Thursday, June 30, 2011

మంత్రివర్గ మార్పుల వేళ సీఎం వ్యూహం…ప్రత్యర్థులతో కలిసి కాపురం ?: వనం జ్వాలా నరసింహారావు

మంత్రివర్గ మార్పుల వేళ సీఎం వ్యూహంప్రత్యర్థులతో కలిసి కాపురం ?

సూర్య దిన పత్రిక (01-07-2011)

వనం జ్వాలా నరసింహారావు

బొత్స, రాజ నరసింహ తీరుతో ధోరణిలో మార్పు, పట్టు కోసం మంత్రివర్గ విస్తరణ ఆయుధం, చిరంజీవి విందు రాజకీయం ఆంతర్యం?, వ్యతిరేకులకు మంత్రివర్గంలో స్థానం?, కిరణ్‌ సవాళ్ళు ఎదుర్కొంటారా?

పిసిసి అధ్యక్షుడుగా బొత్స సత్యనారాయణ నియామకం-పార్టీపై ప్రత్యక్షంగా-పాలనపై పరోక్షంగా ఆయన పట్టు సాధించే ప్రయత్నాలు, ఉప ముఖ్య మంత్రిగా దామోదర రాజ నరసింహ రంగ ప్రవేశం-తెలంగాణ కాంగ్రెస్ నేతగా గుర్తింపు దిశగా ఆయన పయనం-ఢిల్లీ స్థాయిలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనా ధోరణిలో కొంత మార్పుకు దారి తీశాయనక తప్పదు. అపారమైన రాజకీయానుభవంతో, బలీయమైన సామాజిక వర్గం అండ దండల నేపధ్యంతో, సహజ సిద్ధమైన చొరవతో-పలుకుబడితో, బొత్స తన నియామక ప్రకటన వెలువడిన మరు నిమిషం నుంచే, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో తనదైన శైలిలో-తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వేగంగానే సంపాదించు కుంటున్నాడనాలి. తెలంగాణ ఏర్పాటుపట్ల సానుభూతి అపారంగా వున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడి వ్యవహార శైలి ఇలా వుంటే, దానికి ఒకింత భిన్నంగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్య మంత్రి రాజ నరసింహ ఢిల్లీలో చక్రం తిప్పిన ధోరణి వుందనాలి. బొత్స సరాసరి, తానే భవిష్యత్ ముఖ్య మంత్రినన్న రీతిలో, పూర్తి స్థాయి కాకపోయినా, కొందరు మంత్రులతో కూడిన పరోక్ష కాబినెట్ సమావేశాలను జరుపుతున్న తీరు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి నచ్చడం లేదంటున్నారు. రాజ నరసింహ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పలువురు ఇతర సీనియర్ నాయకులను కలుసుకుని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు, ప్రభుత్వం పనితీరు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సమాలోచనలు జరపిన తీరు-ఆ తర్వాత వెలువడిన పత్రికా ప్రకటనల తీరు గమనిస్తే, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా రాష్ట్ర రాజకీయాలలో బొత్స, కిరణ్ కుమార్ రెడ్డిలతో పోటా-పోటీగా ఎదిగే పనిలో నిమగ్నమైన ట్లు అనుకోవాలి. ఈ పరిణామాల మధ్య, ఆర్నెల్ల క్రితం అధిష్టానం ఆశీస్సులతో, ముఖ్య మంత్రి పీఠాన్ని అధిష్టించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఆదిలో ఎదురైన ఆటుపోట్లను అధిగమించి, పార్టీ పైన-పాలన పైన అంతో-ఇంతో గట్టి పట్టు సాధించి, ఆ పట్టు కోల్పోకుండా మరింత బలం కూడగట్టుకోడానికి, ఆయనకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన "మంత్రి వర్గ విస్తరణ" ఆయుధాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో వున్నారు.

బొత్స సత్యనారాయణ బలమైన ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి ఆయన వీరాభిమాని. వాస్తవానికి బొత్సను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా అధిష్టానం ఎంపిక చేయడంలో చిరంజీవి పరోక్ష పాత్ర-సహకారం కూడా వుందంటారు. అందుకేనేమో, బొత్స తన నియామకం అయిన వెంటనే కలిసిన ప్రముఖులలో ముందు వరుసలో వున్న వారిలో చిరంజీవి ఒకరు. అదలా వుంటే, చాలా కాలం తన నియోజక వర్గానికి దూరంగా వుంటున్న, చిరంజీవి, హఠాత్తుగా, బొత్స నియామకం తర్వాత, తిరుపతి పర్యటనకు వెళ్లారు. అంతవరకు ఆశ్చర్యం లేదు. ఆ పర్యటనలో భాగంగా, ముఖ్య మంత్రి బద్ధ విరోధిగా అందరూ భావించే, చిత్తూరు జిల్లాకు చెందిన శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. విందు రాజకీయాలలో, చిరంజీవి పాత్ర కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా పెద్దిరెడ్డిని మార్చడానికా? లేక, ప్రతికూలంగా-మరింత ఘాటుగా ఆయన వుండేందుకు, ఆయనను బొత్స సరసన చేర్చడానికా? అన్నది బయట పడాల్సి వుంది. మధ్యలో, చిరంజీవి మరో సంచలన ప్రకటన చేసి వార్తల్లోకి ఎక్కారు. తానిక సినిమాలలో నటించనని, అది కూడా ముఖ్య మంత్రి పాత్రలో అసలే నటించనని, నిజ జీవితంలోనే ముఖ్య మంత్రిగా తనను చూడాలనుకుంటున్న ప్రజల కోరిక తీరుస్తానని దాని సారాంశం! ఇదిలా వుంటే, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి మలి విడత మంత్రివర్గంలో పెద్దిరెడ్డిని చేర్చడానికి కారణ భూతుడైన అపర రాజకీయ చాణక్యుడు కెవిపి రామచంద్ర రావు ఇంటికెళ్లి మంతనాలు జరిపారు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అప్పట్లో, పెద్దిరెడ్డిని మంత్రి వర్గంలో తీసుకున్నందుకు కిరణ్ కుమార్ అలిగారని, స్పీకర్ పదవి చేపట్టడానికి విముఖత కూడా చూపారని వార్తలొచ్చాయి. నిజా-నిజా లేమైనా, ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో, తన బద్ధ శత్రువు పెద్దిరెడ్డిని, త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో, కిరణ్ కుమార్ రెడ్డి స్థానం కలిగించనున్నట్లు వార్తలొచ్చాయి. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడానికి గవర్నర్ నరసింహన్ ను కలిసిన ముఖ్య మంత్రి అధిష్టానం అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారని అనుకుంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో, తన మంత్రి వర్గంలో, పూర్తిగా తనకు అనుకూలురైన వారిని మాత్రమే చేర్చుకోవాలని కాని-వ్యతిరేకులను పూర్తిగా దూరం పెట్టాలని కాని గతంలో ఏ ముఖ్య మంత్రి భావించలేదు. కొందరు సీజన్డ్ ముఖ్య మంత్రులు, తమకు అనుకూలంగా లేనివారిని, తమవైపు తిప్పుకోవడానికో-తమ గుప్పిట్లో పెట్టుకోవడానికో, తప్పకుండా తమ మంత్రివర్గంలో చేర్చుకున్న దాఖలాలున్నాయి. తండ్రి, దివంగత అమర్ నాథ్ రెడ్డి కాలంలో, రాజకీయాలను అంతో-ఇంతో దగ్గరగా గమనించే అవకాశమున్న ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పూర్వ కాలపు కాంగ్రెస్ ముఖ్య మంత్రుల తరహాలో వ్యవహరించడానికి, తనను వ్యతిరేకించేవారికి కూడా మంత్రి వర్గంలో స్థానం కలిగించి, పాత సాంప్రదాయాలను పునరుద్ధరించడం మంచిది.

1956 లో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పార్టీ నాయకుడిగా పోటీ పడిన నీలం సంజీవ రెడ్డి, బెజవాడ గోపాల రెడ్డి, ఆ తర్వాత విభేదాలున్నా కలిసి మెలిసి పనిచేశారు. నీలం సంజీవరెడ్డి ముఖ్య మంత్రిగా, తనను ఎదిరించిన గోపాల రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు-ఉప ముఖ్య మంత్రిని కూడా చేశారు. అంతకు ముందున్న మంత్రివర్గంలో, బెజవాడ ముఖ్య మంత్రైతే, నీలం కాబినెట్ మంత్రిగా-ఉప ముఖ్య మంత్రిగా పని చేశారు. ఇద్దరికీ పడక పోయినా, సహచర మంత్రులుగా, ఒకరి కింద మరొకరు పని చేసిన మొదటి ఉదాహరణ ఇదే. సంజీవ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు, ఆయన స్థానంలో ముఖ్య మంత్రి పదవి పొందిన దామోదరం సంజీవయ్య, తన మంత్రి వర్గంలో, ఆయన బద్ధ విరోధి ఏసి సుబ్బారెడ్డికి స్థానం కలిగించారు. అదే విధంగా మలి విడత ముఖ్య మంత్రిగా నీలం సంజీవ రెడ్డి రాజీనామాచేసిన తర్వాత, ఆయన వారసుడుగా వచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డి సహితం తన వైరి వర్గానికి చెందిన ఏసి సుబ్బారెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో ముఖ్య మంత్రైన పివి నరసింహా రావు, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో వుండగా, తనను ఆసాంతం వ్యతిరేకించిన జలగం వెంగళ రావుకు, మొదట్లో చోటివ్వక పోయినా, రెండవ పర్యాయం ముఖ్య మంత్రి అయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి, తనను వ్యతిరేకించే పలువురు కాంగ్రెస్ నాయకులకు కూడా మంత్రి వర్గంలో చోటిచ్చారు. అలానే, జలగం వెంగళ రావు తన వ్యతిరేకులైన రాజమల్లు, రాజారాంలకు తన మంత్రి వర్గంలో స్థానం కలిగించారు. మర్రి చెన్నారెడ్డి మొదటి విడత ముఖ్య మంత్రిగా వున్నప్పుడు, ఆయన పదవి నుంచి వైదొలగడానికి కారణమైన రాజారాం, రాజమల్లు, గోకా రామస్వామిలను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ముఖ్య మంత్రులైన వారందరూ, అధిష్ఠానం సూచించిన వారికే సింహభాగం మంత్రి పదవులిచ్చినప్పటికీ, తన వారనుకున్న వారిని మంత్రులుగా చేసేందుకు వెనుకాడ లేదు-తనను వ్యతిరేకించిన వారికి పదవులు దక్కకుండా చూసేందుకు శాయశక్తులా కృషి చేశారు. తెలివిగల నాయకుడు తన ప్రత్యర్థులనుకునే వారికి కూడా పదవులిచ్చి, వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలానే చేస్తే బాగుంటుందేమో!

ఇదిలా వుంటే, డి శ్రీనివాస్ స్థానంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావాలని ఆశించి-కాలేక పోయిన కన్నా లక్ష్మీనారాయణ, ఆ పదవి దక్కించుకున్న బొత్స సత్య నారాయణ, చిరంజీవి నిజ జీవితంలో ముఖ్య మంత్రి కావాలనుందని చెప్పిన మాటల లోని గూఢార్థాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నంలో సమావేశమైనట్లు వార్తలొచ్చాయి. వీరిలో ఎవరినుంచి-ఎటువైపు నుంచి తనకు ముప్పు, ఏ విధంగా రాబోతున్నదోనని అంచనా వేసే ప్రయత్నంలో-ఆ తర్వాత తన అంచనాలకు అనుగుణంగా వారికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారా, లేక, మంత్రి వర్గ విస్తరణకే వెళ్లారా తెలుసుకోడానికి కొంత సమయం పట్టవచ్చు. బొత్స-కన్నా-చిరంజీవిల కలివిడి, విడి విడి ప్రకటనల పరిణామాలు; రాజ నరసింహ తన కంటూ ఒక ప్రత్యేక నాయకత్వ స్థానాన్ని దక్కించుకునేందుకు మొదలెట్టిన ప్రయత్నాలు; ముఖ్య మంత్రి పదవి ఆశించి ఉప-ముఖ్య మంత్రి పదవిని కూడా పొందలేక పోయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో మంత్రి గీతారెడ్డి పరోక్ష హెచ్చరికలు; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఉధృతం విషయంలో టీ ఆర్ ఎస్ అధినేత చంద్ర శేఖర రావు-జానారెడ్డిల సమావేశం-తదనంతర పరిణామాలు-రాజకీయ ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేయాలన్న నిర్ణయం; మరో వారం రోజుల్లో జరుగనున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు-అందులో ఆ పార్టీ అధినేత తీసుకో బోయే కీలక (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా?) నిర్ణయాలు; మధ్య-మధ్య బిజెపి, కమ్యూనిస్టు పార్టీల ప్రతిఘటనలు; వీటన్నిటినీ మించి ప్రతి పక్ష నేత-తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుక్షణం విసురుతున్న సవాళ్లు; ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్య తన భవిష్యత్ లో ఎదుర్కోనున్న క్లిష్టమైన సమస్యలు. వీటిని ఆయన వ్యూహాత్మకంగా అధిగమించి, ఢిల్లీ అధిష్టానం అండ దండలతో, తన స్థానాన్ని పదిలపరచుకుంటారో, లేక, మంత్రి వర్గంలో మార్పులు-కూర్పులు చేసి, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన నాయకత్వాన్ని సవాలు చేస్తున్న వారికే ప్రతి సవాలు విసురుతారో చూడాలి.

Tuesday, June 28, 2011

మూర్ఖుని మనసు మార్చగల మా?

మూర్ఖుని మనసు మార్చగల మా?

సేకరణ: వనం జ్వాలా నరసింహారావు

తెలిసిన వాళ్లకు చెప్పవచ్చు. తెలియని వాళ్లకూ చెప్పవచ్చు. తెలిసీ తెలియని వాళ్లకు చెప్పడం చాలా కష్టమంటారు. ఇదిలా ఉంటే, మరి కొంతమంది ది తాను మునిగింది గంగని, తాను వలచింది రంభని భావించే తత్త్వం. ఇటువంటి వాళ్లకు కూడా ఏమీ చెప్పలేం. అంటే మూఢులైన వాళ్లకు ఎంత చెప్పినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే అవుతుంది తప్ప ఎంతమాత్రం చెవికెక్కదు. ఈ విషయాన్ని భర్తృహరి చక్కటి ఉదాహరణలతో తేల్చి చెప్పేసాడు. మధురమైన భావయుక్తమైన ఆ సంస్కృత శ్లోకాన్నీ, దానికి అంతకంటే రమ్యంగా తెనిగించిన ఏనుగు లక్ష్మణ కవి రాసిన తెలుగు అనువాదాన్ని అందరూ చదవాల్సిందే.

భర్తృహరి శ్లోకం:

"లభేత సికతాసు తలమపి యత్నతః పీడయన్‌

పిబేచ్చ మృగతృష్ణ కాస సలిలం పిపాసార్దితః

కదాచిదపి పర్యటన్‌శశ విషాణ మాసాదయే

న్నతు ప్రతిని విష్ట మూంå జన చిత్త మారాదయేత్‌"

ఏనుగు లక్ష్మణకవి తెలుగు అనువాదం:

తివిరి యిసుమునఁ దైలంబుఁ తీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ

దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ

జేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.

మూర్ఖుల మనస్సును మార్చలేమన్న విషయాన్ని ఇంత చక్కగా చెప్పగలిగిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో, ఈ పద్యాలు ఇంతకాలమైనా మనందరి నోటిలో నానుతూనే ఉన్నాయి. ఇందుకోసం వారు ఎన్నుకున్న ఉపమానాలు అద్భుతం.

సాధ్యం కాకపోయినా రోజుల తరబడి శ్రమించి ఎడారిలోని ఇసుకను గట్టిగా పిండి నూనెను తీయవచ్చట. అలాగే, ఎండమావుల (కంటికి అందినంత దూరంగా చూస్తే అక్కడ నీరు పారుతున్నట్టు భ్రమ కలగడం. అది చూసి మనం అక్కడ నిజంగా నీరు ఉందనే అనుకుంటాం. కానీ అక్కడ ఉండదు) లో తిరిగి తిరిగి నీటిని సంపాదించవచ్చు. అలాంటి చోట్ల కూడా ఏదో చేసి నీటిని సృష్టించవచ్చు. సాధు జంతు వైన కుందేలు తలకు కొమ్మే ఉండదు. ఆవులకూ, గేదెలకూ, దుప్పులకూ, మరి కొన్ని జంతువులకు కొమ్ము ఉంటుంది కానీ, కుందేలుకు మాత్రం కొమ్ము ఉండదు. కాబట్టి కుందేటి కొమ్ము లభ్యం కావడం అసాధ్యం. అయినప్పటికీ ఎంతో ప్రయత్నం చేసి కుందేటి కూడా సాధించవచ్చట!

ఇన్ని అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు కానీ, మూర్ఖుని మనస్సును మాత్రం ఎంత ప్రయత్నించినా మార్చలేమన్నది దీని తాత్పర్యం.

(ఇన్ టర్ నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా...)

Wednesday, June 22, 2011

డోలాయమానంలో రాష్ట్ర ("భారత ఉక్కు వ్యవస్థ") ఐఏఎస్ లు?:వనం జ్వాలా నరసింహా రావు

ఐఏఎస్‌ లలో అసంతృప్తి !

సూర్య దిన పత్రిక (23-06-2011)

వనం జ్వాలా నరసింహా రావు

డోలాయమానంలో రాష్ట్ర ("భారత ఉక్కు వ్యవస్థ") ఐఏఎస్ లు?

వనం జ్వాలా నరసింహా రావు

రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన సుమారు ఏబై మంది ఐఏఎస్‌ అధికారులలో పలువురు తమకు ప్రాధాన్యత పోస్టులు లభించలేదన్న అసంతృప్తితో వున్నారని వార్తలొస్తున్నాయి. వారిలో కొందరు తమ సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని, మరి కొందరు తమను అంతగా ప్రజలతో సంబంధం లేని పదవులకు పంపారని-తామెంత బాగా పనిచేస్తున్నప్పటికీ తమ సమర్థతకు తగిన గుర్తింపు రాలేదని, ఎవరికి తోచిన రీతిలో వారు తమ అసంతృప్తులను బహిరంగంగానే వెల్లడి చేస్తున్నారట. వీరిలో కొందరు గతంలో పదవిలో వున్న ముఖ్య మంత్రుల దగ్గర వ్యక్తిగతంగా పలుకుబడి ఉపయోగించు కోగలిగిన వారైతే, ఇంకొందరు తెలుగు దేశం హయాంలో-రాజశేఖర రెడ్డి, రోశయ్యల కాలంలో, చాలా కాలం ఒకే పోస్టులో వుంటూ అధికారం-పెత్తనం పరోక్షంగా చెలాయించిన వారు కావడంతో ప్రస్తుతం బదిలీ చేసిన పోస్టులోకి వెళ్లాలన్న ఆలోచనను జీర్ణించుకొన లేక పోతున్నారు. ఇదిలా వుంటే, కొందరు మంత్రుల శాఖలకు సంబంధించి, సంబంధిత కాబినెట్ మంత్రికి కనీస సమాచారం కూడా లేకుండానే, అక్కడ పనిచేస్తున్న ఐఏఎస్‌ లందరినీ "మూకుమ్మడిగా" గా బదిలీ చేసింది ప్రభుత్వం. ఏదేమైనా, ప్రభుత్వ యంత్రాంగంలో-అందునా ఐఏఎస్‌ స్థాయిలో, ఫలానా పోస్టు ప్రాధాన్యతకలదని, మరోటి మామూలుదని, ఎవరైనా ఐఏఎస్‌ అధికారి భావించడమంటే, ఆ సర్వీసులో ఇంతకాలం పనిచేస్తున్న వారి అవగాహనా లోపమే అనాలి. సమర్ధుడైన అధికారికి ఏ బాధ్యతలను ఇచ్చినా, గతంలో పని చేసిన శాఖను అభివృద్ధి చేసినట్లే, అక్కడ కూడా రాణించగలరు. అసమర్థులకు ఏమిచ్చినా ఒకటే.

వివాదాల్లో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, తమ పబ్బం గడుపు కోవడానికి సంబంధిత మంత్రులకు వంత పాడడం, కావాలనుకున్న పోస్టింగులను పొందడం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం, కొందరు ఐఏఎస్ అధికారులకు అలవాటుగా మారిందన్న అపవాదు ఇటీవలి కాలంలో సాధారణ విషయమైపోయింది. పదవిలో వున్నా-విరమణ చేసినా, శతృవులు సహితం తప్పు బట్ట వీలులేని స్వర్గీయ ఎస్ ఆర్ శంకరన్, డాక్టర్ వి చంద్రమౌళి, పి వి ఆర్ కే ప్రసాద్, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ లాంటి అధికారుల సంఖ్య క్రమేపీ తగ్గుతుందని అనాలి. అంతెందుకు.. ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, స్వర్గీయ ఎన్ టీ రామారావు ముఖ్య మంత్రిగా వున్నప్పటినుంచి, ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, తెలుగు దేశం అధికారంలో వున్నా-కాంగ్రెస్ అధికారంలో వున్నా, కీలకమైన బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించుకుంటూ, ఒకే రకమైన అనామికతో పని చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన లాగా కేంద్రంలోను, రాష్ట్రాలలోను పనిచేసిన-చేస్తున్న ఐఏఎస్ అధికారులున్నప్పటికీ అలాంటి వారు కొందరే వున్నారనక తప్పదు. దీనికి అనేక కారణాలుండవచ్చు. అత్యంత బాధ్యతతో కూడుకున్న పాలనాపరమైన పదవులు అతి పిన్న వయసులోనే వీరు పొంద గలగినందువల్లనో, అనుక్షణం మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లో, సివిల్ సర్వీసెస్ ప్రస్థానంలో సత్ సంప్రదాయాలు నెలకొన నందువల్ల నో, సంస్కరణలు కాగితాలపైన మాత్రమే కాని-ఆచరణలో నామ మాత్రమే ఐనందువల్లనో ఇలా జరుగుతుండవచ్చు. ఐఏఎస్ అధికారులను తమ గుప్పిట్లో వుంచుకుని, తమ పనులను చక్కబెట్టుకోవాలనే ఆలోచనలో కొందరు మంత్రులుండడం కూడా ఐఏఎస్ ల బాధ్యతారాహిత్యానికి కారణం కావచ్చు. ఈ నేపధ్యంలో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు అవసరం, దాని ఆవిర్భావం, పరిణామక్రమం, భవిష్యత్ లో కొన సాగింపు ఎంతవరకు సమంజసం అనేవి చర్చనీయాంశమైన అంశాలు.

"భారత ఉక్కు వ్యవస్థ" గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించిన, "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)", భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అప్పటి వరకు, బ్రిటీష్ వారి పాలనలో అధికార స్వామ్యానికి ప్రతీకైన "ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్)" స్థానంలో ఆవిర్భవించింది. ఐఏఎస్ కు ఎంపికైన వారందరూ, సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు, ఒకటికి మించిన విభిన్న విద్యల్లో, తమదంటూ, ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడా, పలు రకాల వడపోత పద్ధతులను అవలంబించి, విస్తృతమైన-కఠినమైన రాత-మౌఖిక పరీక్షా విధానం ద్వారా, రాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగ పరమైన రక్షణ వుంటుంది. కర్తవ్య నిర్వహణలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన ఆగత్యం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం కాని, ఒత్తిడులకు లోను కావడం కాని, ఏ మాత్రం లేదు. భారత్ దేశ భవిష్యత్ ఈ వ్యవస్థపై ఆధార పడి వుందని పటేల్ అనేవారు.

ప్రిలిమినరీ, మెయిన్స్, మౌఖిక పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులలో, పరీక్షల నిర్వహణకు ముందు, వివిధ రాష్ట్రాలలో, ఆ రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మేరకు, భర్తీచేయాల్సిన ఐఏఎస్ అధికారుల సంఖ్యకు అనుగుణంగా, అంత మందినే, రాంకుల వారీగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆ సంవత్సరానికి ఎంపికచేస్తుంది. అలా ఎంపికైన వ్యక్తులకు, ఏడాదిపాటు మసోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో అన్నిరంగాలకు చెందిన అంశాలలో కూలంకషమైన శిక్షణ ఇప్పిస్తుంది ప్రభుత్వం. ఏడాది తర్వాత, ఆయా అభ్యర్థులకు కేటాయించిన రాష్ట్రాలకు మరో ఏడాదిపాటు శిక్షణ నిమిత్తం పంపుతారు. ఒక్కొక్కరి ని ఒక్కో వెనుకబడిన జిల్లాకు పంపి, సంబంధిత కలెక్టర్ ఆధ్వర్యంలో, అన్ని శాఖలకు చెందిన అన్ని రకాల స్థాయి ఉద్యోగాలలో అవగాహన పొందే వీలుగా శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. వారందరినీ ఆ ఏడాది వరకు "శిక్షణలో వున్న అసిస్టెంటు కలెక్టర్" గా సంబోధించు తారు. ఏడాది మధ్యలో, మూడు-నాలుగు పర్యాయాలు, రాష్ట్ర రాజధానులలో వున్న ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణా సంస్థ (హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లాంటిది) లకు పంపి, రాష్ట్రానికి సంబంధించిన వివిధ సామాజిక-చారిత్రాత్మక-భౌగోళిక-రాజకీయ, తదితర అంశాలపై శిక్షణ ఇప్పించుతుంది ప్రభుత్వం. రాష్ట్రాలకు చెందిన అధికార భాషను (తెలుగు లాగా) వీరు నేర్చుకోవడం తప్పనిసరి కాబట్టి, అందులోను శిక్షణ ఇప్పించి, పరీక్షలు కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వం.

సచివాలయంలో వివిధ స్థాయిలలో జరిగే కార్యకలాపాలపై కూడా అవగాహన కలిగించేందుకు వారం-పది రోజుల పాటు సెక్రెటేరియట్ అనుబంధ శిక్షణ కూడా వుంటుంది. ప్రాజెక్టుల సందర్శన, సర్వే క్షణ శాఖతో అనుబంధం లాంటివి కూడా పూర్తైన తదుపరి, చివరగా, రెండు వారాల పాటు మరో మారు మసోరికి వెళ్లి, తిరిగొచ్చేసరికి, వారికి కేటాయించిన రాష్ట్రాలలోని ఏదో ఒక సబ్ డివిజన్ లో, సబ్ కలెక్టర్ గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు-సిసలైన అధికార రుచి చవి చూసే అవకాశం అలా లభిస్తుంది వారికి. దాంతో పాటే, ప్రజాసేవ చేసే అవకాశం కూడా ప్రప్రధమంగా కలుగుతుంది. సబ్ కలెక్టర్ గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికి మరవ లేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్ కలెక్టర్ తర్వాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి గా-జాయింటు కలెక్టరు గా పదోన్నతి పొంది మరో మెట్టుకు ఎదుగుతారు. ఇక ఆ తర్వాత - సుమారు ఏడెనిమిది ఏళ్లకు, జిల్లా కలెక్టర్ గా నియామకం దొరుకుతుంది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు. కొందరు దురదృష్ట వంతులకు (రకరకాల కారణాల వల్ల) వీటిలో కొన్ని పదవులు దక్కకుండా, వాటికి సమానమైన పదవులు (ఉదాహరణకు, డిప్యూటీ కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా, కార్పొరేషన్లలో ఉన్నతాధికారిగా, మునిసిపల్ కమీషనర్లుగా) దొరుకుతాయి. ఇలా లూప్ లైనులలోకి మళ్లించబడే అలాంటి ఐఏఎస్ అధికారుల ఎదుగుదల సాదా-సీదాగా సాగుతుంది. వారికి ఏ పోస్టు ఇచ్చినా సర్దుకుని పోతుంటారు.

అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకత, దానికి ఎంపికైనవారికి ఒక "జిల్లా కలెక్టర్" గా పని చేయడమే. ఆ పదవిలో వుండగా, కేవలం రెవెన్యూ సంబంధిత బాధ్యతలే కాకుండా, పలు అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో, పర్యవేక్షణలో, కలెక్టర్ అంచనాలకు మించిన బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. 73, 74 రాజ్యాంగ సవరణలతో కలెక్టర్ల బాధ్యతలు ఇంకా రెట్టింపయ్యాయి. దాదాపు నూటికి పైగా జరిగే జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు కలెక్టరే చైర్మన్. అనేక జిల్లా స్థాయి కమిటీలకు అధ్యక్షుడుగా వ్యవహరిస్తూ, తాము తీసుకున్న నిర్ణయాలను తామే గుర్తుంచుకోలేని పరిస్థితుల్లో వుంటారు కొందరు. జిల్లా వ్యాప్తంగా పర్యటనలు, వారానికొక సారి ఏదైనా గ్రామంలో నిద్ర చేయడం లాంటివి కలెక్టర్ల అదనపు కర్తవ్యాలు. అంతులేని ఈ పని భారాన్ని మోసేటప్పుడు, ఎంత విస్తృత స్థాయిలో శిక్షణ పొందినా సహజంగా తప్పులు దొర్లడం సహజం. ఇక అడపదడప ముఖ్య మంత్రి, సంబంధిత శాఖ మంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలకు, వీడియో కాన్ఫరెన్సులకు విధిగా హాజరవ్వాలి.

కలెక్టర్ పదవిని సుమారు పది సంవత్సరాల పాటు, వివిధ జిల్లాలలో చేపట్టి (అందరూ కాకపోయినా కొందరైనా) శాఖాధిపతులుగా నో, కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగా నో, సచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగా నో పని చేసేందుకు రాజధానికి చేరుకుంటారు. వారి-వారి సామర్థ్యాన్ని బట్టి, చాక చక్యాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, జిల్లా కలెక్టర్లుగా పని చేసినప్పుడు రాజకీయ నాయకులతో పెంపొందించుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి, మరి కొన్ని ప్రత్యేక తరహా నైపుణ్యాలను బట్టి వారికి పదవులు లభిస్తాయి. దేశ వ్యాప్తంగా వున్న సుమారు ఆరువందలు మంది జిల్లా కలెక్టర్లు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు పునాది లాంటివారని, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారొకసారి. ఐఏఎస్ అధికారులకు పదవీ భద్రత వుందనీ, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో-అమలులో, దూరదృష్టితో వ్యవహరించడం వారి విద్యుక్త ధర్మమనీ, ప్రతి ఐఏఎస్ అధికారి ఒక రోల్ మోడల్ కావాలని కూడా మన్మోహన్ అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచి, రాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత-అటు పిమ్మట సొంత రాష్ట్రానికో, కేంద్ర సర్వీసులకో, విదేశాలలో పదవులకో వెళ్లిన తర్వాత, ఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడం, మరో వైపు అసలు-సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ పదవి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నో, కేంద్ర కాబినెట్ కార్యదర్శిగా నో నియామకం కావడం. ఆ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అందుకే, ఇటీవల బదిలీ ఐన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు అ ప్రాధాన్యత పోస్టింగులు ఇచ్చారనడం సరైంది కాదు.

అలా భావించే ఐఏఎస్ అధికారులున్నారంటే, ప్రభుత్వ శాఖల్లో కొన్ని "అ ప్రాధాన్యత" గా చేసిన సచివులను, వారి సలహాలు తీసుకుంటున్న మంత్రులను తప్పు బట్టాలి!

Sunday, June 19, 2011

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీ:వనం జ్వాలా నరసింహారావు

చట్టసభల పనితీరు ప్రశ్నార్థకం

ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (26-06-2011)

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీ

వనం జ్వాలా నరసింహారావు

పౌర సమాజానికి చెందిన కొందరు స్వయం ప్రకటిత నేతల ఒత్తిళ్లకు లొంగి, చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న పార్లమెంటు పరిధి నుంచి ఆ అధికారాలను పార్లమెంటే తర శక్తులకు బదిలీ చేసే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలైన పార్టీ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది. పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో సీనియరు కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయానికి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారం ఏచూరి కూడా మద్దతిస్తున్న ధోరణిలో మాట్లాడారు. అదుపులు అన్వయాలకు లోబడి పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థలైన చట్ట సభలు, కార్య నిర్వాహక అధికారి, న్యాయ వ్యవస్థలు పని చేయాలి. ఈ మూడింటి లో ఒకటి ఎక్కువ మరోటి తక్కువ అనలేం. అలాంటప్పుడు, వీటిని అధిగమించి, లోక్ పాల్ పేరుమీద నో, మరే పేరు మీదో, ఇంకో సమాంతర వ్యవస్థ పెత్తనం చేయడం సబబే నా? వాస్తవానికి, రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేసే నిర్ణయాధికారం-సార్వభౌమాధికారం, నూటికి నూరుపాళ్లు పార్లమెంటు దే అయినా, ఒక సంస్థగా-వ్యవస్థగా, భారత పార్లమెంటుకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలను కార్య నిర్వహణ సంస్థ చేతుల్లో పెట్టడంతో, పరోక్షంగా ఉనికిని కోల్పోతున్న నేపధ్యంలో, భవిష్యత్ లో దాని ప్రధాన బాధ్యతైన జవాబుదారీతనంతో వ్యవహరించడం క్లిష్టమౌతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన పార్లమెంటు ఉభయ సభల, రాజ్యాంగపరమైన శాసనాధికార పర్యవేక్షణా సామర్థ్యం, జవాబుదారీ, క్రమేపీ క్షీణ దశకు చేరుకుంటున్నాయని ఐక్య రాజ్య సమితి సామాజికాభివృద్ధి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలోని, ప్రజాస్వామ్యం-పరిపాలన-మానవ హక్కుల కార్యక్రమ అంశాలకు సంబంధించిన ఒక అధ్యయనంలో పేర్కొనడం జరిగింది. జవాబుదారీకి ప్రతీకలుగా, పార్లమెంటులో ప్రవేశ పెట్టి చర్చించాల్సిన వివిధ తీర్మానాలు, రాజ్యాంగ పరమైన పార్లమెంటు పర్యవేక్షణా బాధ్యతలు, సభా సంఘాల పనితీరు లాంటివి, నిర్వీర్యమై పోతున్నాయి. ప్రపంచీకరణ దిశగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు అధికారాలను హరించి వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న పలు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి పార్లమెంటుకు సరైన పర్యవేక్షణ లేదు. ఆ ఒప్పందాల విషయంలో పార్లమెంటు వెలుపల తీసుకున్న నిర్ణయాలు తిరుగులేని విగా వుండడంతో, పార్లమెంటు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ఎన్నికల ద్వారా రాకుండా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే పలు వ్యవస్థలకు బదలాయించిన అధికారాలపై కూడా పార్లమెంటు పర్యవేక్షణ బలహీనంగా వుంది. అదుపులు-అన్వయాల విషయంలో పార్లమెంటుతో సమానమైన అధికారాలను కలిగున్న కార్య నిర్వహణ వ్యవస్థ తనను శాసించే దిశగా పార్లమెంటు అడుగులు వేస్తోంది. అలానే న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటును ఆదేశించే సందర్భాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శాసనాధికారాలున్న చట్టసభల పరిస్థితి ఇలా కావడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు, పార్లమెంటరీ అధ్యయన నిపుణులు అన్వేషించే ప్రయత్నం చేశాయి.

శాసన సంబంధమైన ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదనే సాకుతో, చట్టాల రూపకల్పన-నిర్ణయాధికారం కలిగిన పార్లమెంటు, చట్టం స్థానంలో "ఆర్డినెన్సుల" ను తెచ్చేందుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు (నిర్వహణాధికారికి-ప్రధానికి), అధికారాలను కట్టబెడుతూ పోవడం, భారత పార్లమెంటుకున్న అతి పెద్ద బలహీనతనాలి. మరో విధంగా చెప్పుకోవాలంటే, ఎగ్జిక్యూటివ్ అధికారాలను సమీక్షించే విషయంలో పార్లమెంటు నిష్ఫలత స్పష్టంగా కనిపిస్తోంది. పెరుగుతున్న సామాజిక అవసరాలకు-ఆధునిక పార్లమెంటరీ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించగల సామర్థ్యం-అభిరుచి చాలామంది పార్లమెంటు సభ్యులలో అంతగా లేకపోవడం కూడా జవాబుదారీ క్షీణించడానికి దోహదపడుతోంది. రోజు-రోజుకు పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలు సంస్థాగతంగా పటిష్ఠంగా వ్యవహరించలేక పోవడం, ఆ పార్టీల ప్రతినిధులు స్థానిక అవసరాల దృష్ట్యా చట్ట సభలకు ఎన్నిక కావడంతో, పార్లమెంటు సమిష్టి కార్యాచరణకు అవరోధాలు కలుగుతున్నాయి. జవాబుదారీ తనం తగ్గడానికి ఇది మరో కారణం.

పార్లమెంటు నిర్వర్తించాల్సిన విధులను, దానంతటదే పరిత్యజించడం ఆశ్చర్యకరమైన అంశంగా పరిగణించాలి. ఎన్నికల-పార్టీల రాజకీయాల కారణాన తప్పనిసరిగా తలెత్తే పరిస్థితులు, చట్టాల రూపకల్పనలో అలసత్వం-ఆలశ్యం జరగడానికి దోహదపడుతున్నాయి. పార్లమెంటు సభ్యులు, సరైన కారణాలు లేకపోయినా, చట్ట సభలో అవరోధాలు కలిగించి శాసన ప్రక్రియను ఆలశ్యం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం, శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, నిష్పాక్షికంగా వ్యవహరించే స్వతంత్ర న్యాయ వ్యవస్థ రూపు దిద్దుకోవడం, చైతన్యవంతమైన పౌర సమాజం బలీయం కావడం లాంటివి భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కొంత మేరకైనా పటిష్టం చేశాయి. తరతరాలుగా, గుత్తాధిపత్యంతో కొందరు మాత్రమే రాజ్యాధికారం చలాయించే స్థితిలో వుండే భారతీయ సమాజంలో, నెమ్మదిగా సామాజిక చైతన్యం-విప్లవం వస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులు కాపాడబడతాయని, సార్వజనీన ఓటు హక్కు మార్పుకు సంకేతమని భావించిన దేశ పౌరుల నమ్మకం వమ్మైందని అనాలి. తమ ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజా ప్రతినిధులుండే చట్ట సభల (పార్లమెంట్-శాసన సభలు) పని తీరు అసంతృప్తికి గురి చేస్తున్నాయన్న భావన కలుగుతోంది పౌరులకు.

భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలకు-సాఫల్యాలకు, పార్లమెంటు బాధ్యత ఎంతనేది చర్చనీయాంశం. పార్లమెంటు పనితీరుకు సంబంధం లేకుండా, ప్రజాస్వామ్యం మనుగడ సాగే వీలు లేదు. అదే విధంగా పలు ప్రజాస్వామ్య సంస్థల పని తీరు కూడా పార్లమెంటు నిర్వహణా విధానంపైనే ఆధార పడి వుంటుంది. తమకు టికెట్ ఇచ్చి అవకాశం కలిగించిన రాజకీయ పార్టీల ఆలోచనా సరళి-ప్రభావం, పార్లమెంటు సభ్యులపై ప్రస్ఫుటంగా వుంటుంది. ఈ నేపధ్యంలో, తప్పైనా-ఒప్పైనా, అర్హతల-యోగ్యతల దృష్ట్యా కాని, నిబద్ధత దృష్ట్యా కాని, పార్లమెంటేరియన్ పనిలో నాణ్యత క్షీణిస్తున్నదనే నిపుణుల అభిప్రాయం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లతో పోల్చి చూస్తే, ఈ నాటి పార్లమెంటు సభ్యులలో చాలా మంది విద్యార్హతలు ఉన్నత స్థాయిలో వున్నప్పటికీ, ఎన్నికైన వారిలో గణనీయమైన సంఖ్యలో, నేరచరిత్ర కలిగినవారు కూడా వుండడంతో, దాని ప్రభావం కూడా పార్లమెంటు పనితీరుపై పడుతోంది.

భారతీయ ఓటర్లు తమదైన ప్రత్యేక శైలిలో, వారి-వారి ప్రాధాన్యతలను బట్టి, రాజకీయ అనుబంధాలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, ఎన్నుకునే విభిన్న మనస్తత్వాల కలగూరగంప పార్లమెంటు-అందునా ప్రత్యేకించి లోక్ సభ. మామూలు సాదాసీదా అభ్యర్థులను ఓటర్లు గెలిపించిన సందర్భాలు, యోధానుయోధులను మట్టి కరిపించిన ఉదాహరణలు కోకొల్లలు. ఒక గుర్తింపు పొందిన రాజకీయ పక్షాన పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచిన వ్యక్తి, పార్టీ వీడిన మరు క్షణం ఘోరంగా ఓటమి పాలైన సందర్భాలున్నాయి. ఎన్ని పార్టీలు మారినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, అఖండమైన మెజారిటీతో గెలిచిన వారూ వున్నారు. ఎవరిని, ఎప్పుడు ఎందుకు భారతీయ ఓటరు గెలిపించుతాడో-ఓటమి పాలు చేస్తాడో తెలుసుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి ప్రాధాన్యతలే, పార్లమెంటుకు గెలిచే అభ్యర్థుల సామాజిక కూర్పును ఒక్కో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేసరికి మారుస్తున్నది. ఒక నాడు ఆంగ్ల విద్యను అభ్యసించ గలిగిన లాయర్లు, అగ్రకులాలకు చెందిన విద్యావేత్తలు, ధనవంతులు మాత్రమే పార్లమెంటులో అడుగు పెట్టగల సత్తా వుండేది. కాలం మారింది. ధన బలం, అంగ బలం, కుల బలం వున్న అన్ని సామాజిక వర్గాల వారితో సహా, రిజర్వేషన్ల మూలాన, వెనుక బడిన వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు కూడా పార్లమెంటుకు-చట్ట సభలకు ఎన్నిక కాగలుగుతున్నారు. మహిళలకు ఇంకా రిజర్వేషన్లు కలిగించ లేకపోవడంతో, అనుకున్నంత మంది ఎన్నికవడం లేదు. మొత్తం మీద, మారుతున్న సామాజిక-ఆర్థిక-రాజకీయ పరిస్థితులకనుగుణంగా, వైవిధ్యంతో కూడిన సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే విభిన్న వ్యక్తులతో పార్లమెంటు ఏర్పాటవుతోందిప్పుడు.

ఇందిరా గాంధి హయాంలో 1975 లో విధించిన అత్యయిక పరిస్థితి, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత విషాద సంఘటనగా పేర్కొనాలి. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకున్న దురదృష్టమైన నిర్ణయమది. అంతకు ఐదారు సంవత్సరాల క్రితం నుంచే, కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు బలమైన ముఠా నాయకులు, రాజకీయంగా లబ్ది పొందాలని పట్టుదలతో, జాతి ప్రయోజనాలను భంగం వాటిల్లే విధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మొదలైంది. అదే క్రమంలో, కాంగ్రెస్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలు సంస్థాగతంగా బలహీన పడడం, పార్లమెంటులోకి అడుగు బెట్టే రాజకీయ పార్టీల సంఖ్య ఒక నాటి ఐదు నుంచి సుమారు నలభైకి పెరగడం, ఒక సారి గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలుస్తారో-లేదో అన్న అపనమ్మకంతో, "ఆయారం-గయారాం" రాజకీయాలకు ఒడిగట్టడం, పార్లమెంటు వ్యవస్థ జవాబుదారీ కుదించసాగాయి.

రాజ్యాంగ, ఆర్థిక, పాలనా పరమైన అధికారాలున్నప్పటికీ, పార్లమెంటు మౌలిక లక్ష్యం, చట్టాలను రూపొందించడం. రాజ్యాంగాన్ని సవరించే ఏకైక శక్తి పార్లమెంటు. పన్నులు విధించాలన్నా, నిధులు ఖర్చు చేయాలన్నా, పార్లమెంటు ఆమోదం తప్పని సరి. అధికార పార్టీ ప్రతిపాదించిన బడ్జెట్ కు పార్లమెంటు ఆమోద ముద్ర పడటం జరగకపోతే, ఆటోమేటిక్ గా, ఆ ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కోల్పోయినట్లే. ఇక మంత్రివర్గం యావత్తు పార్లమెంటుకు సమష్టిగా బాధ్యత వహించాలి. ప్రభుత్వం ప్రజలకు నేరుగా కాకుండా పార్లమెంటు ద్వారా జవాబుదారీ. ప్రభుత్వ ప్రప్రధమ జవాబుదారీ సంవిధానం, పార్లమెంటులో ప్రవేశ పెట్టి-చర్చించే అవిశ్వాస తీర్మానం. ప్రతిపక్షాలు ప్రతిపాదించే ఆ తీర్మానం నెగ్గితే, ప్రభుత్వం పడిపోయినట్లే. కాకపోతే, చట్ట సభలో గణనీయమైన మెజారిటీ కలిగున్న ప్రభుత్వానికి ఎప్పుడూ ఢోకా లేదు. ఇంత పటిష్టమైన అధికారాలు కలిగిన పార్లమెంటును, 1975 లో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది ఎగ్జిక్యూటివ్. ఎమర్జెన్సీ విధింపుతో సమాంతరంగా, ప్రాధమిక హక్కులను హరించి వేసే, రాష్ట్రపతి ఉత్తర్వులకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకో కలిగింది ఇందిరా గాంధి. ఎమర్జెన్సీ విధింపును, ప్రాధమిక హక్కుల హరింపును, లోక్ సభ ఆమోదం కొరకు ప్రతిపాదించినప్పుడు, సభలో ఓటింగు చేసిన వారిలో 336 మంది సభ్యులు అనుకూలంగా తల వూపడమంటే, ఎగ్జిక్యూటివ్ అధికారానికి దాసోహం అన్నట్లే కదా! మరో విధంగా చెప్పుకోవాలంటే, సంస్థాగతంగా పటిష్టంగా వున్న పార్టీ గణనీయమైన సంఖ్యాబలంతో వున్నప్పుడు, అవిశ్వాస తీర్మానాలు ఏమీ చేయలేవు.

అవిశ్వాస తీర్మానాల ద్వారా, ఇతర రకాలైన సభా తీర్మానాల ద్వారా, రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలను ఇబ్బందికి గురిచేయగల పదునైన ఆయుధాలు, తమ చేతులో వుంచుకున్న ప్రతి పక్షాలు సహితం, పార్లమెంటును జవాబుదారీగా వుంచడంలో విఫలమవుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో కొచ్చిన రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించలేక పోవడానికి కారణం, సంస్థాగతంగా సరైన నిర్మాణం లేకపోవడమే. బ్రిటన్ లో మాదిరి, "షాడో ప్రభుత్వం" ఏర్పాటుచేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకో లేకపోతున్నాయి. పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, ప్రత్యేక కారణాలకొరకు ఏర్పాటు చేసే పలు అడ్ హాక్ కమిటీల లాంటి పార్లమెంటరీ కమిటీలున్నప్పటికీ, అవి రూపొందించిన నివేదికలను, సర్వసాధారణంగా పార్లమెంటు పరిగణలోకి తీసుకోక పోవడం కూడా జవాబుదారీ క్షీణించడానికి కారణమౌతోంది.

పార్లమెంటులో శాసన నిర్మాణానికి అంచలంచలుగా ప్రక్రియ వుంది. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత, ముసాయిదాను చర్చకొరకు పరిశీలించేందుకు తక్షణమే ఓటింగు పెట్టవచ్చు. లేదా, ప్రవేశపెట్టిన సభా సభ్యుల సెలెక్ట్ కమిటీకి కాని, ఉభయ సభల సంయుక్త సెలెక్ట్ కమిటీకి కాని పంపవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణకొరకు కూడా పంపవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ అరుదుగా జరుగుతుంటుంది. లోక్ పాల్ బిల్లు విషయంలో, ఈ ప్రక్రియకు అవకాశం వుండొచ్చేమో! సింహభాగం బిల్లులను సెలెక్టు కమిటీలకే పంపి తాత్కాలికంగా చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. క్లాజు వారీగా బిల్లుపై చర్చ, సవరణల పరిశీలన, సవరణలకు మంత్రివర్గం ఆమోదం-తిరస్కారం, తర్వాత ఓటింగు జరుగుతుంది. సంబంధిత సభలో నెగ్గిన తర్వాత, మరో సభకు పంపి ఇదే ప్రక్రియను అనుసరిస్తారు. ఉభయ సభలలో ఓటింగు తర్వాత, రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది. ఆమోదం పొందినంత మాత్రాన యాంత్రికంగా-స్వయం చలనంగా చట్టం కాదు. చాలా సందర్భాలలో (కావాలనే?) మరిచి పోవడంతో, రాజ్యాంగపరంగా జారీ చేయాల్సిన గెజెట్ నోటిఫికేషన్ ఆలశ్యం కావడం, చట్టం కాగితాలకే పరిమితమై పోవడం జరుగుతుంటుంది.

పార్లమెంటు సభా సమావేశాల సమయం క్రమేపీ తగ్గుతోంది. వాయిదా తీర్మానాల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. అనేక సందర్భాలలో సభ్యులు మూకుమ్మడిగా నిల్చొని, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియనందున, సభ నిర్వహణకు అంతరాయాలు కలగడం సభా సమయం తగ్గిపోవడానికి మరో కారణం. రాజ్యాంగపరంగా విధిగా కావాల్సిన "కోరం" లేకుండా కూడా సభను నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఒక్కో సారి. విధి లేని సందర్భాలలో సభాపతి వాయిదా మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గ ఓటర్లతో నిరంతరం సంబంధాలుండడం తప్పనిసరి. నియోజక వర్గానికి పోవడం చేస్తున్నారు కాని, తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నారు. దురదృష్టవశాత్తు, నియోజకవర్గానికి చెందిన పలువురి దృష్టిలో ఎంపీ అంటే, తమకు కావాల్సిన సొంత పనులు చేసిపెట్టే మనిషి మాత్రమే అన్న అభిప్రాయం వుంది. పార్లమెంటు సభ్యులకు కూడా వారి అవసరం వుండడంతో, వారు కూడా దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వెరసి ఇవన్నీ కూడా, జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలపై వారు శ్రద్ధ వహించకుండా వ్యవహరించేందుకు దోహద పడుతున్నాయి. జవాబుదారీ లోపించడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుందేమో కాని, ఆ వ్యవస్థకు మూలస్థంభమైన పార్లమెంటు జవాబుదారీ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఈ నేపధ్యంలో, అన్నా హజారే లాంటి వారు ప్రతిపాదించిన "లోక్ పాల్" వ్యవస్థ, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ చెప్పినట్లు "జవాబుదారీ తనం లేని సమాంతర ప్రభుత్వం" లాంటిది కాదా? లెజిస్లేచర్, జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్ ల కంటే ఎక్కువ అధికారాలను కలిగుండే వ్యవస్థ కాదా?

Wednesday, June 15, 2011

బొత్స రాజశేఖరీయం:వనం జ్వాలా నరసింహారావు

బొత్స రాజశేఖరీయం

సూర్య దిన పత్రిక (16-06-2011)

(సమన్వయ) కర్తవ్యం దిశగా వడి వడి అడుగులు

వనం జ్వాలా నరసింహారావు

అధిష్ఠానానికి మింగుడు పడని సమస్యలు! ... పట్టు బిగించడం కోసమే పదవుల పంపకం... బొత్స స్వామి కార్యం, స్వ కార్యం నిర్వహించగలరా? ... సీఎంకు హెచ్చరికలు, చురకలు!... ఇకనైనా బడుగులకు పాలనా పగ్గాలు లభించేనా!

బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం కావడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత, ఆ పార్టీలో తలెత్తిన విభేదాలు-వైషమ్యాలు-ధిక్కార స్వరాలు-నాయకత్వ లోపాలు-బహిరంగ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, అధిష్టానానికి తల బొప్పి కట్టించాయి. గత్యంతరం లేని పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి అధిష్టానానికి ఎదురు తిరిగారు. రోశయ్యను దింపి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్య మంత్రి పీఠంలో కూచోబెట్టడంతో, దింపుడు కళ్లెం ఆశ సహితం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి, పార్టీకి-పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, తల్లి విజయమ్మతో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయించి, వైఎస్సార్ కాంగ్రెస్ ను స్థాపించి, తండ్రి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించి ఎమ్మెల్యేలైన కొందరిని తన శిబిరానికి తెచ్చుకోవడం మొదలెట్టారు. కడప-పులివెందుల ఎన్నికలలో అఖండ విజయం, ఎమ్మెల్యేలు ఒకరి వెంట మరొకరు జగన్ శిబిరంలో కొంత రహస్యంగా-కొంత బహిరంగంగా చేరడం, కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడని సమస్యై పోయింది. ఈ లోపు దిగ్విజయ్ స్థానంలో పాత కాపు గులాం నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి, తనదైన శైలిలో కాయ కల్ప చికిత్స మొదలెట్టాడు. ఆ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని పాలనాపరంగా-పార్టీ పరంగా బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసింది అధిష్టానం. నాలుగు నెలల పైగా పెండింగులో పెట్టిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్య మంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవులను భర్తీ చేయడం జరిగింది.

తన జీవితాశయం రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం అని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్న బొత్స సత్యనారాయణ, గతంలో ఏ పిసిసి అధ్యక్షుడు చేయడానికి సాహసించని విధంగా, సమాంతరంగా "మంత్రి వర్గ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు" నిర్వహించడం ఆరంభించారు. ప్రభుత్వ పథకాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలుగా ప్రచారం చేయడంలోనే పార్టీకి లాభముంటుందని ఆయన గ్రహించడం వెనుక ఒక వైపు రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం, మరో వైపు పార్టీ అధ్యక్షుడుగా తాను బలపడడం, ఆయన జీవితాశయం నెరవేర్చుకోవడం కారణమై వుండాలి. సహచర మంత్రుల వద్దకు కూడా వెళ్ళి, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు. గ్రేట్ బొత్స గారు అనిపించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి పథకాలకు పునరుజ్జీవనం పోసే దిశగా బొత్స అడుగు వేయడం కూడా గమనించాల్సిన విషయం. ఉదాహరణకు, ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిని కలిసి, రాజీవ్ ఆరోగ్య శ్రీ-104-108 పథకాలకు నిధులు పెంచాలని, పటిష్టంగా అమలు చేయాలని కోరడం, కాంగ్రెస్ పట్ల ప్రజలకు సడలుతున్న నమ్మకాన్ని పునరుద్ధరించడమే కావచ్చు.

భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు, సూర్యుడి చుట్టూ తిరగడానికి మున్నూట అరవై ఐదు రోజులు పడుతుంది. "భూ భ్రమణం", "భూ పరిభ్రమణం" అని భౌగోళిక శాస్త్రవేత్తలు పిలిచే ఈ ప్రక్రియ ఏక కాలంలో జరుగుతుంది. ఇలాంటిదే మన సత్తిబాబు, పిసిసి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు నిర్వహించి నన్ని రోజులు (పోనీ నిర్వహించడానికి అధిష్టానం అవకాశం ఇచ్చి నన్ని రోజులు) చేయాల్సిన పని. రాష్ట్రంలోని బడా-చిన్న నేతలను కలవడానికి, కలిసి వారి మద్దతు కూడగట్టుకోడానికి, కట్టుకుని అధిష్టానం తనకు అప్పగించిన స్వామికార్యం-స్వకార్యం నెరవేర్చడానికి, జిల్లాల-మండలాల స్థాయిలో తిరగడానికి రోజుకున్న ఇరవై నాలుగు గంటలు సరిపోతాయో? లేదో? అలానే, తనను పిసిసి పీఠం మీద కూచోబెట్టిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి-వారి కోరికలు (ఏమన్నా వుండక పోతాయా!) తీర్చడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. భూ భ్రమణం-పరిభ్రమణం లాగా ఇటు రాష్ట్రంలోను, అటు ఢిల్లీ చుట్టూ చేయాలి. ఈ క్రమంలో ఆయన నుంచి అధిష్టానం ఆశించింది జరగకపోతే, అది మరో ప్రహసనంగా మారి పోవచ్చు కూడా.

"రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు-చెవులు కాంగ్రెస్ పార్టీనే సుమా!" అని పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరు క్షణంలోనే, బొత్స సత్యనారాయణ, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటిది చేయడం వెనుక, ఎటువంటి ని గూడార్థం ఇమిడుందని రాజకీయ విశ్లేషకులు శోధిస్తున్నారు. అసలింతకీ, ఆ విషయం ముఖ్య మంత్రికి తట్టిందో-లేదో మరి. పార్టీ పరంగా ప్రభుత్వానికి కళ్లు-చెవులు ఇప్పుడే పుట్టుకొచ్చాయా? లేక భూత-భవిష్యత్-వర్తమాన కాలాలలో ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలో వున్నా, పార్టీనే ప్రభుత్వపు కళ్ళు-చెవులుగా, ఆయా సందర్భాలలో ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారు భావించారా? లేదా? ఇవన్నీ సమాధానం దొరికీ-దొరకని భేతాళ ప్రశ్నలు. ఆయన మనసులోని భావాలే వైనా, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో చెట్టా-పట్టాలేసుకుని, కలిసి-మెలిసి పని చేసుకుంటూ, పార్టీని "మరింత బలోపేతం చేస్తాను" అని బొత్సా స్పష్టం చేయడం మాత్రం, (కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నా-అనుకోక పోయినా, పత్రికల వారందరు అనుకుంటున్నట్లు) ముఖ్య మంత్రికి కొంత రిలీఫ్ గానే భావించాలి! బొత్స మార్కు వ్యాఖ్య మరొక టి కూడా ఆశ్చర్యకరంగానే వుందనాలి. తాను ఎవరికీ చీఫ్ కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్య కర్తలకు, ఢిల్లీలో అధిష్టానానికి సంధాన కర్తగా మాత్రమే వ్యవహరిస్తానని శలవిచ్చారాయన. పనిలో పనిగా, తననింతవాడిని చేసిన "దైవం" సోనియా గాంధీకి, "పూజారి" గులాం నబీ ఆజాద్‌ కు, ఈ ఇరువురి మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి తనకు ఆ పదవి కట్టబెట్టడంలో తోడ్పడిన జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులందరి కీ, పేరు-పేరునా కాకపోయినా, ప్రత్యేకమైన తరహాలో సభా ముఖంగా ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు.

పార్టీ అభివృద్ది కోసం కాంగ్రెస్‌ పెద్దలు చెప్పినవి వింటానని-సూచనలు పాటిస్తానని, సీనియర్లతో అహర్నిశలు చర్చించి-పార్టీకి "పూర్వ వైభవం" తీసుకొస్తానని, ముఖ్యమంత్రితో కలసి "పార్టీని బలోపేతం చేస్తానని" కూడా బొత్స అంటున్నారు. తనకు "ఎలాంటి సొంత ఆలోచనలు లేవు" అని, "పార్టీ అధినేత్రి నిర్ణయమే తనకు శిరోధార్యం" అని, అనడంతో అధినేత్రి దృష్టిలో మరికొన్ని మార్కులు అదనంగా తెచ్చుకున్నారు. టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం చేస్తోన్న పథకాలు జనం లోకి పోవని, పరోక్షంగా ముఖ్య మంత్రికి ఒక "అఫెన్సివ్" చురక అంటించారు. అలా అంటూనే, మళ్లీ "డిఫెన్సివ్" గా, ముఖ్య మంత్రితో తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఇద్దరం కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని స్పష్టం చేశారు. బొత్స "అఫెన్సివ్" చురకలకు, "డిఫెన్సివ్" స్నేహ హస్తానికి అదే మోతాదులో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తనకు మధ్య ఎటువంటి భేదాభి ప్రాయ లేవని, భవిష్యత్తులోనూ ఉండవని (?) ఆయన స్పష్టం చేశారు. వారిరువురు తాము చెప్పిన దానిని ఆచరణలో చూపబోతున్నామని చెప్పడానికి సంకేతంగా, ఇద్దరూ కలసి గద-కత్తిని ఎత్తారు. మరో అడుగు ముందుకు వేసి, క్రికెట్ ఆటగాడైపోయారాయన కొంచెం సేపు. తాను, బొత్స, రాజ నరసింహ, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క (ఎవరు కెప్టెన్, వైస్ కెప్టెన్, ఓపెన్ బౌలర్, ఓపెన్ భాట్స్ మెన్? అనేది చెప్పలేదు) 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కోసం, "సెలెక్టర్" సోనియా గాంధీ ఎంపిక చేసిన ట్వెన్టీ-ట్వెన్టీ క్రికెట్ టీం సభ్యుల లాంటి వారమని అన్నారు. ముఖ్య మంత్రి తన టీంను క్రికెట్ టీంతో పోల్చడాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేశవ రావు తప్పుబట్టారు. 2014 ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాకుండా, "రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు" కూడా కృషి చేస్తామని సీఎం కిరణ్‌ చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా దేశ ప్రధానిగా వున్నారు కదా! ఆయనతో సంప్రదించి ముఖ్య మంత్రి ఆ ప్రకటన చేశారా? లేక, స్వయంగా ఆయన నిర్ణయమా అది? గతంలో రోశయ్యను, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని, వారింకా ముఖ్య మంత్రులుగా వుండగానే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రిని చేయాలని కొందరు కాంగ్రెస్ సభ్యులు (జగన్ ఇంకా కాంగ్రెస్ సభ్యుడుగా వున్నప్పుడు) డిమాండు చేయడంలో తప్పులేదే మో!

బొత్స సత్యనారాయణ, తెలంగాణ సమస్య విషయంలో ఆచి-తూచి మాట్లాడారు. తెలంగాణపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పిన దాంట్లో నిజాయితీ ఒకింత కనిపించినా, అదే వేదికపై, అఖిల తెలంగాణ ప్రజలు అసలు-సిసలు తెలంగాణ వాదిగా భావిస్తున్న కేంద్ర మంత్రి, మేధావి జైపాల్ రెడ్డి మాత్రం, తన మనసులో మాట బయట పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవాళ్లు ప్రాంతీయ వాదులు-ఉప ప్రాంతీయ వాదులు కాదని, ప్రపంచంలోనే కాంగ్రెస్‌ అతిపెద్ద జాతీయ పార్టీ అని (?), భారతీయ జనతాపార్టీ (తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తున్న) కి సైద్దాంతిక-భౌగోళిక శక్తి లేదని, కమ్యూనిస్టు పార్టీలకు భౌగోళిక శక్తి ఉంది కాని సైద్దాంతిక శక్తి లేదని, తన మేధ మధనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు వెల్లడి చేశారు. సరిగ్గా ఆరు నెలల క్రితం, కాంగ్రెస్ అధిష్టానం, రోశయ్య స్థానంలో ముఖ్య మంత్రిగా జైపాల్ రెడ్డి పేరును పరిశీలించిందన్న వార్తల నేపధ్యంలో, ఆయన అన్నట్లుగా ఢిల్లీ పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలకు (అధిష్టానం తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి తేనే తాను ముఖ్య మంత్రి పదవిని ఒప్పుకుంటానని జైపాల్ రెడ్డి అన్నట్లుగా!) నేటి వ్యాఖ్యలకు పొంతనే లేదు. సహజంగానే, జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో దుమారం లేపడం, ప్రత్యేకంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం, మరో మారు పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేదికాదని చెప్పడం, అసలింతవరకు కేంద్ర మంత్రివర్గంలో దీని గురించి చర్చకూడా జరగలేదనడం, చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటన వెనుక తన బాధ్యత ఏమీ లేదనడం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న మరో నాటకంలో ప్రధానాంశాలుగా పరిగణించాలి. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకునేవారి వాదన సమంజసమా? కాదా? అనే విషయం కాసేపు పక్కన పెడితే, జైపాల్ రెడ్డి ది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను జాతీయ వాదం కానే కాదని, నిఖార్సైన అవకాశ వాదమని, ఆయన ఎంత వేగంగా పార్టీలు మార గలరో అంతే వేగంగా మాటలను కూడా మార్చగలరని అనక తప్పదు. బోఫోర్సు కుంభకోణంలో అయన వేసిన రంకెలను కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆశీర్వచనాలుగా మార్చ గలిగిన సత్తా ఆయన కుంది. ప్రత్యేక రాష్ట్రం కోరడం జాతీయ వాదానికి ఎలా వ్యతిరేకమవుతుందో జైపాల్ రెడ్డే చెప్పాలి. భారత దేశం ఒక వైపు "ఏక కేంద్రక ప్రభుత్వమైతే", మరోవైపు "సమాఖ్య తరహా ప్రభుత్వం" కూడా. ఆ విషయం ఆయనకు తెలియదా?

ఈ నాటకీయ పరిణామాల మధ్య, రాబోయే రోజుల్లో ఏం జరుగబోతుంది? కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి? బొత్సను అధ్యక్షుడుగా చేయడం వెనుక రహస్యం ఏంటి? అధిష్టానం ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చగల సామర్థ్యం వుందా? ఒకవేళ వున్నా ఆయనను సజావు గా పనిచేయనిస్తారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఒక వైపు, జగన్ సవాళ్లు మరో వైపు బొత్సకు తలనొప్పిగా మారుతాయా? 2004 ఎన్నికలలో ఓడిపోయి, అంచలంచలుగా, రాజకీయ వ్యూహంలో తన చతురతను ప్రదర్శించుకుంటూ, 2009 ఎన్నికలలో గతంలో కంటే రెట్టింపు స్థానాలను సాధించి, 2014 ఎన్నికలొచ్చేసరికి అధికారం చేజిక్కించుకునే ధీమాతో ముందుకు సాగుతున్న తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఎదుర్కునేందుకు బొత్స సరిపోతా రా? ఇవన్నీ రాజకీయ విశ్లేషకుల ముందున్న ప్రశ్నలు.

పూర్వ వైభవం తెస్తానని బొత్స అంటున్నారు. పూర్వ వైభవం అంటే, 2004 కు ముందున్న వైభవమా? 2009 ముందు వైభవమా? అంత కంటే మరోటా? 1999 ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడుగా చేసిన వ్యూహాత్మకమైన తప్పులను, శాసన సభలో ప్రతి పక్ష నాయకుడుగా 2004 ఎన్నికలలో సరిదిద్దుకుని-తనకిష్టం లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం కుదుర్చుకుని, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల ఆధారంగా ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు రాజశేఖర రెడ్డి. అప్పట్లో పిసిసి అధ్యక్షుడుగా వున్న డి. శ్రీనివాస్ ను కాదని, ఆనవాయితికి విరుద్ధంగా రాజశేఖర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసింది అధిష్టానం. ఆయన చేసిన వాగ్దానాలను నమ్మి గెలిపించిన ఓటర్లు, అవి ఆయన అమలు పరిచి ధీమాగా 2009 ఎన్నికలలో కొత్త వాగ్దానాలేవీ చేయకుండా పోటీ చేసినప్పుడు, అదే ఓటర్లు అత్తెసరు మార్కులతో గెలిపించారు తప్ప అఖండ విజయం చేకూర్చలేదు. దాదాపు కాంగ్రెస్ పార్టీని ఓడించినట్లే ఒక విధంగా! అప్పట్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఇక ఇప్పుడు-భవిష్యత్ లో ఆయన నాయకత్వానికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అయిపోయారు. కడప ఎన్నికలలో అది నిరూపణ ఐంది కూడా. రెడ్డి నాయకులంతా ఆయన వెంట వెళ్దామంటున్నారు. అందుకే, కాంగ్రెస్ వల పన్నింది. ఆ వలలో చిరంజీవి పడ్డారు మొదలు. ఇప్పుడున్న వారిలో బొత్సకున్న నాయకత్వ లక్షణాలను గ్రహించిన అధిష్టానం ఆయనను అందలం ఎక్కించింది. వెనుకబడిన వర్గాల వారితో సహా, అన్ని వర్గాల వారిని, తన వెంట తిప్పుకోగల సమర్థుడాయన అని నమ్మింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు అగ్ర కులాలకు చెందిన నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళ రావు, కొణిజేటి రోశయ్య, భవనం వెంకటరాం, ఎన్ టీ రామా రావు, నాదెండ్ల భాస్కర రావు, చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కాగలిగారు. తన తర్వాత ముఖ్య మంత్రి కాగలిగిన అవకాశాలున్న అల్లూరి సత్యనారాయణ రాజును కాకుండా చేసే వ్యూహంలో భాగంగా దళిత కులానికి చెందిన వ్యక్తి దామోదరం సంజీవయ్యను, ముఖ్య మంత్రి అయ్యేందుకు సంజీవరెడ్డి మద్దతిచ్చారు. అలానే రాజారాం అవకాశాలను దెబ్బ తీశారు. కాకపోతే ఇందిరా గాంధి అండ దండలతో ఒక సారి టంగుటూరి అంజయ్య ముఖ్య మంత్రి కాగలిగారు. కాపులకు ఇంకా అవకాశం రానే రాలేదు. ఇకనైనా కాపు నాయకుడు బొత్సకు ఆ దిశగా భవిష్యత్ వుందేమో వేచి చూడాలి.

బొత్స సమర్థత, కార్య దక్షత నిరూపించుకోవాలంటే, రాష్ట్రంలో అందరినీ కలుపుకు పోయి, ఢిల్లీలో అందరి మన్ననలను పొందాలి. అందుకే రాష్ట్రంలో "భ్రమణం", ఢిల్లీ చుట్టూ "పరి భ్రమణం" తప్పదు. 2014 ఎన్నికలు-లేదా అంతకన్నా ముందే జరిగే అవకాశం వున్న ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీని గెలిపించు తాయా? గెలిపించినా బొత్సకు ముఖ్య మంత్రి పీఠం దక్కుతుందా? దక్కనిస్తారా? ఏమో! ఆల్ ద బెస్ట్!

Saturday, June 11, 2011

Parliament as an Institution of Accountability is on the decline:V. Jwala Narasimha Rao

Parliament as an Institution of

Accountability is on the decline

V. Jwala Narasimha Rao

Over the years the effectiveness of Indian Parliament as an institution of accountability and supervision is on the decline. The instruments for accountability like motions on the floor, oversight powers, committee system that Parliament can use, are being rendered dysfunctional. Globalization of Indian economy eroded the power of Parliament. International treaties govern much of the economic decision making and Parliament does not have a system of effective treaty oversight in place. The decision on these treaties would have been already taken and are unalterable, by the time they come to Parliament. Parliamentary oversight on the powers which are being delegated to non-elected institutions is very weak.

These were the salient observations made by Devesh Kapur from Harvard University and Pratap Bhanu of Jawaharlal Nehru University in a study paper on the functioning of Parliament titled, “Democracy, Governance and Human Rights Programme”. The study was sponsored by United Nations Research Institute for Social Development five years ago.

Slow legislation process, more powers to executive in the form of ordinances substituting for legislation were identified as the weakness of the Indian Parliament. Parliament is increasingly becoming ineffective in providing scrutiny of the executive. The capacity and inclination MPs for attending to that modern legislation is weak. The large number of political parties in Parliament, most of which are institutionally weak, has substantially increased the barriers to collective action.

Parliament itself has self-abdicated many of its functions. The imperatives of electoral and party politics gave birth to delay an important legislation just for the sake of delay but not for any qualitative improvement in legislation. Parliament is more an oppositional space rather than a forum for genuine debate. For individual MPs, doing good work in Parliament is not linked to any political rewards, either in their constituencies or within their political parties. Parliamentary performance of an MP has no incentive. In Indian politics there is no principle as to who to enter in to politics, or about the caliber of persons likely to enter Parliament. Those charged with making laws may be law breakers themselves.

Since Independence, India has been a complex experiment in institutionalizing democratic accountability through parliamentary institutions. The country undoubtedly has sustained, against great odds, a lively, stable, multicultural and functioning democracy with regular and free elections, an independent judiciary and a vibrant civil society. India’s democratic institutions have shown remarkable endurance. Indians had great hopes that universal suffrage would produce a quiet and steady social revolution that would loosen the power structure of Indian society, ensure to all Indians the rights promised to them under the Constitution and bring about greater well-being.

It is debatable as to what extent Indian Parliament could be held responsible for the successes and failures of Indian democracy. Performance of Parliamentary Democracy is not independent of performance of Parliament. Functioning of Parliament is closely related to the functioning of other key institutions of a democracy. Performance of legislators in a parliamentary system is more an outcome of the influence of the political party to which they belong than anything else. The quality of parliamentarians, judged by their qualifications and commitment, seems to be declining. Though India’s current parliamentarians have much higher levels of formal education than in the past, sizable number among them has criminal backgrounds. This is certainly has an impact on the functioning of Parliament.

The composition of Parliament in general and in the Lok Sabha in particular, has been a reliable index of the changing political preferences of Indian voters. The social composition of Parliament has changed considerably over the years. From its inception as an elite coterie of British educated lawyers, its members today are drawn from a variety of social strata and occupations. Parliament continues to lag behind in the representation of women, and through quotas, a certain number of seats have been earmarked for historically marginalized groups, the Scheduled Castes and Tribes and this has ensured the representation of these groups in Parliament. Parliament thus is a reasonable representation of the diversity of social interests.

The “state of emergency” that Prime Minister Indira Gandhi declared in 1975 was probably one of the most precarious episodes for parliamentary democracy and was not warranted by the national interest. There is also a general sense that the procedural norms that are the basis of parliamentary practice began to erode, particularly after the mid-1970s. The weakening of political parties, the multiplicity of political parties represented in Parliament, from five in the first Lok Sabha to nearly 40 subsequently as well as the changing nature of constituent services and re-election incentives have all transformed the institution of the Indian Parliament.

The primary objective of Parliament is to enact legislation, although it also has constitutional, financial and governmental powers. It is the sole body that can amend the Constitution. It is also the only body with the power to raise taxes and spend money, including the authority to pass the annual budget. The failure of the government to ensure the passage of the budget is automatically a vote of no-confidence. Finally, the Cabinet is collectively responsible to Parliament.

Parliament is the agency through which government is held accountable. The foremost mechanism of accountability is the availability of a no-confidence motion, which, if sustained, would result in the fall of the government. But, a government with a substantial majority in Parliament is unlikely to be much deterred by the introduction of no-confidence motions. The most offensive failure of Parliament to prevent abuse of executive powers occurred in 1975 when Indira Gandhi rammed resolutions approving the presidential proclamation of an internal emergency through both houses of Parliament, suspending the fundamental rights of citizens. The Congress party, then in power, voted en masse to approve the emergency proclamations by a vote of 336 to 59. Even when executive abuses of authority were as blatant as those involved in the declaration of an emergency, it proved impossible to break the ranks of a dominant majority party.

No-confidence motions can be successful only in a very limited scenario where governments have a small majority, and a small part of that constituent majority has some reason to defect to another coalition or seek a general election that would result from the dissolution of government. In the Indian case, no-confidence motions have been successful first in 1989 when the government headed by V.P. Singh was brought down, then in 1990 when the Chandrasekhar government met a similar fate, later in 1997 when the I.K. Gujral government fell and lastly in 1999 when the A.B. Vajpayee government was brought down. This ability to bring down governments through no-confidence motions should not be confused with holding government accountable to Parliament.

The opposition is the constituent part of Parliament that has the most incentive to use the statutory powers of Parliament to keep the government accountable. The principal reason that opposition parties in India do not scrutinize the day-to-day functions of government with any seriousness is that political parties are weak institutions. The ability of the opposition to function as an independent mechanism of accountability has little to do with the formal rules of Parliament.

There are various types of committees in the Indian Parliament namely standing committees like Committee on Public Accounts, the Committee on Estimates and the Committee on Public Undertakings and Ad hoc Committees which are usually appointed for a specific purpose and can be either select or joint. However, the Parliament itself tends to ignore the reports of its committees which is yet another reason for declining accountability.

Legislation in the Parliament involves three stages corresponding to three readings of a bill. After second reading, the bill may be taken into consideration and put to an immediate vote or can be referred to a select committee of the house in question or to a joint committee of both houses, or even circulated for public opinion. However, this option is almost never exercised after a bill has been introduced. Most bills are referred to select committees. A bill placed in Parliament is scrutinized clause by clause, with members also having the right to move amendments. After the third and final reading, followed by Cabinet’s approval of amendments the bill is put to vote. On passage of the bill, it is sent to the second chamber where the entire process is repeated. It is sent to the president for consent after the bill has been passed by both houses. With President’s consent, it does not become a law automatically, that can be enforced, until a notification is gazetted. This step is sometimes “forgotten”, either deliberately or otherwise, with the result that it is unenforceable.

A distinction needs to be made between the workings of Parliament as an institution and the processes that go into the making of Parliament itself. The thorny issue of campaign finance and “criminalization of politics has a decisive impact on the composition of Parliament. The formidable challenge of raising funds for elections deters many citizens from actively participating in politics. In addition, the imperatives of raising electoral financing makes parliamentarians beholden to special interests and in some cases corrupts them, distorts the legislative process and causes considerable decline in the standing of Parliament.

The number of sittings of Parliament over the years has declined. There is a sharp increase in adjournments of the house as a result of disorderly scenes and interruptions where nothing could be recorded and nobody could hear the MPs. One striking indicator of the declining reputation of Parliament is that it now often functions without the required quorum as mandated by Articles of the Indian Constitution. Due to interruptions legislative proceedings are frequently disrupted to the point where there is no option but to adjourn. The disruption can take many forms: many members speaking simultaneously, the opposition not allowing government ministers to make statements and, increasingly, rushing to the well of the house and shouting down the speaker.

There is a striking paradox that illustrates the relationship between parliamentarians and their constituency. On the one hand, it appears from surveys that parliamentarians spend most of their time attending to the affairs of their constituents. On the other hand, parliamentarians seem relatively uninterested or ineffective in utilizing grants and policies for the development of their constituencies. This is exemplified by the extraordinary failure of the Local Area Development (MPLADS) scheme. It also seems that most MPs and their constituents seem to look upon MPs primarily as distributors of patronage rather than as policy makers. MPLADS is perhaps less important than its implications for Parliament as an institution of accountability.

In an era when India’s institutions have been severely stressed, the role of Parliament is particularly significant. The implications of inaction by Parliament, both in terms of slow response to pressing national problems and a lackluster commitment to critically scrutinizing legislation, are far reaching and long term.

A key constitutional responsibility of Parliament is to exercise accountability over the executive by carefully scrutinizing the budget. Parliament’s indifference to this critical responsibility has resulted in India facing a major fiscal crisis that jeopardizes future generations. In many states, copies of the budget documents given to the legislative members are sold as waste paper without even opening the bundles.

Under the Indian Constitution, the president can, on the advice of the government and even in the absence of parliamentary legislation, promulgate ordinances to deal with matters that might arise from time to time. The purpose behind giving the president this power was to enable the government to make decisions in case of emergency or when Parliament was not in session. Typically, the use of ordinances sharply increases during periods of governmental instability. The frequent use of presidential ordinances cannot be seen other than as a way of by-passing the need to secure parliamentary approval for important legislation. While many ordinances have legitimate justifications, Parliament will have to ensure that this practice does not become a method of giving the government short-term power that Parliament would not have approved.

If Parliament is the premier representative institution through which the sovereignty of the people is given concrete expression, nowhere has that sovereignty been more at risk in recent times than in the matter of signing international treaties and incurring international obligations. As India increasingly integrates into the global order by signing treaties, joining more multilateral institutions with sanction-binding power and entering into bilateral arrangements, it is becoming increasingly clear that Parliament’s role in incurring these international obligations is quite minimal. This is despite the fact that the Constitution expressly places treaty-making powers within the jurisdiction of Parliament. Treaty-making powers were largely left to the discretion of the executive.

Parliament has not taken an active role in monitoring the executive on the matter of international treaties does not imply that the executive has been given a free hand by the legislature. In a parliamentary system with a party government, presumably no government will enter into treaties that do not have significant support within their own parties, and by implication, among the legislators. In principle, this political dynamic should function. In practice, it appears that political parties, even of the government in power, are not widely consulted. There is a great deal of secrecy surrounding international negotiations and members of most political parties admit that they learn of international treaties only after the fact.

While parliamentary democracy remains healthy there are significant institutional challenges facing Parliament.

(Source: Study Paper of United Nations Research Institute for Social Development)