Saturday, April 30, 2011

ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం

వనం జ్వాలా నరసింహారావు

ఇటీవలి కాలంలో, "అపనమ్మకం" అనే ఆయుధం అలవోకగా వాడకంలో కొచ్చింది. శత్రువును దెబ్బ తీయడానికి అంత కంటే సులువైన ఆయుధం మరొకటి లేదనే భావన అందరి లోను, ప్రత్యేకించి రాజకీయ నాయకులలోను బలంగా నాటుకుని పోయింది. అకార క్రమంలో అగ్రభాగాన వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఆది మానవుడు చేతికి దొరికిన దాన్నే తనకు రక్షణగా ఉపయోగించుకుంటే, పాత రాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి మారడంతో, అలా రక్షణకు వాడిన వాటినే, ఇతరులపై దాడికి ఉపయోగించుకో సాగారు. మరి కొంతకాలం గడిచాక, వాటినే పదునైన ఆయుధాలుగా మలచుకోవడం మొదలైంది. ఇలా ఆరంభమైన ఆయుధాల వాడకం, పరిణామ క్రమంలో, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడంతో, తుపాకులుగాను-ఫిరంగులగాను, దరిమిలా రసాయన-అణ్వాయుధాల వాడకం వరకూ పోయింది. ఆ తర్వాత ఆంత్రాక్స్...అలాంటి మరి కొన్ని మాధవ మేధస్సులోంచి బయటకొచ్చాయి.

ఒక వ్యక్తి మరో వ్యక్తి నుంచి తన రక్షణకోసం-ఎదుటివారిని దెబ్బతీయడానికి ఆది మానవుల కాలం నుంచి మొదలైన ఆయుధాల వాడకం, నాగరికత పెరిగే కొద్దీ, దేశ దేశాల మధ్య యుద్ధాలకు దారితీసే దాకా పోయింది. ఇవన్నీ ఒక వైపు ఇలా కొన సాగుతూంటే, ఆధిపత్య పోరులో భాగంగా, అధికారం కొరకు, వ్యక్తుల మధ్య పోరాటం మొదలైంది. ఆ పోరాటానికి వాడే ఆయుధాలు, వ్యూహాత్మకమైన ఆయుధాలు కా సాగాయి. వాటి రూపకర్తలు ప్రజాస్వామ్యం ముసుగులో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న రాజకీయ నాయకులు. మొదట్లో ఆ వ్యూహాలు, ప్రజలకు తామేం మంచి చేయదల్చు కున్నామో తెలియచేసే "వాగ్దానాలు" మాత్రమే. అలా చెప్పే వారిలో నిజాయితీ ప్రతి బింబించేది మొదట్లో. క్రమేపీ, చేస్తామని మభ్య పెట్టే వాగ్దానాలు మొదలయ్యాయి. సమాంతరంగా, ఎదుటి వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా మొదలయ్యాయి. చాలా కాలం వరకు కొంతలో కొంత నిజాయితీగానే, ఒకరిపై మరొకరు ప్రచారాలు చేసుకునే వారు. అవన్నీ పనికి రాని రోజులొచ్చాయిప్పుడు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, వారి నుంచి పాఠాలు నేర్చుకుంటూ-వారినే ఆదర్శంగా తీసుకుంటున్న అనేక మంది, ఎదుటి వారిని దెబ్బ తీయడానికి వాడుకుంటున్న అతి పదునైన ఆయుధం "అప నమ్మకం". తన ప్రత్యర్థి విషయంలో ఎంత ఎక్కువ అపనమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే అంత భారీగా విజయం తమ సొంతం చేసుకోవచ్చనే భావన మొదలైంది. ఈ అంటు వ్యాధి అన్ని రంగాల్లోకి పాక సాగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంతకాలం నుంచి, సాగుతున్న మాటల యుద్ధమే.

పాతిక-ముప్పై సంవత్సరాల క్రితం, సినిమా హీరో నందమూరి తారక రామారావు, తెలుగు దేశం పార్టీని స్థాపించి, తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీదుల్లో అవమానం పాలైందనీ-ఆ అవమానానికి ప్రతీకారంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోను-దేశంలోను ఓడించాలని ఇచ్చిన పిలుపుకు తొలుత ఆయన స్వరాష్ట్రంలోను, అనంతరం దేశ వ్యాప్తంగానూ స్పందించిన ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. అప్రతిహతంగా, స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అటు కేంద్రంలోను, ఇటు పలు (ఆంధ్ర ప్రదేశ్ తో సహా) రాష్ట్రాలలోను, అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగలడం గత శతాబ్ది డబ్బై దశకంలో మొదలైంది. రాష్ట్రాలలో ఆ ప్రక్రియ కొంత ముందుగా మొదలైనప్పటికీ, కేంద్రంలో తొలి కాంగ్రెసే తర ప్రభుత్వం అధికారం చేపట్టడానికి 1977 వరకు ఆగవలసి వచ్చింది. 1971 లో కాంగ్రెస్ పార్టీని విజయ పధంలో నడిపించిన ఇందిరా గాంధిని ఓడించడానికి, అప్పటి రాజకీయ పార్టీలు, ఎదురు దెబ్బ తీశారే తప్ప, వెన్ను పోటు రాజకీయాలను కాని, అవాస్తవాలు ప్రచారం చేయడం కాని చేయ లేదు. ఆమె చేసిన "తప్పు" నే తమ ఎన్నికల ప్రధానాంశంగా ఉపయోగించుకున్నారు. ఉవ్వెత్తున పెల్లుబుకిన "అవినీతి వ్యతిరేక ఉద్యమం" లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, ఆబాల గోపాలాన్ని అందులో పాల్గొనే లా చేసింది. వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఇందిరా గాంధి పార్టీకి చెందిన కొందరు నాయకులతో సహా, ఎందరో, ఆ ఉద్యమానికి మద్దతిచ్చి ఇందిరను ఓడించారు. ఆమె చేసిన తప్పులను మాత్రమే ఎంచి చూపారు కాని, ఆమె చేయని-ఆమెకు సంబంధం లేని విషయాలపై, ప్రజల్లో ఆమెపై "అప నమ్మకం" కలిగే ప్రయత్నం బహుశా ఎవరూ చేయలేదు.

1977 ఎన్నికలలో, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నాయకులు ఉపయోగించిన మరో బ్రహ్మాస్త్రం "నియంతృత్వమా-లేక-ప్రజాస్వామ్యమా" కోరుకొమ్మని ఓటర్లను అడగడం. ఎమర్జెన్సీకి ముందు-ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు, కారణాలు సహేతుకమైనా-కాక పోయినా, ఇందిరా గాంధీలో నియంతృత్వ పోకడలు చోటు చేసుకున్న విషయం, ఆమెకు అతి సన్నిహితంగా మెలిగిన వారు సహితం ధృవీకరించిన మాట వాస్తవం. ప్రతిపక్షాల పిలుపుకు స్పందించిన ఓటర్లు, "ప్రజాస్వామ్యానికి" ఓటే సారు. జనతా పార్టీని గెలిపించారు. రెండేళ్ల లోనే ప్రజాస్వామ్యానికి సరైన సారధులు "జనతా పార్టీ నాయకులు" కానే కాదని, కాలేరని నిరూపించడానికి ఇందిరకు అవకాశం దక్కింది. తనపై నమ్మకం పెట్టుకునే దిశగా దరిమిలా వచ్చిన మధ్యంతర ఎన్నికలలో వాగ్దానాలు చేసిందే కాని, ప్రత్యర్థులపై అపనమ్మకం అస్త్రాన్ని వాడుకోలేదు. జనతా పార్టీ అప్పట్లో సుస్థిర ప్రభుత్వాన్ని అందించడంలో విఫలమయిందని ఓటర్లకు తెలియచేసే ప్రయత్నం మాత్రం చేసింది ఇందిరా గాంధి.

ఇందిరా గాంధీనైతే ఓడించ గలిగారు కాని, నిల దొక్కుకోలేక పోయారు అలనాటి కాంగ్రేసేతర రాజకీయ నాయకులు. ఎన్నికలొచ్చాయి. ఇందిరా గాంధి వ్యూహాత్మకంగా, "సుస్థిరతా? అస్థిరతా" అన్న నినాదం లేవనెత్తిందే కాని, "అప నమ్మకం" ఆయుధాన్ని వాడ లేదు. శత్రువును తన బలంతోను, వారి బలహీనతల తోను, గెలిచిందే తప్ప, వాళ్లకు అపవాదు అంటగట్టే విధంగా ప్రచారం చేయలేదు. మధ్యలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇందిరా కాంగ్రెస్ తాను చేయబోయే పనుల ప్రాతిపదికగానే గెలిచింది. అలాగే, అయిదేళ్ల తర్వాత, అదే మోతాదు ప్రభంజనంలో ఆమె పార్టీని ఓడించిన ఎన్ టీ రామారావు, ఇందిరా కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బ తీశాడే కాని ఆమెపై ప్రజల్లో "అప నమ్మకం" ప్రచారం చేయలేదు. తన వ్యతిరేకులతో ఆమె జత కట్టిందని అసత్య ప్రచారాలు చేయలేదు. "మాచ్ ఫిక్సింగ్" అన్న పదాలు ఆమెకు వ్యతిరేకంగా వాడిన దాఖలాలు లేవు. బహుశా ఇదే పద్ధతి, మన దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఇటీవలి కాలం వరకూ అవలంబిస్తూనే వున్నాయి. కాని కాలం మారింది. ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాల కన్నా, తప్పుడు వాగ్దానాల కన్నా పదునైంది, ప్రత్యర్థిని కించపరచడం-అసత్యాన్ని ప్రచారం చేయడం-ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల వారిపై ఓటర్లలో "అప నమ్మకం" కలగ చేయడం అని గ్రహించాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ఎవరు కూడా ఒకరికి మరొకరు తీసిపోరనే చెప్పాలి.

ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం "మాచ్ ఫిక్సింగ్". క్రికెట్ ఆటలో గెలిచిన జట్టు గెలుపుకు ప్లేయర్ల-కోచ్ ల-కెప్టెన్ల ప్రతిభ కాదని, ఓడిన జట్టులోని కొందరితో రహస్యంగా చేసుకున్న ఒప్పందం వల్లనే అని, ప్రచారాలు మొదలయ్యాయి. దాన్నే "మాచ్ ఫిక్సింగ్" అని ముద్దుగా పిలువ సాగారు. అదొక అ నైతిక ఒప్పందంగా ముద్ర పడింది. నిజానికి అలా జరిగుంటే అది అ నైతికమే. ఒకటి రెండు సందర్భాలలో అలా జరిగుండొచ్చు కూడా. కాకపోతే, ఎప్పుడు ఏ మాచ్ ఏ టీం గెలిచినా, దానికి ఏదో రకమైన "మాచ్ ఫిక్సింగ్" కారణం అనే "అప నమ్మకం" ప్రచారంలోకొచ్చింది. ఆ తరహా "అప నమ్మకం" ఎంత బలంగా క్రికెట్ క్రీడాభిమానుల్లో నాటుకు పోయిందంటే, గెలిచిన ప్రతి టీం విజయ రహస్యం "మాచ్ ఫిక్సింగే మో!" అన్నంత "నమ్మకం" గా భావించడం మొదలైంది. ఇక రాజకీయ నాయకులు ఆ ఆయుధాన్ని వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం.

ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ ఆర్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, ప్రస్తుతం జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్" అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో, ప్రచారం తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. ఇటీవలి కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు.

ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా. దీన్ని అరికట్ట లేక పోతే, ఇది అవినీతి కంటే వేయి రెట్ల ప్రమాదం కలిగించే స్థాయికి పోతుంది. మరో అన్నా హజారే లాంటి వారు ఉద్యమించాల్సిన అవసరం కలిగినా ఆశ్చర్య పోనక్కర లేదు. తస్మాత్ జాగ్రత్త!

Saturday, April 23, 2011

Anti-Defection Law yet to serve its purpose:Vanam Jwala Narasimha Rao

Anti-Defection Law yet to serve its purpose

Vanam Jwala Narasimha Rao

Taking shelter under and advantage of the Anti-Defection Law, the ruling Congress Party in Andhra Pradesh, in a bid to get four of its legislators disqualified as members of state legislature, issued show-cause notices to them alleging that they are engaged in antiparty activities. All the four along with another more than half-a-dozen Congress Party MLAs over a period have openly aligned with YSR Congress. However the party leadership decided against only four for obvious reasons. Simultaneously the (Deputy) Speaker has also been alerted through a petition seeking their disqualification. The decision is awaited but the process has begun. Show cause notices were served on them by the (Deputy) Speaker also. Apart from this decision of disqualification of three more MLAs elected on Telugu Desam party Ticket is also pending. One of them resigned even before party complained on him. Two of the Praja Rajyam Party MLA s are also facing similar problem. Though there are enough of anti-defection law provisions in India, unfortunately none of the Speakers of any State Assembly did lay down good conventions that could be adopted by others. Functioning of parliamentary democracy depends more on conventions rather than legal provisions.

The Anti-Defection Law, in the form of Tenth Schedule to the Indian Constitution, passed in 1985 through the 52nd Amendment during Rajiv Gandhi regime to combat evil of political defections seldom achieved it purpose in any state. India in fact enacted different variants of anti-defection laws in 1973, 1985, and 2003. The 2003 law provides that a person can be disqualified from serving in parliament for “voluntarily giving up the membership of his original party”. Furthermore, the Indian law permits parliamentary expulsion simply for voting (or abstaining from voting) “in the House contrary to any direction issued by the political party to which he belongs”. The Indian law on defection “seeks to provide safety measures to protect both the government and the opposition for instability arising out of shifts of allegiance”.

It is argued by many that the Law while deterring defections might lead to suppression of dissent in political parties. An elected member when feels that his party (as in the case of Pocharam Srinivasa Reddy elected as MLA on Telugu Desam Party Ticket and resigned later) failed to implement electoral promises is left with no alternative except to quit party meaning loosing the membership. In a way the law restricts representatives from voicing the concerns of their voters in opposition to the official party position. The decision on disqualification is vested in the Speaker who is invariably the member or nominee of the ruling party and he or she tends to favor accordingly. It is suggested by many that the deciding authority should be an autonomous body like Election Commission.

An analysis of GC Malhotra, former Secretary-General of the Indian Parliament on “the established laws, rules, practices and procedures and conventions” in 40 Commonwealth countries, with brief references to anti-defection laws in 25 other nations revealed, that, laws in 23 countries penalize with parliamentary expulsion for changing parties and that 7 of the 23 also prescribed expulsion simply for voting against their parties. Only 7 of 25 non-Commonwealth nations had anti-defection laws and none cost members their seats for voting against their parties. Malhotra concluded that the law has “succeeded, to some extent, in checking the menace of defections in India’s body politic,” but that “comprehensive legislation” was needed to make the law more effective. The International Institute for Democracy and Electoral Assistance identified 41 nations with laws against parliamentary party defections. Only 14 percent of established democracies require parliamentary members to forfeit their parliamentary seats if they change political parties.

There have been different views on Anti-Defection Laws wherever they are in existence. Kenneth Janda of the Northwestern University of USA extensively analyzed the subject from several dimensions. According to him, Anti-defection laws are rare in established democracies but common in nascent democracies. The general impression is that, in certain respects, the degree of democracy is clearly associated with the occurrence of restrictions on political parties. The most important line of demarcation seems to run between established democracies and other states. Established democracies display few restrictions on parties, all other groups of states considerably more. Kenneth Janda quoted several examples from various countries. While switching is relatively rare in most countries, it has been common in countries like South Africa, Japan, Bolivia, Ecuador, Nepal, Russia, the Philippines, France, Italy, and Brazil. Comparing the party systems of Brazil and Chile with those in Finland, Ireland, and Italy, it is observed that in these European countries, relatively few politicians change parties.

Even in the United States, with its stable two-party system, 20 members serving in the House and Senate from 1947 to 1994 changed their parties while in office-16 switching from Democratic to Republican. This steady erosion of Democratic representation helped the Republicans-the decided minority party in Congress following World War II-gained strength until they won control in the 1994 election. In a celebrated reversal of the trend, one moderate Republican Senator (Jim Jeffords of Vermont) switched to independent in 2001 when the Senate was equally split between the parties. He then voted with the Democrats to choose the Senate’s leaders, giving the Democrats control of the chamber under Republican President George Bush. After Nicolas Sarkozy defeated the Socialist candidate in the spring of 2007 and became President of France, several high-ranking Socialists left their party to become officials in Sarkozy government. Instances of British and Canadian legislators crossing the floor are there though not many. Party switching occurs in western democracies, even in modern times.

There are advantages and disadvantages with the Indian Anti-Defection Law. It provides stability to the government by preventing shifts of party allegiance, ensures that candidates elected with party support and on the basis of party manifestoes remain loyal to the party policies. It also promotes party discipline. By preventing parliamentarians from changing parties, it reduces the accountability of the government to the Parliament and the people. It interferes with the member’s freedom of speech and expression by curbing dissent against party policies.

There are judgments on disqualification of Members and the Tenth Schedule by the Supreme Court from time to time. On whether the right to freedom of speech and expression is curtailed by the Tenth Schedule, the Court observed that, the provisions do not subvert the democratic rights of elected members in Parliament and state legislatures. It does not violate their conscience. The provisions do not violate any right or freedom under Articles 105 and 194 of the Constitution. On whether only resignation constitutes voluntarily giving up membership of a political party, the Court said that, the words “voluntarily giving up membership” have a wider meaning. An inference can also be drawn from the conduct of the member that he has voluntarily given up the membership of his party.

On several other issues the Court observed that: Once a member is expelled, he is treated as an ‘unattached’ member in the house. However, he continues to be a member of the old party as per the Tenth Schedule. If he joins a new party after being expelled, he can be said to have voluntarily given up membership of his old party. On granting finality to the decision of the Speaker is valid, the Court said that, to the extent that the provisions grant finality to the orders of the Speaker, the provision is valid. However, the High Courts and the Supreme Court can exercise judicial review under the Constitution. Judicial review should not cover any stage prior to the making of a decision by the Speakers. The Speaker of a House does not have the power to review his own decisions to disqualify a candidate. Such power is not provided for under the Schedule, and is not implicit in the provisions either. Further the Court said that, if the Speaker fails to act on a complaint, or accepts claims of splits or mergers without making a finding, he fails to act as per the Tenth Schedule. The Court said that ignoring a petition for disqualification is not merely an irregularity but a violation of constitutional duties. In such a case the Court can review the Speaker’s decision making process under the Tenth Schedule.

In the report “Ethics in Governance” of the Second Administrative Reforms Commission, it is noted that “Defection has long been a malaise of Indian political life. It represents manipulation of the political system for furthering private interests, and has been a potent source of political corruption.” The report further notes that “there is no doubt that permitting defection in any form or context is a travesty of ethics in politics.”

The National Commission to Review the Working of the Constitution recommend that “the power to decide on questions as to disqualification on ground of defection should vest in the Election Commission instead of in the Chairman or Speaker of the House concerned.”The Election Commission and “Ethics in Governance” report also recommended that the issue of disqualification on grounds of defection should be decided by the President or the Governor concerned under the advice of the Election Commission, instead of relying on the objectivity of the decision from the Speaker.

Let the (Deputy) Speaker of AP Legislative Assembly Nadendla Manohar, before whom a decision is pending on disqualification of Legislators belonging to three political parties, initiate a process and deliver the judgment that becomes “The Best Practice” and an “Established Convention” of Indian Anti-Defection Law. End


Friday, April 22, 2011

ఎమ్మెల్యేల పై అనర్హత వేటుకు సమయం-సందర్భం?:వనం జ్వాలా నరసింహారావు

ఎమ్మెల్యేల పై అనర్హత వేటుకు సమయం-సందర్భం?

(సూర్య దిన పత్రిక:23-04-2011)

వనం జ్వాలా నరసింహారావు

పక్కా "అంచెలంచల అధికార వ్యూహం" తో జగన్ వర్గంగా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పై, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద, అనర్హత వేటు వేసేందుకు రంగం తయారవుతోంది. దీనికంటే ముందే, నాయకుల ఫిర్యాదు మేరకు రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస రెడ్డితో సహా, ముగ్గురు తెలుగు దేశం శాసన సభ సభ్యులపై కూడా వేటు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరో పక్క కాంగ్రెస్ బాటలోనే, ఆ పార్టీలో విలీనం కానున్న ప్రజారాజ్యం పార్టీ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోంది. పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి, కాటసాని రాం రెడ్డిలపై అనర్హత పిటిషన్ సభాపతికి ఇచ్చేందుకు పీ ఆర్పీ నాయకులు సిద్ధమవుతున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతే, అవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ, సత్ సాంప్రదాయాలే మన్నా నెలకొన్నాయంటే, అలా ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగా, చిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పని సరి. ఏ పార్టీ అధికారంలో వున్నా, వారి వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల ఆధారంగా, ఆ పార్టీ టికెట్ పై చట్ట సభకు ఎన్నికై సభాపతి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తి, తన మాతృ సంస్థ ఆలోచనా ధోరణి ప్రకారమే నడచుకుంటున్న అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పటికీ సమయం మించి పోలేదు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ (ఉప) సభాపతిగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్, ఈ విషయంలో, యావత్ భారత దేశం అభినందించే రీతిలో, రాజ్యాంగ నిబంధనలకు లోబడిన ఒక సత్ సంప్రదాయం ఆవిర్భావానికి చొరవ తీసుకుంటే మంచిది.

చట్ట సభలకు ఎన్నికైన వారు, ఏ ఏ సందర్భాలలో, సభ్యులుగా కొనసాగడానికి అనర్హులవుతారనే విషయం, రాజ్యాంగంలో స్పష్టంగా వివరించ బడింది. సర్వ సాధారణంగా పేర్కొనే విషయాలకు అదనంగా, పదవ షెడ్యూలులో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని కూడా వివరించబడింది. రాజీవ్ గాంధి ప్రధానిగా వున్నప్పుడు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1985 లో అమల్లోకొచ్చింది. నాలుగు వందలకు పైగా లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ముందు జాగ్రత్తగా రాజ్యాంగ సవరణ చేసిందన్న ప్రచారం కూడా జరిగిందప్పుడు. ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, స్వచ్చందంగా, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు, సహజంగా శాసన సభ సభ్యత్వం కూడా కోల్పోతారు. ఒక పార్టీ సభ్యుడుగా చట్ట సభకు ఎన్నికైన వ్యక్తి, ఎన్నికల అనంతరం, మరో పార్టీలో చేరి, తన పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా సభ్యత్వానికి అనర్హులవుతారు. సభాపతిగా-ఉప సభాపతిగా, లేదా శాసన మండలి అధ్యక్షుడుగా-ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వారికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ, అనర్హత వేటు పడకుండా చట్టం మినహాయించింది.

అదే విధంగా, టికెట్ ఇచ్చిన పార్టీ అధికారికంగా జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా, శాసన సభలో జరిగే ఓటింగులో పాల్గొనక పోయినా-పాల్గొని వ్యతిరేకంగా ఓటేసినా, సభ్యత్వానికి అనర్హుడవుతారు. కాకపోతే, అలా చేయడానికి పార్టీ నుంచి ముందస్తుగా అనుమతి పొందినా, లేక, అలా చేసిన పదిహేను రోజుల లోపు అధికారికంగా పార్టీ నాయకత్వం ఆ వ్యక్తిని మన్నించినా, అర్హతకు గురి కాకుండే అవకాశం వుంది. చట్టం మరో చిన్న వెసులుబాటు కూడా కలిగించింది. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన శాసన (లోక్ సభ) సభ సభ్యులలో, మూడింట ఒక వంతు మంది, మూకుమ్మడిగా పార్టీ మారితే-వేరే పార్టీలో విలీనమైతే, ఆ చర్యకు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు వుంది. అయితే, రాజ్యాంగ 91 వ సవరణ ఈ నిబంధనను మార్చి, మూడింట రెండు వంతుల సంఖ్య వుంటేనే, విలీనమైనట్లవుతుందని చెప్పింది. అలానే ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడు, పార్టీ మొత్తం మరో పార్టీలో చేరితే కూడా ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు వుంటుంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన కొందరు శాసన సభ సభ్యులు విలీనానికి అంగీకరించకుండా వేరే పార్టీ పెట్టుకున్నా, ఒక ప్రత్యేకమైన గ్రూపుగా ఏర్పడినా, మినహాయింపుంటుంది.

అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా (ఉప) సభాపతి దే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా, న్యాయ స్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్ నిబంధనలను అమలు పరిచే విషయంలో, తదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది. రాజకీయ పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, కొత్తగా చేరిన వారి వివరాలు, పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలు, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలు, సంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి ఉపయోగ పడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులు, యాంత్రికంగా, తమ సభ్యత్వాన్ని కోల్పోరు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీ, చట్ట సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి, పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధి, సంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరి, తగు విచారణ జరిగిన చేసిన తర్వాతే, సభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు.

సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినా, చట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం, రాజ్యాంగ పరంగా, న్యాయ మూర్తులకు వుంది. తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, స్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేస్తే, సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూ, సరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయ స్థానం. లాంఛనంగా రాజీనామా చేయకుండా, తనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలో, స్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్ట సభ సభ్యుల విషయంలో కూడా, ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని, 1994 లో, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదే విధంగా, స్వతంత్రుడుగా గెలిచి, ఏదైనా పార్టీలో చేరిన వ్యక్తి కూడా, ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు. పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలు, సభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకు, అర్హత-అనర్హతలతో నిమిత్తం లేకుండా, చట్ట సభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికి, ఎన్ని రకాల అవకాశాలుండాలో అన్ని రకాల అవకాశాలను చట్టం కలిగించింది. రాజకీయ పార్టీల "అధి నాయకులు" తమకు అనుకూలమని భావించి, సభాపతికి ఫిర్యాదు చేయనంత కాలం, ఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం. అలా కాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసన సభ సభాపతి చొరవ తీసుకోవాలి.

తాత్కాలిక-శాశ్వత, ఆర్థిక-లేదా-పదవి లాభం కొరకు, పార్టీ ఫిరాయింపులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. విలువలకు తిలోదకాలిచ్చి, తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన, మాతృ సంస్థకే ద్రోహం తలపెట్టడం నేరం. ఆ నేరానికి కనీసం శిక్ష అనర్హత వేటు. పాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినా, దాని అమలు అంతంత మాత్రమే. రాజీవ్ గాంధి హయాంలో, చట్టం తేవడానికి ప్రధాన కారణం, అంతకు ముందు, దేశ వ్యాప్తంగా, ఆయారాం-గయారాంల హవాలో అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం కావడమే. అయితే, చట్టం తేవడం జరిగినప్పటికీ, ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. చట్టం అమలు బాధ్యత సభాపతి మాత్రమే కావడంతో రాజకీయాలకు అతీతంగా, సత్ సాంప్రదాయాలు నెలకొనక పోవడమే దీనికి కారణం. పార్టీ ఫిరాయింపులు యదేఛ్చగా కొనసాగుతూనే వున్నాయి. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే వున్నాయి. కోట్ల ధనం చేతులు మారుతూనే వుంది. ప్రజాస్వామ్యం విలువను అపహాస్యం పాలు చేయడానికి ఫిరాయింపు దారులు చట్టం లోని లొసుగులను ఇంకా వాడుకుంటూనే వున్నారు. రాష్ట్ర మాజీ గవర్నర్, పాలనానుభవం దిట్ట, ఇందిరా గాంధికి సన్నిహితుడు, పీసీ అలెగ్జాండర్, ఫిరాయింపుల చట్టం లోప భూయిష్టమైందని విమర్శించారు. పదవ షెడ్యూల్ లోని ఫిరాయింపుల చట్టాన్ని తిరగ రాసి, ఏ స్థాయి ప్రజా ప్రతినిధైనా, తాను ఎన్నికైన పార్టీని వీడినట్లైతే, ప్రజల విశ్వాసం కోల్పోయినట్లుగా భావించి, తక్షణం సభ్యత్వానికి అనర్హుడైనట్లుగా ప్రకటించే విధంగా వుండాలని సూచించారు.

ఇక ఈ నాటి మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయానికొస్తే, తెలుగు దేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యుల విషయంలో అనర్హత కేసు నడుస్తోంది. అందులో ఒకరైన పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయనపై అనర్హత ఫిర్యాదు సభాపతికి చేరక ముందే తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించమని కోరుతూ, ఆందోళన కూడా చేశారు. తాను పోటీ చేసిన నాడు, తన పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న దానికి-ప్రజలకు వాగ్దానం చేసిన దానికి విరుద్ధంగా, పార్టీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో వ్యవహరిస్తున్నందున, పార్టీలో వుండడానికి ఇష్టపడని తాను రాజీనామా ఇస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. రాజీనామా అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా మారారు. ఏదో వ్యక్తిగత లాభం కొరకు కాకుండా, నాలుగున్నర కోట్ల ప్రజల ఉద్యమానికి మద్దతుగా రాజీనామా ఇచ్చిన వ్యక్తి ఫిరాయింపుదారుడుగా భావించడానికి వీలు లేదు. ఇక మిగిలిన ఇద్దరు, బహిరంగంగా, పార్టీకి వ్యతిరేకంగా (సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న ఫిరాయింపుల శ్రేణిలో) పని చేశారని నాయకత్వం ఫిర్యాదు చేసింది. వారి విషయం సభాపతి నిర్ణయం మేరకే జరగొచ్చు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల విషయానికొస్తే, ఏడాదిన్నర కాలం మౌనంగా వుండి, ఇప్పుడేదో కొంప మునిగినట్లు, సభాపతికి ఫిర్యాదు చేయడంలోని ఆంతర్యం కేవలం రాజకీయ సౌకర్యం తప్ప మరేమీ కాదు. ఒక వేళ జగన్ వెంట వెళ్లారని వేటు వేయదల్చుకుంటే, వీరితో పాటు మరి కొందరి విషయంలో ఫిర్యాదు చేయకపోవడానికి కారణాలేంటి అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వాలి.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోను, దానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోను, ఎన్నికల సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుంటే మంచిదే మో! ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో, పార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇవ్వడం సమంజసం. ఒక పార్టీ, ఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించి, అమలుకు నోచుకోని అంశాల విషయంలో, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పోచారం లాంటి వారికి ఇబ్బందులు తప్పవు. అదే విధంగా, పదవ షెడ్యూల్ అమలు విషయంలోను, కనీసం, సభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనా, ఎన్నికల సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొన కుండా, రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు.

Sunday, April 17, 2011

అంగరంగ వైభోగంగా ముగిసిన అతిరాత్రం పుణ్య యజ్ఞం:వనం జ్వాలా నరసింహారావు

అంగరంగ వైభోగంగా ముగిసిన అతిరాత్రం పుణ్య యజ్ఞం

వనం జ్వాలా నరసింహారావు

("అతిరాత్రం-ఏప్రిల్ లో కేరళలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం" శీర్షికన ఫిబ్రవరి 2, 2011 న బ్లాగ్ లో రాసిన ఆర్టికల్ కు అనుబంధంగా...)

శుక్రవారం (ఏప్రిల్ 15, 2011) రాత్రి, సుమారు తొమ్మిదిన్నర గంటల సమయంలో, కేరళ రాష్ట్రం పంజాల్ గ్రామంలో నిర్వహిస్తున్న అతిరాత్రం పుణ్య యజ్ఞాన్ని ఆరంభం (ఏప్రిల్ 4, 2011) నుంచి వీక్షిస్తూ, దేశ వ్యాప్తంగా వున్న పాత్రికేయులకు ప్రతి దినం పత్రికా ప్రకటనలను విడుదల పంపిస్తున్న జర్నలిస్టు సురేఖతో, యాగం ముగింపు విశేషాల గురించి అడిగాను. అడగడానికి ప్రత్యేకమైన కారణం కూడా వుంది. 1975 లో యజ్ఞం పూర్తైన వెంటనే, యాగ శాలను శాస్త్రోక్తంగా అగ్నికి ఆహుతి చేసిన మరు నిమిషంలోనే (అది కూడా అనుకున్న సమయానికే!) మేగావృతమై, వర్షం కురిసింది. నాలుగు వేల సంవత్సరాల క్రితం నుంచి ఆచరణలో వున్న, ఈ సాంప్రదాయ క్రతువు, నాడూనేడూ, ముగిసిన వెంటనే, వర్షించడం జరిగినప్పుడే, యాగం పరిపూర్ణంగా పరిసమాప్తమైనట్లు భావించాలి. అలానే జరుగుతున్నది కూడా. నేను ఆ విషయం కనుక్కుందామని అక్కడే వున్న సురేఖకు ఫోన్ చేసి వర్షం కురిసిందా అని అడగడమే కాకుండా, అదే రోజు సాయంత్రం, హైదరాబాద్ తో సహా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రదేశాల్లో వర్షం (వడ గళ్ల వాన) పడిన సంగతి కూడా చెప్పాను. అప్పడికింకా అతిరాత్రం జరుగుతున్న పంజాల్ లో వర్షం కురవలేదని ఆమె సమాధానం ఇచ్చింది.

సరిగ్గా, తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు, సురేఖ నుంచి, మొబైల్ ఫోన్ లో సందేశం వచ్చింది. "కుండ పోతగా పంజాల్ పరిసర ప్రాంతాలలో వాన పడుతోంది" అన్న ఆ సందేశం చదివిన వెంటనే, హిందువుల నమ్మకాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, వైదిక కర్మ కాండలు, వేదాల్లో ఉటంకించిన విషయాలు, వాటిని ఆచరిస్తున్న కేరళ నంబూద్రి బ్రాహ్మణుల తరహా సంప్రదాయ కుల నిబద్ధత లాంటివి మనసులో మెదిలాయి. "మంత్రాలకు చింతకాయలు రాలు తాయా" అని వాదించే ప్రభుద్ధులకు ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలి? అని అనిపించింది. అసలు విషయం-నన్ను మరీ ఆశ్చర్య పరిచిన విషయం తెలుసుకుని మరింత విస్మయం కలిగింది. అతిరాత్రం పుణ్య యజ్ఞం సరిగ్గా పన్నెండు రోజులు నిర్విరామంగా-నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా, వేద పండితులు ఋత్విక్కులుగా వ్యవహరిస్తుండగా జరుపుతారు. ఏ రోజు, ఏ సమయంలో, ఏది, ఎలా నిర్వహించాల్నో అనేది శాస్త్రోక్తంగా, ముందే ప్రణాళికా బద్ధంగా, సిద్ధం చేసుకుని అలానే ముందుకు సాగుతారు. దాని ప్రకారం, ముగింపు రోజున యాగ శాలను అగ్నికి ఆహుతి చేయాల్సిన సమయం కొంచం సేపు ఆలశ్యమై, రాత్రి తొమ్మిదిన్నర కు జరపాల్సింది, పది గంటలకు జరిగింది. అయితే, మరి కొన్ని నిమిషాలలో, యాగ శాలను అగ్నికి ఆహుతి ఇవ్వ పోతుండగా, అనుకున్న సమయానికే, తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు, ఆకాశం చిల్లులు పడినట్లు గా, కుండ వృష్టితో, భారీ వాన పడింది పంజాల్ పరిసరాల్లో. పుణ్య యజ్ఞాన్ని, ఆ క్షణాన, కను లారా వీక్షిస్తున్న సుమారు పది లక్షల మంది, ఆ వర్షంతో, యజ్ఞం పరిసమాప్తమవుతుంటే, పులకించి పోయారు.

అలా ముగిసింది అతిరాత్రం పుణ్య యజ్ఞం.

(ఏ రోజున ఎలా ఆ పుణ్య యజ్ఞం నిర్వహించింది, ముగిసింది... పూర్తి వివరాలతో, మరో ఆర్టికల్ లో...)

Sunday, April 10, 2011

SURVIVAL OF “PUBLIC PRIVATE PARTNERSHIP” IN QUESTION: Vanam Jwala Narasimha Rao

SURVIVAL OF “PUBLIC PRIVATE PARTNERSHIP” IN QUESTION

An interesting Case-Study

Vanam Jwala Narasimha Rao, Consultant, HMRI

104 HIHL Services suffer from delayed Payments. It is only after Chief Minister N. Kiran Kumar Reddy in the presence of Principal Secretary Health Dr. P V Ramesh assured to sanction and release mutually agreed funds for operational expenditure as per MOU to HMRI that have fallen due for over three months, the concerned file for Additional Budgetary Release Order (BRO) moved from the Health Department to Finance. The proposal was in cold storage for more than three weeks and thanks to CM’s intervention and prompt action by Principal Secretary Health after that, the file was sent to Finance. Later, in just two working days, the Budget Release Order was issued from Finance and Administrative Sanction Order from Secretariat Health Department without any loss of time. Surprisingly, even after CM’s assurance, it took another three weeks, mainly due to the delay in the office of Commissioner of Health and Family Welfare (CHFW), for preparation of Cheque. It required 45Days and 104Step Process to obtain Government Funds, but not before CM’s intervention! Even with all this delay, CHFW did not clear all the dues though the Finance Department issued orders!

HMRI (Health Management and Research Institute) and CHFW (Commissioner Health and Family Welfare) , Government of AP entered in to MOU to operationalise two important Health care Delivery services benefiting the vulnerable sections of poor in PNPP (Public Not for Profit Private Partnership), namely 104-HIHL (Health Information Help Line) and FDHS (Fixed Date Health Services). The partnership started with 104-HIHL to begin with and extended later to FDHS.

The broad principle of sharing of costs is: “operational expenditure” to be born for both these services by the Government, where as HMRI on its part, in addition to management and research cost would provide technical knowhow and software besides developing various protocols. Consequent to resignation of the Founder Chairman of HMRI in January 2009, the Piramal Group had come forward to support HMRI and Sri Ajay G. Piramal has been invited to be the Chairman of HMRI since August 2010. Since then he is the Chairman of HMRI.

As against this background, since June 2010 the sanctions and releases to HMRI by the Government which are expected to be on the basis of “quarterly advances principle” as per MOU provisions were gradually diluted. Quarterly advances were replaced by monthly. Later, since July 2010, deviations in timely payments commenced and the monthly advances for operations were almost never adhered to. This resulted in late payments of not only salaries but also other operational and connected expenditure. Many a time, HMRI with its limited financial resources had to compensate and advance to avoid any breakdown in the Health Care Delivery.

Taking advantage of this late payment of salaries as well as uncertainty of sanctions of periodical increments to the staff (as provided in the MOU) some of the vocal members of the staff provoked others for resorting to strike the work in the HIHL call center. The strike was called off on the assurance of Principal Secretary Health to pay the increments.

While this was so, there were indications from various corners that the FDHS program was planned to be revamped and would be brought under the new scheme of Cluster Health and Nutrition Centers. This caused considerable anxiety, uncertainty and insecurity among the members of Field Staff. The happenings and the possible breakdown of the FDHS program as well as the resultant adverse affects on the vulnerable sections in the rural areas were brought to the notice of several important persons in the society-formally and informally during September-October 2010. The then Chief Minister, the Leader of the Opposition, TRS Leaders, the then Speaker of the Assembly, the then Minister in-charge of 104 Services as well as concerned senior officials in the Government were kept informed of the possible adverse affects of the proposed changes on the mind-set of FDHS staff. The staff concerns, in adequate budget provisions and delayed funds release were brought to the notice of Principal Secretary, Commissioner Health and Family Welfare from time to time.

104 Contract Employees Union affiliated to CITU went on strike from 10th November 2010. A Delegation from HMRI Management met the then Chief Minister Sri K Rosiah on 14th November 2010 and presented a memorandum regarding the demands of the striking HMRI Employees. Chief Minister assured the delegation that he would soon call for a meeting with all the authorities concerned to resolve the issues. HMRI Delegation explained in the memorandum that, the demands of the striking employees cannot be met by the management since all of them involve policy matters and financial support from Government. HMRI also indicated that demand to be favorably considered by government for resolving the issue and smooth functioning of peripheral services providing access to the unreached population of the state.

Ultimately the program was handed over to the District Collectors with effect from 4th December, 2010. Ever since this happened, the FDHS vehicles have seldom visited any village, in any district, on the fixed day as was done earlier. The sufferer is the voiceless poor patient!

The FDHS program that provided till then 2.73 lakhs Van days, visited 22,500 villages on an average 12 times and screened 116 lakhs people was handed over to Collectors from HMRI for no fault of the management. During the period the scheme was operationalized by HMRI more than 3.5 lakhs diabetic cases and seven lakhs hypertension cases were diagnosed and referred to the doctors, and drugs were issued each time they visited the service points. Nearly 13 lakhs pregnant women were registered and, on an average, all pregnant women were made minimum three compulsory visits. In addition, 20 lakhs children below 5 years, and 20 lakhs school children were provided services.

475 Mobile Health Units which provided once-a-month Fixed Date Health Service at every rural habitation located 3km beyond Primary Health Centers aimed at reducing maternal and child mortality and screen, identify and refer non-communicable diseases, are now lying idle in many districts for different reasons.

Since then, HMRI has been operationalizing only Health Information Help Line (HIHL) services. Since its inception it has received more than FIVE HUNDRED AND THIRTY LAKHS CALLS benefiting about TWO HUNDRED LAKHS VULNERABLE BENEFICIARIES. Recently it crossed an important milestone of providing more than FIVE LAKH beneficiaries with psychological counseling and averted around 800 potential suicides. AP HIHL which is the first of its kind in Asia is the world’s largest Health Information Help Line. On an average the Help Line receives daily around 39 thousands calls.

HMRI was not in receipt of funds on regular basis, as agreed to, since July 2010. Dues from the Government reached to a tune of Rs. 12. 39 Crores during 2010-2011 financial year. Against this background in response to a mail from HMRI, on 14th February 2011, Principal Secretary Health assured to work out a proposal for obtaining additional funds from Government.

A formal request in writing was also made to Commissioner Family Welfare (Signatory to MOU and responsible for sanctions and releases of funds to HMRI) in a letter dated 14th February, 2011 for sanction and release of Rs 12.39 Crores. Between CHFW and Secretariat Health Department’s Financial Advisor, the request was kept in cold storage until 7th March (Three weeks) and until the intervention of CM and Principal Secretary Health. Till then it was never seriously examined and was subjected to several queries made by Financial Advisor.

On 28th February, 2011 a mail was sent by Consultant to Chief Minister requesting for his intervention. There was a prompt response from CM office and an appointment was given to meet CM. Meanwhile mails requesting for intervention of Chief Secretary (on 3rd March, 2011) and Special Chief Secretary to CM (on 4th March. 2011) were also sent.

CEO HMRI along with Advisor and Consultants called on the Chief Minister on 5th March, 2011 (Saturday evening) and requested him for sanction and release of funds. This was preceded by an hour long meeting with Principal Secretary Health in the CM’s Camp Office. Chief Minister in the presence of Principal Secretary responded positively and assured to provide additional budget. He suggested to the Principal Secretary to ensure release of funds. HMRI management team subsequently met Special Chief Secretary to CM, Special Chief Secretary (Finance) and obtained assurance for budgetary provision as and when the request comes from Medical Department.

On 8th March, 2011 the proposal for additional Budgetary Release Order (BRO) was sent to Finance Department. The proposal after seen by three senior most officers (Secretary, Principal Secretary and Special CS) of Finance Department as well as routing through more than half a dozen steps, was approved on 11th March, 2011. BRO was issued and sent to HM&FW department same evening. It took just TWO DAYS in Finance Department. On return from Finance Department, Principal Secretary Health processed immediately and Administrative Order (GO) was issued same day and sent CFW department for further action.

As usual the further action and process was delayed by CFW until 16th initially and almost till 21st March later for obtaining DTA (Director Treasuries and Accounts) authorization. Meanwhile an interim payment of Rs. 2.00 Crores was made by CHFW pending clearance of LOC. Meanwhile to avoid any further delay, HMRI management team met Special CS Finance and Minister for Finance Anam Ramanarayana Reddy and requested for expediting. Secretary Finance approved and gave clearance for issue of LOC and after the formalities of stamping; LOC was issued by Pay and Accounts Officer and sent to CHFW on 24th March.

CHFW processed (but not before 28th March-another five days!) and the Cheque for Rs. 6.21 Crores has been signed by her sent to Secretary Finance IF for Counter Signature next day. Though the proposal was for Rs. 9.8 Crores, as against balance of Rs. 7.8 Crores to be paid to HMRI, an amount of Rs. 1.59 Crores is still awaited for payment! Neither the reasons were explained nor informed to HMRI management by CHFW. The Cheque is in hand on 30th March!

As against failure experiences of Public Sector Undertakings and Joint Ventures , in India, as in other countries evolved the concept of “Public Private Partnership” (preferably between Government and Not for Profit Private Institutions) and steadily gaining strength. Through Public-Private-Partnership (PPP), an otherwise government (Public) service is funded by state either totally or partly, and operated through a partnership between government and one or more non-governmental organizations or private sector companies (Private).

Non-profit organizations have special concern for reaching the poor and the disadvantaged, but, their sustenance depends on timely funding support from the government for operationalizing the scheme. Hence, the Public not for Profit Private Partnership survival is in question if this is the way the department (Health) concerned delays the sanctions and releases.

In spite of CM’s instructions and in spite of Principal Secretary Health orders, the Commissioner Family Welfare and her officers continued with the delay tactics in making payments. Though the Secretary Finance took just a day to clear the LOC, Commissioner Family Welfare proceeded with her delay tactics to issue the Cheque and took another five days! HMRI did not get the entire amount that has been due to them though Finance Department cleared, and CM as well as Finance Minister intervened!

While the Chief Minister responds to the request promptly and while the finance department right from the Minister down to the Secretary and concerned officers clears the proposals in a day or two, it takes weeks and months in departments (like Family Welfare) where proposals originate and are to be processed. If this happens for a normal and non-priority matters one can understand but when it happens to a not for profit health care delivery institution then the survival of PPP concept is in question. The very Health care Delivery is also in question.

Saturday, April 9, 2011

అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వ సరికొత్త నిర్ణయం? : వనం జ్వాలా నరసింహారావు

అత్యవసర వైద్య సేవలకు చట్టం

(ఆంధ్ర జ్యోతి దిన పత్రిక: 15-04-2011)

అత్యవసర వైద్య సదుపాయంలో "బంగారు ఘడియ"

(సూర్య దిన పత్రిక: 15-04-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఆ మధ్య అమెరికాలో వున్నప్పుడు, తెలిసిన స్నేహితుడింట్లో పని చేస్తుండే "నానీ" (ఆయా లాంటిది), ఒక రోజు ఉదయాన అతడింటికి వస్తున్నప్పుడు, రోడ్డు ప్రమాదానికి గురైంది. పోలీసుల సహాయంతో, 911 అంబులెన్సులో (108 అంబులెన్సు లాంటిది) ఆసుపత్రిలో చేరింది. భారతదేశం నుంచి బంధువుల తోడ్పాటుతో కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా చేరిన ఆమె వీసా కాలపరిమితి తీరింది. అమెరికన్ పౌరురాలు కాకపోయినా, వీసా లేకపోయినా, ప్రమాద బారిన పడిన ఆమెకు అత్యవసర వైద్య సహాయం అందించడంలో, స్థానిక ఆసుపత్రి వైద్యులు ఏ మాత్రం ఆలశ్యం చేయలేదు. ఆ తర్వాత, ఆమె మరికొంతకాలం ఆసుపత్రిలోనే చికిత్స పొందాల్సిన అవసరం వుండడంతో, ఆమె ఎవరి తాలూకు మనిషని ఆసుపత్రి అధికారులు విచారణ చేశారు. ఎవరూ లేరని తేలడంతో, తదుపరి చికిత్స కూడా ఉచితంగానే చేశారు. డిశ్చార్జ్ చేయాల్సిన సమయంలో కూడా ఆమెకు దగ్గరి వారు ఎవరూ లేరని తేలడంతో, ఆమె బాధ్యతను, అలాంటివారికి సహాయపడే స్వచ్చంద సేవకులకు అప్ప చెప్పారు. ఇలాంటిది మన దేశంలో జరుగుతే ఏమైతుందనేది ఊహించడం కష్టమే. 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవలు ఆరంభమైన తర్వాత, కొంతలో కొంత మెరుగ్గా, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి మాత్రం, ఆ అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి చేర్చిన ఇరవై నాలుగు గంటల వరకు, ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులు ఉచితంగా చికిత్స చేయడం జరుగుతున్నప్పటికీ, అన్ని సందర్భాల్లో ఇది జరగడంలేదనేది వాస్తవం. "చికిత్సా నిరాకరణ"-అందునా అత్యవసర పరిస్థితుల్లో నిరాకరించడం శిక్షార్హం కానంతవరకు రోగులకు వైద్య సదుపాయం లభించక పోవడం లాంటివి జరుగుతూనే వుంటాయి.

గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సౌకర్యాలున్న ఆసుపత్రులు అతి తక్కువ. డాక్టర్ల కొరతా ఉంది. వైద్యులున్న ఆసుపత్రులలో, చికిత్స నిరాకరించడం అలా వుంచితే, చికిత్సను అందించలేని పరిస్తితులుండే అవకాశాలే ఎక్కువ. ఇక నగరాల-పట్టణాల విషయానికొస్తే, ఆసుపత్రులున్నా, వైద్యులున్నా, ధనికుల విషయంలో ఇబ్బందులు లేకపోయినా, మధ్య తరగతి వారికి కోరుకున్న రీతిలో వైద్యం లభించడం కష్టమే. కొన్ని లొసుగులున్నప్పటికీ, ఆరోగ్య శ్రీ పధకం పేద వారికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తేగలిగిందనడంలో సందేహం లేదు. సాధారణ పరిస్థితుల సంగతి ఇదైతే, అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడడానికి సమగ్రమైన చట్టం లేకపోవడం మూలాన, ధనికుల విషయం ఎలా వున్నా పేద-మధ్య తరగతి వారికి మాత్రం అటు గ్రామీణ ప్రాంతాలలోను, ఇటు పట్టణ ప్రాంతాలలోను సరైన సమయంలో సరైన వైద్యం అందక పోవడం, అకాల మరణాలు సంభవించడం అందరికీ తెలిసిందే. "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" కింద, 108 అత్యవసర సహాయ సేవల ద్వారా, మారుమూల ప్రాంతాలలో ఆపదకు గురైన వారిని, అతి తక్కువ వ్యవధిలో, సమీప ఆసుపత్రికి, చేయదగినంత మేరకు అత్యవసర చికిత్స చేసుకుంటూ, చేర్చే వీలున్నప్పటికీ, చేరిన తర్వాత అదే మోతాదులో చికిత్స అందే అవకాశాలు అంతగా లేవు. నూటికి తొంభై ఆసుపత్రులలో, కనీస అత్యవసర వైద్య సౌకర్యాలు అంతగా లేవు. దానికి తోడు, కారణాలు ఏవైనా, చికిత్సను నిరాకరించే పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి.

ఈ నేపధ్యంలో, ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్న వారితో సహా, వివిధ రకాల ఆరోగ్య రుగ్మతల వల్ల, క్రమేపీ ఆరోగ్యం క్షీణించి, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకున్న వారికి కూడా, అత్యవసర వైద్య సహాయం-అత్యవసరంగా-సకాలంలో లభించేందుకు, "చికిత్సా నిరాకరణ" ను అడ్డుకునేందుకు,రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న వైద్య విధానాన్ని అమల్లోకి తేవాలను కోవడం అభినందించాల్సిన విషయమే. ఈ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు, రాష్ట్రవ్యాప్తంగా, సుమారు రెండువందల ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులను తొలిదశలో ఎంపిక చేయనున్నది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల, ప్రాణాపాయ స్థితిలో వుండి, అకాల మరణం పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతానికి రెండువందల ఆసుపత్రులకే పరిమితం కానున్న ప్రభుత్వ నిర్ణయం దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు విస్తరించడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సా నిరాకరణ నేరంగా పరిగణించే ఆలోచన చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.

అయిదారు సంవత్సరాల కింద రాష్ట్ర రాజధాని-వందల సంఖ్యలో చిన్నా-పెద్దా ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులున్న హైదరాబాద్‍ నగరంలో కుక్క కాటుకు బలైన పసికందు ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు చేసిన విశ్వ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా డబ్బులివ్వందే చికిత్స చేయలేమన్నారు. చివరకు చనిపోయిన బాలుడి శవానికి కప్పేందుకు గుడ్డనివ్వడానికికూడా డబ్బులడిగారు ఒక ప్రభుత్వాసుపత్రిలో. మర్నాడు మీడియా ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించింది. అదేదో రాజధానిలో జరిగింది కనుక పది మందికి తెలిసింది. తెలియనివెన్నో! ప్రభుత్వాసుపత్రి అయినా, ప్రైవేట్‍దైనా, ప్రభుత్వ డాక్టరైనా, క్లినిక్ నడిపే డాక్టరైనా ప్రాణాపాయంలో ఉన్న పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వలేదన్న సాకుతో వైద్యం అందించకుండా ఉండవచ్చా?

ప్రభుత్వం ప్రకటించనున్న అత్యవసర వైద్య విధానం కార్యరూపం దాలిస్తే, ప్రాణాపాయ స్థితిలో వచ్చిన బాధితులు డబ్బులు చెల్లించ లేకపోయినా, వైద్య సేవలు అందించలేమని చెప్పి వెనక్కు పంపడానికి వీలు లేదు. వాస్తవానికి, సుమారు రెండు దశాబ్దాల కిందటే భారత దేశ అత్యున్నత న్యాయస్థానం, జాతీయ వినియోగదారుల ఫోరం, వివిధ సందర్భాల్లో తీర్పునిస్తూ, ప్రమాదాల బారిన పడినప్పుడే కాక, మరే ఇతర అత్యవసర వైద్య సహాయం అవసరమైనా, రోగిని తీసుకెళ్లిన చోట, చికిత్స చేయకుండా నిరాకరించడం తప్పని పేర్కొన్నాయి. ఇలాంటి సందర్భాల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం మన దేశానికే పరిమితమై లేదు. ఇటువంటివి మళ్లీ జరగ కుండా నిరోధించాలనే ఆలోచనతో కేంద్రప్రభుత్వానికి చెందిన లా కమిషన్ తనంతట తాను చొరవ తీసుకొని, ఐదారేళ్ల కింద, ఒక నమూనా చట్టాన్ని రూపొందించి, దానిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి అభిప్రాయాలడిగింది. అయినప్పటికీ, ఆ నమూనా చట్టం కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. లా కమిషన్ నివేదిక-నమూనా చట్టంలో, మెడికో లీగల్ కేసు అనే నెపంతోనో, డబ్బిలివ్వలేదనే కారణానో, భీమా లేదన్న సాకుతోనో, మరేదైనా మిషతోనో వైద్య సహాయాన్ని నిరాకరించడానికి వీల్లేని విధంగా చట్టం రూపొంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో చికిత్సకైన ఖర్చును ఆ తర్వాత, వైద్య సహాయం అందించిన ఆసుపత్రికి గాని, ప్రైవేట్‍ డాక్టర్‍కుగాని చెల్లించే ఏర్పాటు చేయాలి. ఈ ఖర్చును భరించడానికి ఒక పధకాన్ని రూపొందించాలని, ఆసుపత్రికి చేర్చిన అంబులెన్స్ ఖర్చుకూడా ప్రభుత్వమే భరించే ఏర్పాటు చేయాలని లా కమిషన్ నివేదికలో ఉంది. వైద్య రంగం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కనుక, చట్టం తేవడానికి తోడ్పడేందుకు లా కమిషన్ ఈ విధంగా నమూనా బిల్లును తయారుచేసి ఉండవచ్చు.

లా కమిషన్ తయారు చేసి రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయం కోసం పంపిన నివేదికలో పలు ఆసక్తి కరమైన విషయాలను పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా, అత్యవసర వైద్య సహాయం అవసరమైన సందర్భాల్లో విధిగా గుర్తుంచు కోవలసిన "బంగారు ఘడియ" ను (గోల్డెన్‌ అవర్ కాన్సెప్ట్) గురించి విడమర్చి చెప్పింది. ఎమర్జెన్సీ కేసుల్లో రోగిని, ప్రమాదాన్ని గుర్తించిన గంట లోపు సమీప ఆసుపత్రికి చేర్చగలిగితే, చేర్చి నిలకడ స్థితిని సాధించ గలిగితే బతికే అవకాశాలు ఎనభై శాతం ఎక్కువగా ఉంటాయని చెప్పే సిద్ధాంతమే " గోల్డెన్‌ అవర్ కాన్సెఫ్ట్". అలాగే ప్రభుత్వ డాక్టరైనా, ప్రైవేట్ డాక్టరైనా, వృత్తి రీత్యా సంక్రమించిన బాధ్యత నుంచి తప్పుకునేందుకు వీలు లేదు. ఈ "ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్" ను చట్టం కాదన లేదని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చిన రోగికి చికిత్స చేసే విషయంలో మెడికో లీగల్ నిబంధనను పక్కన పెట్టినప్పటికీ, వైద్య సహాయమందించిన డాక్టర్‌ను న్యాయవాదులు కోర్టుల చుట్టూ తిప్పటం సరైనది కాదని కూడా నివేదికలో ఉంది. దీనిని అనవసర వేధింపుల కింద పరిగణించాలని సూచించారు. పోలీస్ లాంఛనాలు పాటించకుండా, డాక్టర్లు బాధ్యతతో రోగి ప్రాణం కాపాడేందుకు అధిక ప్రాధాన్యమిస్తే, దానిని తప్పుగా పరిగణించకుండా ఉండేలా నమూనా చట్టాన్ని రూపొందించారు. ఇటువంటి సందర్భాల్లో అవసరమైనప్పుడు, వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి, సాక్ష్యం ఇచ్చే అవసరం లేకుండా డైరీ ఆధారంగా విచారణ జరిగితే చాలన్న నిబంధనను నమూనా చట్టంలో చేర్చారు.

అమెరికా వంటి దేశాల్లో ఒకప్పుడు ఇదే పరిస్థితి ఉండడంతో, 1986లో అక్కడ చట్టాన్ని తెచ్చి, డాక్టర్లు, ఆసుపత్రులు, వైద్య సహాయం నివారించే వీలు లేకుండా కట్టడి చేయడం జరిగింది. మన దేశంలో కూడా అత్యున్నత న్యాయస్థానం దాదాపు అదే సమయంలో ఈ విషయంలో ఇచ్చిన తీర్పులో, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు, ప్రజల సంక్షేమ దిశగా సేవలందించడమే ప్రభుత్వాల కనీస కర్తవ్యమని పేర్కొంది. అవసరమైన ఆరోగ్య-వైద్య సౌకర్యాలను అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే ప్రభుత్వం ఆసుపత్రులను, ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ప్రతి పౌరుడి ప్రాణం-స్వేచ్ఛ కాపాడ వలసిన బాధ్యత ప్రభుత్వానిదైనప్పటికీ, సుప్రీం కోర్టు ఆమేరకు తీర్పు ఇచ్చినప్పటికీ, సరైన సమయంలో తగిన వైద్య సహాయం అందక ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. కుక్క కాటుకు బాలుడు మరణించడం లాంటివి ఈ వాస్తవాలను మళ్లీ-మళ్లీ బయట పెట్టినట్లయింది. ఆసుపత్రులకు వెళ్లే రోగుల్లో, ఫీజులిచ్చుకొనేవారూ, ఇవ్వలేని వారూ ఉంటారు. ఇచ్చే స్తోమతలేని వారిని "వినియోగదారులు" గా వర్ణించింది సుప్రీం కోర్టు. అంతేకాక, ఫీజులు చెల్లించే వారి డబ్బులోనే చెల్లించ లేనివారి డబ్బుకూడా ఉంటుందని చక్కటి భాష్యం చెప్పింది.

ప్రమాద పరిస్థితిలో వచ్చిన రోగికి చికిత్స అందే విధంగా చట్ట పరమైన రక్షణ కల్పించాలని, వచ్చిన రోగికి ప్రాధమిక చికిత్స చేసి, అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఆసుపత్రిలో-క్లినిక్‌లో చేయదగినంత చికిత్స చేయాలని, స్థోమతలేని వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని, తమకు వీలు కాని పరిస్థితిలో చావు బతుకుల్లో ఉన్న రోగులను డాక్టర్ లేదా ఆసుపత్రి యాజమాన్యమే మరో ఆసుపత్రికి తరలించాలని, స్క్రీనింగ్ పరీక్షల వంటివి చేయడం చేత కాకపోతే అవి లభ్యమయ్యే వేరే చోటికి పంపే ఏర్పాటు కూడా చేయాలని లా కమిషన్ సూచనలు చేసింది. రోగికి నిలకడ పరిస్థితి కల్పించాలని, అది తమకు చేత కాకపోతే మరొక చోటికి పంపడానికి నిరాకరించిన ఆసుపత్రి లేదా క్లినిక్ లేదా డాక్టర్ ఆ వృత్తిలో కొనసాగే వీలు లేకుండా నిబంధనలుండాలని సూచించింది. రోగిని తరలించడానికి రమ్మని కోరితే, అంబులెన్సుల నిర్వాహకులు నిరాకరించ రాదన్న సూచన కూడా ఉంది. అంబులెన్స్ లేక పోతే పోలీస్ సహాయం తీసుకొని వాహనం ఏర్పాటుచేయాలి. రోగిని తరలించే సందర్భంలో ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలూ తరలిస్తున్న డాక్టర్ కాని, ఆసుపత్రి వారు కాని తీసుకోవాలి. రోగికి సంబంధించిన రికార్డులన్నీ వెంట పంపాలి. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులను ప్రభుత్వాలు సమకూర్చడానికి సరైన పధకం రూపొందించాలని కూడా లా కమిషన్ సిఫార్సు చేసింది.

లా కమీషన్ అల నాడు సూచించిన నమూనా చట్టం బహుశా ఏ రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చినట్లు లేదు. నిజంగా ఇవన్నీ జరిగితే ఇంతకన్నా కావలసిందేముంది? ప్రమాదకర పరిస్థితుల్లో అన్నింటికంటే ముఖ్యం సమీప ఆసుపత్రికి తరలించడం. తరలించే ముందు ప్రాధమిక చికిత్స అందించడం, తరలిస్తున్న రోగిని కనీస సౌకర్యాలున్న సమీప ఆసుపత్రికి చేర్పించడం, ఆ తర్వాతే చికిత్స గురించి ఆలోచించడం. ఇవన్నీ కొంచెమైనా జరగాలంటే మొదటగా కావలసింది కనీస సౌకర్యాలున్న అంబులెన్స్, అందులో ప్రాధమిక చికిత్స చేయగలిగిన సుశిక్షుతులైన పారామెడిక్ సిబ్బంది, అవి నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్త (దేశవ్యాప్త) నెట్‌వర్క్, సాంకేతిక సదుపాయం, నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు. ఆ తర్వాత కావలసింది ప్రతి 15-20 కిలోమీటర్లకు కనీస వసతులున్న ఆరోగ్య కేంద్రాలు, వాటిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది. ఆ తర్వాతే చికిత్స విషయం. వాటిల్లో ఎక్కడ ఏ మాత్రం లోపం జరిగినా, ఒకరి నొకరు నిందించు కోవడం తప్ప, ఆశించిన ఫలితం ఉండదు. ఆసుపత్రులున్నా డాక్టర్లు ఉండరు. డాక్టర్లున్నా పరికరాలుండవు. పరికరాలున్నా ఉపయోగించగలిగే నైపుణ్యమున్న సహాయ సిబ్బంది ఉండరు. చట్టంలో ఇవన్నీ స్పష్టంగా పేర్కొంటే మళ్లీ మళ్లీ దీని గురించి, ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు. వీటిలో అంబులెన్సుల విషయానికొస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ" గత ఆరు సంవత్సరాలుగా ఏడెనిమిది వందలకు పైగా 108 అత్యవసర సహాయ సేవలు అందిస్తున్నది. రాష్ట్రప్రభుత్వం, జాతీయ ఆరోగ్య మిషన్ పధకం కింద, ఈ అత్యవసర వైద్యసహాయసేవలు అందించడానికి, అవసరమైన నిధులను సమకూరుస్తున్నది. అంతవరకు బాగానే వుంది కాని, ప్రాణాపాయ స్థితిలో వున్న రోగులకు, ప్రాధమిక అత్యవసర సహాయ సేవలు అందిస్తూ, "108 అంబులెన్సులు" ఆసుపత్రికి చేర్చిన తర్వాత, అదే మోతాదులో, నాణ్యమైన "ఇన్ పేషంటు" అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అన్నీ అవరోధాలే. చాలా ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కరవైతే, ప్రయివేట్ ఆసుపత్రులలో ఇరవై నాలుగు గంటల తర్వాత రోగులు చికిత్స కయ్యే వ్యయాన్ని భరించాలి.

ప్రభుత్వం ప్రకటించనున్న నూతన అత్యవసర వైద్య విధానం కేవలం రెండు వందల ఆసుపత్రులకే పరిమితం చేయకుండా, గతంలో లా కమీషన్ సూచించిన నమూనా చట్టాన్ని ఆధారంగా చేసుకుని, మరింత మెరుగుగా అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడడానికి వీలయ్యే సమగ్రమైన చట్టం తీసుకు రావాలి. అప్పుడే రోగికి సరైన రక్షణ కలిగించినట్లవుతుంది. అన్ని సౌకర్యాలను కల్పిస్తే చికిత్స నిరాకరించినవారిని ప్రశ్నించే హక్కు పౌరుడికి ఉంటుంది. ప్రతి ఆసుపత్రిలోను, కనీస అత్యవసర వైద్య సౌకర్యం లభించే విధంగా, ప్రత్యేకంగా "ఎమర్జెన్సీ గదులను" రూపొందించాలి. 108 అత్యవసర సహాయ సేవలు అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ వైద్య బృందం, ప్రతి చిన్నా-పెద్దా ఆసుపత్రులలో, ఎమర్జెన్సీ గదులను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బ్లూ ప్రింటును ఏనాడో తయారు చేసింది. దాని ఆధారంగా, అతి తక్కువ వ్యయంతో, వీలై నన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ చికిత్సను తక్షణం అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టి తే బాగుంటుంది. భారత దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఒక మెడికల్ డాక్టర్ వున్నందున, అతి త్వరలో ఈ దిశగా ప్రభుత్వం ఒక కార్యాచరణ పథకం తయారు చేస్తుందని ఆశించవచ్చు. End

Thursday, April 7, 2011

ఆరాధ్య దైవం భగవాన్ సత్య సాయిబాబా:వనం జ్వాలా నరసింహారావు

ఆరాధ్య దైవం భగవాన్ సత్య సాయిబాబా

సూర్య దినపత్రిక (09-04-2011)

వనం జ్వాలా నరసింహారావు

గత వారం పది రోజులుగా ఏ నోట విన్నా, ఏ నలుగురు కలిసినా, ఏ పత్రిక చదివినా, ఏ ఛానల్ చూసినా, వినిపించే-కనిపించే ప్రధానమైన విషయం భగవాన్ సత్య సాయిబాబా ఆరోగ్యం గురించే. ఆస్తికులు-నాస్తికులు, అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు, అధికారులు-అనధికారులు, ఆంధ్రులు-ఆంధ్రేతరులు, దేశ-విదేశాల్లోని సామాన్యులు-అసామాన్యులు, బాబా అపర భక్తులు-ఏ మాత్రం గిట్టని వారు, వారు-వీరు అనే తేడా లేకుండా ఆబాల గోపాలం సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం తెలిసిన విషయమే. దీన్ని అర్థం చేసుకోవడంలోనే, ఆయనో మహానుభావుడని, దైవాంశ సంభూతుడని, మానవ రూపంలో మనందరి మధ్యన-మన కోసం కద లాడుతున్న "పురుషోత్తముడు" అనే విషయం బోధ పడుతుంది. పొలిమేరలే తప్ప ఎల్లలు లేని ఒక కుగ్రామంలో జన్మించి, ఎల్లలెరుగని అపురూప ప్రదేశంగా దాన్ని మలిచి, ప్రపంచ వ్యాప్తంగా దేశ-దేశాల పౌరులకు ఆధ్యాత్మిక తృప్తిని, మానసిక స్థయిర్యాన్ని కలుగజేసే "ప్రశాంత నిలయం" గా ఆ పల్లె రూపు-రేఖలనే మార్చి, తన చిన్న కుటుంబాన్ని వసుధైక కుటుంబంగా చేసుకున్న భగవాన్ సత్య సాయిబాబా దేవుడా-కాదా అంటే, దానికి సమాధానం అలా ప్రశ్నించిన వాళ్లే వెతుక్కోవాలి. ఆయనే దేవుడైతే, ఆయనకెందుకు వైద్యం అవసరమవుతుందని, ఎంతో మందికి తన విబూది ద్వారా చికిత్స చేసిన బాబాకు వైద్యులు చికిత్స చేయడం ఎందుకని ప్రశ్నించే వారూ వున్నారు.

హిందూత్వ కర్మ సిద్ధాంతం ప్రకారం, ఈ సకల చరాచర ప్రపంచంలో, భూతకాలంలో జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ ఒక్కడే. ఏ పనిని, ఎప్పుడు-ఎలా-ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో-లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి వుంది. సృష్టించేది బ్రహ్మనీ, సంహరించేది రుద్రుడనీ, కాపాడుతుండేది విష్ణుమూర్తనీ అనుకుంటాం. బహుశా అది నిజంకాదే మో. అనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మం" ఒక్కరే అయుండాలి. ఆ ఒక్కరికి సమానులు గానీ, అధికులు గానీ ఎవరూ వుండరు. గడ్డి పోచ కదలాలన్నా ఆ ఒక్కరే కారణం. ఆ ఒక్కరే, సృష్టికొక అధికారిని (బ్రహ్మ), సంహరించడానికి ఒక అధికారిని (రుద్రుడు), కాపాడడానికి మరొక అధికారిని (విష్ణుమూర్తి) నియమించాడు. విష్ణు, బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులే. అంటే, ఎవరో ఒక "జగన్నాటక సూత్రధారి" స్వయంగా రచించి-నిర్మించి-దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అధ్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ-నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాలి. ఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తే, దాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి-సాగమన్నప్పుడు సాగి-ఆగమన్నప్పుడు ఆగి, భగవంతుడిలో లీనమై పోవాల్సిందే. ఆ తర్వాత ఏంజరుగుతుందనేది మళ్లీ "పర బ్రహ్మం" కే తప్ప ఇతరులకెవ్వరికీ తెలియదు. అంత మాత్రాన ఆయన నియమించిన బ్రహ్మ కాని, శివుడు కాని, విష్ణువు కాని దేవుళ్లు కారు అని అనలేం. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, దశావతారాలని చెప్పుకునే మరే అంశావతారుడైనా, మానవుడుగా పుట్టిన తర్వాత, మానవుల కొచ్చిన కష్ట నష్టాలు వారికి కూడా రాకుండా పోలేదు. అలానే, వారి వారి అవతారాలలో, ఇతరుల కష్టాలను తీర్చకుండా వుండలేదు. శ్రీరాముడు రావణుడితో ఒంటరిగా యుద్ధం చేయలేదే! తన కంటే బలహీనులైన వానరుల సహాయం తీసుకున్నాడు కదా! తన తమ్ముడికి యుద్ధంలో ప్రాణాపాయం వచ్చినప్పుడు హనుమంతుడి సహాయం పొంద లేదా? శ్రీకృష్ణుడు నీలాపనిందలకు గురికాలేదా? చిన్న బాణం ఆయన కాలికి గుచ్చుకుని తనువు (అవతారం?) చాలించాల్సిన పరిస్థితి కలగలేదా? వారిరువురు దేవుళ్లే అయితే అలా ఎందుకు జరిగిందని ప్రశ్నించడం తగనప్పుడు భగవాన్ సత్య సాయిబాబా విషయంలోను అంతేనని ఎందుకు అనుకోకూడదు? బాబా ఎంతో మందికి ప్రాణం పోసినంత మాత్రాన, ఆయన ఇతరుల (సూపర్ స్పెషాలిటీ వైద్యుల) మీద (శ్రీరాముడు వానరుల మీద వలె) ఆధార పడకూడదని వాదించడం పొరపాటు.

దాదాపు నలభై సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో విద్యానగర్-నల్లకుంట సమీపంలోని రాం నగర్ లో వుంటున్నప్పుడు మొట్ట మొదటిసారి బాబా గురించి వినడం జరిగింది. అప్పట్లో ఉగాది పర్వదినాన సాధారణంగా బాబా హైదరాబాద్ వస్తుండేవారు. ప్రస్తుతం శివం వున్న ప్రాంతంలోనే ఆయన వచ్చినప్పుడు కోలాహలంగా ఉంటుండేది. అలా వచ్చినప్పుడు ఒకసారి పొరుగున వున్న వారితో కలిసి మా శ్రీమతి కూడా శివం వెళ్లింది. ఇక అప్పటి నుంచి బాబా గురించిన విశేషాల ప్రస్తావన అడపా దడపా మా మధ్యన వస్తున్నప్పటికీ, అప్పటికీ-ఇప్పటికీ, "డివోటీ" గా కాకపోయినా బాబా పట్ల ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల డివోటీల కంటే కూడా అధికంగా ఆరాధనా భావంతో గమనించడం అలవాటైంది. ఆ తర్వాత బాబా వచ్చినప్పుడల్లా మా శ్రీమతి శివానికి వెళ్ళి వస్తున్నప్పటికీ నేనెందుకో అలా చేయలేదు. మధ్యలో, మా కుటుంబ సభ్యులు దక్షిణ భారత దేశ యాత్రలకు వెళ్లినప్పుడొకసారి, వారిని మార్గమధ్యం దాకా పంపేందుకు పుట్టపర్తికి వెళ్లాం. అప్పుడింత హడావిడి లేకపోగా, ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాల సముదాయాలు కూడా ఇంకా రూపు దిద్దుకోలేదు. భక్తుల సంఖ్య కూడా ఇంతగా లేదు. బాబా దర్శనం బాగానే అయింది. అయినా, అంతగా ఆయన ప్రభావం మా మీద పడలేదనే చెప్పాలి.

నమ్మకం అనేది ఒక్కొక్కరి ఇష్టాయిష్టాలపై ఆధార పడి వుంటుంది. భగవంతుడిని నమ్మడం విషయంలోను అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని ఇష్ట దేవుడుగా భావిస్తారు-అయినా ఇతరుల నమ్మకాన్ని గౌరవిస్తారు. కాకపోతే, కొందరు మరికొంత ముందుకు వెళ్లి, ఇతరుల నమ్మకాన్ని ఎద్దేవా చేస్తూ, తాము నమ్మిన దేవుడే గొప్ప అంటుంటారు. కొందరు సమస్త దేవతలను కొలిస్తే, మరి కొందరు సమస్త దేవతలను తాము నమ్మిన దేవుడిలోనే చూసుకుంటారు. ఇలాంటిది అనాదిగా సాగుతున్నా ఆచారమే. బహుశా సత్య సాయిబాబాను ఆరాధించే భక్తుల్లో చాలా మంది, ఆయనలో అందరు దేవుళ్లను చూస్తుండొచ్చు. అలానే అన్ని మతాల వారు (ఆయన భక్తుల్లో) ఆయనలో తమ తమ మతాలకు చెందిన దైవాన్నే చూస్తుండొచ్చు. ఈ నేపధ్యంలో, పుట్టపర్తికి మొదటిసారి వెళ్లి వచ్చినప్పుడు కూడా బాబాపై కలగని నమ్మకం, ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ లో కొంత మేరకు కలగడానికి కారణం, అప్పట్లో జరిగిన ఒక సంఘటనే. అది యాధృఛ్చికమో-లేక-బాబా అభీష్ఠం మేరకు జరిగిందో చెప్పడం కష్టం. చిక్కడపల్లి సమీపంలోని అశోక్ నగర్ లో వుంటున్న మేమందరం, నేను పెద్దగా ఇష్టం చూపకపోయినా, ఒక ఉగాది నాడు (లేదా శ్రీరామనవమి) బాబా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శివం వెళ్లాం. దర్శనం చేసుకుని, మండుటెండలో ఇంటి ముఖం పట్టాం. ముప్పై సంవత్సరాల కిందటి మాట ఇది. ఆటో కాని, రిక్షా కాని దొరకలేదు. శివం నుంచి నడక సాగిస్తూ ఎండ వేడిని తట్టుకుంటూ చాలా దూరం పోయాం. "బాబా నిజానికి దేవుడై తే, ఒక కారు పంపుతే ఎంత బాగుంటుంది" అని మాలో ఒకరం అన్న మరు నిమిషాన మా పక్కన ఎవరిదో కారు ఆగడం, వారంతట వారే మమ్ములను ఎక్కడకు వెళ్లాలి అని అడగడం, మా ఇంటి దాకా అందరినీ దింపి, ధన్యవాదాలు చెప్పేలోపునో వెళ్లి పోవడం (అంతర్ధానం?) యదార్థంగా జరిగింది. ఎక్కడో కొంత నమ్మకం-ఎందుకో కలిగింది.

స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి రెండో పర్యాయం ముఖ్య మంత్రిగా పనిచేస్తున్న సమయంలో-నేను ఆయన దగ్గర పౌర సంబంధాల అధికారిగా పని చేస్తున్నప్పుడు, ప్రస్తుతం బాబా కోలుకుంటున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంఖుస్థాపన జరిగింది. సరిగ్గా ఏడాది సమయంలో దాని నిర్మాణం పూర్తి చేయించి, అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయాలతో అపురూపమైన ఆసుపత్రిగా దాన్ని తీర్చిదిద్దుతామని అప్పట్లో బాబా చెప్పడం, అలానే జరగడం, మానవ మాత్రులకు సాధ్యపడే విషయమా అని ప్రశ్నిస్తే, బాబా లాంటి మానవ మాత్రులకు మాత్రమే సాధ్యం అని సమాధానం చెప్పుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు, స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహారావు సమక్షంలో, అనంతపురం జిల్లా ప్రజలకు తాగు నీటి సౌకర్యం కలిగించే పథకాన్ని ప్రారంభించడం మేం ప్రత్యక్షంగా చూశాం. ఆ పథకాన్ని ఆయన హామీ ఇచ్చిన సమయంలోపునే పనులు ప్రారంభించడం, పూర్తి చేయడం అపర భగీరథుడుని జ్ఞప్తికి తెచ్చే అంశం. ఆయన దేవుడా కాదా అంటే ఏం సమాధానం చెప్పాలి? మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో పనిచేస్తున్నప్పుడు, నేషనల్ డిఫెన్స్ కళాశాల నుంచి, శిక్షణా సంబంధమైన అధ్యయనానికి, పదహారు మంది అత్యున్నత సైనికాధికారుల బృందం ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చింది. ప్రభుత్వ అతిధులుగా వచ్చిన వారిని, రాష్ట్రంలోని వెనుక బడిన జిల్లాలలో పర్యటించే సందర్భంగా, వారి వెంట వుండేందుకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ నన్ను నియమించింది. ఆ పర్యటనలో భాగంగా పుట్టపర్తి కూడా వెళ్ళాం. బాబా సమక్షంలో, ఆయనకు అతి దగ్గరగా, గంటన్నర సమయం ఆయన మాటలు వింటూ గడిపే అరుదైన అవకాశం మొదటి సారి కలిగింది. ఆయన దైవ సమానుడని నమ్మకం పెరగడానికి ఆ సందర్భంలో జరిగిన విషయాలు మరో నిదర్శనం.

నెల్లూరు నుంచి పుట్టపర్తికి నేరుగా చేరుకున్న నేషనల్ డిఫెన్స్ కాలేజీ అధ్యయన బృందానికి, మా దగ్గర నుంచి ముందస్తు సమాచారాన్ని అందుకున్న ప్రశాంతి నిలయం నిర్వాహకులు, ప్రముఖులుండడానికి ఉపయోగించే "శాంతి భవన్" లో నివాసం ఏర్పాటు చేశారు. వచ్చిన రోజు సాయంత్రమే, బాబా దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు మాత్రం స్వామిని దగ్గరగా దర్శించుకునే అవకాశం మినహా మరే విశేషం జరగలేదు. మర్నాడు ఉదయం దర్శనం వేళకు మమ్మల్నందరినీ స్వామి కూర్చునే కుల్వంత్ హాల్ వేదికపై కూచునే ఏర్పాటు చేశారు. డివోటీలందరి కి ప్రతి ఉదయం సాధారణంగా ఇచ్చే దర్శనం ముగిసిన తర్వాత, మమ్మల్నందరినీ స్వామి ప్రముఖులకు ఇచ్చే ఇంటర్వ్యూ గదిలోకి తీసుకెళ్లారు. అదో అద్భుతమైన అనుభూతి. అందునా, అసలు-సిసలైన డివోటీ కాని నాలాంటి వారికి, అలాంటి అవకాశం కలగడం వింతైన అనుభూతి. సుమారు గంటన్నర పాటు మాతో స్వామి ఆ గదిలో ఎన్నో విషయాలు మాకు వివరిస్తూ, మధ్యలో మమ్మల్ని ప్రశ్నిస్తూ, హింది-ఇంగ్లీష్-తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో, ఎవరికి అర్థమైన భాషలో వారితో అదే భాషలో పలకరిస్తూ మమ్మల్ని ఆశ్చర్య పరిచారు. ఒకరికి చేతి గడియారం, మరొకరికి ఉంగరం, ఇంకొకరికి బంగారపు చైన్...ఇలా.. పదహారు మందిలో కొందరికి బహుమానాలను సృష్టించి ఇచ్చారు. పదహారు మందిలో ఒకరు, అంతకు కొద్ది రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో కర్రల సహాయంతో నడుస్తున్నారు. కుర్చీలో కూచున్న ఆయనను, స్వామి చేతులు చూపించుకుంటూ, లేచి రమ్మనగానే, కర్రల సహాయం లేకుండా అలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. చివరికి మేమెళ్ళి పోవాల్సిన సమయం వచ్చినప్పుడు, బాబా నాకేమీ ఇవ్వలేదే అని మనసులో అనుకుంటుండగా నన్ను పిల్చారు. విబూది పొట్లాలున్న సంచిని నన్నొక చేత్తో పట్టుకొమ్మని, తానొక చేత్తో పట్టుకుని, ఆర్మీ అధికారులందరి కి పంచారు. నేను అదంతా గమనించడం తప్ప ఏం చేయాలో తోచలేదు. ఆఖరుగా, నా భుజం తట్టి, జేబు నిండా స్వయంగా బాబానే ఆయన చేతికొచ్చినన్ని విబూది పొట్లాలు కుక్కి "సంతోషమా?" అని అడిగినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించడం కష్టం. అసలు జరిగిన అద్భుతం ఇంకోటుంది. అప్పటికి కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయాల్సిన ఆ బృందం నాయకుడు (కమాండెంటు) వెళ్ళ బోతూ, చేసిన విజ్ఞప్తికి సమాధానంగా, బాబా ఆయనకు మరో రెండు సంవత్సరాలు పదవి పొడిగించబడుతుందని చెప్పారు. అది నమ్మ శక్యం కాని విషయం. మిలిటరీ సర్వీసుల్లో పదవీ విరమణ వయసును మించి పొడిగించడం జరగదు. అయితే అదే జరిగింది కొన్నాళ్లకు. ఆర్మీలో పని చేసేవారి పదవీ విరమణ వయస్సునే పెంచింది ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సుల నేపధ్యంలో. యాదృచ్చికం కావచ్చు-లేదా-బాబా ఆశీర్వాదం నెరవేరడానికి కమాండెంటుతో సహా పలువురికి లాభం చేకూరి వుండవచ్చు!

ఇలా రాసుకుంటూ పోతే ఇతరుల విషయం సంగతి ఎలా వున్నా స్వయంగా అనుభవంలోకొచ్చినవే చాలా వున్నాయి. పుట్టపర్తికి వెళ్ళినప్పుడల్లా అలాంటి సంఘటనలేవో జరిగేవి. ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల సంస్థలో పని చేస్తున్నప్పుడు, పుట్టపర్తిలో సేవలను ప్రారంభించడానికి వెళ్లాం. బాబా చేతుల మీదుగా, తొలుత లాంఛనంగా 108 సేవలను ప్రారంభించాలని మా కోరిక. ట్రస్టు బోర్డు సభ్యుల, లోగడ మర్రి చెన్నారెడ్డి దగ్గర ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసి బాబా దగ్గరుంటున్న పరమహంస గారి సహాయంతో మా కోరిక నెరవేరింది. ఉదయం రెండు 108 అంబులెన్సులను ప్రశాంతి నిలయం ఆవరణలో, కుల్వంత్ హాల్ సమీపంలో, బాబాకెదురుగా నిలపడానికి అనుమతి లభించింది. మా సీ.ఇ.ఓ వెంకట్ కు, మరో ఇద్దరు సహచరులకు, నాకు, బాబాకు అత్యంత సమీపంలో కూచునే అవకాశం ఆ ఉదయం-సాయంత్రం లభించింది. ఉదయం వెళ్లినప్పుడు, తాను కూర్చున్న స్థలం నుంచే బాబా చేయి వూపుతూ అంబులెన్సు సేవలను ప్రారంభించారు. అంతకు కొన్ని నిమిషాల ముందు మమ్మల్ని తన దగ్గరకు పిలిచి ఆశీర్వదించి, వెంకట్ మెడలో బంగారపు గొలుసు సృష్టించి వేశారు. మాతో పాటు ఆ ఉదయం సమీపం నుంచి బాబాను దర్శించుకున్న వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారి, 108 సేవలు రాష్ట్రంలో రావడానికి కారకుల్లో ఒకరైన ఐ వి సుబ్బారావు గారు కూడా వున్నారు.

సత్య సాయిబాబా మానవ రూపంలో మన మధ్య నున్న దైవం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ దైవాన్ని మన మధ్యన ఆ భగవంతుడు వుంచినంత కాలం అందరికీ అంతా మంచే జరుగుతుంది. ఆ తర్వాత ఆ భగవంతుడు ఎలా జరగాలనుకుంటాడో అలానే జరుగుతుంది. ఇదే కదా భగవత్ అవతార రహస్యం! పోనీ మనకు అర్థమైనంత మేరకు అనుకుందాం!