Tuesday, June 6, 2017

రాహుల్ జీ, ఇవీ నిజాలు! ...... వనం జ్వాలా నరసింహారావు

రాహుల్ జీ, ఇవీ నిజాలు!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-06-2017)

ఇటీవల సంగారెడ్డిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి ఆవాస్తవమైన విషయాలు ఎన్నో చెప్పారు. సమాచార లోపంవల్ల బహుశా అలా జరిగుండవచ్చు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇంటికో ఉద్యోగమిస్తానని అన్నాడని ఒక ఆరోపణ చేశారాయన. ఇది పూర్తిగా అసత్యం. ఇలా అనలేదనే విషయం సాక్షాత్తూ శాసనసభలో సీఎం స్వయంగా స్పష్టం చేసారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం అని మరో ఆరోపణ......అది కూడా పూర్తిగా అబద్ధమే! యువత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా అనేక విధాలుగా ప్రభుత్వేతర, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు విరివిగా కలిపించారు సీఎం. వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో, తద్వారా రాహుల్ గాంధీ దృష్టికి పొతే బాగుంటుందన్న ఆలోచనతో, రాష్ట్రంలో ఉద్యోగపరంగా ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న అనేక చర్యల సమాహారమే వ్యాసం. బహుశా రాష్ట్రంలో, ఇంత తక్కువ కాలంలో, యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో కాని, ఉద్యోగ భద్రతా విషయంలో కాని, పాటికే విధుల్లో వున్న ప్రభుత్వ-ప్రభుత్వ రంగ ఉద్యోగుల విషయంలో కాని, ప్రభుత్వం చేపట్టిన మోతాదులో మరే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టలేదనే సంగతి జగమెరిగిన సత్యం. రాహుల్ గాంధీకి తెలియకపోవడం దురదృష్ఠం. ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అదృష్టం.

తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వ శాఖలలో ఖాలీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా, మొదటి మెట్టుగా, తెలంగాణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర పబ్లిక్సర్వీస్కమీషన్ఏర్పాటు చేసింది. అకడెమిక్, పాలనా నిష్ణాతుడైన ఆచార్య ఘంటా చక్రపాణినిని కమీషన్ ఛైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఇలా నియమించబడిన సర్వీస్ కమీషన్ ద్వారా మొత్తం 27, 860 ఉద్యోగాల కల్పనా జరిగింది. విసిద స్థాయీలలో   నియామక ప్రక్రియ కొనసాగుతుంది. 5999 ఉద్యోగాలను పాటికే భర్తీ చేయడం జరిగింది. 7306 గురుకుల విద్యాలయాల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది. మరో 2437 పోస్టులకు ఇటీవలే జూన్ 2, 2017 నోటిఫికేషన్ జారీ అయింది. ఆరోగ్య వైద్య శాఖలో  2118 పోస్టులను భర్తీ చేయాలని శాఖ నుంచి అభ్యర్ధన రావడం, వాటికి  త్వరలోనే  నోటిఫికేషన్ జారీకావడం జరగనుంది. ఇవి కాక కొత్తగా మరో 10000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధంగా వుంది. ఉద్యోగాల భర్తీకి ఒక పక్రియ వుంటుంది. ప్రాసెస్ పూర్తికాకుండా రాత్రికి రాత్రే ఉద్యోగాలు అలా-ఇలా ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు కదా! నోటిఫికేషన్లతో కలుపుకుని మరికొన్ని రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థల్లో కొత్తగా 20వేల మందికి పైగా ఉద్యోగులను నియమించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశం ఇచ్చింది. వీటిలో కొన్నింటికి ఇప్పటికే నోటిఫికేషన్ వెలుబడింది. వివిధ విద్యాసంస్థల్లో అన్ని నియామకాలకు సంబంధించిన ప్రక్రియ వారంలోగా ప్రారంభం కావాలని మే 30, 2017 సిఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కొత్తగా 84 కస్తూరిభా గాంధి బాలికల విద్యాలయాలు ప్రారంభమవుతున్నాయి. వీటిలో 1428 ఉద్యోగాలు అవసరం అవుతాయి. 840 మంది బోధన, 588 మంది బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలను కలుపుకుని మొత్తం 29 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 377 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందివీటిలో 174 మంది బోధన, 203 మంది బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు.

వీటికి అదనంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలవుతున్న టీఎస్‍ఐపాస్ ఏక గవాక్ష పారిశ్రామిక విధానం ద్వారా లైసెన్సులు పొందిన రు. 72, 000  కోట్ల విలువ చేసే సుమారు 3900 పరిశ్రమల్లో  దాదాపు 2, 40, 000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనుండగా, ఈపాటికే ఉత్పత్తులు ప్రారంభించిన  సుమారు 2300 పరిశ్రమల్లో 72, 000 మందికి పైగా ఉపాధి పొందారు. ఇవన్నీ ఉద్యోగ కల్పనలే కదా!

ఉద్యోగ భద్రతలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. గురుకుల పాఠశాలల్లో తొమ్మిదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న 758 మంది టీచర్లు, అడ్హాక్ పద్ధతిలో పని చేస్తున్న 18 మంది టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, 2488 మంది భాషా పండిట్లను,1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయంతో దాదాపు 25 వేల పైచిలుకు ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. విద్యుత్ శాఖలో వున్న 13,357 ఖాలీలను భర్తీ చేయాలని,  జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంల పరిధిలోని లైన్ మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వo నిర్ణయించింది. 1500 నాన్ టెక్నికల్, ఉద్యోగుల నియామకాలను చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు 10 వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఇదంతా ఉపాధి కల్పనే కదా! ఉద్యోగాలివ్వడమే కదా!

ఇక ఉద్యోగ భద్రతా విషయానికొస్తే....జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి మున్సిపల్ కార్మికుల వేతనం రూ.8,500 గా ఉండేది. వారి వేతనాన్ని రూ.12,500 కు పెంచింది ప్రభుత్వం. తర్వాత మరోసారి వారి జీతాలను పెంచతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జీతాలు రూ.1500 పెంచి, మొత్తం జీతాన్ని రూ.14,000 చేశారు. సుమారు 24 వేల మందికి జీతాలు పెరిగాయి. ప్రభుత్వం రెండు పర్యాయాలు అంగన్వాడిల జీతాలను పెంచింది. మొదటగా  మార్చ్ 11, 2015 అసెంబ్లీలో నిర్ణయం ప్రకటించింది. రెండో పర్యాయం ఫిబ్రవరి 27, 2017 అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధులతో ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో వారి జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంగన్ వాడీల జీతాలు రూ.4,200 నుంచి రూ.10,500 (150 శాతం) కు పెరిగాయి. 3,989 మినీ అంగన్ వాడి టీచర్లు, జీతాలు 4,500 నుండి 6000 లకు పెరిగాయి. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు పెంచాలనే నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 35,700 కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది సిబ్బందికి ప్రయోజనం కలుగుతుంది. ఆశ వర్కర్ల పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆశ వర్కర్లను తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని అధికారులను ఆదేశించారు. 


            తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సిని ప్రకటించింది. మూల వేతనంలో 43% శాతం మేర పెంచి (ఫిట్మెంట్‌) ఇవ్వడం జరిగింది. సకల జనుల సమ్మె లాంటి అధ్బుత పోరాటలు చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం వేతనాలను పెంచింది. సెర్ఫ్తో పాటు జాతీయ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు పెరిగాయి. సెర్ప్లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మందికి రూ. 6,260 నుంచి రూ. 12, 000 మేర వేతనాలను పెంచారు. మిగతా వారికి 30 శాతం అధికం చేశారు. అలాగే ఉపాధి చట్టంలో పనిచేస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లకు రూ.6,290 వేతనంగా ఉండగా, దాన్ని రూ.10,000 చేసింది ప్రభుత్వం. మిగతా వారికి 30 శాతం వర్తింపజేసారు. దీంతో మొత్తం 11,415 మందికి జీతాలు పెరిగాయి. ఇందులో 7402 ఫీల్డ్ అసిస్టెంట్లు కాగా, 4013 మంది(30 శాతం) ఎఫ్.టి.. లు వున్నారు.

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 1578 మంది 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల వేతనాలను రూ.4 వేలు పెంచింది. వారసత్వంగా విలేజ్ రెవెన్యూ అసెస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు 64.61 శాతం పెంచతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం విఆర్ఎలు అన్ని విధాల కలిపి రూ.6500 వేతనం పొందుతున్నారు. వేతనాన్ని రూ.10,500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ కూడా ప్రకటించింది. దీంతో ఒక్కో విఆర్ఎకు రూ.4,200 వేతన పెరుగుతుంది. వీటితో పాటు వి.ఆర్., అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వి.ఆర్..లకు 30 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయనున్నట్లు ప్రకటించింది. పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి వి.ఆర్.. లుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయం వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ తక్కువ వేతనంతో పనిచేస్తున్న రాష్ట్రంలోని 2,900 మంది డెరెక్ట్ రిక్రూట్ వి.ఆర్..లకు మేలు కలుగుతుంది.

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వి...) వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18,405 మంది వి...లు రూ.500 నుంచి రూ.1500 వరకు వేతనం మాత్రమే పొందుతున్నారు. వీరు చేసే పనికి వస్తున్న జీతం వారికి ఏమాత్రం సరిపోయేది కాదు. నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో వి...లతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ప్రతీ వి...కు నెలకు రూ.5వేల జీతం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2010 పిఆర్సి సిఫారసుల మేరకు ఎస్జీటిలకు 10,900 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్స్కు 14వేల 800 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1892 మంది సిఆర్టిలకు మేలు కలుగుతుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని జనవరి 2,2016 జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి పెంచిన జీతాలను జనవరి 2016 నుండే అమలు చేశారు. ప్రస్తుతం రూ.6,700  జీతం వస్తున్న వాళ్ల వేతనాన్ని రూ.12 వేలకు, 8,400 వస్తున్న వారికి 15 వేలకు, 10,900 వస్తున్న వారి జీతాలను రూ.17 వేలకు పెంచారు.

కాంట్రాక్టు లెక్చరర్ల కనీస వేతనం రూ.37,000 పెంచడం వల్ల రాష్ట్రంలో 3,687 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రయోజనం పొందారు. అలాగే కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ల మూల వేతనం రూ.40,270, డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.43,670 పెంచారు. నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులర్ టీచర్ల మాదిరిగా వేతనాలు పొందుతున్నారు. తెలంగాణలో ఆర్టిసి సిబ్బందికి 44శాతం ఫిట్ మెంట్ పెంచాలని నిర్ణయించి, అమలు చేసింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల 58,770 మంది కార్మికులకు ప్రయోజనం కలిగింది. విద్యుత్ శాఖలోని ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లలో పనిచేస్తున్న దాదాపు 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని దశలవారీగా క్రమబద్దీకరణ చేయడం జరుగుతున్నది. వీరికి ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన జీతభత్యాలు లభిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్శాఖ ఉద్యోగులందరికి 27.5 శాతం ఫిట్మెంట్ అలవెన్స్ మంజూరు చేసింది ప్రభుత్వం. విద్యుత్శాఖలోని జెన్కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం డిసెంబర్ 2, 2014 నిర్ణయించింది. ప్రతి నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న హోంగార్డుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం డిసెంబర్ 5, 2014 పలు నిర్ణయాలు తీసుకుంది. 16 వేల మంది హోంగార్డుల వేతనం 9 వేల నుండి 12 వేలకు పెంచడం జరిగింది.  


ఇలా వందల, వేలమంది నిరుద్యోగ యువతకు, ఉద్యోగులకు వివిధ రకాల లబ్ది కూరేలా ప్రభుత్వం అనేక కార్యాలు చేపట్టింది. వాస్తవాలివైతే యువతకు ఏమీ చేయలేదనే వాదన సమంజసం కాదు. END

Rahul Gandhi, get your facts correct : Vanam Jwala Narasimha Rao

Rahul Gandhi, get your facts correct
Vanam Jwala Narasimha Rao
The Hans India (07-06-2017)

At a recent public meeting in Sangareddy, All India Congress Committee (AICC) Vice President Rahul Gandhi made certain remarks about the employment opportunities in Telangana state which are far from facts and truth. This could possibly be due to misinformation. He alleged that during the last general elections KCR promised a job for every house. This is false and on the floor of the Legislative Assembly the Chief Minister himself made it clear many a times. Rahul also alleged that CM is playing with the lives of the unemployed youth which again is travesty of truth. The CM has initiated several measures, many of which in the process of implementation, to create opportunities in the government, non-government, Public sector and thereby bring in light among the lives of youth. If these facts are not known to Rahul Gandhi, it is unfortunate and if he tries to realise them then it will be good.

The government has accorded top most priority to overcome unemployment and for filling up vacancies in several government departments. As a first step, it has created Telangana State Public Service Commission. It is headed by well-known academician and professor Ghanta Chakrapani as the Chairman. 27,860 jobs have been created under the Commission.  Appointments process is going on at various stages.  So far 5,999 jobs were filled up and notification is issued for the filling up of vacancies in 7306 Residential Schools. And for an additional 2437 posts notification is issued on June 2, 2017. Requirement for 2118 posts came from the Medical and Health department for which issue of notification is in the process. Notification is ready for another 10,000 jobs. Filling up of vacancies must go through a process and they cannot be filled up over night. Besides these notifications, the government has instructed the officials concerned to expedite the process for appointing another 20,000 in several educational institutions. The CM has gone on record on May 30, 2017 that appointment process in the educational institutes should begin within a week’s time.

In the state, for the 84 new Kasturi Ba Gandhi Girls Vidyalayas 1428 posts are required. The government issued orders for appointing 840 Teaching and 588 non-teaching employees. The government has also given permission for 377 posts in urban residential Schools to be set up in 29 District Head quarters. Of this, the CM has instructed the District Collectors concerned to appoint 174 Teaching and 203 Non-Teaching employees.

In addition, through the prestigious TS IPASS single window clearances industrial policy the 3900 industries that got approval letters with an investment of Rs. 72, 000 Crores have an employment potential of over 2, 40, 000 jobs. Already the 2300 industries that started production provided 72, 000 jobs. Is this not employment creation to the unemployed youth?

The State government has also taken several measures for the job security and protection of the employees. It has regularized 758 teachers working on contract basis for the past nine years and 18 Adhoc teachers. The government has upgraded 2488 Basha Pandits and 1047 PETs as School Assistants.  It has also decided to regularize the contract employees benefiting 25,000 individuals in all. The government has decided to fill-up 13357 in the electricity department from linemen to Executive Director under Genco, Transco and Discoms. It has also decided to appoint 1500 non-technical employees. In the electricity department alone 10,000 individuals are being promoted. Is this not job creation and creating employment?

The government has increased the salaries of GHMC drivers and sanitation workers. At the time of formation of State Municipal workers were getting a salary of Rs 8,500 per month, which is increased, to Rs 12,500. Later the CM announced that their salaries are further enhanced by Rs 1500 per month, fixing at Rs 14,000 benefitting 24,000 workers. The government has hiked the salaries of Anganwadi workers twice. The first was announced in the Assembly on March 11, 2015 and the second when the CM had a meeting with Anganwadi workers and helpers on February 27, 2017. Their salaries are hiked by a whopping 150 per cent from Rs 4,200 to Rs 10,500 per month. Mini Anganwadi workers salaries are increased from Rs 4,500 to Rs 6,000 benefitting 3989 workers.  This hike in salaries have helped 67,411 workers working in 35,700 Anganwadi centres in the State. ASHA workers salaries also increased to Rs 6,000 per month and the CM has instructed that they be called Rural Health Workers.


The government has announced PRC for the state government employees who have actively participated in the Telangana movement. 43 per cent fitment given on their basic salary. The government has also given a special increment for the employees who have successfully organised the Sakala Janula Samme. Salaries are also hiked for the IKP workers, employees working under SERP and Employment Guarantee Scheme. Of the 4174 Workers in SERP, 767 employee’s salaries are hiked from Rs 6,250 to Rs 12,000 and others are given 30 per cent more. Field Assistants working under Employment Guarantee Scheme are given a hike from Rs 6,290 to Rs 10,000 and 30 percent hike given to others. In all 11, 415 have got the benefit.

For 1578 employees working under 108 Services with meagre salaries, the government hiked to Rs 4,000 per month. For the Village Revenue Assistants working on hereditary posts, the salary is increased from Rs 6,500 to Rs 10,500 (64.61 percent hike). They were also given Rs 200 Telangana increment per month. The government has also decided to regularize VRAs recruited through the Public Service Commission. This will benefit the direct VRA recruits numbering 2900 who are working at lower salaries.

The government has also decided to hike the salaries of 18, 405 Village Organization Assistants (VOA) who were working on lower salaries. They were getting Rs 500 to Rs 1500 per month. The CM held a meeting in Pragathi Bhavan with VOAs and assured that they will be given Rs 5000 per month as salary. The government also decided to hike the salaries of contract teachers working in Tribal Welfare Residential Schools. On the recommendations of 2010 PRC, SGT’s salary is hiked to Rs 10,900 and School Assistants to Rs 14,800 benefiting 1892. On January 2, 2016, the state cabinet decided to increase the salaries of outsourcing employees. For all those getting the salary of Rs 6, 700 to Rs 12,000, for those getting Rs 8, 400 to 15,000 and for those getting Rs 10,900 to Rs 17,000, the salaries were increased.

By increasing the minimum salary of the contract lecturers to Rs 37,000 per month, 3687 were benefitted. Contract Polytechnic Lecturers’ basic salary is increased to Rs 40,270 and for the Degree College Lecturers, Rs 43,670. RTC employees are given 44 percent fitment as well as Telangana increment benefitting 58,770 employees. 24,000 outsourcing employees in the electricity department are being regularized in a phased manner; with this they will get job protection and better wages. Electricity employees in the state are given 27.5 fitment allowance. On December 2, 2014, the government decided to give 30 per cent fitment to the employees in Genco, Transco and Discoms. The salaries of Home Guards, who are on duty day and night has been increased to Rs 9,000 to Rs 12,000 benefitting 16,000 of them.


When this is the truth, Rahul speaks in a different way. Rahul Gandhi Ji get your facts correct please! End

Sunday, June 4, 2017

భక్త ప్రపన్నులకు సీతారాములిద్దరూ సేవ్యులే ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

భక్త ప్రపన్నులకు సీతారాములిద్దరూ సేవ్యులే
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (05-06-2017)

మంత్ర మాత్రుక అయిన గాయత్రీ మంత్ర దివ్య విన్యాసం ఆద్యంతాలూ నింపుకున్న ఇంపైన కాండ సుందరకాండ. కాండ "" కారంతో మొదలై, "" కారంతోనే ముగుస్తుంది. "తరువాత రావణాసుర" అనే పద్యంతో వాసుదాసుగారి సుందరకాండ మొదలవుతుంది. శిష్యుడున్న చోటు వెతికే ఆచార్య స్వరూపం ఇందులో విశదీకరించడం జరిగింది. భగవదనుజ్ఞ లేకుండాఎవరు కూడా ఆచార్యత్వం నెరపలేరన్న విషయం కూడా ఇందులో స్పష్టం చేయడం జరిగింది. అదే విధంగా దూత అనేవాడు, తన స్వామి చెప్పిన మాటలను తెలియచేయడంతో పాటు, శత్రువులు నిరోధించినప్పటికీ, ఎదుర్కొని, విజయవంతంగా తిరిగొచ్చి తాను చేసిన పనులను నివేదించగలవాడై వుండాలనే వ్యంగార్థాన్ని ఇది ధ్వనిస్తుంది. ఇందులో గురు లక్షణాలూ చెప్పబడ్డాయి. హనుమంతుడికి భగవదనుజ్ఞ వుందనడానికి గుర్తు, శ్రీరాముడు ఆయనకిచ్చిన తన ముద్రికే!

"శ్రుతి, స్మృతి, సదాచారం, స్వప్రియం, శీలం" అనేవి ధర్మ నిర్ణయానికి ప్రామాణికాలు. రావణుడి అంతఃపురంలో ఎందరో స్త్రీలను చూసినప్పటికీ హనుమంతుడి మనస్సు చలించదు. లంకాదహనం, అక్షకుమారాది వధ, గురుచారణ మార్గంలో జరిగినవని అనడంలో అర్థం: దూత కృత్యం ధర్మ మార్గానికి అవిరోధంగా చేయడమే! హనుమంతుడికి రామాజ్ఞ వుంది. అది రామాజ్ఞ కాబట్టి వేదానుశాసనమే! ఇలా ఎన్ని రకాలుగానో, హనుమంతుడిలో పరిపూర్ణమైన ఆచార్య లక్షణాలు కలవన్న విషయం తెలియచేస్తూ, అట్టివాడికే శిష్యాన్వేషణ ఫలిస్తుందన్న సంగతి చెప్పడం జరిగింది. సుందరకాండలో శిష్య లక్షణమూ చెప్పడం జరిగింది. శిష్యుడి ప్రధమ లక్షణం "సీత" లాగా వుండడమే!

జాంబవంతుడి ప్రేరణతో వానరులతో కూడి హనుమంతుడు మహేంద్ర పర్వతాన్ని ఎక్కుతాడు. అక్కడినుండి లంకకు వెళ్లాలన్నదే ఆయన సంకల్పం. దానిని కార్యరూపంలోకి తేవడానికి సిద్ధపడ్డాడు హనుమంతుడు. రామదూత, శత్రుసంహారకుడైన హనుమంతుడు, రావణుడు అపహరించిన సీతాదేవిని లంకలో వెతికేందుకు ఆకాశ మార్గాన అక్కడకు ప్రయాణమవుతాడు. రావణ నీత అయిన సీతను అన్వేషించేందుకు సిద్ధపడుతున్నాడప్పుడు. సీతాదేవిలాంటి పతివ్రతా శిరోమణి పాద దర్శనం కలిగినా తాను కృతకృత్యుడైనట్లేనని ఆంజనేయుడి భావన. దీనివలన సీతా మహాత్మ్యం, హనుమంతుడి భక్తి, వినయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. భక్త ప్రపన్నులకు సీతారాములిద్దరూ సేవ్యులే కదా!

హనుమంతుడు తాను పయనించాల్సిన మార్గాన్ని ఒక సారి తేరిపార చూశాడు. తల, మెడ నిక్కపొడిచి, మదించిన కోడెనాగు లాగున్న హనుమంతుడు అత్యంత సుందరాకారుడిలాగా కనిపించాడప్పుడు. కాలంలో, దేశంలో, ఎవ్వరికీ సాధ్యపడని ఘనకార్యం చేయాలన్న తలంపు హనుమంతుడి మనస్సులో కలిగింది. వానరశ్రేష్టుడైన హనుమంతుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ముందుకూ, వెనుకకూ తిరుగుతాడు. పక్షులను బెదిరించాడు. జంతువులను అదిలించాడు. రొమ్ము, నుదురుతో తాకుతూ చెట్లను పడేశాడు. కొండను వూగేట్లు చేశాడు. విజృంభించిన సింహం మాదిరి సంచరించాడు.

నలుపు, తెలుపు కలబోసిన వర్ణ చిత్రంలాగా, ఆకుపచ్చతో సహా వివిధ రంగులతో వృద్ధి చెందిన లోహాదులతోనూ, కాంతిమంతమైన ఆభరణాలతోనూ, అలంకరణ చేసుకున్న యక్షులు, కిన్నరులు, దేవతలు, దేవతాస్త్రీల గుంపులతోనూ, మనోహరమై, మదించిన గజసమూహాలు ఎళ్లవేళలా సంచరించే మహేంద్ర పర్వతంపైన హనుమంతుడు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రకాశించాడు.         

సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మకు, ఇతర దేవతలకు అణకువతో నమస్కరించి ప్రయాణానికి సన్నాహమవుతాడు హనుమంతుడు. సూర్యుడు ఆయనకు విద్యా గురువైనందున తొలుత నమస్కరిస్తాడు. రాక్షసులతో యుద్ధానికి పోతున్నాడు కాబట్టి రాక్షస విరోధి ఇంద్రుడికి ఆ తర్వాత నమస్కరిస్తాడు. బలం, వేగం కలగాలని తండ్రి వాయుదేవుడికి నమస్కరిస్తాడు. బ్రహ్మాస్త్రాల బాధ కలగకుండా వుండాలని బ్రహ్మదేవుడికి ప్రార్థనా పూర్వకంగా నమస్కరిస్తాడు. దీనర్థం కార్యారంభంలో గురువుకూ, ఇష్టదేవతకూ, విధిగా నమస్కరించాలని భావన. పురుషకారాన్ని ప్రార్థిస్తూ, పెద్దలకు నమస్కరిస్తూ, అలా అందరం చేయాలని మనకు నేర్పుతున్నాడు హనుమంతుడు.


గురుదేవతలతో పాటు ప్రత్యక్షదేవతైన తండ్రికి నమస్కరించాలని భావించి దక్షిణ ముఖంగా వున్న హనుమంతుడు తూర్పు తిరిగి ఆ పని చేస్తాడు. సుభ కార్యాలన్నీ తూర్పు, ఉత్తరం తిరిగి మాత్రమె చేయాలనీ, అశుభ కార్యం దక్షిణ ముఖమై చేయాలనీ దీనర్థం. నిద్రలో తలగడకు ఉత్తరం నిషిద్ధం కాగా దక్షిణం ప్రశస్తం.

ఈ విధంగా హనుమంతుడు రామకార్యం సాధించదలచి సముద్రాన్ని దాటేందుకు నిశ్చయించు కుంటాడు. వానరులందరూ చూస్తుండగా పౌర్ణమి నాటి సముద్రం లాగా అంతు లేనంతగా తన దేహాన్ని పెంచాడు.

మితిమీరిన శరీరంతో, సముద్రాన్ని దాటుతున్నానన్న గర్వంతో, హనుమంతుడు రెండు చేతులతో, కాళ్లతో పర్వతాన్ని ఊగించాడు. కదలని ఆ పర్వతం హనుమంతుడి బలానికి చెదిరింది. ఉగిసలాటకు పర్వతం మీదున్న చెట్ల పూలు కొండ మీద రాలడంతో పర్వతం పూలకొండ మాదిరిగా అందంగా కనిపించింది. సువాసనలు వెదజల్లాయక్కడ. కపినాయకుడి పీడనకు గురైన ఆ పర్వతం మదించిన మత్తగజం కన్నీళ్లు (మదం) కారుస్తున్నట్లుగా కనిపించింది. గడ-గడ లాడుతున్న ఆ కొండ మధ్యలోని పొరల చాటునుండి బయటపడ్డ వెండి బంగారాలు ఒకటి తర్వాత మరొకటి కనిపించ సాగాయి. మండే అగ్నిహోత్ర జ్వాలలు పొగలు కక్కినట్లే ఆ పర్వతం కూడా పెద్ద పెద్ద బండలను బయట పడేసింది.

గడ-గడ వణకుతున్న ఆ కొండ గుహల్లోకి అడవి మృగాలు కలవరపడి ఏడ్చిన ధ్వనులు భూమ్యాకాశాలను దద్దరిల్ల చేసాయి. పర్వత చరియల్లోనూ, చుట్టుపక్కల ప్రదేశాలలోనూ, తిరుగాడే పాములు పడగలు విప్పి, కాటేస్తే అగ్నితో సమానమైన ఆ విషప్రభావానికి రాతిగుండ్లు వేయితునకలై ఎగిరిపడ్డాయి. ఆ పర్వతంలోని ఔషధులు కూడా అణచలేక పోయే మోతాదులో వుందా పాముల క్రూరమైన విషం. ఆ కొండ ఎక్కడ బద్దలవుతుందో అన్న భయంతో అక్కడ వుంటున్న వారు, తాగుతున్న మద్యాన్ని మధ్యలోనే వదలి, ఎక్కడి వస్తువులు అక్కడే పడేసి, హడావిడిగా పరుగెత్తారు. హారాలు, కంకణాలు, భుజకీర్తులు, కాలి అందెలు, పూదండలు, కదియాలతో సహా, శరీరం మీద వున్నవి తప్ప మిగిలినవన్నీ వదిలేసి పోయారు.

తమ ఆడువారు తోడురాగా, మత్తులో వున్న వీరందరూ, వళ్ళు మరచి ఆకాశానికి ఎగిరారు. స్త్రీలు ఆకాశ వీదిలో తమ ప్రియులతో కలసి, పరాచకాలాడుతూ, నవ్వుతూ, శరీరాలు మరచి, అక్కడ జరుగుతున్న భయానక దృశ్యానికి అబ్బురపడుతూ, కార్యసాధకుడైన హనుమంతుడిని చూసారు. శ్రేష్ఠులైన విద్యాధరులు గుంపులు-గుంపులుగా ఆకాశంలో నిలుచుని, ఆ క్షణంలో పర్వతమున్న భంగిమను చూసారు ఆశ్చర్యంగా.


            ఆంజనేయుడు రామకార్యార్థమై, వానరార్థమై, పర్వతాకారంలో అసాధ్యమైన సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు పోయే ప్రయత్నంలో ఉన్నాడని సిద్ధులు, చారణులు, విద్యాధరాలకు చెప్పారు. సీతకై సముద్రాన్ని దాటడం కేవలం రాముడికొరకే కాదు....వానరుల ప్రాణ రక్షణ చేయడం కూడా వుంది. దేహాన్ని అమితంగా పెంచిన హనుమంతుడు ఒక్కసారిగా వళ్ళు విదిలించి, వెంట్రుకలు రాల్చి, వర్షాకాల మేఘం లాగా దిక్కులు పిక్కటిల్లేట్లు గర్జిస్తాడు. గరత్మంతుడు పామును విదిలించినట్లు తన తోకను విదిలించాడు. హనుమంతుడి తోక గరత్మంతుడు పట్టుకున్న పాములాగా ఆయన వీపుమీద మెరుస్తున్నదప్పుడు. End

Thursday, June 1, 2017

Welfare to all …. Poverty to none ...... Chief Minister K Chandrashekhar Rao’s Address..formation day

Welfare to all …. Poverty to none
Chief Minister K Chandrashekhar Rao’s Address
On the occasion of State’s Formation Day Celebrations
(02-06-2017)
On this auspicious occasion, I convey my State Formation Day greetings to the entire Telangana people. On the occasion, I pay my respectable homage to all those sacrificed their lives for the formation of the State.
For what purpose did we lead the great movement and what dreams that we wanted to be realised in our own State, the Telangana State is marching towards the progressive path, fulfilling those aspirations and realising those dreams.
First in Revenue Growth Rate
Telangana is rich in its natural resources and endowed with prosperity. But the economic strength and growth of Telangana was pushed to oblivion during the United AP rule. I have repeatedly asserted during the Telangana movement that once separate Telangana state is formed it will be the richest in the country. The statements that I have made then have been proved literally correct now. In its recent report, CAG for the financial year 2017-18 stated that Telangana state stood first in the revenue growth rate in the country registering 17.82 per cent growth. We should all be proud of it and it is a good omen to us. I declare it proudly that it is due to proper policy planning, financial prudence and discipline of the government policies that the growth rate was achieved.
People’s Welfare
The Telangana state has also stood first in the country in not only creating prosperity and wealth but also sharing it with people based on equity and social justice. I am happy to say that the State has also became a role model for others in taking the results of development to lower rungs of the society.
After formation of the State, within a short span of time, Telangana government has given welfare to all. It has infused self-confidence and instilled self-respect among the poor. The government is spending Rs 40,000 Crore for 35 Welfare Schemes. A Lion’s share of the State’s income is being spent for the people’s welfare. The government is giving pension under Asara Scheme to 40 Lakh helpless individuals.  For the marriage of daughters from the poor families, we are implementing Shaadi Mubarak/Kalyan Laxmi Schemes. To the hungry poor, 6-Kgs of rice is given per member at a subsidised price of one Rupee per KG. To help the poor to live with dignity, 2 Bed Room Houses are given free of cost. For all the hostel students, fine rice is supplied for their meal. To impart international level education to the poor, newly 512 Residential Schools are set up. Let me share with you that on the lines of SC Degree Colleges for women, from next academic year, ST Degree Colleges will also be set up for ST girl students. For the benefit of SC/STs a Special Fund is created based on their population figures and special programmes are framed for the development and Welfare. We have identified the employees and workers at the field level and have increased their salaries by leaps and bounds. For the first time in independent India’s history, ours is the first government, which created a fund for Lawyers, and Journalists in the State’s Budget
Single women—KCR Kits
We are going to implement two schemes with a human angle for the poor women on the occasion of the state’s formation day. Pension for single women, who have no support, will be started from day after tomorrow and they will get Rs 1000 per month pension. I hope this pension will mitigate their difficulties and offer solace to them.
Rs 15,000 worth KCR Kits Scheme aimed at the well being of mother and child will come into force from tomorrow. Poor pregnant women are forced to go for work to eek out a living even though they are in advance stage of pregnancy. To stop them from going to work during their advance stage of pregnancies, to get them nutritious food and to take care of the new born after delivery, this scheme is designed. The pregnant women are given Rs 12,000 financial assistance in three phases. Incase the pregnant women gives birth to a baby girl Rs 1000 is given additionally. The idea is to encourage more and more deliveries in the government hospitals, reduce the infant mortality rate and female feticide. After the delivery for the well being of the mother and newborn the government is giving KCR Kit with 16 items. The Kit will have clothes, quality baby soaps, Baby oil, Baby powder, Mosquito net, toys, napkins, Diapers etc., which will be sufficient for three months. This is an affectionate gift given by the government to mother and child.
Development-Infrastructure facilities
We have registered excellent results in development and infrastructure along with welfare within a short time. The greatest achievement among all is the way the State created a miracle in the power sector and this is a living example. Soon after formation of the State, the greatest challenge before the government was that of the power crisis. We have successfully got over the crisis and we have come to a stage where we have no power cuts, instead we have uninterrupted quality power supply. We are setting up new power plants to make the State surplus in power generation in future. We are making serious efforts to provide 24 hours round the clock uninterrupted quality power supply to farmers this summer itself. I pray to God that it should be successful and put an end to the miseries faced by farmers for the past three decades.

To supply safe and pure drinking water at the doorstep of people we have launched Mission Bhagiratha Programme and works are going on war footing. By end of this December, river water will reach all the villages putting an end to the drinking water problem in the state once and for all.
On the other hand we are developing roadways in and around the state in all corners. We are developing the transport sector in a big way for the safety and comfortable travel of the people. The TS IPASS innovative industrial policy of the government has been yielding good results and it is attracting huge investments into the State. The Telangana State stood first in Ease of Doing Business in the country. The state government has several innovative programmes in the IT Sector; as a result, investments and industrial production registered high percentage in the sector. The third phase of Haritha Haram programme aimed at increasing the green cover in the state by planning 230 Crore saplings will begin next month. I appeal to people in the state to participate actively with enthusiasm in the programme.
Strengthening rural economy
We can achieve wonderful results if only we can utilise the human resources available in villages. The government has formulated several schemes to strengthen the rural economy. We have made a comprehensive plan to develop the agricultural economy which is backbone to the rural areas while offering financial support to the agro based activities and there by putting the villages on the progressive path. No one till date had formulated any permanent and scientific plans, solutions to the problems faced by the agriculture community. Always there are empty phrases like “Farmer is the king”. No concerted efforts have ever been made and no proper measures are taken to reform the farm sector. The Telangana agriculture sector was pushed into a crisis due to the discrimination it suffered during the united AP rule. As soon as the Telangana government took over, it started making committed attempts to come to the rescue of farmers. For the first time in the country, Rs 17,000 Crore crop loans of 35. 30 Lakh farmers is waived. Mission Kakatiya program with tremendous spirit and missionary zeal is going on to revive and rejuvenate 46, 000 tanks all over the state. Already during the last two years 16, 000 tanks were rejuvenated. This year work is on to revive 5, 000 more tanks. Tanks revived under Mission Kakatiya are brimming with water and there is increase in the ground water table. This has resulted in change of life and atmosphere in the villages.
In the past, farmers had to suffer for seeds and fertilisers. The Telangana state government is keeping the seeds and fertilizers and stocked them before hand and to make them available at the doorstep of farmers. Now there is no scarcity of seed and fertiliser. We are giving huge subsidies for poly houses, Green house cultivation. For micro irrigation, 100 percent subsidy is given to SC/STs, 90 percent to others. We have constructed godowns with huge capacity to store the agriculture produce. At the time of formation of state, 179 Godowns with capacity of 4 lakh Metric tonnes were there, but now we have constructed 364 more Godowns with a capacity of 17.07 lakhs of Metric Tons. Overall now we have godowns with a capacity of 22.5 Lakh tones. We are giving tractors on subsidy to farmers and transport tax has been waived for tractors used in the farming sector.
Plans for profitable agriculture
The measures and actions so far initiated and implemented are not just adequate to make agriculture profit oriented and no more as a waste. To make agriculture profitable the state government has done lot of thinking and had extensive discussions with Agriculture Scientists and farmers. Based on this, the government a meticulous plan of action to be implemented. 
·       Organizing the farmers together under one platform
·       Providing water to the lands by completing the irrigation projects at the earliest
·       Giving Rs 8000 input costs for two crops per acre
·       Supplying uninterrupted and quality power
·       Creating Crop Colonies in the state
·       Ensuring Minimum Support Price for the crop
These are the six issues for which the government made comprehensive plans.
Every manufacturer and producer has the right fix the price of his product or produce where as in case of the farmer it is otherwise. The price of agriculture produce is fixed by the middlemen. The reason for this is that farmers are not organized themselves. The government has drawn plans to organize them. For every 5000 Acres, now there is one Agriculture Extension Officer. They are now visiting villages and conducting survey on the quality of soil, weather conditions, moisture in air, availability of water, and data on farmers. Once the survey is over, village level Farmers’ Associations will be formed.  From village to the Mandal, then to the district and then finally to State level farmers’ Federations will be set up. The Farmers’ Federations will help the farmers to get better yields and MSP for their produce.
Despite attempts by certain vested interests to put spokes, the government is bent upon completing all the irrigation projects, by allocating Rs 25,000 Crore per year in the budgets. Efforts are afoot to supply 24-hour free and quality power to the farmer from this summer. We are going to give Rs 8000 per acre for two crops from next year as the input expenditure. Based on the soil testing, availability of water, weather conditions, the government will identify on what crop to sow where and divide the State into Crop Colonies. This will ensure that all farmers will not go in for the same crop and prevent them incurring losses. The Farmers’ Federation will be given Rs 500 Core Corpus Fund to intervene in the market when the prices are low. I call upon the farmers to become partners with commitment in the programmes being implemented by the State Government, which no other government ever did in the country. The farmers should work towards becoming role models to others in the country.
Encouraging hereditary professions
In rural areas, along with agriculture there will be many who are depended on their hereditary professions and trades. Several hereditary professions have lost their relevance as times passed by and faced extinction. But there are still many more hereditary professions, which do exist even today which however due to lack of support and encouragements, are in crisis. The stare government has decided to offer help and support to these professions and bring light into the lives of people living on these professions. For the first time in the country, budgetary allocations are made for these trades and professions and these programs are designed for them.
This month we are starting a scheme under which Yadavas and Kurumas are given 75 per cent subsidy to set up Sheep units. For this registration of membership in the Sheep rearing Cooperative Societies is in full swing in the state. Arrangements have been made to provide 24 sheep as a unit to all the eligible members. I am happy to announce that we are buying and distributing 84 Lakh Sheep with an investment of Rs 5, 000 Crores to Yadav and Kuruma families. This scheme will result in accumulation of wealth worth Rs 20,000 Crore! for Yadav and Kuruma families. By taking up sheep breeding on large scale,  not only Telangana State will become self-sufficient in its need for meat but will be in a position to export it to other states and countries.
The government has also initiated measures to better the lives of fishermen by utilising the water available at reservoirs, new projects for fish culture. The government has started a scheme in which the government will put the investment but the profit is shared by Bestha, Mudiraj communities. We have made a comprehensive plan for the well being of handloom sector. We have decided to give 50 percent subsidy on Yarn and Chemicals and we have ordered that the cloth made from the handlooms should be purchased by the government. This program has given tremendous confidence among the handloom workers. The government is going to give Rs one lakh for Nayi Brahmins to set up modern Saloons in the State. The washermen will be given modern washing machines and for goldsmiths the government will give financial assistance and tools that they require. The government will also help those who want to switch their professions. To encourage hereditary profession of toddy tappers, the government has undertaken planting of Toddy and palm trees on a large scale in crores. For the Most backward classes, Nomadic tribes, the government has set up a finance corporation with Rs 1000 Crore Budget.
Conclusion
“I pray to God that schemes of drinking water, water for irrigation, infrastructure, power and Welfare schemes should be successfully implemented and make people to lead a happy and prosperous life and I seek His blessings for this.”
To quote Maha Kavi Dasaradhi Krishnamacharya which always linger in my mind …….“How far is the new age where there are no one with hunger and destitute?
When will there be a time where there are no famine and starvation?”.
As dreamed by the poet, I will work with dedication, with utmost commitment, relentlessly working for the welfare state combined with my thought, words and action. I once again convey my greeting to the people in the state on the occasion of formation Day.
END


Three years of Governance with a huge difference : Vanam Jwala Narasimha Rao

Three years of Governance 
with a huge difference
Vanam Jwala Narasimha Rao
The Hans India (02-06-2017)

As a result of 14 years peaceful and conscious struggle, under the leadership of Kalvakuntla Chandrashekhar Rao, Telangana State was formed. When he took over as Chief Minister, he had to face many problems, obstacles, issues like uncertainties in several sectors, non-availability of officials and non- cooperation from the neighbouring State etc., perhaps comparable to the situation faced by Pandit Jawaharlal Nehru when he took over as PM of independent India. Like Pandit Nehru who in his own style laid direction, action plan and a road map for the young country, Chandrashekhar Rao also formulated plans, roadmap for the new State, which was undergone injustices and sufferings under 60 years of Andhra misrule. KCR has been defining, designing and delivering what all that the young state needed during the last three years of his governance.

Within three years of short span of just three years, Chandrashekhar Rao as the CM made the State number one in the country in several spheres. The Telangana State government under the able guidance of Chandrashekhar Rao is making rapid strides in development and attracting attention of the entire country for its innovative schemes, programs and projects. The one outstanding example of transforming the power deficit State into a power surplus State is enough to define the pace of development of the Telangana State. There are several such programmes and initiatives that took place under the leadership of KCR. Everyone has a reason to praise Telangana State. The government has distributed welfare to every section of the society. The Schemes are made after a thourough thought process with a human touch.

For 38 Lakh beneficiaries at the cost of Rs 4,844 Crore Rs 1000 per month Asara pensions are given, under Kalyan Laxmi/Shaadi Mubarak each bride is given Rs 75,116 financial assistance for the marriage. Six Kilograms of rice per member at a subsidised rate of one Rupee per KG is supplied, Rs 12,000 financial assistance to each pregnant woman, Rs 2000 worth KCR Kits to the new born are given, Rs 1000 per month pension is given to the single woman and these are some of the programmes launched for the well being of people.

The Telangana government, which is dedicated for the people, has initiated programmes for the welfare of each person in the State. The State government is the only government in the country, which is spending Rs 40,000 Crore for 35 Welfare Schemes.  The income limit of the small traders, employees is hiked from Rs 60,000 to Rs 1, 50,000 in rural areas, from Rs 75,000 to Rs 2, 00,000 in urban areas to make them eligible for the various welfare schemes.

Free and compulsory education from KG to PG is being implemented in the State. Residential schools are started in a big way to impart corporate level education to the poor students in English Medium. Rs 20 lakh each overseas scholarship is given to the poor students to study abroad. Fine rice is given to the hostels and Anganwadi centers. Three acres of agriculture land is given to each Dalit family along with input expenditure for the first year. Agriculture and farmers welfare is top most priority for the government and the CM.

The CM has decided to give Rs 8000 per acre per year as input subsidy for two crops. The moment the TRS government came to power, Rs 17,000 Crore loans of 35 Lakh farmers are waived once and for all. Rs 25,000 Crore per year allocated in the Budget for the Major and medium Irrigation projects with an aim to supply water to one crore acres in the state and the works on all these projects going on fast track. Under Mission Kakatiya, 46,000 Tanks are being revived and rejuvenated. 21.5 Lakh Metric Tonnes capacity Godowns are constructed.


Power is supplied 24x7 hours to all the sectors except the farm sector which is given 9-hour uninterrupted quality power supply. When the state was formed the power generation capacity was 6,000 MW which now is doubled to 12,000 MW. In next two years, it will reach 25,000 MW for which new plants are being installed. In Solar power, the state is number one in the country and by next year the farm sector will also get 24x7 Hours power supply. The government is working towards strengthening the rural economy.  Yadavs, Kurumas are given 75 per cent subsidy for purchase of the Sheep. Government has taken up fish culture in a big way to help Bestha, Mudiraj communities. Helping hand is extended to Handloom workers by giving Rs 15,000 per month as wages and 50 percent subsidy on the Yarn and chemicals. Rs one lakh financial assistance is given to Naayi Brahmins to setup modern hair dressing saloons.

A special Corporation is set up for the MBCs with Rs 1000 Crore seed fund. Under Mission Bhagiratha, drinking water will be supplied to every household in the State brining the Godavari and Krishna waters. To make the poor live with dignity, the government has taken up the 2 BHK houses construction to provide 2 Bed Room, hall, Kitchen and 2 Bathrooms house free of cost to the beneficiary. The state government has created a special development fund exclusively for the SC/STs based on their population figures and created carry forward facility under an Act passed by the Assembly.

The government has also passed an Act providing 12 per cent reservation to the backward Minorities and 10 percent to the STs. All the Thandas are upgraded as Gram Panchayats. Each Telangana Martyr family is given Rs 10 Lakh assistance and one job to the eligible from the family. State government employees are given 43 percent fitment in their salaries as well as a special increment from June 2, 2014 when the State was formed. Major hike is given to the salaries of Asha workers, Anganwadi teachers, Municipal Sanitary workers, Contract Lecturers, Water works employees.

The government is taking measures to eradicate bonded labor system. 24,000 outsourcing employees working under Electricity department are regularized. Besides Rs 12,000 financial assistance and KCR kits, women who have given birth to a baby girl are given an additional R 1000. Rs 100 Crore each is given to Advocates welfare and Brahmin Welfare and for welfare of journalists Rs 50 crore is allocated. Ambulance services are provided free of cost to shift bodies from the hospitals to their homes. Free accident insurance policy of Rs 5 lakh each is given to construction workers, auto drivers, home guards, toddy tappers and journalists. The limit on loan given at 25 paise nominal interest to Self Help groups has been increased from Rs 5 lakh to Rs 10 Lakh.

Measures are taken to supply quality seed, fertilisers, pesticides to farmers on time. Seeds are supplied at subsidised rates at the farmers’ doorstep by the Primacy Agriculture Societies and the seeds are stocked in the godowns to prevent any scarcity. The land records in the state are updated to do away with land related disputes and 12 lakh Sada Bainama are registered free of cost. Micro Irrigation is given a top priority and reservations are provided in all the market committees.  For the poor, 125 square yards of residential plot on government lands are regularized. 1.25 Lakh are given land Pattas.

World’s best industrial policy is being implemented in the State and the State is ranked number one in IT sector with the highest IT exports. Under TS IPASS, all permissions for the industry are given within 15 days of application. The state also stood first in ease of doing business in the country. For the young entrepreneurs T-Hub incubator is set up. Districts are reorganized for the administrative convenience and for the benefit of the people increasing the number from 10 to 31. Haritha Haram program the second largest human effort of green cover aiming at planting 230 crore saplings is in progress.


That the welfare schemes of the state are yielding good results can be gauged from the fact that the State stood first in the revenue growth rate in the country. The oft-repeated assertion of the CM that Telangana State is the richest is nothing but plain truth. With this growth rate, the state will be able to implement several new innovative schemes in future. Ends.