Saturday, February 26, 2011

కల్నల్ గడాఫి-"మధ్య ప్రాచ్య ప్రాంతపు పిచ్చి కుక్క"?: వనం జ్వాలా నరసింహారావు

కల్నల్ గడాఫి-"మధ్య ప్రాచ్య ప్రాంతపు పిచ్చి కుక్క"?
వనం జ్వాలా నరసింహారావు
అలనాటి సామ్రాజ్య వాద-వలస పాలన నుంచి విముక్తి చెందిన అత్యధిక దేశాల-అందునా మధ్య ప్రాచ్య దేశాల పౌరుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడవేసినట్లయింది. పాలనా పగ్గాలు తొలుత రాజుల-రారాజుల చేతుల్లోకి, ఆ తర్వాత రాచరిక వ్యవస్థను కూల దోసామని చెప్పిన సైనిక నియంతల చేతుల్లోకి మారింది. దరిమిలా నియంతల మార్పిడి జరిగినా, ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు జరిగిన దాఖలాలు దాదాపు లేనట్లే. సైనిక నియంతలు, ఏక పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగడం, అత్యధిక మెజారిటీతో గెలవడం, ప్రజాభిమానాన్ని చూరగొన్న వ్యక్తిగా చరిత్ర పుటల్లో ప్రసిద్ధికెక్కడం ఆనవాయితీగా మారింది. ఆయా దేశాల్లోని నియంతలను, తమ ప్రచ్చన్నయుద్థ అవసరాల కొరకు, ఆధిపత్యం చెలాయించేందుకొరకు, అగ్రరాజ్యాలు వ్యూహాత్మకంగా ఎత్తులకు పైయెత్తులు వేయడంతోనే వర్తమాన చరిత్ర కొనసాగుతూ వస్తుంది. మార్పు కోరుకుంటున్న ఆ ప్రాంత ప్రజల్లో ప్రజాస్వామ్య కాంక్ష బలీయంగా బయటకొచ్చినప్పుడు, ఈజిప్టు తరహా ప్రజా ఉద్యమాలు చోటు చేసుకోవడం జరిగినా, వాటి వెనుక మరో నియంత అదృశ్య హస్తం వుండే అవకాశాలే ఎక్కువనాలి. అందుకే, ప్రజాస్వామ్యం అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోతోంది.

లిబియా ఉత్తర ఆఫ్రికా లోని ఒక దేశం. దీనికి ఉత్తరాన మధ్య ధరా సముద్రం, తూర్పున ఈజిప్టు, ఆగ్నేయాన సూడాన్, దక్షిణాన చాద్-నైగర్, పశ్చిమాన అల్జీరియా-టునీషియా దేశాలున్నాయి. 18 లక్షల చదరపు కిలోమీటర్ల లిబియా విస్తీర్ణంలో సుమారు 90% ప్రాంతం ఎడారి ప్రదేశమే. జనాభా సుమారు 60 లక్షలు. 17 లక్షల జనాభా గల ట్రిపోలి నగరం లిబియా రాజధాని. అధికారంలో ఉన్న గడాఫికి వ్యతిరేకంగా ఇటీవలే మొదలైన ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటోంది.

ఇరవై మూడేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన లిబియా సరిహద్దు దేశం తునీషియా అధ్యక్షుడు జినే బెన్ అలీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి పదవీచ్యుతుడు కాక తప్పలేదు. మరో సరిహద్దు దేశం ఈజిప్టును సుమారు ముప్పై సంవత్సరాలు ఏలిన సైనిక నియంత హోస్నీ ముబారక్ పదవి వదిలి పలాయనం చిత్తగించాడు. బహరైన్ లో పరిస్థితి రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మరో అరబ్ దేశం యెమెన్ లో కూడా ప్రభుత్వ మార్పిడి కోరుతూ ప్రజలు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. తునీషియా, బహరైన్, ఈజిప్టు, యెమెన్ దేశాల ప్రజల మార్గాన్నే ఇప్పుడు లిబియా పౌరులూ ఎంచుకున్నారు. 41 సంవత్సరాల కల్నల్ గడాఫి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడుతున్నాయి. పెట్రోలియం నిల్వలతో-ఉత్పత్తులతో సంపన్న దేశాల జాబితాలో చేరిన లిబియా దేశాన్ని తన ఉక్కు పిడికిలిలో బంధించి తిరుగులేని నాయకుడుగా చెలామణి అవుతున్న గడాఫి, ఫిబ్రవరి నెలలో పెల్లుబుకిన ప్రజాందోళనలో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ప్రజల తిరుగుబాటులను కర్కశంగా అణచి వేసే చర్యలెన్ని చేపట్టినా, పరిస్థితిని అదుపు చేయలేక పోవడంతో, ఆ దేశ ప్రధాన నగరమైన బెన్ ఘాజి తిరుగుబాటు దారుల వశమైంది. అరబ్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపధ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం పొంచి వుందనాలి.

అతి చాకచక్యంగా, నెత్తురు చిందకుండా, సెప్టెంబర్ 1969 లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న గడాఫి "నియంతల్లో అతి పెద్ద నియంతగా" గుర్తింపు తెచ్చుకున్నాడనాలి. తన పాలనలో, అంతా తానే అయిపోయి, తన "వ్యక్తి పూజకు" బాటలు వేసి, పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయంతో తనకూ-తన బంధువులకూ, అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు గడాఫి. తర తరాలకు సరిపోయే సంపదను దేశం వెలుపల భద్రపరచుకున్నాడు. మహిళా అంగరక్షకులను తోడుంచుకుని పయనిస్తూ, ఎడారి దేశదిమ్మరులు నివసించే పెద్ద టెంటు హౌజ్ లాంటి స్థలంలో వుండడానికి ఇష్టపడే ఒక తరహా "నియమ రహిత", "అవాస్తవిక" వ్యక్తిగా గడాఫి ప్రసిద్ధికెక్కాడు. ప్రతి విషయంలోనూ, తనకు తానే సాటి అనిపించుకోవాలనే తపన వున్న మనిషి గడాఫి.

స్వతంత్ర లిబియా దేశపు ఆధునిక చరిత్ర 1951 లో ఆరంభమైంది. జనవరి 1952 కల్లా లిబియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ, నవంబర్ 21, 1949 న ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశం తీర్మానం ఆమోదించింది. రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ముందు, మిత్ర రాజ్యాల ఉమ్మడి సైన్యం 1943 లో ఇటలీ సైన్యాన్ని పారదోలేంతవరకు, లిబియా ఇటలీ వలస పాలనలో వుండేది. లాంఛనంగా ఇటలీ పాలన నుంచి విముక్తి పొందిన లిబియా, ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో, 1947 లో ఫ్రాన్స్-బ్రిటన్ దేశాల ఆధీనంలోకి వచ్చింది. డిసెంబర్ 24, 1951 న లిబియా సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రకటించుకుని, ఇద్రిస్ రాజుగా, "యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ లిబియా" గా మార్పు చెందింది. దరిమిలా, రెండు సంవత్సరాల అనంతరం, మార్చ్ 28, 1953 న అరబ్ లీగ్ లో చేరింది లిబియా. స్వతంత్రం వచ్చిందన్న మాటే కాని, లిబియా కష్టాల్లో కూరుకు పోయింది. అదృష్టవశాత్తు, ఏప్రియల్ 1955 లో పెట్రోలియం ఉత్పత్తులు ఊపందుకోవడంతో, లిబియా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. అయితే పరిస్థితులు రాజు ఆధీనంలోంచి జారిపోసాగాయి. ఇద్రిస్ వైద్య పరీక్షల కోసం, చికిత్స కోసం టర్కీ దేశంలో వుండగా, గడాఫి నాయకత్వంలో సైన్యం తిరుగుబాటు చేయడం, రాచరిక పాలన అంతరించడం, సెప్టెంబర్ 1, 1969 న కేవలం పాతిక సంవత్సరాల వయసులోనే గడాఫి గద్దె ఎక్కడం జరిగింది. ఇక నాటి నుంచీ, లిబియా ప్రజలు నియంతృత్వ పాలనలోనే మగ్గి పోతున్నారు.

మధ్య ప్రాచ్య ప్రాంతంలోని ఈజిప్టు, తునీషియా, బహరైన్, యెమెన్ దేశాలలో జరిగిన-జరుగుతున్న విధంగానే, కనీ వినీ ఎరుగని రీతిలో లిబియా పౌరులు, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, గడాఫి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమం చేపట్టారు. రోజు-రోజుకు ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. అణచివేత కార్యక్రమం కూడా అదే మోతాదులో కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు లిబియాలో జరుగుతున్న మారణ కాండను ఖండించడానికి నాలుగు రోజులు పట్టింది. ఆచి-తూచి మాట్లాడిన ఒబామా, గడాఫి పేరెత్తకుండా, అధికారులను తప్పు పడుతూ ప్రకటన చేశారు. కాకపోతే, దరిమిలా, లిబియాపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులో కొచ్చే దిశగా కదలడం లేదు.

ప్రపంచ చరిత్రలో, రాచరికానికి సంబంధం లేని పాలకుల్లో, ఒక దేశాధినేతగా, అత్యధిక కాలం అధికారంలో వున్న వ్యక్తిగా గడాఫి రికార్డు నెలకొల్పాడు. అలానే లిబియాను ఇంత ఎక్కువ కాలం పాలించిన వారు కూడా ఎవరూ లేరు. అధికారంలో వుంటూనే, ఆస్తులు-అంతస్తులు లెక్కకు దొరకనంత మోతాదులో సమకూర్చుకున్నాడు గడాఫి. యుక్త వయసులో వుండగా, అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు నాజర్ అన్నా, ఆయన అరబ్ సోషలిస్టు-జాతీయ విధానమన్నా గడాఫికి విపరీతమైన అభిమానం వుండేది. 1956 నాటి సూయజ్‌ కాలువ సంక్షోభంలో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలలో చురుగ్గా పాల్గొనేవాడు గడాఫి. లిబియా రాజు ఇద్రిస్ ను పదవీచ్యుతుడు చేసిన గడాఫి, "లిబియన్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించి, తనను తానే మరో "చి గు వేరా" గా పిలుచుకున్నాడు. పాశ్చాత్య దేశాల వ్యతిరేక భావాల తీవ్రవాదులకు కేంద్ర స్థావరంగా లిబియాను రూపుదిద్ద సాగాడు గడాఫి. అమెరికన్లకు సింహ స్వప్నమయ్యాడు. లిబియాను పాలించడానికి, కొత్త తరహాలో, గడాఫి అధ్యక్షుడుగా "రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్" ను ఏర్పాటైంది. ఇతర సైనిక నియంతలు అనుసరించిన విధంగా కాకుండా, తన పేరు ముందర "జనరల్" బిరుదుకు బదులు, కేవలం "కల్నల్" అని మాత్రమే తగిలించుకున్నాడు. ఇప్పటికీ కల్నల్ గడాఫి గానే కొనసాగుతున్నాడు. లిబియా సమాజం "ప్రజలచే పాలించబడే" సమాజం అనీ, తనకు అత్యున్నతమైన సైనిక బిరుదులొద్దని అంటుండేవాడు.

"అరబ్ నేషనలిజం", "సంక్షేమ రాజ్యం", "ప్రత్యక్ష లోక ప్రియ ప్రజాస్వామ్యం", అన్న నినాదాల ప్రాతిపదికగా తన ప్రభుత్వ పాలన వుంటుందని చెప్పుకునేవాడు గడాఫి. తాను అనుసరిస్తున్న విధానం "ఇస్లాం సామ్యవాదం" అని అంటూ, ఒక వైపు చిన్న కంపెనీల అజమాయిషీ ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టుతూనే, భారీ సంస్థలను మాత్రం ప్రభుత్వ పరంగా అధికారుల ఆధిపత్యంలో నడిపేవాడు. 1977 లో తన పంధా మార్చుకున్నాడు. రిపబ్లిక్ ప్రభుత్వం పేరు మార్చి, "ప్రజల ప్రభుత్వం" గా ప్రకటించాడు. "స్థానిక ప్రజాదరణ మండళ్ల" ద్వారా, "సహజీవన వ్యవస్థల" ద్వారా, నేరుగా ప్రజలచే పాలించబడే "ప్రత్యక్ష ప్రజాస్వామ్యం" అమల్లోకి వచ్చిందని ప్రకటించాడు గడాఫి. దేశ వ్యాప్తంగా వుండే ఈ మండళ్ల-వ్యవస్థలపై, జాతీయ స్థాయిలో, గడాఫి "సెక్రటరీ జనరల్" గా "పీపుల్స్ కాంగ్రెస్" ఏర్పాటైంది. 2008 లో మరో విప్లవాత్మక ప్రకటన చేశాడు. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా లభించే ఆదాయం నేరుగా దేశ ప్రజలకు పంచుతానన్నాడు. పొరుగు దేశాలకు సంబంధించి, నాజర్ విధానాలనే పాటించాడు. అరబ్ దేశాల ఐక్యతకు, "ఐక్య అరబ్ జాతి" కొరకు పోరాడుతున్నాననేవాడు. నాజర్ మరణం తర్వాత, అరబ్ జాతి సైద్ధాంతిక నాయకత్వం ఆశించాడు. పాలస్తీనా విమోచన సంస్థకు గట్టి మద్దతిచ్చాడు. 1979 శాంతి ఒప్పందం దరిమిలా, ఆయన ఇజ్రాయెల్ వ్యతిరేకత, లిబియా-ఈజిప్టు మధ్య సంబంధాలు తెగిపోవడానికి దారి తీసింది. తక్షణమే సోవియట్ యూనియన్ తో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు.

దక్షిణాఫ్రికా దేశాల్లోను, ముస్లిం దేశాల్లోను, తిరుగుబాటు వుద్యమాలను-విముక్తి పోరాటాలను ప్రోత్సహించే విధంగా తన అంతర్జాతీయ రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నాడు గడాఫి. 1980 దశకం చివరికల్లా, అంతర్జాతీయ-సీమాంతర ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే ప్రధాన వ్యక్తిగా, పాశ్చాత్య దేశాలు గడాఫిని అనుమానించసాగాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విముక్తి పోరాటాలను ప్రోత్సహించడం వల్ల, సద్దాం హుస్సేన్ ఇరాక్ కు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో ఇరాన్ దేశానికి మద్దతివ్వడం వల్ల, అలనాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఆగ్రహానికి గురయ్యాడు గడాఫి. "మధ్య ప్రాచ్య ప్రాంతపు పిచ్చి కుక్క” గా రీగన్ ఆయనను అభివర్ణించాడు అప్పట్లో. దరిమిలా చోటుచేసుకున్న సంఘటనలు, అమెరికా, లిబియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు చెడిపోవడానికి దారితీశాయి. సద్దాం హుస్సేన్ పతనం అనంతరం, తన దేశంలో "భారీ విధ్వంసక రసాయన అణు ఆయుధాలను" తనిఖీ చేయమని, అంతర్జాతీయ సంస్థలకు తనంతట తానే విజ్ఞప్తి చేశాడు. వాటిని కనుగొని, ధ్వంసం చేసిన అంతర్జాతీయ పర్యవేక్షక దేశాల ప్రతినిధుల ద్వారా ఆయా దేశాల పాలకులతో సంబంధాలను మెరుగు పరచుకున్నాడు గడాఫి. నాటి బ్రిటీష్ ప్రధాని టోనీ బ్లెయిర్ లిబియా పర్యటించడానికి, ఆయన గడాఫిని ప్రశంసించడానికి, సీమాంతర ఉగ్రవాదం అణచివేతలో లిబియా పాల్గొనాలని బ్లెయిర్ కోరడానికి ఆ సంబంధాలు తోడ్పడ్డాయి. క్రమేపీ, అమెరికాతో దౌత్య సంబంధాలు మెరుగవడం, ఫ్రాన్స్ అధ్యక్షుడు లిబియాలో పర్యటించడం జరిగింది. ఒబామా అధ్యక్ష పదవికి పోటీలో వున్నప్పుడు గడాఫి ఆయనను తీవ్రంగా విమర్శించాడు.

ఒకానొక సందర్భంలో గడాఫి భారతదేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటనను చేశారు. ఎన్నాళ్లగానో నలుగుతున్న కాశ్మీరు అంశంపై మాట్లాడుతూ... కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రం హోదాను ఇచ్చేసి భారత్- పాక్‌లు అక్కడ నుంచి శాశ్వతంగా వైదొలగాలని, కాశ్మీరు ఆ రెండు దేశాలకు చెందని దేశంగా పరిగణించాలని అన్నారు. ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో గడాఫి పలు అంశాలపై సుదీర్ఘమైన ప్రసంగం చేస్తూ, సుమారు గంటన్నర పాటు కాశ్మీరు అంశంతోపాటు అమెరికా, ఐక్య రాజ్య సమితిలపైనా మండి పడ్డాడు. భద్రతామండలిని తీవ్రవాద మండలిగా అభివర్ణించాడు. ప్రపంచాన్ని శాసించేటటువంటి కొన్ని కీలక అధికారాలను భద్రతామండలికి కట్టబెట్టడంపై తన అసంతృప్తిని వెల్లడి చేశాడు.

ఈ నేపధ్యంలో, కారణాలే వైనా, ఫిబ్రవరి 17, 2011 న గడాఫి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజల నిరసనలు-ప్రదర్శనలు మొదలయ్యాయి. గడాఫి సైన్యం బెదిరింపులను ఖాతరు చేయకుండా, తుపాకీలకు ఎదురు నిల్చి, ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు ప్రజలు. ఇతర అరబ్ దేశాల నాయకుల మాదిరిగా కాకుండా, గడాఫి తీవ్ర స్థాయిలో అణచివేతకు దిగాడు. తన ప్రాణాలున్నంతవరకు పోరాడుతానని ప్రతిన చేశాడు. తనపై తిరుగుబాటుకు ఒసామా బిన్ లాడెన్ కారకుడని కూడా అంటున్నాడు. అయినా, లాడెన్ ప్రధాన శత్రువు, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, లిబియా పై ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమౌతున్నాడు.

కారణేలేవైనా, ఇటీవలి కాలంలో అరబ్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న తిరుగుబాటులకు, గతంలో సైనిక తిరుగుబాటులకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, అప్పూడూ-ఇప్పుడూ, తిరుగుబాటుల వల్ల నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం వచ్చే అవకాశాలు లేవు. ఆ దేశాల్లోని, ఈ కాలం సైనికులు ప్రభుత్వాలను పడగొట్టడానికి నూతన మార్గాలను ఎంచుకున్నట్లు కనబడుతున్నది. ఉన్న నియంతకు వ్యతిరేకంగా ప్రజలను పురికొల్పి, వారిని గద్దె దింపి, ఆ స్థానంలో అధికారం పొందడమనే వ్యూహం వుందా అన్న ధోరణిలో అక్కడి తిరుగుబాటులు గోచరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నెలకొననంత వరకు తిరుగుబాటు చేసిన ప్రజలకు వారు కోరుకున్నది లభించనట్లే. ఇదిలా వుండగా, అరబ్ ప్రపంచాన్ని అస్థిర పరచడానికి, అమెరికా పన్నిన కుట్రలో భాగంగానే, ఆయా దేశాల్లో తిరుగుబాటులు చోటుచేసుకుంటున్నాయని, ప్రజాస్వామ్యమైనా-నియంతృత్వమైనా, రాబోయే ప్రభుత్వాలు తన కనుసన్నల్లోనే మెలగాలని అమెరికా పన్నాగమని విశ్లేషకులనుకుంటున్నారు.

Wednesday, February 16, 2011

ముబారక్ నిష్క్రమణం-నియంతృత్వంపై ప్రజాస్వామ్యం అఖండ విజయం: వనం జ్వాలా నరసింహారావు


నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఈజిప్ట్ ప్రజల-అందునా యువకుల, పద్దెనిమిది రోజుల సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం, ఆ దేశాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసింది. ముప్పై సంవత్సరాల హోస్నీ ముబారక్ పాలనకు చరమ గీతం పాడిన దేశ పౌరులకు, వారి చిరకాల వాంఛైన ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడే విషయమా, లేక, మరికొంత కాలం సైనిక పాలనే కొనసాగనున్నదా అనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే. తిరుగుబాటు అనంతరం పాలనను చేపట్టిన ఈజిప్ట్ మిలిటరీ నాయకులు, త్వరలోనే రాజ్యాంగాన్ని సవరించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించుతామని, ప్రజల న్యాయమైన హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తామని, ముబారక్ కాలం నుండి అమల్లో వున్న "అత్యవసర చట్టాన్ని" తొలగించుతామని బహిరంగంగా ప్రకటించారు. పౌర పాలన స్థాపనకు శ్రీకారం చుట్టి, ప్రజలెన్నుకున్న నాయకుల కింద పనిచేసేందుకు సైన్యం అంగీకరించుతుందా, లేక, మరో మిలిటరీ నియంత పాలనకు దోహదపడుతుందా తెలియదు.

ఏళ్ల తరబడి బ్రిటీష్ వలస రాజ్యంగా వున్న ఈజిప్ట్, 1952 లో జనరల్ మొహమ్మద్ నెగ్యుబ్ నాయకత్వంలో రాచరిక పాలన నుండి విముక్తి పొందడానికి ముందు, కొంత కాలం పాక్షికంగా-నామ మాత్రపు పార్లమెంటరీ తరహా ప్రాతినిధ్య పాలనలో కొనసాగింది. అలనాటి విప్లవం అనంతరం, జూన్ 18, 1953 న దేశాధ్యక్ష పదవిని చేపట్టిన నెగ్యుబ్ ఎక్కువకాలం పదవిలో కొనసాగలేదు. 1952 విప్లవ అసలు సిసలు వ్యూహకర్త-నాయకుడు గమాల్‌ అబ్దుల్‌ నాజర్‌, 1954 లో నెగ్యుబ్ ను గద్దె దింపి, జూన్ 18, 1956 నాటికల్లా, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లు ప్రకటించాడు. ఇక నాటి నుంచి, మొన్న ముబారక్ దిగిపోయేంతవరకు, ముగ్గురు విభిన్న నాయకుల పాలనలో, ఆటుపోట్ల మధ్య, ఒడిదుడుకుల మధ్య, ఆరోహణ-అవరోహణల మధ్య ఈజిప్ట్ ప్రస్థానం సాగింది. భవిష్యత్ ఇదమిద్ధంగా ఇలా వుండబోతుంది అని చెప్పలేని పరిస్థితికి వచ్చిందిప్పుడు.

ఈజిప్ట్ ప్రజలపైన, సంస్కృతీ-సాంప్రదాయాలపైన, రాజకీయాలపైన, యావత్ అరబ్ ప్రపంచంపైన, గమాల్‌ అబ్దుల్‌ నాజర్‌ ప్రభావం, చెరగని ముద్ర వలె, ఆయన మరణించి నలభై సంవత్సరాలైనప్పటికీ, కొనసాగుతోంది. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే, పౌర సంస్థలను నియంత్రించడంతో పాటు, రాజకీయ పార్టీలన్నింటినీ నిషేధించి, సామ్యవాదానికి అనుకూలమని చెప్పుకునే ఏక పార్టీని నెలకొల్పాడు నాజర్. నాజర్ వ్యక్తిగత-ఏక పక్ష పాలనకు ఎదురు చెప్పలేని స్థితికి ఈజిప్ట్ పౌర వ్యవస్థ లోనైంది. అయినా, దేశంలోపలా-వెలుపలా నాజర్ ప్రజాదరణ గల నాయకుడుగానే ఎదగ సాగాడు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొంద సాగాడు. ప్రపంచ వ్యాప్తంగా, ఆయనకు లభించిన గౌరవానికి ప్రధానమైన నిదర్శనంగా, ఏ రాజ్యకూటమికీ చెందని అలీనోద్యమ ఆవిర్భావానికి నాజర్ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడమే. సామ్రాజ్యవాద వ్యతిరేకతకు ఈజిప్టును కేంద్ర బిందువుగా నాజర్ చేయగలిగాడనడానికి ఉదాహరణగా, సూయజ్‌ కాలువ జాతీయం చేయడం చెప్పుకోవాలి. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, యుగోస్లేవియా ప్రధమ అధ్యక్షుడు మార్షల్ టి టో, ఇండొనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో లతో సమానంగా, అలీనోద్యమ నిర్మాతగా నాజర్ ప్రసిద్ధికెక్కాడు. అగ్రరాజ్యాల మధ్య రగులుతున్న "ప్రచ్ఛన్న యుద్ధం" లో తలదూర్చకుండా, మధ్యేమార్గంలో పయనించడానికి అలీన దేశాలను సిద్ధపర్చిన నలుగురు ప్రముఖుల్లో నాజర్ ఒకరు. అలనాటి ప్రపంచ నాయకులైన చౌ-ఎన్-లై, మావో, ఎన్ కృమా, కెన్నెత్ కవుందా, జాన్ కెన్నెడీ, లిండన్ జాన్సన్, ఇందిరా గాంధీ, ఛార్లెస్ డిగాలే, నికితా కృశ్చేవ్, అలెక్స్ కొసిగిన్ లాంటి ప్రపంచ నాయకుల సరసన, వారితో సమానంగా నాజర్ ను గుర్తించింది ప్రపంచం.

అప్పట్లో నెలకొన్న అంతర్జాతీయ స్థితిగతులను కూలంకషంగా ఆకళింపు చేసుకున్న నాజర్, వాటిని, ప్రత్యేకించి అరబ్ ప్రపంచానికి, గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్ దాడులకు అన్వయించుకుని, తనకు అనుకూలంగా మలచుకుంటూ, అరబ్బీల తిరుగులేని నాయకుడుగా ఎదగ సాగాడు. ఒక వైపు అలీనోద్యమం బోధిస్తూనే, తన దేశ రక్షణ విషయంలో, ఆయుధాలను సమకూర్చుకోవడానికి, పాశ్చాత్య అగ్రరాజ్యంవైపు పోకుండా, కమ్యూనిస్టుల సహాయంపై దృష్టి సారించాడు. మరో వైపు, తనకు అనుకూలమైన నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని, ఏక పార్టీ అయిన "నేషనల్ యూనియన్" ఏకైక అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి, ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఆయన దేశీయ-విదేశాంగ విధానాలు, నాజర్ ను అమెరికన్లకు దూరం చేశాయి. నైలు నదిపై కడుతున్న వంతెన నిర్మాణానికి అమెరికా-బ్రిటన్ల ఆర్థిక సహాయం ఆగిపోవడంతో, ప్రతీకారంతో, సూయజ్‌ కాలువను జాతీయం చేసి, అరబ్బీల "హీరో" గా ఖ్యాతికెక్కాడు. ఇదిలా వుండగా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం నేపధ్యంలో, అంతవరకు నాజర్ కు అనుకూలంగా లేని అమెరికా అధ్యక్షుడు ఐసన్ హూవర్, అక్టోబర్ 1956 లో ఈజిప్ట్ పై ఇజ్రాయెల్ చేసిన దాడిని బహిరంగంగా ఖండించాడు. తాత్కాలికంగా యుద్ధం ఆగిపోయింది. మూసేసిన సూయజ్‌ కాలువ తిరిగి తెరిచింది ఈజిప్ట్ ప్రభుత్వం. అంతర్జాతీయంగా నాజర్ పరపతి పెరిగింది.

ఆయుధాల కొరకు కమ్యూనిస్టు దేశాలను ఆశ్రయించినప్పటికీ, ఎప్పుడైతే, సిరియా దేశం కమ్యూనిస్ట్ ప్రాబల్యంలోకి రాబోతున్నదని భావించాడో, తక్షణమే, "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించి, సిరియాను ఈజిప్టులో విలీనం చేసి, ఫిబ్రవరి 1958 లో, యు.ఏ.ఆర్ అధ్యక్షుడుగా ప్రకటించుకున్నాడు నాజర్. అరబ్ ప్రపంచంలో నాజర్ కమ్యూనిజానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాడు. ఆ పార్టీ కార్యకలాపాలను నిషేధించాడు కూడా. పార్టీపై నిషేధాన్ని ఎత్తి వేయాలని కృశ్చేవ్ చేసిన అభ్యర్థనను మన్నించని నాజర్, ఆ విషయం తమ అంతర్గత వ్యవహారం అంటూ కొట్టి పారేశాడు. చివరకు, సెప్టెంబర్ 1961లో, సిరియన్ సైన్యం స్వతంత్రం ప్రకటించుకోవడంతో, యు.ఏ.ఆర్ ఉనికి కోల్పోయింది. ఆ మనస్థాపంతో, దానికి ప్రధాన బాధ్యత వహించిన నాజర్ ఆరోగ్యం క్షీణించసాగింది. సిరియన్ పరిస్థితులు ఈజిప్ట్ లో తలఎత్తకుండా జాగ్రత్త పడ్డాడు నాజర్. సామ్యవాద ఎజెండాతో ప్రజలను ఆకర్షించుకోవాలనుకున్నాడు. "నేషనల్ యూనియన్" పార్టీ పేరు మార్చి, "అరబ్ సోషలిస్ట్ యూనియన్" అని పిలవ సాగాడు. అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తిని అణచేందుకు, తనను తానే "సాయుధ బలగాల ప్రధాన అధికారి" గా ప్రకటించుకున్నాడు. రాజ్యాంగాన్నితిరగ రాశాడు. ప్రజోపయోగమైన విధానాలను ప్రకటించాడు. సహ-విద్య లాంటి సంస్కరణలను అమలు చేశాడు. విడాకుల చట్టాన్ని సవరించాడు.

ఇజ్రాయెల్ పై పోరు కొనసాగించడానికి వీలుగా, "అరబ్ లీగ్ శిఖరాగ్ర సభ" ను నిర్వహించి, ఉమ్మడి అరబ్ కమాండును ఏర్పాటు చేశాడు నాజర్. పాలస్తీనా విమోచన కొరకు పోరాటం చేస్తున్న వివిధ ముఠాలను ఐక్యం చేసి, ఒకే గొడుగు కిందకు తేవడానికి 1964, "పాలస్తీనా విమోచన సంస్థ" ను నెలకొల్పిన నాజర్, అదే సంవత్సరం అలీన ఉద్యమం అధ్యక్షుడుగా ఎన్నికైనాడు. ఏడాది తర్వాత, మరో ఐదేళ్ల పాటు కొనసాగేందుకు వీలుగా, ఈజిప్ట్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు. 1967 ఈజిప్ట్ కు కష్టాలు మొదలయ్యాయి. ఈజిప్ట్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ఆరంభించి, కేవల మూడు రోజుల్లోనే, సినాయ్-గాజా భాగాలను గెలుచుకుంది. ఓటమిని బహిరంగంగా ఒప్పుకున్నాడు నాజర్. జోర్డాన్ లోని వెస్ట్ బాంక్, సిరియాలోని గోలాన్ హైట్స్ కూడా ఆక్రమించుకుంది ఇజ్రాయెల్. జూన్ 10, 1967 న నాజర్ చేసిన రాజీనామాను, ఒక్క గొంతుతో, యావత్ ఈజిప్ట్ ప్రజానీకం తిరస్కరించింది. "గమాల్..మేమంతా నీ సైనికులం" అని ఎలుగెత్తి చాటుకుంటూ, వీధుల్లోకి వచ్చిన ఈజిప్ట్ ప్రజల ఆదరాభిమానాలకు స్పందించిన నాజర్, రాజీనామాను ఉపసంహరించుకున్నాడు. సోవియట్ యూనియన్ నాజర్ కు అండగా నిలిచింది. ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. అమెరికాతో నాజర్ అదే పని చేశాడు. ఈజిప్ట్ పునరుద్ధరణలో భాగంగా, నాజర్ మరింత నియంతగా మారాడు. ఆక్రమిత ఈజిప్ట్ ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని ఐక్య రాజ్య సమితి తీర్మానం చేసింది. దరిమిలా ఇజ్రాయెల్ పై యుద్ధానికి నాయకత్వ బాధ్యతను పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ కు అప్పగించాడు. ఇంతలో, జోర్డాన్ రాజు హుస్సేన్ కు, యాసర్ అరాఫత్ కు మధ్య తల ఎత్తిన విభేదాలను పరిష్కరించడానికి, సెప్టెంబర్ 1970 లో అరబ్ లీగ్ శిఖరాగ్ర సభను ఏర్పాటు చేశాడు. సమావేశం రాజీ మార్గంలో ముగిసింది.

సెప్టెంబర్ 28, 1970 న శిఖరాగ్ర సభ ముగిసిన కొద్ది సేపటికే, తీవ్రమైన గుండె పోటు రావడంతో నాజర్ మరణించాడు. అక్టోబర్ మొదటి తేదీన జరిగినా నాజర్ అంతిమ యాత్ర చరిత్రలో మరపురాని సంఘటనగా పేర్కొనవచ్చు. పది కిలో మీటర్ల అంతిమ యాత్రలో, నాజర్ శవ పేటిక, అందులో పాల్గొన్న ఏబై లక్షల మంది ప్రజల భుజాల మీదుగా కదిలిందట. అరబ్ దేశాధి నేతలందరితో పాటు, సోవియట్ ప్రధాని కొసిగిన్, ఇతోపియా రాజు సెలాస్సీ పాల్గొన్న వారిలో వున్నారు.

1952 విప్లవం రోజుల నాటి నాజర్ సహచరుడు, ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన అన్వర్ సాదత్, ఈజిప్ట్ మూడవ అధ్యక్షుడయ్యాడు. ఆయన పదకొండేళ్ల పాలన, ఏక పార్టీ స్థానంలో, బహుళ పార్టీల ఏర్పాటుకు దోహద పడింది. 1973 లో ఇజ్రాయెల్ పై జరిగిన యుద్ధంలో, ఈజిప్ట్ సాధించిన విజయం, దరిమిలా ఇరు దేశాల మధ్య కుదిరిన "ఈజిప్ట్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం", సాదత్ ను ఆయన దేశంలో "హీరో" చేయడమే కాకుండా, ఆయనకు నోబెల్ శాంతి బహుమానం రావడానికి కూడా కారణమైంది. కాకపోతే, అదే కారణాన, అరబ్ ప్రపంచంలో ఆయన కొంత అనాదరణకు కూడా గురయ్యాడు. అరబ్ లీగ్ లో సభ్యత్వం కోల్పోయింది ఈజిప్ట్. శాంతి ఒప్పందం పూర్వ రంగంలో, నవంబర్ 19, 1977 న ఇజ్రాయెల్ సందర్శించిన అన్వర్ సాదత్, ఆ దేశ ప్రధాని మెనాకెమ్ బెగిన్ ను కలవడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన పరిణామంగా భావించారు. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సమక్షంలో, వాషింగ్టన్ లో, మార్చ్ 26, 1979 న కుదిరిన శాంతి ఒప్పందం, పలువురు అరబ్బీలకు నచ్చలేదు. అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయాన్ని, కైరో నుంచి, టునిసియా రాజధాని టునిస్ కు మార్చారు. "సంస్కరణ విప్లవం" పేరుతో ఆయన చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, పలువురు నాజర్ మద్దతు దారులు, రాజకీయ నాయకులు జైళ్లపాలయ్యారు. అక్టోబర్ 6, 1981 న హత్యకు గురైన సాదత్ స్థానంలో, ఆయన ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్న హోస్నీ ముబారక్ ఎన్నికయ్యారు. 28 సంవత్సరాలు తిరుగులేని నాయకుడుగా పెత్తనం సాగించి, ప్రజల ఆగ్రహానికి గురై, దేశం వదలి పారిపోయాడు.

ఇజ్రాయెల్ కు ముబారక్ ఇచ్చిన మద్దతు వల్ల, ఆయనకు, అమెరికా అండ దండలు పుష్కలంగా లభించాయి. ఆయన పాలనలో, ముబారక్ ను విమర్శించిన ప్రతివారూ, జైలు పాలయ్యారు. వాక్ స్వాతంత్ర్యం అనేది లేనే లేదు. అమెరికా ఆలోచనలు అనుగుణంగా తీవ్ర వాదాన్ని ఎదుర్కోవడంలో తోడ్పడ్డాడు. దేశాన్ని అస్థిరం కాకుండా చూడగలిగాడు కాని, దాని కొరకు, ప్రజలు చెల్లించిన మూల్యం విలువ కట్ట లేనిది. సాదత్ హత్యకు గురైన అనంతరం ముబారక్ విధించిన అత్యయిక పరిస్థితి నిరవధికంగా కొనసాగుతూ వచ్చింది. అరబ్ లీగ్ లో తిరిగి సభ్యత్వం పొంది, ప్రధాన కార్యాలయాన్ని కైరోకు మార్పించ గలిగాడు.

ప్రజలు ఆకాంక్షించే ప్రజాస్వామ్యాన్ని ఇవ్వని ముబారక్ పై ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆయన్నైతే తొలగించగలిగారు కాని, ప్రజాస్వామ్యాన్ని ఇంతవరకూ పునరుద్ధరించుకోలేక పోయారు. అది జరిగిన నాడే, వారి తిరుగుబాటుకు సాఫల్యం అనుకోవాలి.

Monday, February 14, 2011

Hosni Mubarak’s Exit-A Great Triumph of People : Vanam Jwala Narasimha Rao

Hosni Mubarak’s Exit-A Great Triumph of People!
Egypt of Nasser, Sadat and Mubarak
Vanam Jwala Narasimha Rao

An 18-day revolt led by the youth of Egypt ousted President Hosni Mubarak. Whether Mubarak’s exit would usher Egypt have a democratic set-up or continue to be under military dictatorship is a million dolor question. People obviously want a fundamental democratic change and open elections. The Military which controls Egypt now, in a statement ensured the amendment of the Constitution to “conduct free and fair presidential elections”. “The armed forces are committed to sponsor the legitimate demands of the people,” the statement declared, and the military promised to ensure the fulfillment of its promises “within defined time frames” until authority could be passed to a “free democratic community that the people aspire to.” It pledged to remove the “emergency law.” Whether the military will subordinate itself to a civilian democracy or install a new military dictator is difficult to predict now.

Egypt-for long a British protectorate, adopted Parliamentary Representative system and enjoyed partial internal autonomy before it was liberated from the Monarch rule by General Muhammad Neguib in 1952 revolution. Neguib who became the first President of the Egyptian Republic on June 18, 1953 was toppled in 1954 by Gamal Abdel Nasser-the Principal Architect of the 1952 revolution.

Nasser led Egypt to full independence on June 18 1956. His mark on Egypt, its people, culture, and politics is Indelible even forty years after his death. Nasser established a populist-socialist single party state banning all political parties and regulating every civil association. The civil society became very weak and opposition to Nasser's personal autocracy was negligible. Nasser consolidated personal and political power. The best indicator of his popularity as one of the great world leaders of his times is the Non-Aligned Movement-formation of an intergovernmental organization of states-which maintained equidistance from the major powers. Under the leadership of Nasser Suez Canal was nationalized and Egypt was seen as center point for anti-imperialist activity.

Nasser along with the then Prime Minister of India Jawaharlal Nehru, Yugoslavia First President Marshal Joseph Broz Tito, Indonesia First President Sukarno, the co-founders of Non-Aligned Movement, were recognized all over the world as the four prominent leaders of advocating middle course of states in the developing world away from the Cold War between Western and Eastern Blocks. Nasser was seen either as an equal or at times even above some of the world Prominent Leaders like the then Chinese Prime Minister Chou Enlai, Chinese Communist Party Leader Mao, Nkrumah of Ghana, First President of Zambia Kenneth David Kaunda, 35th and 36th Presidents of USA John F Kennedy and Lyndon B Johnson, Nehru’s daughter and third Indian Prime Minister Indira Gandhi, President of France for over a decade Charles De Gaulle and former Soviet Premier Nikita Khrushchev.

Nasser on joining the army and progressing in the career gained importance. He was once summoned by the then British Controlled Prime Minister and was interrogated on the suspicion that he was forming a secret group of dissenting army officers in 1949. Though he denied the allegation, the “Association of Free Officers” was formed and started talking of freedom for Egypt. Two years later Nasser decided to launch large scale assassination campaign and guerilla attacks on British. Nasser determined to establish the independence of the army from the monarchy. Consequent to the developments that preceded and succeeded Egyptian Revolution of 1952, Nasser planned for the takeover of the government by Army Units loyal to Association. Following success of the revolution in just one day, Muhammad Naguib became the first President of Republic of Egypt and the monarchy was abolished.

“Association of Free Officers” was renamed as “Egyptian Revolutionary Council” chaired by Naguib with Nasser as Vice-Chairman. Both of them were also Prime Minister and Deputy Prime Minister respectively. Nasser being more powerful among them initiated banning all political parties and creating one-party system but favored to hold parliamentary elections. Following an assassination attempt on him, Nasser ordered the largest crackdown by arresting more than twenty thousand people. President Naguib was removed and was put under house arrest. Nasser toured extensively and through his speeches and acts gained control of the media. Soon he got himself appointed as President pending an election in January 1955.

Nasser took advantage of international scenario with specific reference to Arab World as well as Israel attacks in the Gaza Strip and projected himself as leader of Arab World. He emerged as prominent person of Non-Aligned Movement. In order to acquire arms to defend his country he preferred Communist Block over Western Countries. The New Constitution of Egypt was drafted in January 1956 and as the nominee of “National Union”-the single party-Nasser was elected as President of Egypt. Nasser’s policies both domestic and international alienated American support to him. When USA and Britain withdrew financial support for Aswan High Dam across the Nile River, Nasser announced nationalization of Suez Canal Company. This decision of him made a Great Hero throughout Arab World.

The Israeli war on Egypt, sequel to a secret agreement between Britain, France and Israel in October 1956 was publicly condemned by US President Eisenhower. Israel and its British and French allies had to withdraw. The Suez Canal that was closed was reopened. Nasser’s position became very strong in the international scene. Later developments made him more popular. Following developments in Syria which appeared close to becoming a Communist Satellite, Nasser formed the “United Arab Republic” with a total merger of both the nations-Egypt and Syria-in February 1958 and he became its President. Nasser always opposed Communism in the Arab World and even banned. When once he met Nikita Khrushchev, Nasser refused his request to lift the ban stating that it was an internal affair. However in September 1961 Syrian Army Units declared independence and the UAR collapsed. Nasser accepted personal responsibility for the collapse of UAR and his health deteriorated after the dissolution of the Union.

To preempt a Syrian like situation in Egypt, Nasser brought in Socialist Agenda in the country. The National Union Political Party was renamed as Arab Socialist Union. North Yemen civil war, Algerian independence, military coup in Iraq and connected developments also made Nasser popular once again. To overcome couple of internal dissentions Nasser appointed himself as Chief of the Armed Forces in 1963. Nasser introduced a new Constitution and the National Charter in 1964. The latter called for universal health care, provision of housing, building of vocational schools, widening the Suez Canal, an increase in women's rights, and developing a program for family planning. In addition, he attempted to maintain oversight of the country's civil service to prevent it from inflating and consequently becoming a burden to the state. He allowed gender-mixed schools, introduced evolution as an acceptable subject matter to discuss, amended divorce laws, and merged religious courts into civil ones.

Nasser sought to firmly establish Egypt as the leader of the Arab world and to promote a second revolution in Egypt with the purpose of merging Islamic and socialist thinking to satisfy the will of the general populace. He called for an Arab League Summit and also for the creation of the United Arab Command against Israel. In May 1964 he founded the Palestine Liberation Organization (PLO), an umbrella group of various groups. Nasser became President of Non-Aligned Movement in the same year and held the second meet in Cairo. Nasser was reelected for another six-year term as President in March 1965.

In the year 1967 Egypt had problems of war. In fact Soviet Union cautioned Nasser of the Israel’s intentions of a large scale war against Syria. Nasser in his speech to UN General Assembly in May that year raised the issue of the rights of Palestinian people. He believed war was inevitable. In June first week Israel attacked Egyptian Airfields. Within three days Nasser appeared on Television and informed the Citizens of the Country’s defeat. Israel captured the entire Sinai Peninsula and Gaza Strip from Egypt, the West Bank from Jordan, and the Golan Heights from Syria in the next two days. Nasser announced his resignation on 10th June 1967. Entire population of the country, on hearing his resignation over television, in one voice rejected, pouring in to streets. Nasser’s resignation speech goes like: “I have taken a decision with which I need your help. I have decided to withdraw totally and for good from any official post or political role, and to return to the ranks of the masses, performing my duty in their midst, like any other citizen. This is a time for action, not grief.... My whole heart is with you, and let your hearts be with me. May God be with us-hope, light and guidance in our hearts”. Responding to the demonstrators slogans that “We are your Soldiers Gamal” Nasser retracted his decision next day.

The Soviet Union resupplied the Egyptians what they needed and broke diplomatic relations with Israel. Nasser cut his relations with the USA. At home he arrested many army generals. Nasser slowly moved towards creating a full dictatorship in Egypt and assumed the roles of Prime Minister and Commander-in-Chief of the armed forces. In November 1967 Nasser accepted UN Resolution which called for Israel’s withdrawal from occupied territories. In June 1968 Nasser commenced the “War of Attrition” against Israel. He allowed Soviets to construct naval Facilities. By then Yasser Arafat became the leader of PLO. The battle was perceived as an Arab-Palestinian victory. Nasser decided to entrust the battle leadership against Israel to Arafat. During his visit to Moscow Nasser introduced Arafat to high-level Soviet Officials. There was a cease-fire in the Attrition War in August 1970.

Nasser held an emergency Arab League Summit on 27th September to sort-out differences between King Hussein and PLO leadership. The participants literally crossed swords while Nasser pleaded with Arafat and Hussein to put an end to the verbal fight. The conference ended on a compromise note.

On 28 September 1970, at the conclusion of the summit, Nasser suffered a heart attack and was pronounced dead soon after. Following the announcement of Nasser's death, Egypt and the Arab world were in a state of shock. His funeral procession through Cairo, on 1 October, was attended by at least five million mourners throughout the 10-kilometre procession to his burial site. His flag-draped coffin was attached to a gun carriage pulled by six horses and led by a column of cavalrymen. All Arab heads of state attended. King Hussein of Jordan and PLO leader Yasser Arafat cried openly while Muammar al-Gaddafi of Libya reportedly fainted twice. Soviet premier Alexei Kosygin also attended. Almost immediately after the procession began, mourners had engulfed Nasser's coffin shouting "There is no God but Allah, and Nasser is God's beloved... Each of us is Nasser." Police unsuccessfully attempted to quell the crowds and as a result, most of the foreign dignitaries surrounding his coffin, including Kosygin, Hussein, French premier Jacques Chaban-Delmas, and Haile Selassie of Ethiopia were evacuated. The final destination was the Nasr Mosque, renamed Abdel Nasser Mosque, where Nasser was buried. An Egyptian political activist who was imprisoned by Nasser for four years claimed that "Nasser's greatest achievement was his funeral. The world will never again see five million people crying together”.

Anwar Sadat, a senior member of the “Association of Free Officers” during the 1952 Egyptian Revolution and a close confidant of Nasser, succeeded him as President of Egypt. His eleven years rule brought in the Multi Party System. Sadat’s success against Israel in the 1973 war culminating in “Egypt-Israel Peace Treaty” not only made him a Hero in Egypt but also won him the Nobel Peace Prize of that year. Sadat also became equally un-popular and his country had to lose membership in the Arab League. Contrary to expectations of Nasser’s supporters, Sadat surprised many with his tactical and shrewd political moves to emerge as a strong leader. His famous “Corrective Revolution”, a step to purge Nasserist members of the government and security forces as well as imprisonment of other political forces paid rich dividends to Sadat.

The 1973 October war suddenly launched by Sadat against Israel and the initial victories restored popular morale throughout Arab World that was lost during Nasser’s days. Israel recognized Egypt as a formidable force. The peace process had thus begun. Sadat’s peace move gained support from religious leaders including support from Pope Paul VI. When he visited Israel on November 19, 1977 and met Prime Minister Menachem Begin, he became the first Arab Leader to do so. Towards achieving a comprehensive peace to the Arab-Israeli Conflict, Anwar Sadat and Menachem Begin facilitated by US President Jimmy Carter, signed the “Egypt-Israel Peace Treaty” in Washington on 26th March 1979. Both the signatories were awarded with Nobel Peace Prize. The Treaty that got wide support in Egypt however was seen as a betrayal by many Arabs. Arab League expelled Egypt and the League’s Head Quarters was moved from Cairo to Tunis-capital of Tunisia.

On October 6, 1981 Sadat was assassinated in Cairo. Among others Egypt Vice-President Hosni Mubarak was also wounded. His funeral was attended by record number of dignitaries. Sadat was succeeded by Hosni Mubarak and has held office for nearly 28 years.

Mubarak has been a central figure in the world's most volatile region for decades. His support for Israel won him the support of the West. Government critics are routinely jailed and freedom of expression and assembly are restricted. Egypt has long been a leader of the Arab world, and Mubarak, has successfully negotiated the complicated issues of regional security, solidifying a relationship with Washington, maintaining cool but correct ties with Israel and sharply suppressing Islamic fundamentalism and terrorism. He is one of the world’s longest-serving presidents. His iron grip on every level of Egyptian society has kept the Arab world’s most populous nation stable, but at a price.

Mubarak declared emergency rule immediately after Sadat’s assassination and renewed regularly. The decree allows Mubarak to seize or censor all publications and other media outlets. Mubarak made few friends among Palestinians. He proved incapable of influencing the Palestinian-Israeli peace process. Mubarak reestablished relations with Arab countries, beginning the Gulf's oil powers, and by 1989 won Egypt's return to the league. Cairo again became its headquarters.

But…people prefer democracy…and they agitated. They could get rid of Mubarak. Whether they would get democracy that they cherished is still awaited.

Sunday, February 6, 2011

మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు:వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 2011 న మల్లు అనంతరాములు 21 వ వర్ధంతి సందర్భంగా....
మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు
వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 1990 ఉదయం రాజ్ భవన్ ప్రాంగణంలో నివసిస్తున్న మా ఇంటికి "బ్రేక్ ఫాస్ట్ అతిథి" గా వచ్చిన డాక్టర్ మల్లు అనంతరాములు ఎంతో ఉల్లాసంగా-ఉత్సాహంగా కనిపించారు. రాజీనామా చేసిన కుముద్ బెన్ జోషి స్థానంలో నియమితులైన కృష్ణకాంత్, ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా, అదే రోజున, మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజ భవన్ కు మల్లు వస్తున్నందున, నేను ఆయనను మా ఇంటికి ఆహ్వానించాను. డాక్టర్ చెన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నుకోవడంతో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రాజీనామా చేసిన ఆయన స్థానంలో, అధిష్ఠానం మల్లును పీసీసీ అధ్యక్షుడుగా నియమించింది. ఆ హోదాలో ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడుగా నియామకం కావడానికి రెండు నెలల పూర్వం, 1989 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, రెండో పర్యాయం, మహబూబ్ నగర్ జిల్లా-నాగర్ కర్నూల్ రిజర్వు డు నియోజక వర్గం నుంచి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు మల్లు. ఉదయం బ్రేక్ ఫాస్టులోను, ఆ తర్వాత గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంలోను, ఎప్పటిలాగా చురుగ్గా-సరదాగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ గడిపిన మల్లు అనంతరాములు, ఆ మధ్యాహ్నమే హఠాత్తుగా మరణించారన్న వార్తను ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారితో సహా ఎవరూ నమ్మలేక పోయారు. మల్లు మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్య మంత్రి చెన్నారెడ్డి స్వయంగా ఆయన మాటల్లో చెప్పిన సంతాప సందేశాన్ని సీఎం పీఆర్వోగా పత్రికల వారికి, ఆయన కుటుంబ సభ్యులకు పంపాను. రాష్ట్ర శాసన సభకు, దేశ వ్యాప్తంగా లోక్ సభకు, జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాల్లో మల్లు వహించిన పాత్రను అప్పటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి, ఘనంగా పొగుడుతూ మల్లుకు నివాళులు అర్పించారు.

పెద్దవాళ్ల మధ్య పెద్దవాడి గాను, చిన్న వాళ్ల మధ్య పెద్ద తరహా గాను మలగుతూ, అందరినీ తన వారిగా భావించే మనస్తత్వమున్న అనంతరాములు మల్లు, స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అరుదైన దళిత నాయకుడు. పదవిలో వున్నా-లేకపోయినా, సన్నిహితులకు-అంతగా పరిచయం లేని ఇతరులకు, తన చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు మల్లు. ఒకే జిల్లాకు చెందిన మా ఇద్దరికి, రెండు దశాబ్దాల పరిచయం. మొట్టమొదటి సారి, మా జిల్లా నుంచి కాకుండా, మహబూబ్ నగర్ జిల్లానుంచి 1980 లో లోక్ సభ కు ఎన్నికైన తర్వాత, రాజకీయంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఢిల్లీ నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, నాకు-మితృడు భండారు శ్రీనివాస రావుకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం, వచ్చిన తర్వాత, ఇక్కడున్నన్ని రోజులు కలిసి మెలిసి వుండడం తప్పని సరిగా జరిగేది. ఒక సాధారణ "వీ ఎల్ డబ్ల్యూ" గా పని చేసి, కాంగ్రెస్ సంస్థలో ఉన్నత పదవులను అలంకరించిన అతి కొద్దిమంది దళితుల్లో మల్లు ఒకరు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడడం ఆయన కార్య దక్షతకు, పట్టుదలకు నిదర్శనం. వీ ఎల్ డబ్ల్యూ యూనియన్ క్రియాశీలక వ్యక్తిగా మల్లులో నిబిడీకృతమైన నాయకత్వ లక్షణాలు, ఖమ్మం జిల్లా నాయకులతో సహా రాష్ట్ర స్థాయి నాయకులకు ఆయనను చేరువ చేసింది. ఆయన ఉపన్యాసాలు శ్రోతలను ఉర్రూతలూగించేవి. ఎమర్జెన్సీ నేపధ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర స్థాయిలో అధికారం, రాష్ట్ర స్థాయిలో పట్టు కోల్పోయిన ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మల్లు లాంటి వారి అవసరం కలిగింది.

1978 లో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో, ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నో ఎన్నికల సభల్లో ఆయన ఉపన్యాసాలు, కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర నాయకత్వాన్ని మెప్పించాయి. అప్పటి ముఖ్య మంత్రి చెన్నారెడ్డి మల్లు నాయకత్వ లక్షణాలను గుర్తించి, ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, నాగర్ కర్నూల్ నియోజక వర్గం లోక్ సభ టికెట్ ఇప్పించారు. ఆయన ఘన విజయం సాధించడంతో, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం ఆరంభమయింది. పార్లమెంటు సభ్యుడుగా ఢిల్లీలో అడుగు పెడుతూనే, కేంద్ర నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోకుండా, నియోజక వర్గం అభివృద్ధికి ఉపయోగించుకుంటూ, ప్రజలకు చేరువయ్యారు. నాటి ఆర్థిక సహాయ మంత్రి జనార్థన్ పూజారి తోడ్పాటుతో, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు ప్రదేశాల్లో రుణ మేళాలు ఏర్పాటు చేసి, షెడ్యూల్డు కులాల వారికి-తెగల వారికి-వెనుక బడిన వర్గాల వారికి ఎన్నో రకాల ఆర్థిక సహాయం అందేలా చూశారు మల్లు. నాగర్ కర్నూలు తో సహా, స్వస్థలమైన ఖమ్మం జిల్లా వాసులకు కూడా సహాయ పడే వారాయన. కార్య శీలతకు, కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలూ అంకితమై పనిచేస్తున్న వారికి పార్టీలో గుర్తింపు దొరకడం కష్టం కాదని మల్లు నిరూపించారు. ఖమ్మం జిల్లా స్వంత గ్రామం లక్ష్మీపురంలో, ఆత్మీయుల మధ్య పార్టీ వ్యవహారాలు చర్చిస్తున్న సందర్భంలో, నాటి ప్రధాని-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పాతికేళ్ల క్రితం, దేశ రాజధాని నుంచి కుగ్రామానికి ప్రధాన మంత్రి దగ్గర నుంచి నేరుగా పిలుపు రావడం సాధారణ విషయం కాదు. మల్లు ప్రతిభే దానికి కారణం. పదమూడు రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అప్పగించు తూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మల్లును నియమిస్తున్నట్లు రాజీవ్ గాంధి నుంచి సమాచారం అలా చేరింది ఆయనకు.

న్యూ ఢిల్లీలోని మల్లు కార్యాలయం ఎప్పుడూ అత్యంత కోలాహలంగా వుండేది. గత పది-పదిహేనేళ్లలో జాతీయ స్థాయికెదిగిన పలువురు కాంగ్రెస్ నాయకులను మల్లు అనంతరాములు దగ్గర కలిసే అవకాశం కలిగింది. తన దగ్గర కొచ్చిన ప్రతి వారినీ, బయట వరకు వచ్చి పంపడం ఆయన అలవాటు. ఎప్పుడన్నా పని ఒత్తిడుల వల్ల అలా వీలు కాకపోతే తప్ప, సాధారణంగా ఆయన ఆ మర్యాద పాటించేవారు. ఇతరులకు పరిచయం చేసేటప్పుడు, తన స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పడం మల్లు లోని సద్గుణం. అడిగిన పని తనకు సాధ్యం కాదని అనే అలవాటు ఆయనలో లేదు. ప్రయత్న లోపం వుండదని దానర్థం. మల్లు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా, రాజీవ్ గాంధి ఆయనను నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడుగా నియమించారు. ఆ పదవిలోనూ మల్లు రాణించారు. రాజీవ్ గాంధీకి మరింత చేరువ కావడానికి ఆ పదవి తోడ్పడింది. పార్టీ ప్రయోజనాలకై చాలా మందికి తెలియని ఎన్నో గురుతర బాధ్యతలను రాజీవ్ గాంధి ఆయనకు అప్ప చెప్పారు. ఎంఏ వరకు చదువుకున్న మల్లు పార్లమెంటు సభ్యుడైన తర్వాత రీసెర్చ్ చేసి, పీ హెచ్ డి తెచ్చుకుని, డాక్టర్ అనంతరాములు మల్లు ఐపోయారు.

ఎన్ టీ రామారావు సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో కొచ్చిన తెలుగు దేశం పార్టీని ఓడించడానికి చెన్నారెడ్డి నాయకత్వంలో 1989 లో ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ, మరో పర్యాయం, మల్లు అనంతరాములుకు నాగర్ కర్నూలు లోక్ సభ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఆయనకు శాసన సభకు పోటీ చేయాలని మనసులో కోరికగా వుండేది. వీలుంటే ఖమ్మం జిల్లాలో ఏదైనా నియోజక వర్గం నుంచి టికెట్ వస్తే బాగుండేదనుకునేవారాయన. కాకపోతే, ఖమ్మంలోని రిజర్వుడు నియోజక వర్గాల నుంచి గతంలో పోటీ చేసిన వారు కాని, సిట్టింగ్ అభ్యర్థులు కాని పోటీ చేస్తుండడంతో మల్లుకు అవకాశం దొరకడం కష్టమైంది. రాజీవ్ గాంధీ ఆదేశం కూడా లోక్ సభకు పోటీ చేయమనే. తనకు పార్టీ విజయం ముఖ్యమని, రాష్ట్రంలోను-దేశంలోను, ప్రత్యేకించి తనకప్పగించిన పదమూడు రాష్ట్రాలలోను, అభ్యర్థుల విజయానికి తన పూర్తికాలం వినియోగిస్తానని చెప్పినప్పటికీ, రాజీవ్ గాంధీ మల్లును నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. తన నియోజక వర్గంతో పాటు, ఇతర నియోజక వర్గాలలోను మల్లు ప్రచారం చేశారు. లోక్ సభకు మరో మారు గెలిచారు. కాకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలోకొచ్చింది. 1989 ఎన్నికల్లో, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం కొరకు రాజీవ్ గాంధీ కూడా వచ్చారు.

మర్రి చెన్నారెడ్డి స్థానంలో పీసీసీ అధ్యక్షుడుగా నియామకం జరిగిన నాటి రాత్రి పది గంటల సమయంలో మర్నాడు హైదరాబాద్ వస్తున్న సంగతి ఫోన్ చేసి మరీ చెప్పారు మల్లు అనంత రాములు స్వయంగా. పీసీసీ అధ్యక్షుడుగా ఆయన నియామకం చేయడానికి బలవత్తరమైన కారణం వుండొచ్చు. బ్రతికున్నట్లయితే, మర్రి చెన్నారెడ్డి తర్వాత, బహుశా మల్లుకు ముఖ్య మంత్రి అయ్యే అవకాశం వచ్చి వుండేదేమో! నేను ముఖ్య మంత్రి చెన్నారెడ్డి పీఆర్ వో గా పని చేస్తున్నప్పటికీ, మల్లు పీసీసీ అధ్యక్షుడుగా హైదరాబాద్ మొదటిసారి వచ్చినప్పుడు బేగంపేట విమానాశ్రయానికి పోవడమే కాకుండా, ఆయన వెంట వూరేగింపులో కొంత సేపు ప్రయాణం కూడా చేశాను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మల్లు పలువురి మన్ననలను, ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఎన్నో నూతన ఒరవడులకు నాంది పలికారు. ముఖ్య మంత్రికి, ఇతర మంత్రులకు, గాంధీ భవన్ కు మధ్య వారధిగా పని చేశారు. ముఖ్య మంత్రిని కలవడానికి వచ్చినప్పుడు ఇతర సందర్శకులలాగానే వ్యవహరించేవారు తప్ప, తన కంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరేవారు కాదు.

అది యాధృఛ్చికమో, దైవ సంకల్పమో కాని, మల్లు అనంతరాములు హఠాత్తుగా మరణించడానికి కొన్ని గంటల ముందు, ఆయన తమ్ముడి మామగారు, అప్పట్లో రాష్ట్ర కాబినెట్ మంత్రి కోనేరు రంగారావు పదవికి రాజీనామా చేశారు. అనంతరాములు సోదరుడు మల్లు రవి ఆయన స్థానంలో నాగర్ కర్నూలు లోక్ సభ సభ్యుడుగా రెండు సార్లు ఎన్నికకాగా, మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా, మధిర శాసన సభ సభ్యుడుగా ఎన్నికై ప్రస్తుతం ప్రభుత్వ ఛీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గవర్నర్ ప్రమాణ స్వీకారం, కాబినెట్ మంత్రి రాజీనామా, పీసీసీ అధ్యక్షుడి హఠాన్మరణం అన్నీ ఒక్క నాడే, ఫిబ్రవరి 7, 2011 న సంభవించాయి. మల్లు మరణించి సరిగ్గా 21 సంవత్సరాలైంది. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికై, నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ చైర్మన్ పదవిని పొంది, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా-పదమూడు రాష్ట్రాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు నిర్వహించిన మల్లును, ఒక దళిత నాయకుడిని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మరిచిపోయినట్లే కనిపిస్తోంది. భావి తరాల వారు-ఆ మాటకొస్తే నేటి తరం వారుకూడా, ఆయన్ను గుర్తుంచుకునే ట్లు, ఆయన జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టి తే బాగుంటుందేమో!

Wednesday, February 2, 2011

"అతిరాత్రం"-ఏప్రిల్ లో కేరళలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం:వనం జ్వాలా నరసింహారావు

సుమారు నాలుగు వేల సంవత్సరాల పూర్వం నుండి ఆచరించబడుతూ, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన-అత్యంత ఆకర్షణీయమైన వైదిక సాంప్రదాయ కర్మకాండ-పుణ్య యజ్ఞం "అతిరాత్రం", ముప్పై సంవత్సరాల విరామం తర్వాత మరొక్క పర్యాయం నిర్వహించడానికి రంగం సిద్ధమౌతోంది. రాబోయే ఏప్రిల్ నెలలో, కేరళ రాష్ట్రంలోని పంజాల్ గ్రామంలో, వైదిక సాంప్రదాయ క్రమానుగతిని అనుసరించి, పన్నెండు దినాలు నిర్విరామంగా నిర్వహించనున్న అపురూపమైన “అతిరాత్రం” విన్యాసాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి పలువురు విదేశీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అత్యంత మౌలికమైన ప్రమాణాలుగా పేర్కొన బడే వేదాలు భగవంతుడి ద్వారా తెలుపబడినవని, మానవుల రచనలు కావని సాంప్రదాయుల విశ్వాసం. వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం నాలుగు వేదాలుగా విభజించి, వాటికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని పేర్లు పెట్టాడని, అందుకే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా అనాదిగా వస్తున్న వేదాలకు సంబంధించిన మూల గ్రంథాల్లో పేర్కొనబడిన ఒకానొక అతి ప్రాచీనమైన సాంప్రదాయ కర్మకాండే "అతిరాత్రం". పన్నెండు రోజులు, తెల్లవార్లూ-రాత్రంతా అగ్ని హోమంతో నిర్వహించే "అతిరాత్రం", వైదిక కర్మకాండలన్నింటిలో కి అత్యంత సంక్లిష్టమైనది-మహోన్నత మైనదని, కేరళ రాష్ట్రానికి చెందిన అతిరాత్రం నిర్వాహక సంస్థ "వర్తాతె" సభ్యుడు డాక్టర్ శివశంకరన్ నంబూద్రి అంటున్నారు.

అతిరాత్రం ఆచారాన్ని ప్రాచుర్యంలో తేవడానికి రూపొందించిన అధికారిక వెబ్ సైట్, వైదిక సాంప్రదాయిక పుణ్య యజ్ఞాలను గురించి ప్రస్తావిస్తూ, ఆ సాంప్రదాయాలన్నీ మానవ సమాజం ఆచరణలో పెట్టడానికి రెండు రకాల పద్ధతులను సూచించాయని రాసింది. వాటిలో మొదటిది "గ్రహ్య", రెండోది "శ్రుత". వ్యక్తిగతంగా, సాంప్రదాయానికి కట్టుబడిన వారు పాటించాల్సిన ఆచార వ్యవహారాలైన ఉపనయనం, వివాహం లాంటి విషయాలు మొదటి పద్దతికి చెందినవి. సంస్కార పూర్వ కంగా-అత్యంత ఉన్నత స్థాయిలో, శ్రుతి సాహిత్యంలో నేర్చుకున్న దాని ఆధారంగా, మౌఖిక సాంప్రదాయ బద్ధంగా, ఋగ్వేద-యజుర్వేద-సామవేదాలలో చెప్పిన దాని ప్రకారం తూచ తప్పకుండా ఆచరించేదే రెండో పద్ధతి. ఉపనయన, వివాహ సంప్రదాయాలను భారత దేశమంతా చాలామంది ఆచరణలో పెట్తున్నప్పటికీ, కీలకమైన వైదికాచారాలను మాత్రం, ఎవరో కొద్దిమంది బ్రాహ్మణులు, అక్కడో-ఇక్కడో అడపాదడపా పాటించడం జరుగుతోంది. అలా పాటిస్తున్న వారిలో నంబూద్రి బ్రాహ్మణులు ముందు వరుసలో వున్నారు.

శంకరాచార్యుడు నంబూద్రి బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. నంబూద్రీలు కేరళ బ్రాహ్మణులు. వీరి గురించి ఆసక్తికరమైన సమాచారం ఉంది. శాతవాహనుల తరువాత ప్రసిద్ధి చెందిన రాజవంశం కాదంబ వంశం. కాదంబులలో ప్రసిద్ధుడైన రాజు మయూర శర్మ కేరళ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన తన స్వస్థలమైన కోనసీమ (తూర్పు గోదావరి) నుండి ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబాలను కేరళకు తీసుకు వెళ్ళాడు. ఆ కుటుంబాల వారే తరువాత నంబూద్రీ బ్రాహ్మణులుగా పేరు పొందారు. ఈ విషయం బ్రహ్మ వైవర్త పురాణంలోను, మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన తెలుగు గ్రంథం సంపుటాలలోను లభిస్తుంది. శంకరుడు తెలుగువాడు ఐనప్పటికీ వల్లభుడు, నింబార్కుడు, త్యాగరాజు, మొదలైన అనేకమంది మహాపురుషుల లాగే ఆయనకు తెలుగు కంటే ఇతర ప్రాంతాల్లోనే ఆదరణ, ప్రసిద్ధి కలిగిందని చెప్పడంలో సందేహం లేదు.

వైదిక ఆచారాలు అంతరించి పోకుండా, కేరళ నంబూద్రీ బ్రాహ్మణులు, ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. పన్నెండు రోజులు, అహోరాత్రులు, ఆరిపోకుండా అగ్నిహోత్రం వుంచడమనే ప్రక్రియ, నంబూద్రీ బ్రాహ్మణులకు అత్యంత ఆకర్షణీయమైన విజ్ఞాన-వినోద దృశ్యం లాంటిది. సనాతన సంప్రదాయాన్ని ముమ్మూర్తులా ప్రతిబింబించే "అతిరాత్రం", భారతీయ మతాచారాలకు-నాగరికతకు అసలు-సిసలైన రూపురేఖగా నంబూద్రీలు భావిస్తారు. కాకపోతే, భారత దేశంలో ఆవిర్భవించిన హిందు, జైన, బౌద్ధ మతాలపై "అతిరాత్రం" ప్రభావం ఏ మేరకు పడిందోనన్న అంశాన్ని అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు. "అతిరాత్రం" నిర్వహణ శారీరక శ్రమతో కూడుకున్నది. క్రీస్తు పూర్వం పదవ శతాబ్దిలో మొదలైన ఈ ఆచారం, ఆరవ శతాబ్దం వరకూ కొనసాగింది. ఆ తర్వాత కాలంలో, ఎందరో-ఎన్ని విధాలుగానో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేశారు. గుప్తుల, చోళుల కాలంలో పునరుద్ధరణకు నోచుకున్న అతిరాత్రాన్ని, పదకొండవ శతాబ్దం వచ్చే సరి కల్లా, కేరళ నంబూద్రీ బ్రాహ్మణులు సజీవంగా కొనసాగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే ప్రక్రియ నేటికీ సాగుతోంది.

అనేక నెలల ముందస్తు సన్నాహాలు తప్పనిసరిగా అవసరమయ్యే "అతిరాత్రం" అగ్నిహోత్ర విన్యాసాన్ని నిర్వాహకులు తప్ప ఇతరులకు వీక్షించే అవకాశం వుండేది కాదు ఒకప్పుడు. అయితే, ముప్పై ఐదు సంవత్సరాల క్రితం, 1975 లో కేరళ రాష్ట్రం పంజాల్ గ్రామంలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఇండాలజిస్ట్ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్, రాబర్ట్ గార్డినర్ ప్రేరణతో, నంబూద్రీ బ్రాహ్మణులు పన్నెండు రోజుల పాటు నిర్వహించిన "అతిరాత్రం" కార్యక్రమాన్ని బయటి వారు చూసే అవకాశం కూడా లభించింది. జైమినీ సామ వేదంలో దిట్ట, ఘనాపాఠి బ్రహ్మ శ్రీ ముట్టతుకట్టు మమ్మున్ను ఇట్టి రవి, ఋగ్వేదం-యజుర్వేదం ఆచారాలను-సాంప్రదాయాలను ఔపోసన పట్టిన బ్రహ్మ శ్రీ చెరు ముక్కు వైదికన్ వల్లభన్ సోమయాజిపాడ్ అనే వైదిక పండితులిద్దరు 1975 లో జరిగిన అతిరాత్రాన్ని నిరాటంకంగా జరిపించారు. స్టాల్, గార్డినర్ లకు అనేక మంది అంతర్జాతీయ సంస్థలు-వ్యక్తులు సహకరించారప్పుడు. తత్వ శాస్త్రంలో ఆచార్యుడుగా ఇప్పటికీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న స్టాల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి లభించిన నిధులతో, "అతిరాత్రం" ఆచారానికి సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచారు. ఒక భారతీయుడు చేయాల్సిన పనిని విదేశీయుడు చేయడమంటే, నిజంగా, ఆయనను అభినందించాల్సిందే.

అతిరాత్రం ఆచారం ఒక రకమైన అద్భుత విన్యాసం. ఆ విన్యాసంలో ప్రధాన భాగమైన అగ్ని హోమం ప్రక్రియను నిర్వహించడానికి 17 మంది ఋత్విక్కులు (పూజారులు) వుంటారు. పన్నెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో మొదటి రోజున హోమం చేసే "యజమాని", ప్రత్యేకంగా తయారుచేసిన మూడు కుండలలో, పవిత్రమైన అగ్నిని నింపుకుని యజ్ఞ వాటికలో ప్రవేశిస్తాడు. "బంకమట్టి" తో తయారు చేసిన ప్రత్యేకమైన కుండలవి. నామ మాత్రంగా-లాంఛన ప్రాయంగా, వాయుదేవుడికి జంతు బలి జరిపించుతారు. ఐదుగురు ప్రధాన పూజారుల ఎంపిక జరుగుతుందప్పుడు. ఆ తర్వాత రాపిడి ద్వారా నిప్పు వెలిగించుతారు. యజమాని శిరస్సుకు తలపాగా లాంటిది కట్టుతారు. ఇక ఆ క్షణం నుంచీ, యజమానిని ప్రత్యేక రక్షణలో వుంచుతారు ఆ పన్నెండు రోజులు. పిడికిలి బిగించిన చేతులతో, మౌనంగా ఆ పన్నెండు రోజులు యజమాని యజ్ఞాన్ని చేయాలి. కాకపోతే, ఆయన చేయాల్సిన మంత్రోచ్ఛారణలకు మౌనం వీడవచ్చు. అలానే, స్నానం చేసేటప్పుడు పిడికిలి సడలించవచ్చు. అగ్నితో నింపిన ప్రధాన కుండను తీసుకుని, మూడడుగులు నడవాలి యజమాని ఆ తర్వాత.

వాల్మీకి రామాయణం బాల కాండలో, 14 వ సర్గలో, అశ్వమేధ యాగం ప్రస్తావనలో అతిరాత్రం గురించి పేర్కొనడం జరిగింది. అశ్వమేధయాగంలో భాగంగా, చివరి రోజైన మూడో దినాన, "అతిరాత్రం" ప్రక్రియ వుంటుంది. కేరళలో జరగుతున్న దానికి, దీనికి కొంత తేడా వున్నప్పటికీ, రెండింటి భావం ఒక్కటే. ప్రక్రియ కూడా ఒకే తరహాలో వుంది. రెండింటి లోను, 17 మంది ఋత్విక్కులే వుంటారు.

రెండో రోజున బంక మట్టితో మరొక ప్రత్యేకమైన కుండను తయారు చేస్తారు. మూడో రోజున నైవేద్యం కొరకు ప్రత్యేకంగా ఒక స్తంభాన్ని తయారు చేస్తారు. "మహావేది" గా పిలువబడే యజ్ఞ వాటిక కొలతల ప్రకారం, లాంఛనప్రాయంగా బలి ఇవ్వడానికి, పక్షి ఆకారంలో బలిపీఠం నమూనాను తయారు చేస్తారు అదే రోజున. నాలుగో రోజున దేవతల రాజైన ఇంద్రుడిని యాగానికి ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుంది. మహావేది వున్న ప్రదేశాన్ని నాగలితో దున్ని, అందులో విత్తనాలు చల్లి, మొదటి రోజు నాటి ప్రధాన కుండను భూమిలో పాతిపెట్టు తారు. పక్షి ఆకారంలో బలిపీఠం నిర్మాణం ఆరంభమవుతుంది అదే రోజున. ఐదు, ఆరు, ఏడు దినాల్లో, బలి పీఠం నిర్మాణాన్ని అంచెలంచలుగా కొనసాగిస్తూ, రాత్రివేళల అగ్నిహోత్రం పనిని యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. ఎనిమిదో రోజున, బలి పీఠంలో మరొక అంతస్తు వేయడంతో పాటు, దానికి ఉపయోగించిన ఇటుకలను గోవులుగా మారాలని యజమాని ప్రార్థన చేస్తాడు. రుద్ర పూజ కూడా జరిపించుతారు పూజారులు. అంతవరకూ ఉపయోగించిన పనిముట్లను, పూర్తి చేయబడిన బలి పీఠంలో, మానవ ఆకారంలో పేర్చుతారు తొమ్మిదో రోజున. ఆ ప్రదేశంలో మళ్లీ అగ్నిని వుంచడం జరుగుతుంది. మంత్రోచ్ఛారణల మధ్య అగ్ని హోమంలో నెయ్యి పోసుకుంటూ అతిరాత్రం కొనసాగుతుంది. లాంఛనప్రాయంగా-నామ మాత్రంగా జంతు బలి ఇవ్వడం ఆ తర్వాత ప్రక్రియ.

చివరి మూడు రోజులు రాత్రింబగళ్ళు యాగం కొనసాగుతూనే వుంటుంది. బలిపీఠం చుట్టూ, పదవ రోజున, యజమాని కొందరు పూజారులతో కలిసి, పాములలాగా తిరగాలి. నామ మాత్రంగా (వాస్తవంగా కాదు) పదకొండు జంతువులను బలి ఇవ్వడం జరుగుతుంది. పన్నెండో రోజున యజమాని భార్యా సమేతంగా "అవభ్రత స్నానం" చేసి, మేక బలిని (వాస్తవంగా కాదు) ఇచ్చి, ఇంటికి తిరిగొచ్చి మూడు చోట్ల అగ్నిని పేర్చి, ఆ అగ్నిహోత్రాన్ని జీవితాంతం చేస్తూ పోతుండాలి. పన్నెండు రోజులు ఒకే రకమైన కర్మ కాండలుండవు. అగ్నిలో ప్రధానంగా సోమ రసం ఉపయోగించుతారు. వైదిక గ్రంధాల్లో చెప్పిన ప్రకారం రెండు రకాల కట్టెలను రాపిడి చేసి నిప్పు పుట్టిస్తారు.

భారత దేశానికి-విదేశాలకు చెందిన కొందరు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పాటై, "వార్తాతె ట్రస్టు" పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అతిరాత్రం ఆచారాన్ని పునరుద్ధరించి, ఆ అద్భుత అపురూపమైన సనాతన సాంప్రదాయిక విన్యాసాన్ని మరో రెండు నెలలలో ప్రదర్శించబోతున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో వున్న ఒట్టపాలెం కేంద్రంగా ట్రస్టు పనిచేస్తుంది. ఏప్రిల్ 4-15, 2011 మధ్య నిర్వహించనున్న అతిరాత్రం రిహార్సల్లు మొదలయ్యాయి. పంజాల్ గ్రామంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి, ఈ సారి యజమానిగా పుటిల్లట్టు రామానజన్ సోమయాజి వుండనున్నారు. నాలుగువేల ఏళ్ల క్రితం ఎలా జరిగిందో, అచ్చు అలానే ఏప్రిల్ లో జరపడానికి అన్ని జాగ్రత్తలు ట్రస్టు తీసుకుంటున్నది. పనిముట్లన్నీ ఆ ప్రాంతంలో లభ్యమయ్యే కట్టెతోనే తయారు కానున్నాయి. ఏ రకమైన లోహ సామగ్రిని ఉపయోంచడ జరగదు. బలి పీఠానికి వాడే ఇటుకలు కూడా కట్టెతో తయారుచేసినవే. అవన్నీ అక్కడే తయారవుతున్నాయి. అతిరాత్రంలో పన్నెండు రోజులు కూచోగల సామర్థ్యం యజమానికి కలగడానికి చర్యలు చేపట్టారు. పుణ్య యజ్ఞంలో అతి భారమైన యజుర్వేద పఠన బాధ్యతను కాప్రా కుటుంబీకులు తమ భుజాలపై మోపుకున్నారు. ఋగ్వేదం నిర్వహణను నారాస్ కుటుంబీకులు, సామవేదాన్ని తోట్టం కుటుంబీకులు చేపట్టుతున్నారు.

శుఖాపురం దేవాలయ అధికారుల అనుమతితో కార్యక్రమం ఏప్రిల్ నెలలో నిర్విఘ్నంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భౌగోళిక-వాస్తు పరమైన సిద్ధాంతాల ప్రాతిపదికగా యజ్ఞ వాటికను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల యాగాలకు-యజ్ఞాలకు కేంద్ర స్థానమైన పంజాల్ గ్రామం అద్భుత విన్యాసానికి ముస్తాబవుతోంది. అంతా బాగానే వుంది... సరిగ్గా నాలుగువేల సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే...ఏప్రిల్ నెలలో కూడా...అచ్చు.. అలానే "అతిరాత్రం" జరిగిందని ఇదమిద్ధంగా చెప్పగల ధైర్యం ఎవరికన్నా వుందా? అయితే జరిగిందనడానికి... శాస్త్ర ప్రకారం కొన్ని దాఖలాలు వున్నాయి. యజ్ఞం పూర్తవగానే, యజ్ఞ శాలపై ఆకాశంలో ఒకే ఒక గద్ద ఎగురుతూ కనిపించితే, ఆ క్షణంలో ఆకాశం మేఘావృతమై వర్షం కురిస్తే, దేవతలు సంతోషించారనడానికి నిదర్శనం అని అతిరాత్రం గట్టిగా విశ్వసించే ఒక నంబూద్రీ బ్రాహ్మణుడు అంటున్నారు. వాస్తవానికి 1975 లో అతిరాత్రం పూర్తవగానే కుంభ వృష్టి జరిగిందని ఆయన అంటున్నారు.

అతిరాత్రం గురించి రాస్తూ ప్రొఫెసర్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం మంచిది. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు-ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా ఒకరి నుంచి మరొకరికి-గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!" 77 సంవత్సరాల వయసున్న స్టాల్, తన సహచర బృందంతో సహా, ఏప్రిల్ నెలలో పంజాల్ లో నిర్వహించనున్న అతిరాత్రం అద్భుతాన్ని వీక్షించడానికి రాబోతున్నారు.