Monday, September 9, 2019

మాంద్యం ముసురులో సంక్షేమ బడ్జెట్ : వనం జ్వాలా నరసింహారావు


మాంద్యం ముసురులో సంక్షేమ  బడ్జెట్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (10-09-2019)
దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న నేపధ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి, రు. 1,46,492 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో,  తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శాసనసభలో ప్రవేశ పెట్టడం జరిగింది. రాష్ట్రంగా అవతరించిన ఐదేళ్లలోనే అత్యద్భుతమైన ప్రగతిని సాధించి, అనేకమైన వినూత్న ప్రజోపయోగ పథకాల అమలుతో యావత్ భారత దేశాన్ని ఆశ్చర్య పరిచి, నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి కూడా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆర్ధిక మాంద్యం తన ప్రభావాన్ని చూపడంతో, తెలంగాణ ప్రభుత్వం కొంత జాగరూకతతో 2019-20 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ను రూపొందించాల్సిన అవసరం ఏర్పడ్డప్పటికీ, ఏ ప్రాధాన్యతా రంగానికి కూడా నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

దురదృష్టవశాత్తు గడిచిన ఏడాదిన్నర కాలం నుండి దేశం తీవ్ర ఆర్ధిక మాంద్యానికి గురవుతూ వస్తున్నప్పటికీ, ఏటేటా తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టగలిగే పరిస్థితుల పెరుగుదల, స్థూల దేశీయోత్పత్తి (జి.ఎస్.డి.పి.) సగటు వృద్ధిరేటు పెరుగుదల, క్రమంగా గణనీయంగా పెరుగుతూ వస్తున్న మూల ధన వ్యయం, మూల ధన వ్యయానికి బడ్జెటేతర నిధుల ఉపయోగం, సగటు ఆదాయ వృద్ధి రేటులో గత ఐదేళ్లగా గణనీయ వృద్ధి, అన్ని రంగాలలో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి ఫలితంగా మాంద్యం ప్రభావాన్ని కొంతలో కొంత తట్టుకునే వీలు కలిగిందనాలి.   

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడ్జెట్ ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టుతూ “ప్రభుత్వం అవలంభిస్తున్నసమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ వల్ల; విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యల కారణంగా, అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం వల్ల; టిఎస్ ఐపాస్ లాంటి ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానం ఫలితంగా, పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేసే అవకాశం కలగడం వల్ల; కునారిల్లిపోయిన వ్యవసాయ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో వ్యవసాయ రంగం పునరుత్తేజం పొంది, పంట దిగుబడులు పెరగడం వల్ల; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించడం వల్ల; అన్ని ప్రధాన రంగాల్లో మూలధన వ్యయం పెరగడం లాంటి కారణాల వల్ల తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమయింది” అని అన్నారు.

ఇలా సుదీర్ఘంగా కొనసాగిన అభివృద్ధికి ప్రధాన కారణం ప్రభుత్వం అవలంభించిన పటిష్టమైన ఆర్ధిక క్రమ శిక్షణే. ఈ రకమైన ఆర్ధిక ప్రగతి వల్ల సమైక్య రాష్ట్రంలో అతి దారుణంగా దెబ్బతిన్న గ్రామ సీమలు, వ్యవసాయం, కుల వృత్తులు, చేనేత రంగం, తదితర వర్గాలు భారీగా లాభపడ్డాయనేది, చాలామంది నిరుపేద కుటుంబాల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేసిందనేది వాస్తవం. కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పినట్లు ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా గడిచిన ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చిత్తశుద్ధితో అమలు చేస్తున్న పథకాల వల్ల సమైక్య పాలనలోని జీవన విధ్వంసం లోంచి తెలంగాణ సమాజం తేరుకుని, కుదుటబడి, స్థిమితపడింది.

ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడి చేసిన వాస్తవాల ఆధారంగా, ప్రాతిపదికగా గమనిస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదు అయింది. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో వృద్ధిరేటు నమోదైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగంలో అదనపు వృద్ధి సాధించి, ఐటి ఎగుమతుల విలువను గణనీయంగా పెంచుకోగలిగింది.  ఇది ఆయారంగాలలో రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి విస్పష్ట సంకేతం. అవినీతి రహిత పాలన అందించడం వల్ల, సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే పైన చెప్పిన ఆర్థిక ప్రగతి సాధ్యమైందనేది వాస్తవం.

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన ఫలితంగానే సమైక్య రాష్ట్రంలో అతి దారుణంగా దెబ్బతిన్న గ్రామ సీమలు, వ్యవసాయం, కుల వృత్తులు, చేనేత రంగాలకు పునరుత్తేజం తీసుకురావడం కోసం ప్రభుత్వం తగిన ఆర్థిక ప్రేరణ అందించగలుగుతున్నదన్నారు సీఎం కేసీఆర్. నిరుపేద కుటుంబాల సంక్షేమం కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయగలుగుతున్నది.  అత్యున్నత నాణ్యమైన విద్యాప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన వందలాది గురుకుల పాఠశాలల్లో లక్షలాది మంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్య అభ్యసించగలుగుతున్నారు. రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించుకోగలిగింది ప్రభుత్వం. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడం సాధ్యమైంది.


ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతంగా నిలుస్తున్నది. తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారితీస్తున్న పరిణామాలను అనునిత్యం గమనిస్తూనే వున్నాం. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సీఎం వివరించినట్లు దేశ ఆర్థిక స్థితిగతులకు సూచికలుగా నిలిచే అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనంలో, పరిస్థితి పూర్తి నిరాశాపూరితంగా ఉందని ఆయా సంస్థలు వెల్లడిస్తున్న అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి.

         వాహనాల అమ్మకాలు పడిపోయాయి. దేశంలోని ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి, వ్యాట్ తగ్గిపోయింది. లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కార్గో విమానాల ద్వారా జరిగే సరుకు రవాణాలో వృద్ధిరేటు తగ్గింది. సరుకు రవాణా చేసే రైల్వే గూడ్సు వ్యాగన్ల బుకింగులలో వృద్ధిరేటు తగ్గింది. గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది. దీంతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రూపాయి మారకం విలువ శరవేగంగా పతనమవుతున్నది. ఇవన్నీ సీఎం తన ప్రసంగంలో పేర్కొనడం గమనిం చాల్సిన విషయం.  

         దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా గణనీయంగా పడింది. కేసీఆర్ చెప్పినట్లు దేశంలో స్థూల ఆర్థిక విధానాలను శాసించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం తీసుకొచ్చిన విధానాన్నే రాష్ట్రాలు అనుసరించాలి తప్ప, మరో గత్యంతరం లేదు. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి వచ్చిందనీ, అనేక పరిమితులను దాటిపోలేమనీ, ఆ ప్రాతిపదికగా చుట్టూ అలుముకున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్ర మేథోమధనం చేసి, అనేక మంది ఆర్థిక గణాంక నిపుణులతో చర్చించి, నిర్థారణ చేసుకున్న వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించిందనీ సీఎం అన్నారు.

ఏదేమైనా, ఇతర రాష్ట్రాలతో పోల్చిచూసినప్పుడు తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంతలో కొంత నయంగా కనిపిస్తున్నదనీ; స్థిరమైన ఆర్థిక ప్రగతి, పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన పరపతితో ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుకోగలుగుతున్నదనీ; ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులకు లోబడి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అసునరించి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిఎస్డీపీ) లో 25 శాతం మించకుండా ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరిస్తున్నదనీ; భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించిందనీ ముఖ్యమం త్రి అన్నారు.

ఇలా సేకరించిన నిధులతో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణం యధాతథంగా కొనసాగుతుందని సభకు చెప్పారు సీఎం. అలాగే ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సహితం, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో వుందన్నారు. రైతుబందు పథకం యథాతథంగా కొనసాగుతుందని, రైతు భీమా పథకాన్ని కూడా ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుందని,  రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుందనీ, పేదలకు అందించే ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆరు కిలోల బియ్యం లాంటి పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానీయమని, సీఎం స్పష్టం స్పష్టం చేశారు. అదే విధంగా విద్యార్థులకు మంచి వసతి, భోజనం కల్పిస్తూ ఇంగ్లీషు మీడియం విద్య అందిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం యధావిధిగా కొనసాగిస్తుందనీ, గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలను కూడా ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తుందనీ చెప్పారు ముఖ్యమంత్రి.

కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటున్నదని చెప్పారు ముఖ్యమంత్రి. ప్రజలకు మేలు చేయగలవని భావించిన కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందనీ, ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాల కోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయదలచుకోలేదని విస్పష్టంగా ప్రకటిస్తున్నానన్నారు సీఎం. స్థానిక సంస్థలకు నిధుల కొరత రానీయకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన విధానం తీసుకొచ్చిందనీ, కేంద్ర ఆర్థిక సంఘం ఎన్ని నిధులిస్తే, అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున జమ చేసి, స్థానిక సంస్థలకు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుందనీ, ఈ రెండింటినీ కలిపి గ్రామ పంచాయతీలకు ప్రతీ నెలా 339 కోట్ల రూపాయలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, స్పష్టం చేసారు ముఖ్యమంత్రి. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఎప్పటికప్పుడు తగిన ఆర్థిక సహకారం అందిస్తున్నదన్నారు.

ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడానికి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవనీ, నిజానిజాలను స్పష్టంగా, స్ఫటిక సదృశ్యంగా సభ ముందు, సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నామనీ, దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం కారణంగా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గిన మాట కఠిన వాస్తవం అనీ, దీని కారణంగా అనేక ఒడిదొడుకులు ఎదురైన విషయం కూడా అంతే వాస్తవం అనీ, ఈ కఠిన వాస్తవాల ప్రాతిపదిక ఆధారంగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసిందనీ అన్నారు సీఎం.

ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి , ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి, ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు కూడా మనకు వుందని అన్నారు.  ఆదాయ వనరులను బట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటూ, సవరించుకుంటూ క్రియాశీలకంగా (డైనమిక్ గా) వ్యవహరిస్తుందని చెప్పారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరానికి, అంటే, 2014-2015 కు, బడ్జెట్ రూపొందించడానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి రకమైన “క్లూ” లభించలేదు. 12 నెలల ఆదాయ-వ్యవ వివరాల అంచనాలు పూర్తిస్థాయిలో లేని నేపధ్యంలో ఆ తరువాతి సంవత్సరం అంటే 2015-16 బడ్జెట్ తయారుచేయాల్సి వచ్చింది. 2016-17 బడ్జెట్ రూపొందించుకునే సమయానికల్లా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, ఆదాయ-వ్యయాలపై, ప్రభుత్వానికి ఒక సమగ్రమైన-సంపూర్ణమైన అవగాహన వచ్చింది. అది మూడో బడ్జెట్ అయినప్పటికీ, వాస్తవంగా ఆలోచిస్తే, అసలు-సిసలైన లెక్కల ఆధారంగా, తయారుచేసిన మొదటి బడ్జెట్ అనాలి. 2017-2018 లో రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, ప్రేరణ కలిగించేదిగా, సందేశాత్మకంగా వుందని చెప్పాలి. ఇక 2018-19 లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతకు ముందు 45 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి అమలు పరుస్తున్న కార్యక్రమాలను ఏ విధంగా ప్రమాణీకరణం చేయవచ్చు, ఏ విధంగా స్థిరపర్చవచ్చు, ఏ విధంగా పటిష్టం చేసుకోవచ్చు అనే విషయాలు స్పష్టంగా కనిపించాయి.  

ఈ నేపధ్యంలో, ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ, అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి, ప్రజా సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా రైతులు, పేదల జీవితాల్లో వెలుగు తీసుకురావాలనే చిత్తశుద్ధిని వెల్లడించారు ముఖ్యమంత్రి. ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వుండే రీతిలో ప్రాధాన్యతా రంగాలకు నిధుల కేటాయింపు జరగడం అంటే, ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ప్రవేశ పెట్టిన ఆశాజనకమైన, వాస్తవిక బడ్జెట్ 2019-20 బడ్జెట్ అని చెప్పుకోవాలి. 

Saturday, September 7, 2019

జటాయువును చూసిన రామలక్ష్మణులు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-77 : వనం జ్వాలా నరసింహారావు


జటాయువును చూసిన రామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-77
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (08-09-2019)
          శ్రేష్టమైన మంచి నీతి వాక్యాలను, వాటి అర్థాన్ని, చిన్నవాడైనా తమ్ముడు లక్ష్మణుడు చెప్పగా విన్న పెద్దవాడైన రామచంద్రమూర్తి, దాంట్లోని సారాన్ని గ్రహించి, కోపంతో లోగడ చేద్దామనుకున్న పనిని వదిలి, విల్లు ఆధారంగా నిలబడి, “నాయనా! లక్ష్మణా! సీతను వెదకడానికి ఏం చేయవచ్చు? ఎక్కడికి పోదాం?” అని అడిగాడు. శోకతప్తుడైన రామచంద్రమూర్తి ఇలా అడగ్గా, లక్ష్మణుడు జవాబుగా ఇలా చెప్పాడు. “ఈ జనస్థానంలో పెద్ద-పెద్ద మృగాలు, గుహలు, కొండలు, చొరలేని మార్గాలు వున్నాయి. కిన్నరుల ఇండ్లున్నాయి. భయంకరమైన రాక్షసుల దీనంలో వుందిది. పెద్ద-పెద్ద చెట్లున్నాయి. కాబట్టి రాక్షసులు సీతను తెచ్చి ఇక్కడే, ఎక్కడో దాచిపెట్టి వుంటారు. కాబట్టి సీతాదేవిని ఇక్కడే ఎక్కడో వెతకాలి. నీలాంటి బుద్ధి సంపదకలవాడు ఆపద వస్తే చలించాలా? ఎంత గట్టిగా గాలి వీచినా కొండలు కదులుతాయా?”. ఇలా చెప్పగా రామచంద్రమూర్తి తమ్ముడు తనవెంటరాగా అడవి ప్రదేశమంతా వెతికాడు.

         ఇలా వెతుక్కుంటూ పోగా-పోగా, ఆ పర్వతం దగ్గరే ఒకచోట పెద్ద కొండలాగా వున్న, నెత్తుటితో తడిసిన, పుణ్యాత్ముడిని, ప్రాణం పోయినా సరే స్వామికార్యం చేయాలన్న భక్తి కలవాడిని, పక్షి శ్రేష్టుడిని, జటాయువును చూశారు రామలక్ష్మణులు. చూసి తమ్ముడితో ఇలా అన్నాడు రాముడు. “విరోధులను శిక్షించినవాడా! చూశావా? వీడు రాక్షసుడు....సీతను మింగి, మనం చంపుతామేమోనని భయంతో గద్దలాగా హాయిగా కూచున్నాడు. వీడిని నా భయంకర బాణాలతో, తక్షణమే, ఆలస్యం చేయకుండా చీలుస్తాను”. ఇలా అంటూనే జటాయువుకు ఎదురుగా పోయి, ఒక తీవ్ర బాణాన్ని సంధించగా భూతలం వణికింది. అప్పుడు నెత్తురు చొంగ కక్కుతూ, మరణతాపంతో బాధపడుతూ, గద్గద స్వరంతో పక్షిరాజు రామచంద్రుడితో ఇలా అన్నాడు.

         “ఆయుష్మంతుడా! అడవిలో ఔషధిని వెదికిన విధంగా దేన్నైతే వెతుకుతున్నారో, ఆ సీతను, నా ప్రాణాన్ని, తెమ్టినీ రావణుడే అపహరించాడు. నువ్వూ, లక్ష్మణుడూ, పావనైన సీతను ఒంటరిగా అడవిలో విడిచిపోగా, రావణుడు బలవంతంగా ఆమెను ఎత్తుకుని ఆకాశమార్గాన పోసాగాడు. అది చూసిన నేను, విసురుగా వాడికి అడ్డం పోయాను. వాడిని ఎదిరించి వాడితో బలం కొద్దీ యుద్ధం చేసి వాడి రథాన్ని నేలపడగొట్టాను. వాడిని కింద పడేశాను. నేను విరిచిన విల్లు ఇక్కడే పడి వుంది. పొది కూడా ఇక్కడే పడిపోయి వుంది. నా రెక్కల దెబ్బకు చచ్చిన సారథి ఇక్కడే పడిపోయి వున్నాడు. ఇదే నేను విరగ్గొట్టిన రథం. నేను ముసలివాడినై అలసిపోయాను. అప్పుడు వాడు తన కత్తితో నా రెక్కలను తెగనరికి నేలమీద పడేసి, సీతను పట్టుకుని ఆకాశమార్గాన పరుగెత్తాడు. నీ భార్య కోసం ముందే రావణుడు నన్ను చంపాడు. నా స్నేహితుడైన దశరథుడి పుత్రా! చావడానికి సిద్ధంగా వున్న నన్ను నువ్వు కూడా చంపాలా?


         జటాయువు మాటలు విన్న రాముడు తన విల్లు దూరంగా పడవేసి, అతడిని కౌగలించుకుని, తమ్ముడితో కలిసి ఏడ్చాడు. “లక్ష్మణా! నా నిర్భాగ్యం ఎలాగుందో చూశావా? రాజ్యం పోవడం, భయంకర అరణ్యంలో దుఃఖపడడం, సీతను పోగొట్టుకొనడం, జటాయువు మరణం.....ఇవన్నీ, సర్వం దహించే అగ్నిహోత్రుడినైనా కాలుస్తాయి. సహించలేని ఈ తాపం చల్లార్చుకొనడానికి నేను సముద్రంలో దూకినా నా శరీరం వేడి వల్ల సముద్రం ఎండుతుంది కాని నేను చల్లబడను. ఎంత వెతికి చూసినా నా కంటే అదృష్టహీనుడు లోకంలో లేరు. జటాయువు మన తండ్రికి స్నేహితుడు. పుణ్యాత్ముడు. ముసలివాడు. పక్షిరాజు. నా నిర్భాగ్యం వల్ల కొట్టబడి నేలకూలాడు చూశావా?”

         అని లక్ష్మణుడితో అంటూ, రెక్కలు నరకబడి నెత్తురుకారుతున్న జటాయువును తన చేత్తో తుడిచి, “పుణ్యాత్ముడా! నా ప్రాణంతో సమానమైన సీత వృత్తాంతం చెప్పు” అని అడిగాడు.

Gubernatorial gimmicks of modern times : Vanam Jwala Narasimha Rao


Gubernatorial gimmicks of modern times
Hans India (08-09-2019)
Mislead Governorship 
Millennium Post, New Delhi (09-09-2019) 
Vanam Jwala Narasimha Rao

For a democracy, if it has to be vibrant and relevant to the contemporary times, introspection is a must. In the ever-changing scenario of needs, desires, values, demands of the society, the Constitution of any democratic country cannot be static. It should be alive, dynamic and keep on changing itself to suit to the present-day conditions. Perhaps, this is the reason, why more than 100 amendments were brought to the Constitution of India since it was first enacted in 1950. This principle holds good even for the institution of Governor in Indian Polity especially in the context of appointment of Governors to five states recently. Some Constitutional Experts are of the opinion that the spirit of cooperative federalism is missing in these appointments and there is a need to appoint apolitical governors.     

Ever since the creation of the office of the Governor as the pivot of Indian federal system it has remained a controversial one. Governors today are being derogatively called as the agents of the Centre. The issue becomes more relevant with the appointment of 9 new Governors in the recent past since July. When the controversy over the institution of Governor became a nation-wide debate in the early 80s the then Union Government appointed Justice Sarkaria Commission to prepare a report.

Sarkaria Commission in its report in October 1987, suggested that the Governor should be a person of some eminence in some field and should be a detached figure with little record of participation in the local politics of the State. He or she should be a person who has not taken too great a part in politics generally and particularly in the recent past of his or her appointment. It is desirable that a politician from the ruling party at the Centre should not be made the Governor of a State run by another party. It should be ensured that there is effective consultation with the Chief Minister of a State while appointing a Governor in that State. None of these are apparently followed.

Against this back drop, it may be appropriate to compare the institutions of CM and Governor. Chief Minister in our country is the democratically elected head of government of a State, and is vested with all executive powers. He or she is elected by legislators of the party or coalition, commanding majority in the State Assembly. According to Constitution, the Governor is only a namesake head of the state and his or her role is just ceremonial, whereas the real power lies with Chief Minister.

Governors of the states have more or less similar powers and functions at the state level as that of the President of India at Union level. One exception is, that, there cannot be a President’s Rule at the center whereas President’s Rule or Governor’s Rule may be imposed in a state when it is allegedly felt that the state cannot be run in accordance with the provisions of the Constitution! This provision was frequently abused.

Though the Constitution says that, the Governor, who is appointed by the President for a term of 5 years enjoys many different types of powers, the Executive, the Legislative and the Discretionary, the spirit of the Constitution envisages that these are titular in nature. Governor appoints the Chief Minister, but only such a person, who enjoys the support of the majority in the Assembly. Like the British Monarch, Governor can do no wrong in this. The Governor also appoints the other members of the Council of Ministers and distributes portfolios to them only on the advice of the Chief Minister.


The Council of Ministers remain in power during the pleasure of the Governor, but in the real sense it means the pleasure of the Assembly. He makes many more constitutional appointments but these powers are formal and the Governor while using these powers must act according to the advice of the Council of Ministers headed by the Chief Minister. When the state legislature is not in session Governor can promulgate ordinances, but, only on the advice of CM. As long as these systems continue without hindrance, the spirit of the Constitution is upheld, but, if it is otherwise, it becomes a mockery as happened in number of instances in several states by political Governors.  

From time to time, the role of Governor has made people feel that they are living in a very fragile democratic realm, which can be shaken effortlessly by the Governor. It is a well-known fact that the Governors played a dictatorial role many a time and transcended all the democratic limits. Different political parties have misused the role of the Governor at different times for their partisan interests, thus proving that Indian society has yet to achieve the state of political modernization and political culture.

The institution of the Governor was misused to a great extent several times in the past and there is no guarantee that the same is not repeated in future. Many political debates took place to restructure the constitutional framework concerning the office and role of the Governor in a federal set-up. When the Chief Ministers belonged to the opposition, the Governor was considered as the Centre’s agent. As a result, the Governor started playing a stubborn role, which gave birth to debatable issues concerning the constitutional powers of the Governor.

There were many constitutional debates about the institution of the Governor. Some people wanted popularly elected Governors. The drafting committee of the Constitution however decided that the Governor would be appointed by the President. As a result, different parties manipulated the appointment of the Governor on the one hand, and on the other, Governors started following the command from the Central Government in order to make Centre happy in anticipation of gaining higher political positions. Since independence no party in power at center was an exception to this.  

Thus, we see that the framers of the Constitution endowed the Governor with certain powers with the hope that the Governor would use these powers to keep India united, with the spirit of cooperative federalism, but the Governors and Central governments misused the institution to fulfill their political interests.

While the President of India is elected by the representatives of the people, namely the MPs, MLAs, the Governor is merely appointed by President on the advice of Prime Minister. Like that of President, the Governor should also be elected by members of both Houses and also by ZP Chairpersons. If it has to be an appointment, then, on the lines of appointment of a Judge to the supreme court by the President on the recommendation of the collegium, apolitical Governors should also be appointed with a similar process. The collegium may include the Prime Minister, Chief Minister of the concerned state, the Supreme Court Chief Justice and at least two constitutional experts of impeccable character, all with veto power.   

 The key issue concerning the office of the Governor today is one of rehabilitation. The problem of role differentiation is taking place largely on account of one-party dominance, which assumed such serious dimensions today as to become a case of crisis of confidence in the political system itself. Though, the Supreme Court has expressly laid down that the Governorship is an independent constitutional office, which is not subject to the control of the Government of India, it is seldom observed in practice.  

Let the appointment of Governors not be a process of political rehabilitation for the party in power at the Centre as reflected in the recent appointments under the present dispensation. It’s high time we make necessary changes in the Constitution and do away with the old practices? The sooner, the better!

Friday, September 6, 2019

గవర్నర్లనూ ఎన్నుకోవాలి : వనం జ్వాలా నరసింహారావు


గవర్నర్లనూ ఎన్నుకోవాలి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-09-2019)
వర్తమాన, నడుస్తున్న చరిత్ర అవసరాలకు అనుగుణంగా, శక్తివంతంగా, సందర్భోచితంగా ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే, కాలానుగుణంగా రాజ్యంగ వ్యవస్థలలో ప్రస్ఫుటమైన మార్పు వచ్చి తీరాలి. ఆ మార్పు ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు, కోరికలకు అద్దం పట్టాలి. ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగం ఒక స్థిరమైన, చలనం లేని డాక్యుమెంటులాగా కాకుండా ఎప్పటికప్పుడు మార్పులకు ఆలవాలం కావాలి. బహుశా, అందుకేనేమో భారత రాజ్యాంగానికి, అది అమల్లోకి వచ్చిన 1950 నుండి గత 70 సంవత్సరాలుగా వందకు పైగా సవరణలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇలాగే జరుగుతున్నది. ఇదే సిద్దాంతం భారత రాజ్యాంగంలో అంతర్భాగమైన గవర్నర్ వ్యవస్థకు, అందులోనూ ప్రధానంగా ఇటీవల ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగిన నేపధ్యంలో స్పష్టంగా అన్వయిస్తుంది. వారి నియామకంలో సమాఖ్య సహకార స్ఫూర్తి పూర్తిగా లోపించిందని నిపుణుల అభిప్రాయం.

భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఒక ముఖ్య భూమికగా భావించబడుతున్న గవర్నర్ స్థానం అది ఏర్పాటైన నాటినుండీ ఏదో ఒకరకమైన వివాదాస్పద వ్యవస్థగా మిగిలిపోయింది. ఇటీవలికాలంలో, కారణాలేవైనా, గవర్నర్లను ఒకరకమైన అవమానకరమైన సంబోధనతో కేంద్ర ప్రభుత్వ ఏజంట్లుగా పిలవడం కూడా జరుగుతున్నది. మరీ ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా జులై మాసం నుండి ప్రారంభమై నిన్న-మొన్న జరిగిన మొత్తం తొమ్మిది మంది గవర్నర్ల నియామకాల నేపధ్యంలో ఈ వ్యవస్థ మరీ వివాదానికి గురైందనక తప్పదు. ఒకానొక సందర్భంలో, 80 వ దశకంలో గవర్నర్ వ్యవస్థ మీద జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు, వివాదం వచ్చిన నేపధ్యంలో, అప్పటి కేంద్ర ప్రభుత్వం, తగు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సర్కారియా కమీషన్ ను ఏర్పాటు చేసింది.

గవర్నర్ గా నియమించబడే వ్యక్తి ఏదైనా ఒక ప్రముఖ రంగంలో నిష్ణాతుడై, ఒక ఉన్నతోన్నత వ్యక్తి అయ్యుండాలనీ, రాగద్వేషాలకు అతీతమైన వ్యక్తి అయ్యుండాలనీ, స్థానిక-రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అయ్యుండాలనీ సర్కారియా కమీషన్ అక్టోబర్ 1987 లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొనడం జరిగింది. గవర్నర్ గా నియామకానికి తక్షణ పూర్వరంగంలో సాధారణ రాజకీయ కార్యకర్తగా కానీ, క్రియాశీలక రాజకీయ నాయకుడు లేదా నాయకురాలిగా కానీ వుండకూడదని కూడా సిఫార్సులో వుంది. అదే విధంగా కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి చెందిన వ్యక్తిని, ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ అధికారంలో వున్న రాష్ట్రానికి గవర్నర్ గా పంపకూడదని మరో సిఫార్స్ వుంది. గవర్నర్ నియామకానికి ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలని కూడా సర్కారియా కమీషన్ సూచించింది. వీటిలో ఏవీ ఇటీవలి గవర్నర్ల నియామకం సందర్భంగా పాటించినట్లు లేదు.

ఈ నేపధ్యంలో, రాష్ట్రాల ముఖ్యమంత్రి, గవర్నర్ వ్యవస్థలను, అధికారాలను పోల్చి పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు అవగాహనకొస్తాయి. మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడ్డ రాష్ట్రాధినేత. సమస్త కార్యనిర్వాహక అధికారాలు ఆయన గుప్పిట్లోనే వుంటాయి. రాష్ట్ర శాసనసభ మెజారిటీ సభ్యుల నాయకుడు ఆయన. ఇక గవర్నర్ విషయానికొస్తే, రాజ్యాంగం ప్రకారం, ఆయన లేదా ఆమె, రాష్ట్రానికి నామ మాత్రపు అధిపతి మాత్రమే. వారి పాత్ర కేవలం ఉత్సవ విగ్రహం లాగానే. ముఖ్యమంత్రి వద్దనే నిజమైన సర్వాధికారాలు వుంటాయి.

కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు, విధులు వుంటాయో రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కు కూడా అలాంటి అధికారాలు, విదులే వుంటాయి. ఒక్క విషయంలో మాత్రం మినహాయింపు వుంది. కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి పాలనకు రాజ్యాంగంలో అవకాశం కలిగించలేదు. రాష్ట్రాలలో గవర్నర్ అనుకుంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాజ్యంగ ప్రకరణాల ప్రకారం రాష్ట్రంలో పాలన కొనసాగడం కష్టం అని సాకు చూపి పలుమార్లు, పలురాష్ట్రాలలో రాష్ట్రపతి (గవర్నర్) పాలన విధించడం తెలిసిన విషయమే. ఈ రకమైన అధికార దుర్వినియోగం చాలా సార్లు జరిగింది.

ఐదేళ్ల కాలానికి నియమించబడే గవర్నర్ కు పలు రకాలైన కార్యనిర్వాహక, శాసన వ్యవహారాల, విచక్షణాధికారాలు రాజ్యాంగపరంగా ఉన్నప్పటికీ, అసలు సిసలైన రాజ్యంగ స్ఫూర్తి ప్రకారం ఇవన్నీ నామమాత్రంగా వుండాలనే. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించాలని రాజ్యాంగం చెప్తుంది కాని అలా చేయడానికి హద్దులున్నాయి. ఎవరికైతే శాసనసభలో మెజారిటీ వుంటుందో వారిని మాత్రమే ముఖ్యమంత్రిగా నియమించాలి కాని ఎవరిని పడితే వారిని కాదు. బ్రిటీష్ మోనార్క్ లాగా భారత దేశంలోని గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాటు చేయదానికి ఆస్కారం లేదు. కాబినెట్ మంత్రులను నియమించేదీ, వారికి పోర్ట్ ఫోలియోలను కేటాయించేదీ గవర్నరే అని రాజ్యాంగం చెప్పినా, అది ముఖ్యమంత్రి సలహా మేరకే చేయాలి.


గవర్నర్ ఆమోదం ఉన్నంత కాలమే మంత్రి మండలి అధికారంలో వుంటుంది అని రాజ్యాంగం చెప్పినా, వాస్తవానికి, మంత్రిమండలి శాసనసభకు మాత్రమే జవాబుదారీ. రాజ్యాంగపరమైన ఎన్నో నియామకాలు గవర్నర్ చేయడానికి అధికారం ఉన్నప్పటికీ అవన్నీ కేవలం లాంచనమే. గవర్నర్ ఈ అధికారాలను ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. శాసనసభ సమావేశాలు జరగనప్పుడు గవర్నర్ ఆర్డినెన్సులను జారీచేయవచ్చు కాని, అది కూడా ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే. ఎంతవరకైతే ఈ రకమైన వ్యవస్థీకృత పద్ధతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతాయో, అంతవరకూ రాజ్యాంగ స్ఫూర్తి కూడా కొనసాగుతుంది. అలా కాకుండా దానికి విరుద్ధంగా జరుగుతే, దానికి కారణభూతులు గవర్నర్లే అయితే రాజ్యాంగానికి దక్కేది రాజ్యంగా పరిహాసమే. గతంలో కొన్ని రాష్ట్రాలలో కొందరు గవర్నర్ల పుణ్యమా అని అలా జరిగిందనేది వాస్తవం.

కాలం గడుస్తున్నా కొద్దీ, దురదృష్టవశాత్తూ, గవర్నర్ పాత్ర పుణ్యమా అని, ఒకరకమైన పెళుసైన, సున్నితమైన ప్రజాస్వామ్య రాచరికంలో మనం జీవిస్తున్నామా అనే భావన ప్రజల్లో నాటుకుపోతున్నది. అలాంటి సున్నితమైన ప్రాజాస్వామ్య వ్యవస్థను ఎటువంటి ప్రయత్నం లేకుండా గవర్నర్ కిందు-మీదు చేయగలడని కూడా వారి భావన. గత దేశవ్యాప్త అనుభవాలను నెమరేసుకుంటే, కొందరు గవర్నర్లు నియంతల పాత్ర పోషించి అన్ని రకాల ప్రజాస్వామ్య విలువలను కాలరాశారనేది విదితమవుతుంది. అందరూ అలానా అంటే కాకపోవచ్చు. తమ-తమ రాజకీయ అవసరాలకు కేంద్రంలో అధికారంలో వున్న వివిధ రాజకీయ పార్టీలు గవర్నర్ పదవిని దుర్వినియోగ పరచిన సందర్భాలు కోకొల్లలు. దీనర్థం, భారత సామాజిక వ్యవస్థ రాజకీయ పరిణితిని, రాజకీయ ఆధునీకరణను, రాజకీయ సంస్కృతిని ఇంకా సాధించలేదనేదే.

గవర్నర్ వ్యవస్థను ఎన్నో రకాలుగా దుర్వినియోగ పరచిన సందర్భాలు మన దేశంలో అనేకం వున్న దృష్ట్యా, భవిష్యత్ లో కూడా అలాంటిదే పునరావృతం కాదన్న హామీ ఏదీలేదు. భారత సహకార సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ పాత్రను పునర్నిర్వచించే విధంగా రాజ్యాంగంలో మౌలికమైన మార్పులకు సంబంధించి గతంలో అనేక సందర్భాలలో, అనేక వేదికలపైన చర్చోపచర్చలు జరిగాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి చెందనివ్యక్తైతే, ఎప్పుడో-అప్పుడు తప్ప, సాధారణంగా, అక్కడ నియమించబడ్డ గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వ ఏజంటుగా భావించడం పరిపాటైపోయింది. ఫలితంగా, ఆ రకమైన గవర్నర్లు నిర్ణయాత్మకమైన మొండి వైఖరిని అవలంభించి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు అవరోధాలు కలిగించే సందర్భాలు కలగడంతో ఆ మొత్తం వ్యవస్థపైన అనుమానాలు కలగడం మొదలైంది. అయితే కొందరు గవర్నర్లకు ఈ విషయంలో మినహాయింపు వుంది.

గవర్నర్ వ్యవస్థను గురించి రాజ్యాంగపరంగా చర్చించినప్పుడు, గవర్నర్లను రాష్ట్రపతి తరహాలో ఎన్నుకుంటే మంచిదని కొందరు సూచించారు. కాకపొతే రాజ్యంగ నిర్మాతల ముసాయిదా కమిటీ గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. అలా మొదలైంది నియామక గవర్నర్ల వ్యవస్థ. తమను నియమించిన కేంద్రాన్ని సంతోషపరచడానికి, తద్వారా భవిష్యత్ లో మరిన్ని ఉన్నతపదవులను అదిరోహించడానికి, కేంద్రం అదుపాజ్ఞలలో వుండడం చాలామంది గవర్నర్లకు అలవాటుగా మారిందన్న ఆరోపణలున్నాయి. స్వాతంత్ర్యానంతరం కేంద్రంలో అధికారంలో వున్న అన్ని పార్టీలు, అలనాటి కేరళ ప్రభుత్వం రద్దు నుంచీ, తమ ఇష్టానుసారంగా గవర్నర్ వ్యవస్థను వాడుకోవడం తెలిసిన విషయమే. గవర్నర్ రాజ్యాంగ పరంగా తనకు సంక్రమించిన అధికారాలను, విధులను సహకార సమాఖ్య స్ఫూర్తితో, భారతదేశాన్ని ఐక్యంగా వుంచడానికి మాత్రమే ఉపయోగిస్తారని రాజ్యంగా నిర్మాతలు భావించారు కాని, అందరూ కాకపోయినా కొందరు గవర్నర్లు, అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేయడం వాస్తవం.

భారత రాష్ట్రపతిని ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కాని, గవర్నర్ ను మాత్రం ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఇద్దరూ ఒకేరకమైన రాజ్యాంగపరమైన విధులు నిర్వర్తిస్తారు. అలాంటప్పుడు ఈ తేడా ఎందుకు? రాష్ట్రపతి లాగానే గవర్నర్ ను కూడా ప్రజాప్రతినిధులైన సంబంధిత రాష్ట్ర ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే మంచిదేమో! ఒకవేళ ఇది కుదరకపోతే, నియామకం ద్వారా మాత్రమే జరగాలంటే అదీ ఒక నియమిత పధ్ధతి ద్వారా చేయవచ్చేమో! సుప్రీం కోర్టు జడ్జీల ఎంపిక మాదిరిగానే గవర్నర్ ఎంపికకు కూడా ఒక కొలీజియం ఏర్పాటు చేయవచ్చుకదా! అదే పద్ధతిలో రాష్ట్రపతి గవర్నర్ ను నియమించవచ్చు. ఆ కొలీజియం సభ్యులుగా, వీటో అధికారంతో, ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కనీసం ఇద్దరు నిష్ణాతులైన రాజ్యంగ నిపుణులు వుంటే బాగుంటుంది.

గవర్నర్ నియామకం విషయంలో వస్తున్న ప్రధానమైన విమర్శ అది రాజకీయ పునరావాసమని. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో సాధారణంగా ఏక పార్టీ ఆధిపత్యం వుండడం. దీనివల్ల యావత్ రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఒక సంక్షోభ స్థాయికి చేరుకున్నది. గవర్నర్ ఉద్యోగం ఒక స్వతంత్ర రాజ్యాంగపరమైన అధికారిక పీఠంగా వుండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రప్రభుత్వ అదుపాజ్ఞలలో వుండరాదనీ,  సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దాన్ని పాటించిన దాఖలాలు అంతగాలేవనే అనాలి.
ఇటీవల జరిగిన గవర్నర్ నియామకాల లాగా కాకుండా, కేంద్రంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీ సభ్యుల పునరావాసంలాగా కాకుండా, భవిష్యత్ లో వీటికి అతీతంగా జరిగితే మంచిది. తదనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు తెస్తే మంచిది. అదెంత త్వరగా జరుగుతే అంత మంచిది.

More Citizen-Centric Governance : Vanam Jwala Narasimha Rao


More Citizen-Centric Governance
Vanam Jwala Narasimha Rao
Telangana Today (07-09-2019)

Interactive policy-making, citizen panels, citizen charters, public facilitation centres and other forms are being used to enhance public interface. In Telangana number of welfare programs like Kalyana Laxmi, Shaadi Mubarak, Aasara Pensions, Rythu Bandhu, Rythu Bhima, Sheep distribution, Fish breeding, Double bedroom houses, Residential school education, Wellness centres, KCR Kits etc. are public interface measures.

The Panchayati Raj Act aims to ensure people’s participation to bring the desired qualitative change in village administration. The Municipal Act envisages that all certificates as required from the municipalities such as birth certificate, death certificate, land use certificate, child name inclusion in birth certificates and corrections in the certificates shall be issued online in a time bound manner. All these require the public to get in touch with public servants at least once in a while. The proposed Revenue Act aims to reduce corruption that is widely prevalent today in the revenue department.

Responsive Government
  The conference of Chief Ministers held n 24th May 1997, presided over by the then Prime Minister IK Gujral discussed about Effective and Responsive Government. The conference recognized the growing doubts about the accountability, effectiveness and moral standards of administration and the need to move together to justify the trust of faith of the people in the Government both at the center and states.

AS resolved in the conference, the Accountable and Citizen Friendly Government envisaged Citizens’ Charter, Redressal of Public Grievances, Review of Laws, Regulations and Procedures as well as Peoples Participation and Decentralization and Devolution of Powers. Transparency and Right to Information envisaged a legislation for Freedom of Information. As part of improving the performance and integrity of the public service the conference noted that people-friendly and effective administration depends on cleansing of civil services at all levels.

            The conference also realized that there was considerable frustration and dissatisfaction amongst the people, especially the weaker sections of society, about the apathy, irresponsiveness and lack of accountability of public servants. There was increasing anxiety about growing instances of corruption and criminalisation in public life and administration. Against this background, two decades ago, the state and central governments were involved in some manner or the other, in providing public services. We may take a cue from the conference.

Ensuring Accountability
Apart from an overall lack of transparency and accountability in the system, most government delivery systems all-over the country suffer from adhocism and delay. It is therefore, important to identify and publicize the standards of services and time limits that the public can reasonably expect, particularly in critical activities with a public interface.


             One of the important means of ensuring accountability and transparency in the agencies engaged in providing services to the people, or enforcing laws and regulations, is to organize their actions around the concept of Citizens’ Charter. This is part of a national movement in countries, like the UK and Malaysia, where it lays out the citizen’s entitlement to public services and responsive administration of regulations. It places the citizen at the centre of administration instead of making him a passive recipient of services rendered indifferently.    
        
Citizens’ Charter is based on the principle of, wide publicity of standards of performance of public agencies and local bodies; assured quality of service; access to information and courtesy and helpfulness of staff; Choice and consultation with the citizens; Simplified and convenient procedure for receipt and acknowledgement of complaints and time bound redressal of grievances and the provision for independent scrutiny of performance with the involvement of citizen groups.    
   
Moral Commitment     
While it is not justifiable, it represents the moral and democratic commitment of the government to service of the public. In order to accomplish this task, each Government Department should work out its own Citizens’ Charter and related actions in terms of the nature of work and, more importantly, the groups of clients or members of the public, geographical concept, nature of regulatory function and paid-for services. It should also evolve a plan containing both long term and short-term targets for improved public satisfaction and efficient performance through systems improvements, technological and information inputs, staff orientation, work place changes, use of alternate providers, partnership with citizen groups, voluntary agencies and the corporate sector. An in-built machinery to be set up in each department for independent system auditing and periodic monitoring of performance with reference of the charter principles and to attend to the capacity building and orientation of the staff.

            The poor record of most public in the area of prompt and effective redressal of public grievances is a major cause of public dissatisfaction and a subject of criticism. Public grievances primarily arise out of the inaccessibility of officials’ failure to even acknowledge applications, non-enforcement of any kind of time limits, and unsympathetic attitude of officials at various levels.

              It is also found that adequate facilities are often not available in the public offices for reception of the public seeking various types of information or with various queries and demands of services. Arrangements for seating and waiting of the public, water supply and sanitation, protection from rain, sun etc are insufficient or non-existent in public offices which the citizens are required to visit.

There are often no display boards relating to information generally desired by the public on the location of offices and facilities, various procedures involved, fees, submission of forms, time taken in disposal. The names of grievance redressal officers are not often widely published, and these officers are also not accessible as stipulated to meet the public.

In big cities, citizens are often required to travel long distances to visit different offices due to lack of decentralized locations at the ward level for providing information on dealing with complaints. As regards the villagers in dispersed villages throughout the district, they face great problems in approaching the tehsil and district offices for getting copies of records, licenses, payments, and applications under various government schemes.  

Measures for improvement
A number of measures could be considered for immediate improvement in the situation. The language and tone of various application forms should be user friendly, and the forms be widely available in various outlets, including post offices. Every public servant should normally be available during working hours to respond to the public in person or on phone at least in a specified time. Every application or petition should be acknowledged. Every application should also carry such a slip for future response. Time limits should be fixed for approval or rejection of applications.

       The real issue, however is the need to bring about a total change in the attitude of public servants towards redressal of public grievance at all levels and to pin point responsibility for action on grievance of the people. A demonstrable and effective way of ensuring prompt redressal of public grievance would be establishing Citizen Information Centres and Public Facilitation Centres. Steps to promote widespread and easy access of people in rural and urban areas to information on public services, details of government schemes, status of application, issue of certificates have to be initiated.  This will ensure administration to be more effective and responsive and help in preventing corruption and harassment to the common people.