులతో కొన్ని బృందాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాలలో రామదాసు కీర్తనలను ప్రచారం చేయాలి. దేవాలయాల్లో, సాంప్రదాయ ఉత్సవాలలో రామదాసు కీర్తనలని అలపించేట్లుగా చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఏ విధంగానైతే అన్నమయ్యకు విశేష ప్రాధాన్యాన్ని కలిగిస్తున్నారో, ఏ విధంగా నైతే తమిళ ప్రజలు సంగీత విద్యాంసుడు త్యాగరాజుకు బ్రహ్మ రథం పడుతున్నారో, అలాగే తెలంగాణ ప్రజలు రామదాసుకు తగిన గుర్తింపు ఇస్తే గ్రామస్తులు ప్రధానంగా సంతోషిస్తారు. నేలకొండపల్లి లోని శ్రీ భక్త రామదాస ద్యాన మందిరాన్ని, బౌద్ధ స్థూపాన్ని కలిపి ఒక మంచి పర్యాటక స్థలంగా, ఆద్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతే మరీ మంచిది.


ధ్యాన మందిరాన్ని ఒక నెల క్రితం దర్శించి, గ్రామస్తుల ఆలోచనలను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ఈ సంవత్సరం రామదాసు జయంతి ఉత్సవాలను మూడు రోజులపాటు అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, భద్రాచలం దేవస్థానం, శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఖర్చుతో చేయించిన భక్త రామదాసు శిలా విగ్రహ ప్రతిష్ట కూడా జరుగురుంది. రామదాసు నవరత్న కీర్తనల గోష్టి గానం, సంగీత విభావరి, భజనలు, కోలాటాలు, పేరిణి నృత్య రూపకం లాంటి పలు కార్యక్రమాలు జరుగుతాయి. అచిరకాలంలోనే గ్రామస్తులు కోరుకుంటున్న స్థాయిలో రామదాసు ధ్యాన మందిరం రూపుదిద్దుకుంటుందని ఆశించవచ్చు. End 

Thursday, January 26, 2017

WAYS TO CURE AILING PUBLIC HEALTHCARE IN TS : VANAM JWALA NARASIMHA RAO

WAYS TO CURE AILING 
PUBLIC HEALTHCARE IN TS
VANAM JWALA NARASIMHA RAO
THE HANS INDIA (26-01-2017)
Decades after the establishment of Osmania and Gandhi Hospitals in twin cities, for the first time the Telangana State Government issued orders for establishing four new 500 bedded multi-specialty hospitals in the city to cater to the healthcare needs of people from city and surrounding areas. These hospitals will come up one each at Victoria Memorial Hall Home LB Nagar, Rajendranagar, Pet Basheerabad and Miyapur. While this is an important milestone in the healthcare in the state, it is worthwhile to analyse few more aspects towards providing a better healthcare in the state-both in urban and rural areas.
Keeping in view some of the unique conditions in Telangana state it is of utmost significance to revitalize the existing government system of health care by providing adequate medical and health facilities as well as integrating at some point the non-government and private medical and health facilities. In any case, ultimately, on the long run it is only a technology based health care that would be able to address the medical and health needs of people. It is time to plan on those lines from now itself.  
NOT WITHIN REACH OF POOR
In Telangana like in other parts of the country, specialties and super specialties healthcare is available in private sector only or mainly and the entire primary care is done by government. Another problem in India in general and particularly to the middle class people is the huge costs for diagnostic services which are provided mainly by private centres. For instance a PET (Positron Emission Tomography) Scan costs anywhere around Rs. 20, 000 and an MRI (Magnetic resonance imaging) costs around Rs. 10, 000 and many more like that. These need to be provided by Government at affordable costs. It is also desirable that the government establishes its own polyclinics and also takes the help of private clinics enabling the patient to get treatment at affordable costs. It is high time that we study systems elsewhere and adopt them here.
EXPERT OFFERS SOLUTION
Dr AP Ranga Rao with his rich experience as an expert specialist doctor, administrator and consultant to several national and international health projects speaks about a practical model for Telangana state which if considered by government would go a long way in provision of required medical and health facilities both at urban and rural areas.
According to Dr Rao for health care delivery purposes the state can be divided into Four Zones. Hyderabad and RR districts with about 75-80 lakhs to be in zone one, 40+ towns in zone two with 60 lakhs population and 900 villages with 27 lakhs population in zone three which have at present some primary or secondary or tertiary care. These constitute in all about 47% of population. The fourth zone of 8100 villages with 186 lakhs population which accounts for 53% still depends on uncertified care of RMPs or ANMs.
Dr Ranga Rao says that as on today zone one is served by 2400 Specialists and 640 super specialists of various categories belonging to both Government and private sector in addition to the doctors with basic qualification of MBBS. Population in zone two too has access to primary and secondary care to 780 Specialists and 125 super Specialists of their choice. 27 lakhs (7.6% of total population) are living in the villages where a PHC is located (683 in number) who can hope to have round the clock access (If the doctor is posted and is staying in) to primary health care.
For the rest of population (approximately 1.86 crores constituting 53% of total population) living in 8100 villages the access to qualified primary health care is kilometres away. Out of them for 57 lakhs population it is beyond 5-10 kms and for 92 lakhs population it is more than 10 kms. They have to literally depend on the services of ANMs in the sub centres (If they are posted and staying) for a qualified care. In reality this 1.86 crore population is dependent on local uncertified long standing village practitioners of allopathic care or even otherwise.
NEED FOR MOHALLA CLINICS
In Hyderabad out of 80 lakh population nearly 25-30 lakhs live in recognized slums. One Anganwadi worker and one Aasha worker is supposed to serve about 1000-1500 population who probably may be made as a team and the Anganwadi centres or the nearby polling booth could be designated as Mohalla Clinics. Here twice in a week a dispensary or a clinic could be run where on the first day cases of maternity and child welfare, immunization etc could be attended to. On the second day lifelong diseases and chronic diseases could be attended to. The facility here may be limited to screening and collection of blood samples. All metro, rail stations and bus terminals may be used for running these clinics.
ROPE IN HOUSE SURGEONS AND PG STUDENTS TO RUN CLINICS
At the rate of say 1500 persons per clinic for the whole of Hyderabad the requirement would be around 5000. One doctor can serve three clinics to work on average 8-9 days per clinic. A maximum of 1750 doctors are required to cover all the clinics. These doctors can be drawn from out of the in-service house surgeons in addition to few doctors exclusively recruited for this purpose either as on a month or two months attachment. There would be enough of them, graduated from both government and private medical colleges. On an average every year 2500+ are admitted in both Government and private medical colleges and even if two thirds pass out every year the number of house surgeons available for Mohalla clinics would be anywhere near to 1650. Their job is to do a general medical check-up and attend to minor ailments and organize screening. This is in a way the primary health care centre. These clinics may to begin with be concentrated in slums where there is nearly 30 lakhs population.

There are at present 110 urban health centres in Hyderabad and it is adequate if their number is increased to say by another 150 where there would be a qualified doctor to serve as first referral centre. About 30-35 clinics may be attached to each urban health centre. PG medical students of various private and government medical colleges on rotation should take care of urban health centres which are supposed to be for secondary health care. On an average both private and Government hospitals put together there would be around 850+ PG students in Telangana. These are also to be specialist clinics in the areas of medicine, surgery, psychiatry, gynaecology, eye etc. as a first referral health care.
INVOLVE NON-GOVERNMENT SECTOR IN TERTIARY CARE
Both in the primary and secondary stages sample collections will be done and in the tertiary care diagnostic tests will be done. After the primary and secondary stage the third stage is the tertiary care hospital. Each of these numbering around ten in government sector should cover a population of say 5 lakhs which means another five are required. The tertiary level is also the speciality, multi speciality and super speciality hospital. In the third stage there has to be an integrated approach to enlist NGO run hospitals like Andhra Mahila Sabha, Mahavir and Saint Theresa and similar others as well as large number of private nursing homes, RTC, Railways, even Military hospitals.  In a way the Health Card system does the similar function and this may be further explored and extended.
RURAL AREAS
Coming to rural areas falling in zone three and four the present structure is beginning with 4863 Sub-centres, we have 683 Primary Health Centres (PHC), 114 Community Health centres (CHC), 31 Area Hospitals and then the 7 District Hospitals.  After the reorganization of districts it is only one third of the district headquarters we have district level hospitals and in rest of the districts mostly we have Area hospitals.
There are also 18 teaching hospitals out of which 10 are in Hyderabad and 4 in Warangal. In addition we also have 272 Ayurveda, 130 Homeo, 141 Unani and 24 Naturopathy Hospitals in the state. Thought may be given to integrate these. 
An estimated 2595 government doctors are supposed to be working in various capacities which means on an average about 13, 500 individuals per government doctor. The bed strength is 20, 400 and per bed population is 1716. In addition we have 35, 700 Anganwadi centres all over the state. In every district with medical colleges coming up year after year the services of house surgeons and PG students could be effectively utilized at primary care, secondary and tertiary care that is CHC/PHC, Area/district and teaching hospitals wherever they are.
PHCs thus could be effectively equipped with doctors. Here again as also in CHCs sample collections will be done and in the tertiary care that is district hospitals diagnostic tests will have to be done.
For 1.86 crores constituting 53% of total population living in 8100 villages the access to qualified primary health care is possible only either through Tele-Medicine or through FDHS (Fixed Date Health Services) scheme. FDHS Mobile Health Units that are designed to render two four-hours service each day in two habitations of 1500 population each covering 39 million people living beyond 3 kilometres of any health facility are to be strengthened. This service would regularly provide primary screening of pregnant women, growing children and patients with chronic diseases through appropriate laboratory investigations and providing medicines that are prescribed by competent medical officers. The service aims to create equity in health care by providing access to affordable and quality health services at the door steps of the poor and vulnerable sections of the state.
Telemedicine is the use of telecommunication and information technology to provide clinical health care from a distance. It helps eliminate distance barriers and can improve access to medical services that would often not be consistently available in distant rural communities. It is also used to save lives in critical care and emergency situations.
Probably if a thought is given to these ideas we may expect a new face of health facility in the state of Telangana. End

Tuesday, January 24, 2017

Mission Bhagiratha…Model to country…Pride for the state says CM KCR in the review meeting : Vanam Jwala Narasimha Rao

Mission Bhagiratha…Model to country…
Pride for the state
says CM KCR in the review meeting
Vanam Jwala Narasimha Rao
Chief Minister K. Chandrashekhar Rao has asked the officials supervising the implementation of Mission Bhagiratha drinking water programme to complete all important works before onset of the monsoon season, although the year-end has been fixed as the target.

“There’s no dearth of funds for the drinking water project likely to become a model in the country, since several financial institutions have extended loans of about ₹30,000 crore. Execution of works alone is the task now. Coordinate with various departments concerned so that there’s no delay,” the Chief Minister told the officials at a review meeting for over four hours held in Pragati Bhavan, Hyderabad on 24th January.

The Chief Minister enquired progress of component-wise works such as intake wells, water treatment plants (WTPs), pipelines, construction of electrical sub-stations and others. He instructed the District Collectors to take initiative for getting clearances linked to pipeline laying from forest, national and state highways, Panchayat raj roads, railways, irrigation and other departments.

Chief Minister as part of his marathon review has instructed that all the works under Mission Bhagiratha should be completed on schedule with coordination among all the departments concerned. CM congratulated the officials concerned for working with zeal and commitment towards Mission Bhagiratha programme, which the state government has taken as a prestigious project.

The Chief Minister has emphasized the need to have uninterrupted power supply for the programme. “For Mission Bhagiratha power supply is very essential.  Expedite the works on Sub Stations, power lines etc., Power should be supplied to Intake Wells, WTPs. Make all arrangements for the uninterrupted power to supply drinking water, ” the CM said.

“There is no dearth of funds for the Mission Bhagiratha. Financial Institutions have already pledged about Rs 30,000 Crore. We have to speed up works at the ground level and that should be our aim as on date.  Coordinate with all the departments for the pipeline works. Get clearances from the National Highways, state Highways, Panchayat Raj roads, Railway crossings, Canal crossings, River/Rivulet Crossings. Get the forest clearances faster. The district Collectors should be asked to play a proactive role in this,” the CM said.

The officials informed the Chief Minister that of the 19 Intake Wells, 11 are completed and other are at various stages of the completion.  These will be completed by this March. By April all the Intake Wells will be able to pump the water, the officials informed.  Of the 50 Water Treatment Plants, three are completed, 75 per cent of work is completed in another 10 Water Treatment Plants. In 11 WTP about 50 per cent of the works are done and 25 per cent works are done in another 20 WTPs and in 6 WTPs less than 25 per cent of works are done. To this, the Chief Minister said, that, “Working agencies should understand the aims and objectives of the government. Expedite the works. We have already announced that if the works are completed on time, one per cent incentive will be give. This should be utilized. State’s financial position is robust. State’s GDP is also good. One should take advantage of the strong financial situation in the State”. The officials promised that works on WTPs would be completed latest by June this year.


By March this year, 3811 Villages will get the drinking water and by December 20,366 villages will be added.  2671 (Over Head Service Reservoirs) OHSRs will be completed by this March and by December 15, 602 OHSRs will be completed.  8547 KMs main pipeline will be completed by this March and by December 42,780 KMs will be completed. By March 9, 79, 245 houses will get the drinking water. By December 42, 38,980 houses will get the drinking water.  42618 KMs OFC line will be completed by December this year, the officials said. “I want all the works should be done on time as planned. In case of any problem discuss at the district level and keep the CMO informed and we will act immediately,” the Chief Minister said.

“Mission Bhagiratha is going to be a role model in the country. The Prime Minister himself has launched this programme. Representatives from 7 States came here to study the programme. NITI AYOG praised this project and in several states they are planning to emulate the programme. We have also taken this programme as a prestigious one. By next elections, if we do not supply drinking water to every household, we have declared that we will not seek votes. We have a lot of faith in our officials and this is the reason why the works are not given to any private agencies but handed over to our officials.  Officials are monitoring internal works in the villages and we are paying bills regularly to the working agencies. We are solving every problem. All works should be completed by December 2017, the CM instructed. “Though December is the target, complete the works by June.  Works cannot be executed as planned during the rainy season. Complete the works before the onset of Monsoon.” The CM added.

The officers concerned have informed the Chief Minister that at 148 points the pipeline has to cross the rivers and works at 53 points are completed and the rest will be over by this summer. The pipeline has to cross canals at 1477 points, of this works at 164 points are over.  The rest will also be completed by this summer.  Railway crossings are at 237 places and permissions are given for 207 and of this works are over at 44 places. Works at rest of the places are going ahead. The pipeline has to cross the National Highways at 442 places and permission is given for 418 places. Works at 57 places are over and work is progressing at rest of the places. The pipeline will cross the R&B Roads at 4447 points. Works at 590 points are over and the rest of the works are progressing. In this context, the Chief Minister has asked the Chief Secretary to convene a meeting with the officers concerned to get permissions immediately.

The Chief Minister said, “Working agencies have given works at several places to the sub contractors and as such they should take the responsibility of getting the works completed by the sub contractors on time.  Based on the soil conditions changes should be made while preparing estimates for the pipeline.  Change in estimates should be done in 48 hours and the rates should be standardized based on quality rates.  Besides supplying drinking water pipelines to every village, the water should be supplied through pipeline to every household and this is important.  Laying an internal pipeline network within the villages is very important and crucial work.  Get the necessary equipment and keep them in the villages.  Speed up the works. These 11 months are very crucial. Do your administrative duties,” the CM explained to the officers. END


Sunday, January 22, 2017

సముద్రిడిపై కన్నెర్ర చేసిన శ్రీరాముడు .....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 28 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

సముద్రిడిపై కన్నెర్ర చేసిన శ్రీరాముడు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
28 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (23-1-2017)

తాత్పర్యం:    యుద్ధంలో పగవారికి శోకం కలిగించేదిగా, నిడివైనదిగా, మంచి మనసున్న మిత్రుల సంతోషానికి స్థానమైనదిగా, భూమండలానికి ఆశ్రయమైనదానిగా, సవ్యాపసవ్యములుగా బాణాలు ప్రయోగించేందుకు సామర్ధ్యం కలదిగా, అల్లెతాటి రాపిడి వల్ల కాయకాచిన చర్మం లాగా, వేలాది ఆవులను దానం చేసినదానిగా, పాప పడగవంటిదిగా భయంకరమైన గడియ మ్రాకులా, శ్రీరాముడి కుడి భుజం వుంది. దానిని దిండుగా చేసుకుని సముద్రతీరంలో శ్రీరాముడు పడుకుంటాడు.

ఛందస్సు:      తరలముకు ", , , , గజం" లు గణాలు. పన్నెండో అక్షరం యతి. మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి. తరలము లోని మొదటి రెండు లఘువులను గురువుగా మారుస్తే మత్తకోకిలము అవుతుంది. అలానే మత్తకోకిలము లోని గురువును లఘువులుగా మారుస్తే తరలము అవుతుంది.

శ్రీరాముడు అలా తూరుపు ముఖంగా పడుకుని, తాను సముద్రాన్ని దాటనన్నా దాటాలి, లేదా, సముద్రుడు చావనైనా చావాలి అని నిశ్చయించుకుంటాడు. అలా మౌన వ్రతము బూని సముద్రాన్ని ప్రార్ధించుతూ, మూడు రాత్రులు పడుకున్నప్పటికీ, సముద్రుడు కనబడలేదు. సముద్రుడి మీద కన్నెర్ర చేశాడు రాముడు. తన పదునైన బాణాలతో సాగరాన్ని ఎండిపోయే ట్లు చేస్తానని లక్ష్మణుడితో అంటాడు. సముద్రాన్ని క్షోభకు గురిచేస్తానని చెప్పాడు. సముద్రం గతి ఎలా వుంటుందో చూడమని అంటూ కళ్లు ఎర్ర చేసి బాణ సమూహాలను విడిచే విధానాన్ని "స్రగ్ధర" వృత్తంలో వర్ణించాడు కవి.

స్రగ్ధర          జ్వాలాభీలాశుగంబుల్ చర చర చనుచున్ సాగరం బుత్తలింపన్
                వే లోనం జొచ్చినంతన్ విషధరచయముల్ బెగ్గిలెన్ దిగ్గనన్ గ్రా
                హాళీకుంభీరయుక్తం బగు సలిలము వాతాతి నిర్హ్రాదయుక్తిన్
                జాలన్ ఘోరత్వమందెన్ సరఁ గ బొగలతో సంభ్రమద్భంగ పాళిన్-123

తాత్పర్యం:    అగ్నిశిఖల లాంటి బాణాలు చరచర బోయి సముద్రాన్ని అల్లకల్లోలం చేయగానే, హటాత్తుగా వచ్చిన ఆ ఉత్పాతానికి పాములు భయపడ్డాయి. గ్రాహములతోను, మొసళ్లతోను నిండిన నీరు పెనుగాలికి కలిగిన ధ్వనివల్ల, మరింత భయంకరమై, పొగలతోను, అలల తోను కనిపించింది.

ఛందస్సు:      స్రగ్ధర వ్య్త్తానికి "మ, , , , , , " గణాలు. ఎనిమిదింట, ఎనిమిదింట యతి.
నలుడు సేతువు నిర్మించే సమయంలో, తనకు వానరుల సహాయం కావాలని రాముడిని కోరతాడు. ఆయన కోరిన ప్రకారమే, రాముడు, వానరులను చెట్లు-గుట్టలు తెచ్చి సముద్ర తీరానికి చేర్చమంటాడు. వానరులు వాటిని తెచ్చిన వైనాన్ని కవి "పంచచామరము" వృత్తంలో వర్ణించారు.

పంచచామరము:      గుభీల్ గుభీల్మనంగఁ గొండ లెల్ల దండిగా
                        దభాలునం బడంగ వైవఁ దల్లడిల్లి సత్త్వముల్
                        గభీ ల్మనంగ గుండియల్ ది గా ల్పడంగ, బిందువుల్
                        నభంబునం జివాలునన్ ఘ నంబుగన్ నటింపఁ గన్-124

ఛందస్సు:      పంచచామరానికి "జర, జర, జగ" గణాలు. తొమ్మిదింట యతి.
వానర సేన సేతువు దాటిన తరువాత, ఆహారం కొరకు ఒక ప్రదేశంలో విడిది చేసినప్పుడు, శ్రీరాముడు చేసిన అసాధ్య కార్యాన్ని దేవతలు-ఋషులు మనసులోనే పొగుడుకుంటూ రాముడిని పూజిస్తున్న సందర్భాన్ని "వనమయూరము" వృత్తంలో వర్ణించారు కవి.

వనమయూరము:     చేరి యభిషేకమును జేసి శుభవారిన్
                        ధీరవర! శత్రుల వధింపుము సపారా
                        వారమహి నేలుమ య పారసమ లంచున్
                        సారెకు సమర్చల నొ నర్చిరి సభక్తిన్ - 125

తాత్పర్యం:    రామచంద్రమూర్తిని పవిత్ర జలాలతో అభిషేకించి, శత్రువులను జయింపుమని, అనేక సంవత్సరాలు భూమండలాన్ని ఏలమని, భక్తితో పూజించిరి.
ఛందస్సు:      వనమయూరమునకు "భ, , , , , " లు గణాలు. తొమ్మిదింట యతి.

సుగ్రీవుడి వద్దకు రాయబారానికి రావణుడు పంపిన శుకుడు, శ్రీరాముడి దయవల్ల ప్రాణాలను దక్కించుకుని తిరిగి రావణుడి దగ్గరకు వస్తాడు. సీతను రామచంద్రమూర్తికి అప్పగించమని హితబోధ చేస్తాడు. తనను ఎంతమంది ఎదిరించిన ఏమీ చేయలేరనీ, సీతను ఇచ్చే ప్రసక్తే లేదని రావణాసురుడు స్పష్టం చేసిన సందర్భంలో, "మత్తకోకిలము" వృత్తంలో ఒక పద్యాన్ని రాశారు కవి.

మత్తకోకిలము:         వేయిగన్నులు గల్గి వెల్గెడు వేల్పు ఱేఁ డరుదెంచినన్
                దోయధీషుఁ డు పాశహస్తుడు త్రోచివచ్చిన, దండియై
                యా యముం డిట వచ్చినన్, ద్రవి ణాధినేత యెదిర్చినన్
                జేయ లే రొకయింతయేనియుఁ జెట్ట నా కెటు భీరుకా-126


తాత్పర్యం:    శుకుడిని పిరికివాడా అని సంభోదిస్తూ, వేయి కళ్లున్న ఇంద్రుడు వచ్చి ఎదిరించినా, పాశం చేతుబట్టుకుని వరుణుడు వచ్చినా, యమదండంతో యముడు వచ్చినా, ధనాధిపతి కుబేరుడు వచ్చినా తనకే కీడు చేయలేరని అంటాడు రావణాసురుడు.

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి.
శ్రీరాముడి వెంట వచ్చిన వానర సేన బలాన్ని రావణాసురుడికి పూర్తిగా వివరిస్తూ శుకుడు చెప్పిన మాటలను ఒక సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో వర్ణించారు కవి.

మత్తకోకిలము:         వారిఁ జూడు మవార్యవీర్య విభా ప్రభావులు బాలకా
                కారు లబ్జజుపంపునన్ మురి గండు మీఱ సుధారసం
                బారఁ గ్రోలిరి మైందుఁ డున్ ద్వివి దాఖ్యుఁ డున్ నిను నీ పురిం
                భూరివిక్రమ సంపదన్ మును ముట్టఁ గూల్పఁ గ జూచెదన్-127

తాత్పర్యం:    మైందుడు, ద్వివిదుడు అనే వానరవీరులకు వారింపనలవి కాని వీర్యము, మహత్త్వము వుంది. వయసొచ్చిన బాలురవలె వుంటారు. దానికి కారణం, బ్రహ్మ ఆజ్ఞానుసారం బలగర్వాలు ఎక్కువకావటానికి           అమృతం తాగడమే. నిన్ను, నీ పట్టణాన్ని కూడా భుజబలాతిశయంతో మట్టుబెట్టనున్నారు.

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి.
అశోకవనంలో వున్న సీతదేవి దగ్గరకు రావణాసురుడు వెళ్లి, ఆమెతో, శ్రీరాముడు యుద్ధంలో మరణించాడని అబద్ధం చెప్తాడు. అది నమ్మిన సీత తన భర్త గురించి, అత్తగారు కౌసల్య గురించి బాధపడిన విషయాన్ని సుగంధి వృత్తంలో రాశారు కవి.

సుగంధి:       
          కుల్య! రామభద్ర! యిట్టి క్రూరమైన వార్త హృ
        చ్ఛల్య వినంగఁ గల్గ సాధుశీల యత్త కౌ
        సల్య పుత్ర పుత్ర రామ చంద్ర యంచు దుఃఖధీ
        లౌల్య లేఁ గఁ బాయు గోవు లా గదెంత కుందునో - 128

తాత్పర్యం:     గొప్ప వంశంలో పుట్టిన నీకా ఈ నికృష్టపు చావు? రామభద్రా, నేను చేసిన పాపం నేను అనుభవించవలసిందే. తప్పదు. ఇది నాతో పోదే. ఈ క్రూరమైన వార్త వినగానే సాధుస్వభావురాలైన నా అత్తగారు కౌసల్య, కొడుకా, కొడుకా రామచంద్రా అని, లేగదూడను పోగొట్టుకున్న ఆవు వలె ఎంత దుఃఖించునో కదా. నేనొక్కతెను చేసిన పాపం నిరపరాధులను ఎందరినో బాధించుతున్నది కదా.
ఛందస్సు:      సుగంధికి "ర, , , " గణాలు. తొమ్మిదింట యతి.
          తదుపరి భర్త రాముడిని తలచుకుంటూ, దైవ సంకల్పానికి అడ్డు లేదనుకుంటూ తనలో తానే అనుకుంటున్న దానిని " ఇంద్రవంశము " వృత్తంలో రాశారు కవి.

ఇంద్రవంశము:                   నే రేజపత్రేక్షణ! నిర్దయాత్మికన్
                        గ్రూరన్ మహారౌద్రను ఘోర దుష్కృతా
                        కారన్ ననున్ వల్లభ! కాళరాత్రినిన్
                        జేరంగ నీ తీయుటఁ జేటుఁ దెచ్చితిన్ - 129
తాత్పర్యం:     తామర రేకుల లాంటి కళ్లు కలవాడా! దయలేని మనస్సు నాది. అందుకే కఠిన చిత్తను, మహా భయంకరమైన దానిని నేను. పాపాలు నా ఆకారంలో వున్నాయి. వల్లభ! నేను నీ పాలిటి కాళరాత్రిని. ఇలాంటి దాన్ని నన్ను నీవు చేరదీయడం వల్లనే, నేనే నిన్ను చంపాను. తేలును దగ్గరకు తీస్తే కుట్టక మానుతుందా?

ఛందస్సు:      ఇంద్రవంశమునకు "త, , , " గణాలు. ఎనిమిదింట యతి.

          సీత తన మనసులో బాధను తానే పరిపరి విధాలుగా పడుతూ, భర్తను పరోక్షంగా తూలనాడుతుంది. అ సందర్భంలో "స్రగ్విణి" వృత్తంలో ఒక పద్యాన్ని, "మత్తకోకిలము" వృత్తంలో మరో పద్యాన్ని రాశారు.

హిందూ సంప్రదాయంలో బారసాల : వనం జ్వాలా నరసింహారావు

హిందూ సంప్రదాయంలో బారసాల
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (22-01-2017)

బారసాలని అసలు "బాల సారె" అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి "బారసాల" అయింది. అసలు బారసాల అంటే పేరు పెట్టడం లేదా నామకరణం చేయటం అని అర్థం. ఈ వేడుకను పుట్టిన పాపాయికి (బాబు అయితే బాబుకు) పేరు పెట్టటానికి చేస్తారు. వాడుకలో వున్న పద్ధతి ప్రకారం, పుట్టిన 21వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 21, 23, 25, 27 రోజులలో చాలా మంది చేస్తారు. అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా మంచిరోజు చూసుకొని చేసుకోవచ్చు. నెలలోపల చేసుకునే వీలు లేకపోతే, మూడో నెల వచ్చిన తర్వాత చేసుకుంటారు. పూజ చేయించేందుకు తగిన బ్రాహ్మణుడిని వెతుకుతారు. బ్రాహ్మణుడి సూచన మేరకు కావాల్సిన వస్తువులను సేకరిస్తారు. బారసాల-నామకరణం-సత్యనారాయణ వ్రతానికి కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకచెక్కలు, ఖర్జూరపు పండ్లు, అగరు వత్తులు, హారతి కర్పూరం, అరటి పండ్లు, పూలు, కొబ్బరికాయలు-ఇవి పగులగొట్టే సౌకర్యం, ఎండు కొబ్బరి చిప్పలు, కొత్త తుండు గుడ్డ, కొత్త రవికె గుడ్డ, తేనె, పెరుగు, పాలు, నెయ్యి, పంచదారల మిశ్రమమైన పంచామృతం, సత్యనారాయణ స్వామి ఫొటో, తగు మోతాదులో కేసరి ప్రసాదం, బియ్యపు రవ్వ-అందులో కలిపేందుకు పంచదార, వేలకులు, జీడి పప్పు, కిస్‌మిస్ పండ్లు, దీపారాధనకు కావాల్సిన (దూది, నూనె, అగ్గిపెట్టె) సామాగ్రి, కొబ్బరి కాయనుంచే వీలున్న వెండి-రాగి-సిల్వర్ పాత్ర (చెంబు), పావలా బిళ్లలు (సెంట్లు), రెండు-మూడు కిలోల బియ్యం.

          తెలుగు వారి ప్రత్యేకత-ఆ మాటకొస్తే భారతీయులందరి ప్రత్యేకత, వారి పేరులోనే వుంటుందనాలి. అదేంటోగాని, చాలామంది విషయంలో, తెలుగు వారి-భారతీయుల పేర్లు, వారి పేరును పట్టి, కొత్తగా పరిచయమైన వారు, సర్వసాధారణంగా ఒక అవగాహనకు వచ్చే విధంగా వుంటాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆ పేరును వారు పుట్టిన 21 వ రోజున, తల్లి పక్కనుండగా, బంధు-మిత్రుల సమక్షంలో, శాస్త్రోక్తంగా జరుపుకునే ఒక వేడుకలో, తండ్రి పెడ్తాడు. పేరును ఆనవాయితీగా ఆచరిస్తున్న పద్ధతుల ప్రకారం, బారసాల జరుపుకొని, "నామకరణం" ప్రక్రియ పూర్తిచేయని తెలుగు వారు గానీ, భారతీయులు గానీ వుండరు. అదో ఆచారం-వేడుక-సరదా-సామాజిక కలయిక. పేరు వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామ వాచకము. వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించడానికి లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది.

          బారసాల నాడు పెట్టిన పేరే ఆ మనిషి పేరులా చెలామణి అవుతుంది. తమ పేర్లు రాసుకునేటప్పుడైనా, చెప్పేటప్పుడైనా భారతీయులందరూ ఒకేవిధంగా వ్యవహరించరు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన  సంప్రదాయాన్ని పాటిస్తారు. బారసాల నాడు పెట్టిన పేరు మొదట, ఇంటి పేరు తరువాత వచ్చేలా కొన్ని ప్రాంతాల వారు, ఇంటి పేరు మొదట, తరువాత బారసాల నాడు పెట్టిన పేరు వచ్చేలా మరికొన్ని ప్రాంతాల వారు పాటిస్తారు. సాధారణంగా ఏ ప్రాంతం వారికైనా ఇంటి పేరు తరతరాలుగా మారకుండా వుండి, వారి యొక్క వంశ నామంగా వుంటుంది. తెలుగు వారు సంప్రదాయం ప్రకారం బారసాల నాడు పెట్టిన పేరు ముందర ఇంటి పేరు తగిలించకుండా తమ పేరు చెప్పుకోరు. ఈ మధ్య కాలంలో తెలుగు వారి ఇంటి పేరు సంప్రదాయం, క్రమ క్రమంగా మార్పుకు యువతరం నాంది పలుకుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు, "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా..." అన్న నా నుడిని పేరు చెప్పుకునే విషయంలో కొంచెం సడలించి, "బి ఎ రోమన్ వైల్ ఇన్ రోమ్" సంప్రదాయాన్ని పాటించడం నేర్చుకున్నారు. అమెరికా దరఖాస్తు పత్రాలలో  ఫస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, పుంఖాను పుంఖంగా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోసారి సర్ నేమ్ ఏమిటని మరో ప్రశ్న వేస్తారు. ఈ బాధలు తప్పించుకోవడానికి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారందరు కూడా వారి పద్ధతినే అనుకరిస్తున్నారు. తప్పదు కదా మరి !. దేశ-కాల మాన పరిస్థితులను బట్టి మారడం మంచిదే కదా !


       మంత్రోచ్ఛారణల మధ్య, పురోహితుడుగా-పూజారిగా బారసాల-నామకరణం జరిపించడానికొచ్చిన బ్రాహ్మణుడు మొదట విఘ్నేశ్వరుడి పూజ చేయిస్తాడు. విఘ్నేశ్వరుడి పూజకంటే ముందు, పురుడు అయిపోయిన వెంటనే, శాస్త్రం ప్రకారం జీర్ణ యజ్ఞోపవీతాన్ని తీసివేసి-దాని స్థానంలో నూతన యజ్ఞోపవీతాన్ని పాపాయి తండ్రితో ధరింప చేసే కార్యక్రమాన్ని జరిపించాలి. తరువాత పుణ్యాహవాచనం (శుద్ధి) కార్యక్రమం వుంటుంది. తరువాత నామకరణం చేయించుతారు. పేరు అనేది ఎవరైనా జన్మ నక్షత్రం ఆధారంగా పెట్తారు. అయితే, అదనంగా, వ్యవహారిక నామంగా, తమకు ఇష్టమైన పేరు పెడతారు. కాని నక్షత్రం ప్రకారం పెడితేనే మంచిది. ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు అనేవి శాస్త్రంలో చెప్పబడే వున్నాయి.

          పాపైనా-బాబైనా, పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్య సూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్య సూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్య సూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి. మొదటిది: జన్మ నక్షత్రాన్ని బట్టి; రెండోది: పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి; మూడోది: ఇలవేల్పుని బట్టి; నాలుగోది అందరూ పిలిచే పేరును బట్టి. చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యా స్థాయిని బట్టి ఉంటుంది. వెండి పళ్ళెంలో పోసిన బియ్యంపై తండ్రితో పేరు రాయించుతాడు బ్రాహ్మణుడు. నామకరణం తంతు ముగిసిన తర్వాత, కటి సూత్ర ధారణ అంటే మొలతాడు కట్టే కార్యక్రమం కూడా జరిపించాలి. పసుపు రంగు పులిమిన దారంతో తయారుచేసిన మొలతాడును పాపాయి మొలకు, బామ్మ గారితో కట్టించాలి. బంగారపు వుంగరాన్ని తేనెలో ముంచి, మొదలు తండ్రితో, తర్వాత తల్లితో, ఆ తర్వాత అమ్మమ్మ-బామ్మ-తాతయ్యలతో-ఇతర పెద్దలతో, పాపాయి నోట్లో వుంచే కార్యక్రమాన్ని కూడా జరిపించాలి.

          సాధారణంగా ఫలానా వారికి ఫలానా ఇంటి పేరుండడానికి ఏదో ఒక నేపధ్యం వుంటుందంటారు. వుండాలని లేదు కూడా. ఇంటి పేరు గ్రామనామమో, ఏదో ఒక శరీర అవయవమో, జంతువుల పేరో, పక్షుల పేరో, పూల పేరో, తిను పదార్థాల పేరో, వస్తువుల పేరో, వేదాల పేరో, వృత్తుల పేరో, ప్రకృతి సంబంధమైన పేరో, వృక్షాల పేరో, నదుల పేరో, ఇలాంటి మరింకేదో వుంటుంది. లోగడ కొందరు మాత్రమే ఇంటి పేరుగా వాడుకునే కులాలను, ఇటీవల కాలంలో "ఒక హక్కు" లాగా పలువురు ఉపయోగించుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా, కుల-గోత్ర-నామాలు, ఎందరు ఒప్పుకున్నా-ఒప్పుకోక పోయినా మన సంస్కృతీ సంప్రదాయంలో చెరిపినా చెరగని అంతర్భాగాలు. తర-తరాల కుటుంబ నేపధ్యం, భావి తరాల వారికి తెలియచేయడానికి, మన గురించి మనం అర్థం చేసుకోవడానికి, ఈ కుల-గోత్ర-నామాలు వాడుకుంటే తప్పులేదు కాని, ఆ పేరుతో కులతత్వం-మతతత్వం-ప్రాంతీయ తత్వం, లేదా, మన సంస్కృతి గొప్ప-ఇతరుల సంస్కృతి తక్కువ అనే భావాలను రెచ్చగొడితే అంతకంటే ఘోరమైన పాపం మరింకోటి లేదు.

ఇంటి పేరుకు ఒకరకమైన నేపధ్యముంటే, వ్యవహారిక నామానికి కూడా మరో రకమైన నేపధ్యముంటుంది. ఒక తరంలో ఒక వ్యక్తికున్న పేరు, వారి మనుమల-మనుమరాళ్ల తరం వచ్చేసరికి ఎవరికో ఒకరికి పెట్టుకోవడం ఆనవాయితీ. తాతగారి పేరు మనుమడికి, అమ్మమ్మ-బామ్మ గార్ల పేర్లు మనుమరాళ్లకు కొన్నేళ్ళ క్రితం వరకు యథాతధంగా పెట్టుకునేవారు. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతున్నా, కొంచెం ఆధునీకరించి పెట్టుకుంటున్నారు. దీని మూలాలు మన గోత్రాల్లో-ఋషుల్లో వున్నాయంటారు.

          గోత్రం అంటే, వంశ పరంపరను తెలియచేసే రహస్యం లాంటిదనవచ్చు. బ్రాహ్మణుల్లో, పితృ-పితామహ-ప్రపితామహ...అంతకంటే తెలిసి నన్ని తరాల పూర్వీకులతో పాటు, వంశం ఎక్కడనుంచి ఆరంభమయిందో వారి గోత్రాన్ని బట్టి కొంతవరకు తెలుసుకోవచ్చు. ప్రతి గోత్రం ఒక మహర్షి పేరుతో వుంటుంది. వంశ పరంపర గురించి వివరించేటప్పుడు, మొదటగా ఏ మహర్షి పేరుమీద గోత్రం వుందో, ఆయన పేరు చెపుతారు. తర్వాత ప్రవర చెప్పాలి. ప్రవరంటే, గోత్రానికి ఆద్యుడైన ఋషి పేరు, ఆ ఋషి కుమారుడి పేరు, ఆయన కుమారుడి పేరు (కొంత మందికి ముగ్గురి తో ఆపగా, మరికొంతమంది ఏడుగురి వరకూ చెప్పాలి) చెప్పి, ఫలానా వాడి పౌత్రుడని, పుత్రుడని చెప్పుతారు. బ్రాహ్మణులు వివిధ వర్గాలుగా గుర్తింపు పొందడానికి బహుశా ఇదొక ఏర్పాటు కూడా కావచ్చు. మొట్ట మొదటిసారి గోత్రం అన్న పదాన్ని ఎప్పుడు వాడిందో ఇదమిద్ధంగా తెలవక పోయినా, క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దానికల్లా, అలనాటి మారుతున్న సామాజిక నియమ నిబంధనలు-చట్టాలు, గోత్రం చెప్పుకునే పద్ధతిని స్థిరపర్చాయని అంటారు. దరిమిలా ఆ వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. గోత్రాల పుట్టుక సప్తర్షుల ఆవిర్భావంతో ముడిపడిందంటారు. అయితే ఆ సప్తర్షులు ఒక్కో మన్వంతరంలో, ఒక్కో పేర్లతో వ్యవహరిస్తుండవచ్చు. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ మానస పుత్రులైన మరీచి, అత్రి, అంగీరస, పులస్థియ, పులహ, క్రతు, వశిష్ట మహర్షులను సప్తర్షులనేవారట. అలానే, మరో నమ్మకం ప్రకారం, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప, అగస్త్య అనే ఎనిమిదిమంది మహర్షుల సంతతిని-వంశ పరంపరను తెలిపే గోత్రాల పేర్లుగా పెట్టారంటారు.


          ఉదాహరణకు: "పరాశర" గోత్రం. ఋషులు "వశిష్ట-శక్తి-పరాశర". వశిష్ట మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప యోగి. బ్రహ్మ సంకల్ప బలంతో జన్మించాడు. అందరు మహర్షుల వలె ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత-పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి కలిగిన చాలా మంది కుమారులలో "శక్తి" జేష్టుడు. పరాశరుడు వశిష్టుడి మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న వారికి, వివాహ సమయంలో ఆచరించే సంప్రదాయాలలో మహా పతివ్రత అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒకటి. పరాశరుడు తాతగారైన వశిష్టుడి దగ్గర పెరిగాడు. పరాశరుడు ఒకనాడు తీర్థ యాత్రకు పోతూ, యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్య గంధి-సత్యవతిని చూసి-మోహించి, ఆమెతో సంగమించాడు. అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన (కన్యాత్వం చెడకుండా) జన్మించిన కొడుకే కృష్ణ ద్వైపాయనుడు లేదా వ్యాసుడు. ఆ పరాశరుడి వంశ క్రమంలో వాళ్లే మా "వనం" వారు.

Friday, January 20, 2017

శాతకర్ణి...బ్రాహ్మణ చక్రవర్తే : వనం జ్వాలా నరసింహారావు

శాతకర్ణి...బ్రాహ్మణ చక్రవర్తే
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (21-01-2017)

          తెలుగువారైన శాతవాహన రాజుల తొలినివాసం తెలంగాణలోని కోటిలింగాల. ప్రజానురంజకంగా పరిపాలించిన శాతవాహన వంశీయులు అసహాయ శూరులు, అరివీర భయంకరులు. శాతకర్ణి బ్రాహ్మణుడే. బ్రాహ్మణ చక్రవర్తి అని చెప్పడానికి ఎన్నో చారిత్రక పుస్తకాలలో సాక్ష్యాధారాలున్నాయి. అసలు సిసలు బ్రాహ్మణుడైన గౌతమీపుత్ర శాతకర్ణిని బ్రాహ్మణేతరుడిగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమే!

          "బ్రాహ్మణ రాజ్య సర్వస్వం" పేరుతో స్వర్గీయ బి ఎన్ శాస్త్రి రచించిన సుమారు ఏడువందల పైచిలుకు పేజీల బృహత్ గ్రంథానికి భూమిక రాసిన డాక్టర్ గంగాపురం హరిహరనాథ్, క్రీస్తు పూర్వం 184 ప్రాంతంలో, మగధ వంశంపు చివరి రాజైన బృహద్రథుడిని, ఆయన భోగలాలసతను సహించలేని మహామంత్రి పుష్యమిత్రుడు చంపి, సింహాసనాన్ని అధిష్టించిన తదనంతర పరిణామాలలో, ఏ విధంగా బ్రాహ్మణ రాజ్యాలేర్పడ్డాయో పేర్కొన్నారు. ఆయన సింహాసనాన్ని అధిష్టించడంతో మంత్రి, సామంత, దండనాయక పదవులందున్న బ్రాహ్మణులందరూ, స్వతంత్రులై అఖిల భారత వ్యాప్తంగా స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన రాశారు. వారే శుంగులుగా, శాతవాహనులుగా, కాణ్వులుగా పేరొందారు. దక్షినాపథానికి మహోజ్వల చరిత్రనందించడమే కాకుండా, భారత దేశ మహోన్నత చరిత్రకు శ్రీకారం చుట్టిన వారు శాతవాహనులని, సుమారు 450 సంవత్సరాలు పాలించిన వారి కాలంలో వైదిక ధర్మం వర్ధిల్లిందని హరిహరనాథ్ అంటారు. ఈ విషయాలతో పాటు బ్రాహ్మణ రాజ్యాలకు సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన విషయాలు బిఎన్ శాస్త్రి గారి గ్రంథంలో లభ్యమవుతాయి. బ్రాహ్మణులు కేవలం మంత్రి, దండనాయక, పురోహిత పదవులనే అలంకరించారు కాని సామ్రాజ్యాలను స్థాపించలేదని మొండిగా వాదించేవారికి కనువిప్పు కలిగేలా, ఈ సర్వస్వంలో, ప్రసిద్ధమైన 26 బ్రాహ్మణ రాజ్య వంశాల గురించి పరిశోధనాత్మకంగా, సోదాహరణంగా, నిరూపిస్తూ, విపులీకరించారు శాస్త్రిగారు. ఈ సర్వస్వంలో ఇతర విషయాలతో పాటు ఆర్య బ్రాహ్మణులు, ఋగ్వేదం, ఋగ్వేద ఋషులు, రాజులు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఆర్యుల వ్యవసాయం, సాంఘిక అంశాలు, జనపదాలు, గణతంత్ర రాజ్యాల సంక్షిప్త సమాచారం లాంటి అనేక విషయాలున్నాయి. అందులో భాగంగానే గౌతమీపుత్ర శాతకర్ణి వంశమైన శాతవాహనుల గురించి కూడా వివరించడం జరిగింది.

ప్రజానురంజకంగా పరిపాలించిన శాతవాహన రాజులు అసహాయ శూరులు....అరివీర భయంకరులు...అప్రతిమాన ప్రతిభా విశేషాలు కలవారని శ్లాఘించారు శాస్త్రిగారు. తెలుగువారైన శాతవాహనుల తొలినివాసం తెలంగాణలోని కోటిలింగాల. ఇదే వారి గణతంత్ర రాజ్యంగా వుండేది. శాతవాహన వంశీయులు అశ్వగణానికి చెందినవారు. మత్స్య, వాయు పురాణాలలో శాతవాహనుల చరిత్ర గురించి వుంది. గ్రీకు రచయితలు, చైనా యాత్రీకులు కూడా వీరి గురించి రాశారు. ఈ రాజవంశపు రాజుల్లో హాల శాతవాహన చక్రవర్తి గొప్ప కవే కాకుండా తన ఆస్థానంలో కుమారిల, శ్రీపాలిత లాంటి మహాకవులను పెట్టుకున్నారు. ఈ వంశీకులకు సంబంధించిన అనేక కథలు, గాథలు ప్రచారంలో వున్నాయి. ఇటీవలి కాలంలో సినిమా రూపంలో కూడా వెలువడుతున్నాయి. కాకపోతే వీటిలో చాలా భాగం చారిత్రకంగా ప్రామాణికాలు కావు. గాథా సప్తశతి, బృహత్కథ, జాతక కథలు, జానపద కథలు కొన్ని, కొంతవరకు శాతవాహనుల చరిత్రను తెలియ చేస్తాయి. బిఎన్ శాస్త్రి తన పుస్తకంలో శాతవాహన వంశానికి చెందిన 30 మంది రాజుల గురించిన వివరాలు పొందుపరిచారు.

శాతవాహన వంశానికి మూలపురుషుడు శ్రీముఖుడు రాజకీయ చతురుడు, పరాక్రమవంతుడు. ఇతడి తండ్రి శాతవాహనుడు. అశోక చక్రవర్తి మరణానంతరం స్వతంత్రుడై, విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పాలించాడు. శ్రీముఖుడికి పూర్వం కోటిలింగాల పరిసరాల పట్టణ సమాఖ్యను పాలించిన రాజు శాతవాహనుడు. తండ్రి మీద గౌరవంగా శాతవాహన పేరును వంశనామంగా శ్రీముఖుడు పెట్టుకున్నాడు. శ్రీముఖుడు మహారాష్ట్ర లోని కొంత ప్రాంతాన్ని జయించి మరాఠీ అమ్మాయితో తన కుమారుడు మొదటి శాతకర్ణి వివాహం జరిపించాడు. శ్రీముఖుడి మరణానంతరం కొడుకు చిన్నవాడైనందున అతడి సోదరుడు కృష్ణుడు కొంతకాలం పాలించి శాతకర్ణి యుక్తవయస్కుడైన తరువాత రాజ్యాన్ని అప్పగించాడు. దక్షినాపథాన వున్న సమస్త రాజ్యాలను జయించిన శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేశాడు. మొదటి శాతకర్ణి ప్రతిభావంతుడు, పరిపాలనా దక్షుడు, మహా బలవంతుడు. మొదటి శాతకర్ణి తరువాత పూర్ణోత్సంగుడు, స్కంద స్తంబి పాలించారు. ఆ తరువాత రాజ్యాన్ని అధిష్టించిన వాడు రెండవ శాతకర్ణి. ఇతడు 56 సంవత్సరాలు శాతవాహన రాజ్యాన్ని పాలించినట్లువిదేశీయుల దురాక్రమణను ఎదుర్కొని, దేశీయుల దండయాత్రలను నిరోధించి, అణచి, శాతవాహన సామ్రాజ్యంలో శత్రు భయం లేకుండా చేసినట్లు ఆధారాలున్నాయి. మగధ సామ్రాజ్యాన్ని సహితం జయించి చక్రవరి పదవిని పొందాడు.


రెండవ శాతకర్ణి అనంతరం, గౌతమీపుత్ర శాతకర్ణి కంటే ముందు, రాజ్యాన్ని పాలించిన వారు వరుసగా....లంబోదరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి శాతకర్ణి, స్కంద స్వాతి, మృగేంద్ర శాతకర్ణి, స్వాతివర్ణ, పులోమావి, గౌరకృష్ణుడు, హాల శాతవాహనుడు, మందూలకుడు, పురేంద్ర సేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివ స్వాతి. అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి అనంతరం పాలించినవారు వరుసగా....రెండవ పులోమావి, శివశ్రీ, శివస్కంద, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయ శాతకర్ణి, చందశ్రీ, నాల్గవ పులోమావి. వీరిలో, హాల శాతవాహనుడు ఆ వంశపు రాజన్యులలో సాహిత్య పోషకుడిగా, మహా కవిగా, సంస్కృత ప్రాకృత భాషల అభిమానిగా-ఆదరించి పోషించిన వాడిగా, ప్రసిద్ధికెక్కాడు. ఇతడి కాలంలోనే గాథా సప్తశతి రూపుదిద్దుకుంది. ఆయన ఆస్థానానికి వచ్చిన కవుల గాథలను, ఏర్చి కూర్చి గాథా సప్తశతి గ్రంథాన్ని తయారు చేశారు. చంద్రశ్రీతో శాతవాహన వంశపు ప్రధాన శాఖ అంతరించిందనే అనాలి. నాల్గవ పులోమావి శాతవాహన వంశంలో మరో శాఖకు చెందినవాడు. శాతవాహన వంశపు చివరి రాజులు అంతఃకలహాలలో మునిగి వివిధ ప్రాంతాలలో చిన్న-చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలించారు.

శాతవాహన వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి అగ్రగణ్యుడు. క్రీస్తు శకం 104 లో సింహాసానానికి వచ్చి 21 సంవత్సరాలు పాలించాడు. ఆయన పాలనా పగ్గాలు చేపట్టే నాటికి శాతవాహన రాజ్యం చాలా చిన్నదిగా వుండేది. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి వీరమాత గౌతమీ బాలశ్రీ. ఇతడిని "ఏక బ్రాహ్మణ" అనే బిరుద నామంతో సంబోధించేవారు. అసిక, అశ్మక, ములక, విదర్భ మొదలైన రాజ్యాలను జయించి, క్షహరాట వంశాన్ని నిర్మూలించి, "క్షహరాట వంశ నిరవశేషకర" అనే బిరుదు కూడా పొందాడు. ఆయన మహాసామ్రాజ్య నిర్మాణంలో భాగంగా పూర్వీకులు కోల్పోయిన ప్రాంతాలనే కాకుండా, అనేక ఇతర రాజ్యాలను జయించాడు. సహపాణుడిపై విజయం సాధించిన తరువాత, విజయ సూచనగా, ఆతడి పేరుమీద వున్న నాణేలను పునర్ముద్రించాడు. శాతవాహన వంశ ప్రతిష్టను ఉద్ధరించడమే కాకుండా, తన రాజ్యంలో చక్కటి పాలనా వ్యవస్థను ప్రవేశ పెట్టాడు. ప్రజానురంజకంగా పాలన చేశాడు. వింధ్య, అచీవతి, వింధ్య పర్వత ప్రాంతం, ఆరావళీ పర్వతాలు, పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి పర్వత పంక్తి, నీలగిరులకు పడమట వున్న కన్హగిరి, మలయ పర్వతం, మహేంద్రగిరి, చకోర పర్వతం, శ్రీశైల శ్రేణులు, సెటగిరి, సిరికణ పర్వత శ్రేణులతో శాతకర్ణి రాజ్యం వ్యాపించి వుండేది. ఇతడి రథాశ్వాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయని శాసనాలలో రాయబడింది.

గౌతమీపుత్ర శాతకర్ణి దృఢకాయుడని, స్ఫురద్రూపి అని, అతడు ముద్రించిన నాణేల మీద వున్న చిత్రాల ఆధారంగా భావించాలి. సమున్నత శరీరం కల శాతకర్ణి అరివీర భయంకరుడని, సమర శిరసి విజిత రిపు సంఘాతుడని, ఉదార పాలకుడని, ప్రజల సుఖ దుఃఖాలను తెలిసినవాడని, వైదిక ధర్మ నిరతుడని, ఆగమ నిలయుడని, ఏక బ్రాహ్మణుడని, బ్రాహ్మణులను ఆదరించి వేద విద్యలను ప్రోత్సహించాడని, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిని పొందిన మహామనీషి అని "బ్రాహ్మణ రాజ్య సర్వస్వం" లో బీఎన్ శాస్త్రి గారు వర్ణించారు. తల్లి గౌతమీ బాలశ్రీ ప్రోత్సాహంతో బౌద్ధ సన్యాసులకు దాన ధర్మాలిచ్చిన తనయుడు శాతకర్ణి "అవిపన్న మాతృ శుశ్రూషక" అన్న బిరుదు కూడా పొందాడంటారు శాస్త్రి గారు. అతడి పాలనా కాలంలో శాతవాహన రాజ్యం సమున్నత స్థితిలో వుండి, తెలుగువారి కీర్తి దిగ్దిగంతాలలో వ్యాప్తి చెందింది. అప్పుడే తెలుగువారు సముద్రయానం చేసి ప్రాక్పశ్చిమ దేశాలతో వ్యాపారాలు కూడా సాగించారు.

సుమారు నాలుగున్నర శతాబ్దాలు దక్షిణాపథాన్ని, దక్షిణ భారత దేశాన్ని, ఉత్తరాపథాన్ని, మగథ సామ్రాజ్యాన్ని, తమ ఏలుబడిలోకి తెచ్చుకొని ప్రజానురంజకంగా పాలించిన శాతవాహన రాజుల చరిత్ర తెల్సుకోవడానికి అనేక ఆధారాలు శాసనాల రూపంలో, పురాణాలు-గ్రంథాల రూపంలో, దేశ విదేశీయుల రాతల రూపంలో, నాణేల రూపంలో , అప్పటి బౌద్ధారామాల రూపంలో, కథలు, గాథల రూపంలో సులభంగా లభ్యమవుతున్నాయి. శాతవాహనులు తెలుగువారైనందువల్ల ఈ ప్రాంతంతో వారికి పటిష్టమైన సంబధ బాంధవ్యాలున్నాయి. శాతకర్ణి బ్రాహ్మణుడే, బ్రాహ్మణ చక్రవర్తే అని చెప్పడానికి ఒక్క " బ్రాహ్మణ రాజ్య సర్వస్వం" పుస్తకమే కాకుండా మరెన్నో పుస్తకాలలో పలు ఆధారాలున్నాయి. నాణేలలో కనిపించే ఆయన రూపు రేఖలు గౌతమీపుత్ర శాతకర్ణి అసలు సిసలైన బ్రాహ్మణుడే అనడానికి స్పష్టమైన నిదర్శనం.

అలాంటప్పుడు చరిత్ర వక్రీకరించి గౌతమీపుత్ర శాతకర్ణిని, బ్రాహ్మణేతరుడిగా, చిత్రీకరించడం భావ్యమా?