Monday, February 3, 2025

 ఏమో … గుర్రం ఎగరావచ్చు!

(కాంగ్రెస్ పార్టీ మార్క్ క్రమశిక్షణ)  

వనం జ్వాలా నరసింహారావు

నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీ 

(04-02-2025) 

ఐదారు నెలల క్రితం, యాధృచ్చికంగానో, మనసులో మాటో, ‘అధిష్టానం కోయిల ముందే కూసిందో’ కాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచరమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తనతో సమానంగా సిఎం అయ్యే అర్హతలున్నాయని, ఆయన నిజమైన ‘పోరాట యోధుడుని ప్రశంసించారు. ఆ మర్నాడే మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహితం ఇలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలే చేశారు. 

ముఖ్యమంత్రి, మంత్రి వ్యాఖ్యల అర్థం ఏదైనా కావొచ్చు. ‘కాంగ్రెస్ పార్టీ మార్క్ (ఒక) వారసుడి పరోక్ష నిర్ణయం’ జరిగి వుండాలని, వీరి వ్యాఖ్యల నిగూఢార్థం, అంతరార్థం కావచ్చు. కాకపోనూ వచ్చు. ఈ వ్యాఖ్యానాల్ని ‘రీడ్ బిట్వీన్ ద లైన్స్’ విధానంలో విశ్లేషిస్తే, ‘పార్టీ-ప్రభుత్వ స్టీరింగ్’ మీద ‘చేతులు మారే’’ అవకాశాలున్నాయేమో అన్న అభిప్రాయం కలగడం సహజం. అది ఐదారునెలల క్రితం జరిగిన ఈ సంగతి, ఆ తర్వాత పూవు పూసి, కాయ కాసి, ఇప్పుడు దోరపండు స్థాయికి చేరుకున్నది. ఎప్పుడైనా పూర్తిగా పక్వానికి రావచ్చు!!

ఇటీవలి కొన్ని పరిణామాలు, వాటి పర్యవసానాలను నిశితంగా విశ్లేషిస్తే, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రథ సారథ్యం సంక్షోభంలో కూరుకుపోతున్నదా? అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతున్నది. పరిస్థితి నాయకుడి అదుపులోంచి శీఘ్రంగా జారిపోతున్నదనే భావన విశ్లేషకుల్లో వినిపిస్తున్నది. ఊపిరాడనివ్వకుండా అస్మదీయ, తస్మదీయ ఎమ్మెల్యేల వేరుకుంపటి సెగలు-పొగలు, పార్టీమారివచ్చిన ఎమ్మెల్యేలలో అపోహలు, అసహనం, ఏ మంత్రి పదవికి ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న ఆందోళన, కొందరు మంత్రుల మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిని బాహాటంగా ప్రకటిస్తున్న సందర్భాలు, ఆ క్రమంలో తొలి అడుగుగా కలకలం రేపిన పదిమంది శాసనసభ్యుల రహస్య భేటీ వార్త, వీటన్నిటినీ తలదన్నే, కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విటర్‌ (ఎక్స్‌) హ్యాండిల్‌ నిర్వహించిన సర్వేలో దాదాపు 70-80 శాతం మంది కాంగ్రెస్‌ పాలనను వ్యతిరేకించడం....ఇంకా...మరెన్నో... దేనికి దారితీయనున్నదో?

కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే, అధినాయకత్వంమీద భయంతో కూడుకున్న అపార విశ్వాసం, గౌరవం, ‘విచిత్రమైన క్రమశిక్షణ’ జగద్వితం. కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనైనా, ‘తుమ్మితే వూడే ముక్కులాగా’ నాయకత్వ మార్పు అలవోకగా ఏ క్షణంలోనైనా జరగవచ్చు. నాటి నుండి నేటి వరకు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకుని ఎంపికైనా, నామినేషనైనా అధిష్టానం కనుసన్నల్లో, ఇష్టానుసారం జరిగేదననేది అక్షరసత్యం! అధిష్టానాన్నే ‘పార్లమెంటరీ బోర్డ్’ అనీ, ‘హైకమాండ్’ అని సమయ-సందర్భాన్ని బట్టి ‘పాజిటివ్’ లేదా ‘నెగెటివ్’ అర్థం వచ్చేట్లు ముద్దు-ముద్దుగా పిలుచుకుంటారు కాంగ్రెస్ పార్టీ చోటా-బడా నాయకులు. 

ఉమ్మడి రాష్ట్రం రోజుల నుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిరాడంబరంగా, సాదాసీదాగా, ఉన్నతమైన విలువలతో, ముఖ్యమంత్రి, లోక్ సభ స్పీకర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల స్థాయికి ఎదిగి, హంగూ-ఆర్భాటం లేని సాధారణ జీవితం గడిపిన అగ్రశ్రేణి ప్రముఖుల స్ఫూర్తి, విలువలు, క్షీణించిపోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యమంత్రులుగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న బూర్గుల రామకృష్ణారావు ఆకోవకు చెందిన వారే. ప్రతిపక్ష నాయకుడుగా వున్న పుచ్చలపల్లి సుందరయ్య ఒక మహామనీషని ప్రత్యర్థులు సహితం అంగీకరిస్తారు. అలాగే వావిలాల, తెన్నేటి. 

కాంగ్రెస్ పార్టీకి చెంది, ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారెందరో రాజకీయ ఉద్దండులుగా, దేశరాజకీయాలను శాసించే స్థాయికి, ప్రధాని అభ్యర్థినే నిర్ణయించే స్థాయికి చేరుకున్న సందర్భాలున్నాయి. నీలం సంజీవ రెడ్డి అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి, కేంద్రమంత్రి, లోక్ సభ స్పీకర్, రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. దామోదరం సంజీవయ్య అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పీవీ నరసింహారావు కేంద్రమంత్రిగా, ప్రధాన మంత్రిగా వున్నారు. జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, టంగుటూరి అంజయ్యలు కేంద్ర మంత్రులయ్యారు. తెలుగుదేశానికి చెందిన ఎన్టీరామారావు కేంద్ర రాజకీయాల నిర్దేషకుడయ్యాడు. చంద్రబాబునాయుడు కేంద్రంలో చక్రం తిప్పాడు.  రాష్ట్ర విభజన అనంతరం, తెలంగాణ మొదటి సిఎంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంతకు ముందే కేంద్రమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎంపిక చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి భవిష్యత్తులో వీరి స్థాయికే చేరుకోవాలి.

ఎన్టీరామారావు ముఖ్యమంత్రి కావడానికి పూర్వం, రాష్ట్ర రాజకీయాలంటే, కాంగ్రెస్ పార్టీ అంతర్గత, బహిర్గత, సమ్మతి, అసమ్మతి, రాజకీయాలే. స్వపక్షంలోని అసమ్మతి నాయకులకు, విమర్శలు చేసే విపక్ష నాయకులకు, అధికారంలో వున్న పెద్దలు సముచితమైన గౌరవం ఇచ్చేవారు. నిస్వార్ధంగా, గౌరవప్రదంగా, విద్వేషరహితంగా రాజకీయాలలో రాణించిన మహనీయులెందరో నడయాడిన తెలుగురాష్ట్రాలలో, వర్తమాన రాజకీయాలు జుగుప్స, అసహనం, అసహ్యం, నిస్సహాయాత, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా వుండగా, వేగంగా మారుతున్న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల నేపధ్యంలో నాయకత్వ మార్పు వుండవచ్చా? లేకపోవచ్చా? గత ఏడు దశాబ్దాల అనుభవాలను చర్విత చరణం చేసుకుంటే ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సామెత గుర్తుకు వస్తుంది. 

ముఖ్యమంత్రి కావడానికి ముందు సీఎల్పీ నాయకుడి ఎంపిక ఆసక్తికరంగా వుండేది. 1956 లో సంజీవరెడ్డి ఎన్నికైనప్పుడు రాజకీయం చేయకుండా ఐక్యతకు, క్రమశిక్షణకు ‘అధిష్టానం’ ప్రాధాన్యత ఇచ్చింది. బూర్గుల అభ్యర్థిత్వానికి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, పోటీ సంజీవరెడ్డి, బెజవాడల మధ్యనే జరిగింది. బూర్గుల, జేవీ నరసింగరావుల మద్దతు నీలంకు లభించగా, చెన్నారెడ్డి వర్గం బెజవాడను బలపర్చారు. రహస్య ఓటింగ్ ద్వారా సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. 1957 సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా, చెన్నారెడ్డి అభ్యంతరాన్ని కాదని, నీలం సంజీవరెడ్డినే సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నారు. సంజీవరెడ్డి అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడంతో, సంజీవరెడ్డి రాజీపడి దామోదరం సంజీవయ్యకు మద్దతు పలికారు. 1962 ఎన్నికల అనంతరం, నీలం, దామోదరం పోటీలో నిలిచినప్పటికీ, సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అధిష్టానం ఆదేశించింది. నీలం సిఎం అయ్యారు. 1964 లో సిఎం పదవికి రాజీనామా చేసిన సంజీవరెడ్డి, సీఎల్పీ నాయకుడిగా కొనసాగుతూనే, బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా ‘నామినేట్’ చేయించగలిగాడు. లాల్ బహదూర్ మంత్రివర్గంలో సభ్యుడైన తరువాత సంజీవరెడ్డి సీఎల్పీ నాయకత్వానికి రాజీనామా చేస్తే, బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతా అధిష్టానం చలవే!

1967 సార్వత్రిక ఎన్నికల నంతరం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం వల్ల, అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచి, సీఎల్పీ నాయకుడిగా, బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1971 లోక్ సభ మధ్యంతర ఎన్నికల తరువాత, ‘అధిష్టానం’ ఆదేశం మేరకు, బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. ‘బలపడుతున్న సిఎంలను తొలగించాలన్న’ ఇందిరాగాంధీ వ్యూహంలో భాగంగానే కాసు రాజీనామా చేయాల్సి వచ్చిందనేవారు. ఇందిరాగాంధీ (ఏకవ్యక్తి అధిష్టానం) నిర్ణయం మేరకు నీలం, కాసులకు ‘విదేయుడిగా పేరుతెచ్చుకుని’ అనుచరవర్గం లేదని భావించిన, పీవీ నరసింహావును ఏకగ్రీవంగా శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నిక చేయించి  ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం.     

1972 ఎన్నికలు జరిగిన తరువాత, పీవీ ఏకగ్రీవంగా సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై, ముఖ్యమంత్రి అయ్యారు. ఏకవాక్య తీర్మానం ద్వారా, నాయకత్వం ఎంపిక ప్రధాని ‘ఇందిరాగాంధీ’కి (పార్టీ అధ్యక్షురాలికి, అధిష్టానానికి) వదిలిపెట్టే సాంప్రదాయం, ‘సీల్డ్ కవర్ రాజకీయాలు’ ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజన ఆందోళన నేపధ్యంలో సిఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చిన పీవీ, సీఎల్పీ నాయకుడిగా కొనసాగారు. రాష్ట్రపతి పాలనలో శాసనసభ రద్దుకాలేదు. దరిమిలా, పీవీని సీఎల్పీ నాయకుడిగా రాజీనామా చేయమని ఆదేశించిన అధిష్టానం, ఆయన స్థానంలో వ్యక్తిని ఎంపిక చేసే అధికారం, 1973 అక్టోబర్ చివరలో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభా పక్షం, ‘ఇందిరాగాంధీ’కి అప్పచెప్పింది. ‘ఇందిరాగాంధీ ఆశీస్సులు’ వుంటే చాలనే సాంప్రదాయం బలపడ సాగింది. 

ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పేరును ఢిల్లీలో ప్రకటించారు ఇందిరాగాంధీ. మరో సాంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. భవిష్యత్తులోనూ కొనసాగి తీరుతుంది. అంటే, ఏ క్షణంలో ఎవరి పేరైనా అప్పటివరకున్న సిఎం కు తెలియకుండానే ఢిల్లీలో ప్రకటన రావచ్చు. వెంగళరావు సిఎంగా వున్నప్పుడే అత్యవసర పరిస్థితి విధించడం, ఎత్తివేయడం, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, కేంద్రంలో కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగాయి. కాంగ్రెస్ పార్టీ చీలిపోయి, ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ (ఐ) ఆవిర్భావం జరిగింది. 1978 జనవరిలో  రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న చెన్నారెడ్డి రాజీనామా చేసి ఇందిరా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఫిబ్రవరి 24న జరిగిన ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్ 175 స్థానాల్లో ఘన విజయం సాధించింది. వెంగళరావు నాయకత్వంలోని బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ వర్గం ఓడిపోయింది.  

చెన్నారెడ్డి, రాజారాంలు సీఎల్పీ నాయకత్వ పోటీకి సిద్ధమయ్యారు. ఆధిపత్యానికి తిరుగులేని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు, రాజారాం పోటీనుండి తప్పుకోవడంతో సీఎల్పీ నాయకుడిగా చెన్నారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయింది. కాంగ్రెస్ పార్టీ ‘సమ్మతి-అసమ్మతి’ వర్గపోరు తీవ్రమై, 19 నెలల తరువాత ఇందిరాగాంధీ ఆదేశం మేరకు చెన్నారెడ్డి రాజీనామా చేయడం, ఆయన వారసుడిగా ఆమే ‘స్వయంగా’ ఎంపికచేసిన కేంద్ర కార్మికశాఖ మంత్రి, తెలంగాణ ప్రాంత వ్యక్తి, టంగుటూరి అంజయ్య నియామకం జరగడం కేవలం లాంఛనమే. అనుకోని పరిణామాల నేపధ్యంలో రాజీనామా చేసిన అంజయ్య స్థానం ఇందిరాగాంధీ అనుగ్రహంతో భవనం వెంకట్రాంరెడ్డికి దక్కింది. 

ఇంతలో ఎన్టీ రామారావు రాజకీయ రంగప్రవేశం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, పదవిలో ఏడు నెలలు కూడా నిండని భవనం రాజీనామా, ఐదేళ్లలో నాలుగో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి నామినేట్ కావడం, 1983 లో ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం, ఎన్టీ రామారావు అఖండ విజయం సాధించి సిఎంగా మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు కావడం, సమకాలీన రాజకీయ చరిత్ర. ఆ సమకాలీన చరిత్రలోనే విఫలమైన నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు ఒక దురదృష్ట అధ్యాయం. 

1989 శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఢిల్లీ పెద్దల అండతో, సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు (నేను ముఖ్యమంత్రి పీఆర్వోగా ఆయన దగ్గర పనిచేశాను). సంవత్సరం గడవక ముందే, కాంగ్రెస్ పార్టీ సంస్కృతీ, సాంప్రదాయాలైన, ‘ఢిల్లీ పెద్దల వ్యవహారశైలి’ వల్ల చెన్నారెడ్డి రాజీనామా చేయక తప్పలేదు. ఆ తరువాత ముఖ్యమంత్రైన నేదురుమల్లి జనార్ధనరెడ్డికి అసమ్మతి సెగ తగలడంతో రాజీనామా చేయక తప్పలేదు. తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డిని రెండోమారు ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం. ఆ నిర్ణయమే 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారితీసింది. ఎన్టీఆర్ రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన మీద తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబునాయుడు, 1999 ఎన్నికలలోనూ గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. 

2004 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి శ్రీనివాస్ ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, అధిష్టానం (సోనియాగాంధీ) ఆశీస్సులు రాజశేఖరరెడ్డికి లభించి సీఎల్పీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి వీలైంది. 2009 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ‘ఆటోమేటిక్ చాయిస్’ గా మరోమారు సీఎల్పీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ అకాల మరణంతో రోశయ్య, తరువాత కిరణ్ కుమార్ రెడ్డిలను నామినేట్ చేసింది అధిష్టానం. తెలంగాణ ఆవిర్భావం తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) రెండు పర్యాయాలు (2014, 2018 ఎన్నికలలో) అధికారంలోకి రావడం, కె చంద్రశేఖర్ రావు సిఎం కావడం జరిగింది. ఎన్టీ రామారావుకు, చంద్రబాబునాయుడుకు, చంద్రశేఖర్ రావుకు వారికి వారే అధిష్టానం. వారిదే నిర్ణయం. 

పీసీ అధ్యక్షుడిగా వున్న ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో, 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.  ఆయనే కాంగ్రస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నికవుతారని అందరూ భావించినా, అలవాటు, ఆచారం, సాంప్రదాయం ప్రకారం, అధిష్టానం నుంచి ‘క్లియరెన్స్’ వచ్చేవరకు ప్రకటన రాలేదు. తెలుగురాష్ట్రాలలో ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంత్రులుగా అయినవారందరూ నీలం నుండి కిరణ్, రేవంత్ వరకూ అధిష్టానం కనుసన్నలలో మెలిగినవారే, మెలగాల్సినవారే.

సిఎంలు అయిన వారినెవరినీ కాంగ్రెస్ అధిష్టానం ‘సాధారణంగా’ పూర్తికాలం పదవిలో’ వుండనీయలేదు. చెస్ బోర్డులో, పచ్చీసు పట్టాలో పావులను కదిలించినట్లు సిఎంలను మార్చడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం. దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో కొనసాగగలరా? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి, అసహనం, అసమ్మతి సహజం. దీనికి అతీతులెవరూ లేరు. ‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు’ అంటారు. ‘శివుడి ఆజ్ఞ’ అంటే ‘అధిష్టానం ఆజ్ఞ.’ ఎమ్మెల్యేల వేరుకుంపట్లు, రహస్య భేటీలు కాంగ్రెస్ పార్టీకి చెందినంతవరకు ‘అధిష్టానం ఆశీస్సులు’ లేకుండా జరగవు!!! ఇంతకీ అధిష్టానం పనుపున చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి ఎవరనేది ప్రశ్న?  

Sunday, February 2, 2025

WEF PLEDGES: REALITY IS BITTER: By Vanam Jwala Narasimha Rao

 WEF PLEDGES: REALITY IS BITTER

MoUs on Investments at Schwab’s 

World Economic Forum Echo ‘Malthusian Theory’

By Vanam Jwala Narasimha Rao

The Hans India (03-02-2025)

{Billions of investment announcements pledged at WEF and consequently hurried MoUs with companies by a few Chief Ministers create a perception of rapid economic expansion and development as well as false expectations of huge employment creation. In actual implementation, fund disbursement, ground-level projects, and tangible benefits like employment creation or economic uplift typically follow a slower and linear pace due to innumerable bureaucratic hurdles, regulatory challenges, and economic uncertainties, not to speak of politically motivated hyped announcements}-Synoptic Note by Editor

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu expressed the view that, a visit to the ‘World Economic Forum (WEF)’ is not just about signing MoUs, but engagement and networking with ‘Globally Influential Individuals’ under one roof, to gain insights into the direction the world is headed. This is absolutely true, especially in the context of series of ridiculous statements ‘day in day out’ by few Chief Ministers about their signing MoUs in Davos, including with Indian companies!!!

The 54th WEF Meeting was held in Davos, from January 15-19, 2025, attracting International Organizations and Global Companies. Approximately 3000 significant global leaders, policymakers, experts, leaders from government, business, civil society, and academic institutions participated. They included Prime Ministers, Ministers, and Top Officials. USA delegation comprising 674, UK’s 270, Chinese delegation with 140 members, and India’s largest-ever delegation of 133 (with the theme of ‘One Team and One Indian Pavilion’) from Telangana, Andhra Pradesh, Maharashtra, Uttar Pradesh, Tamil Nadu, Kerala, Karnataka, and West Bengal participated. Five Union Ministers, three state Chief Ministers, nearly 100 CEOs and leaders from various sectors from India participated. 

‘European Management Forum (EMF)’ established in 1971 by a 33 years old Swiss Engineer and Economist, Professor Klaus Schwab, was renamed as ‘World Economic Forum (WEF)’ to broaden its Vision. Schwab’s idea was to create an efficient and effective platform for European Executives and Entrepreneurs to learn and adopt USA Management Techniques. Gradually it evolved to focus on broader economic and social issues. Schwab strategically leveraged his contacts to mobilize resources, basically from the initial gathering of approximately 400 European Business Leaders. Conceived as a non-profit foundation under the supervision of the Swiss Federal Government, WEF traditionally has been holding ‘Annual Meetings’ in Davos, chosen for its serene mountain setting to foster open and cooperative discussions, embodying the ‘spirit of Davos’ as termed by Schwab.

WEF does not own permanent venue in Davos. Some ‘Annual Meetings of the New Champions (AMNC)’ focusing on innovation, entrepreneurship, technology, by bringing together leaders from business, government, academia, and civil society were held in China’s Dalian. Telangana’s First Chief Minister Kalvakuntla Chandrashekhar Rao attended one such meeting in Dalian in 2015. Reverberating his ‘Intellectual Presence and with a Statesman Like Approach’ in his five-minute talk in the meeting, in seriatim, KCR defended with Nationalism Spirit the Indian Economy, endorsed host country China’s Development with International Comprehension, and precisely projected the State as an investment destination as a dedicated leader of Telangana. Exactly decade after what he envisioned there, the Economic Survey 2024-25 presented to Parliament by Union Finance Minister, has reaffirmed ‘Telangana’s Exceptional Economic Growth’ under KCR Regime and leadership. Great!!

Participation in the WEF Annual Meetings by those who are significant contributors to the economic or political landscape or who are likely to add value to the forum's goals of fostering global collaboration and solving complex global challenges, is ‘Strictly by Invitation’ often ‘Stage-Managed.’ WEF provides an opportunity for lobbying economic opportunities, investments, and global collaborations. Chief Ministers and Union Ministers from India participate to showcase their economic potential, and to attract global investors. They apparently build international partnerships, including strategic discussions and behind-the-scenes interactions. 

WEF projecting as a ‘Socializing Institution’ in ‘Shaping Global Economic Policies’ serves as a platform to ‘Promote Neoliberal Agendas’ inadvertently facilitating the spread of policies that prioritized deregulation and market liberalization, which may not align with the interests of the broader population. Nevertheless, it became a key platform for developing countries to showcase investment opportunities. 

When Narendra Modi attended WEF Annual Meeting 2018, he became the First Indian Prime Minister to do so in two decades after Deve Gowda who attended in 1997. Modi in his keynote address highlighted India's economic reforms, ease of doing business, and investment opportunities. Modi consciously promoted initiatives like Make in India, Digital India, and Skill India to attract global investors. He addressed global concerns like climate change and terrorism, positioning India as a responsible global power. In tune with this, perhaps, while addressing an event hosted by Confederation of Indian Industry (CII) at the 54th meeting, Schwab hailed India’s successful growth story and spoke about the country's success in achieving 7% growth annually. Undoubtedly this was Great Recognition on international Dais. However, the Economic Survey’s Prediction hooks India’s ‘Real GDP Growth’ in 2025-26 between 6.3% and 6.8% only ‘keeping in mind the upsides and downsides.’ 

N Chandrababu Naidu was one of the first and most notable Chief Ministers from India to attend the WEF Annual Meetings in the late 1990s and early 2000s. He actively utilized the WEF platform and promoted the erstwhile AP state as a destination for foreign investment. He also promoted the state's IT industry and state's role in India's IT growth, especially Hyderabad’s emergence as an IT Hub. This time also he attended in similar fashion. He interacted with the Microsoft founder Bill Gates. Telangana Chief Minister Anumula Revanth Reddy attended in 2023 also now. Most Successfully he secured significant investments for Telangana from Amazon, Sun Petrochemicals, Tillman Global Holdings etc. worth Rs 1.78 lakh crore, which is expected to generate employment opportunities for 49,550 people. Great!

WEF is celebrated for its potential to forge international partnerships to secure investments. However, the tangible benefits, particularly in terms of economic growth and employment generation, often come under scrutiny. In recent years, many political leaders, especially Telangana and Andhra Pradesh have used this high-profile platform to announce ‘Large-Scale Investments, Often in Billions.’ The question is whether these investments are ‘Merely Publicity Stunts’ deliberately designed to ‘Showcase Political Agenda’ or do they ‘Truly Contribute to Long-Term Prosperity’?

It may be of interest to draw a parallel between the ‘Malthusian Theory’ which discusses ‘Arithmetic and Geometric Progressions’ and the ‘Largescale Investment Announcements’ made at the World Economic Forum, versus their ‘Actual Implementation or Real Benefits.’ The ‘Malthusian Theory of Population Growth’ is in ‘Geometric Progression’ or growing exponentially (1, 2, 4, 8, 16...). ‘Food Supply Growth’ will be in ‘Arithmetic Progression’ or increases linearly (1, 2, 3, 4, 5...). Eventually population outpaces food supply, leading to shortages, crises, and corrective measures.

In the similar way, ‘Billions of Investment Announcements Pledged in WEF’ and ‘Consequent Hurried MoUs’ with companies by few Chief Ministers are in ‘Geometric Progression’ which grow exponentially year on year creating a ‘Perception of Rapid Economic Expansion and Development’ as well as ‘False Expectations of Huge Employment Creation.’ When it comes to ‘Actual Implementation’ it is not even in ‘Arithmetic Progression.’ The real execution, such as fund disbursement, ground-level projects, and tangible benefits like employment creation or economic upliftment, typically follows slower and linear pace due to innumerable bureaucratic hurdles, regulatory challenges, and economic uncertainties, not to speak of ‘Politically Motivated Hyped Announcements.’ 

The result is that, this disparity leads to a ‘Development Gap’ where the promised economic transformation falls short of expectations, resulting in delays, skepticism, and policy adjustments. Just as Malthus emphasized the need for checks and balances to align population with resources, ‘Policymakers and Stakeholders’ must ensure realistic projections, continuous monitoring, and ground-level execution to align World Economic Forum investments with actual economic growth. While ‘Large-Scale Investments are Certainly a Positive Step’ towards economic development, these hyped announcements cannot be sheer ‘Game-Changing Propositions.’ The goal should be to ensure that these investments translate into tangible development, especially in Telugu states. 

Professor Klaus Schwab of World Economic Forum who fairly demonstrated remarkable skills as a ‘Public Relations Strategist, Specialist Economist, and Maneuverer’ in the global political and economic landscape, may well have steered the WEF toward even more meaningful change. Moving forward, ‘Greater Humility, Accountability, and an Ethics-First Approach’ would help solidify its credibility and long-term relevance, ensuring that, it delivers a positive legacy for future generations.

(The Writer is former Chief Public Relations Officer to First Telangana Chief Minister K Chandrashekhar Rao)

జగత్ సృష్టి అంతా భగవత్ సృష్టే అని నారదుడికి చెప్పిన బ్రహ్మ ..... శ్రీ మహాభాగవత కథ-21 : వనం జ్వాలా నరసింహారావు

 జగత్ సృష్టి అంతా భగవత్ సృష్టే అని నారదుడికి చెప్పిన బ్రహ్మ

శ్రీ మహాభాగవత కథ-21

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (03-02-2025) 

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమహాభాగవతం ద్వితీయ-తృతీయ, పంచమ స్కందాలలో ప్రపంచోత్పత్తి గురించి, అంతుచిక్కని సృష్టి రహస్యం గురించి చాలా విపులంగా రాయడం జరిగింది. 

శ్రీమన్నారాయణుడు ఒకప్పుడు చతుర్ముఖ  బ్రహ్మకు లోక సృష్టి మీద బుద్ధి కలిగించాలని సంకల్పించాడు. దానికొరకు భగవానుడు సరస్వతిని నియోగించాడు. ఆ వాగ్దేవి తనకు తానుగా బ్రహ్మను హృదయనాధుడిగా వరించింది. వేదరూపిణిగా ఆయన ముఖమండలం నుండి బయటకు వచ్చి, ఆ బ్రహ్మను తిరుగులేని సృజనాక్రియా పారంగతుడిని చేసింది. భగవంతుడు తాను స్వయంగా అంతటా వ్యాపించి ఉన్నవాడే అయినప్పటికీ, పంచభూతాల పరస్పర సంయోగంతో శరీరాలు అనే పురాలను పుట్టించాడు. పంచభూతాలలో పదకొండు ఇంద్రియాల తేజాన్ని ప్రసరింపచేసి వాటి మహాత్మ్యంతో పదహారు కళారూపాలతో వెలుగొందుతాడు. 

నారదుడు తన తండ్రి బ్రహ్మను జగత్ సృష్టి గురించి అడిగాడు ఒకసారి. ‘ఈ జగాన్ని ఇలా సృష్టించాలనే తెలివి మొదట నీకు ఎవరు కలిగించారు? ఏ ఆధారంతో లోక సృష్టిని మొదలు పెట్టావు? అలా ఆరంభించడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? దాని అసలు స్వరూపం ఎలా ఉంటుంది? ఎడతెరిపి లేని సాలెగూటి లాంటి సృష్టి క్రమాన్ని ఎలా అల్లుకుంటూ వస్తున్నావు? ఈ సృష్టి అంతటికీ నువ్వే అధిపతివి అని అనుకుంటున్నాను. అది నిజమేనా? నువ్వే సర్వాదికారివా? నీకంటే ఘనుడు, నిన్ను మించిన మహానుభావుడు మరెవరైనా ఉన్నారా? నువ్వు ఏ దేవదేవుడిని గురించి తపస్సు చేశావు? నీకు పరమ విభుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే, అతడే ఈ బ్రహ్మాండం పుట్టడానికి కారణమా? ఆయన విలాసం వల్లే ఈ విశ్వం వర్ధిల్లుతూ, లయిస్తూ ఉంటుందా? ఈ సృష్టి విధానం ఆసాంతం నాకు వివరించు’ అని ప్రశ్నించాడు నారదుడు బ్రహ్మను.

జవాబుగా బ్రహ్మ దేవుడు ఇలా అన్నాడు: ‘ఈ చరాచర జగత్తు మొత్తాన్నీ నాకు నేనుగా సృష్టించే తెలివి నాకు ఏమాత్రం లేదు. అందుకే మొదట చాలా తడబడ్డాను. ఈ సమస్తాన్ని సమన్వయ పరచుకుని, సృష్టికి నేను యథేచ్చగా శ్రీకారం చుట్టగల అవగాహనను నాకు ఆ పరమాత్మ ప్రసాదించాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలూ, చిన్న చుక్కల్లాగా ఈ లోకం అంతా పరమాత్మ కాంతిని అనుసరించి వెలుగుతుంది. ఈ సృష్టి అంతా భగవత్ సృష్టే. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల పుట్టుకకు కారణం ఆ వాసుదేవుడే! పద్నాలుగు లోకాలు ఆ శ్రీహరి నియమించినవే! సురలంతా ఆ దివ్య స్వరూపుడి శరీరం నుండి పుట్టినవారే! వేదాలు, యుగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ నారాయణుడికి చెందినవే! సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షీభూతుడు ఆ పరమేశ్వరుడే! అతడి అనుగ్రహంతో మాత్రమే నేను సృష్టిస్తూ ఉంటాను’.

ఇంకా ఇలా చెప్పాడు బ్రహ్మ: ‘ఆ పరమ దైవం మాయకు పాలకుడు. తన మాయ వల్ల, దైవ స్థానం వల్ల లభించిన కాలం, జీవుడు-అదృష్టం (కర్మ)-స్వభావం అనే మూడు అంశాలతో, వివిధ రకాలుగా సృష్టి చేయాలని సంకల్పించి ఆ పనికి పూనుకున్నాడు. ఆయన ఆశ్రయించిన తత్త్వం “మహత్తు”. దానితో కాలాన్ని, గుణాలనూ మేళవించాడు. స్వభావానికి రూపం ఇచ్చి, దానిని సృష్టిగా మలచాడు. జీవుడి పుణ్య-పాప రూపమైన కర్మ (అదృష్టం) నుండి “జన్మ” ను కలిగించాడు. ఆ మహత్తత్త్వం రజోగుణం, సత్వగుణాలతో విస్తరించి, ఒక రూపం పొందింది. దానివల్ల తమోగుణం ప్రధానంగా కల “అహంకారం” ఏర్పడింది. ఇది పంచ మహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకున్నది. అహంకారం, ద్రవ్యశక్తి కల “తామసం”, క్రియాశక్తి కల “రాజసం”, జ్ఞానశక్తి కల “సాత్త్వికం” అనే మూడు రూపాలుగా మార్పుచెందింది. ఈ మూడిట్లో పంచభూతాల సృష్టికి మూలం “తామస అహం”. దీని వికృతి “ఆకాశం” గా ఏర్పడింది. దీని గుణం “శబ్దం”. ఈ శబ్దం చాలా సూక్ష్మరూపం కలిగి ఉంది’.

బ్రహ్మ కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘ఆకాశం నుండి “వాయువు” ఏర్పడుతుంది. ఆకాశంతో పొందిక వల్ల “శబ్దం”, “స్పర్శ” అనే రెండు గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ప్రాణ రూపంలో ఉంటుంది. ఈ వాయువులో ఇంద్రియాల ఆరోగ్యం, మానసిక శక్తి, దేహపుష్టి ఉంటాయి. ఇవి ఓజస్సు, జీవశక్తి, బలం అనేవాటికి హేతువులై ప్రవర్తిల్లుతాయి. వాయువు నుండి “తేజస్సు” ఏర్పడుతుంది. రూపం, స్పర్శం, శబ్దం అనేవి దాని గుణాలు. తేజస్సు నుండి జలం ఏర్పడుతుంది. రసం, రూపం, స్పర్శం, శబ్దం అనేవి దీని గుణాలు. జాలం నుండి భూమ ఏర్పడుతుంది. గంధం, రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే అయుదు దీని గుణాలు. వీటన్నిటికీ తామసాహంకారం మూలం. సాత్త్వికాహంకారం వికారానికి లోనైనప్పుడు “మనస్సు” పుట్టింది. దీని దైవం చంద్రుడు. అహం నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు’.

   బ్రహ్మ ఇంకా కొనసాగించాడు. కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘రాజసాహంకారం తేజస్సుకు సంబంధించినది. దీన్నుండే పది ఇంద్రియాలు ఏర్పడ్డాయి. వీటికి మూలం పదిమంది సాత్త్వికాహంకార దేవతలు. త్వక్కుకు దిక్కు, నాలుకకు సూర్యుడు, ముక్కుకు అశ్వినీ దేవతలు, చేయికి అగ్ని, పాదానికి ఉపేంద్రుడు, గుడానికి మిత్రుడు, మర్మాంగానికి ప్రజాపతి దేవతలు. ప్రజ్ఞను పుట్టించే ఇంద్రియాలలో ఒకటి బుద్ధి. క్రియను పుట్టించే ఇంద్రియం ప్రాణం. ఇలాంటి పది జ్ఞానేంద్రియాలతో కూడిన పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలు అనే వస్తు సంచయం ఉన్న ఇవి విడి-విడిగా వేటికవే ఉండడం వల్ల బ్రహ్మాండపు శరీరాన్ని రూపొందించగల సామర్థ్యం లేకుండా పోయాయి. పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలతో, ప్రాకృతిక శక్తి ప్రేరేపణలతో, అన్నీ ఏకీకృతమైనాయి. ఇవి అన్నీ కలిసి చేతన-అచేతన రూప బ్రహ్మాండాన్ని సృజించేవి అయ్యాయి. అలా ఏర్పడ్డ బ్రహ్మాండం కోట్లాది సంవత్సరాలు నీళ్లలోనే ఉండిపోయింది. ఆ పరమాత్మ జీవం లేనిదాన్ని జీవవంతం చేశాడు. ఆ దివ్యాత్ముడు జీవరూపంలో చక్కగా చుట్టూ చుట్టుకుని ఉన్న నీళ్లలో పడివున్న బ్రహ్మాండంలో జొరబడి వాటిని బాగా విస్తరింప చేశాడు. ఆ తరువాత అందాన్ని బద్దలు చేసి బయటపడ్డాడు’.

నారదుడి ప్రశ్నకు జవాబు కొనసాగిస్తూ బ్రహ్మ ఇంకా ఇలా అన్నాడు. ‘ఆ పరమేశ్వరుడు, ఈశుడు జగదాకారుడు. అనంతమైన బ్రహ్మాండాన్ని విపులమైన పద్నాలుగు లోకాలు (భువనాలు) గా చేశాడు. బహురూపాలు దాల్చిన ఆ పరమయోగి ఎన్నో పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, నేత్రాలు, శిరస్సులు, నోసళ్ళు, చెవులతో కూడి ఉంటాడు. ఆయన సృష్టించిన భువనాలలో మీద ఉన్న ఏడు లోకాలు నడుము నుండి పైన ఉన్న శరీర భాగం. దిగువనుండి ఏడు భువనాలు విష్ణువుకు దిగువనున్న శరీర భాగం. ప్రపంచమే పరమాత్ముడి దేహం. ఆ పురుషుడి నోటి నుండి బ్రహ్మణకులం, చేతులనుండి క్షత్రియ కులం, తొడల నుండి వైశ్యకులం, పాదాల నుండి శూద్రకులం పుట్టాయని చెప్తుంటారు. ఆయన మొలచుట్టూ ప్రదేశం “భూలోకం”. హృదయం “సువర్లోకం”. ఎదురు రొమ్ము భాగం “మహర్లోకం”. మెడ మూలం “జనలోకం”, రెండు స్తనాలు “తపోలోకం”, శిరో భాగం బ్రహ్మ నివసించే “సత్యలోకం”, కటి భాగం “అతలం”, తొడలు “వితలం”, మోకాళ్లు “సుతలం”, పిక్కలు “తలాతలం”, చీల మండలం “మహాతలం”, కాలి ముని వేళ్లు “రసాతలం”, అరికాళ్లు “పాతాళం”. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఉర్ధ్వలోకాలలో వ్యాపించి ఉన్నాడు. అమరులు, అసురులు, మునులతో సహా నీళ్లలో, ఆకాశంలో, తిరిగే ప్రాణులు అంతా విష్ణుమయమే. బ్రహ్మాండం అంతా అతడి శరీరంలో 12 అంగుళాల ప్రమాణంలో పొందుపడి ఉంటుంది. అంతా ఆయనే’.

బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు: ‘అచ్యుతుడు, బ్రహ్మాండం లోపల ఉంటూనే లోపలా, బయటా వెలుగులు నింపుతాడు. అలాంటి లోకాత్ముడి బొద్దు నుండి ఒక తామర పూవు పుట్టింది. దాని నుండి నేను (బ్రహ్మ) పుట్టాను. ఆ పరమాత్మ ఈ లోకాన్ని నిర్మించడం కొరకు ఒక మాయను సృష్టించాడు. ఆ మాయ వల్లే అతడు భగవంతుడయ్యాడు. ఆ విష్ణువు జగత్తే ఆత్మ కలవాడు. ప్రపంచానికి ఈశుడు. అతడు నియమించడాన్ని బట్టి నేను స్థావర జంగమాత్మకమైన ప్రాణులతో ఈ సృష్టి క్రమాన్ని విస్తరిస్తాను. విష్ణువు సుస్థితిని కలిగించి రక్షిస్తుంటాడు. శివుడు గిట్టింప చేస్తాడు. విష్ణువు సృష్టి, స్థితి, లయలనే మూడు శక్తులు కలిగి ఈ సమస్తానికీ తానె మూల భూతమై ఉన్నాడు. శ్రీమహావిష్ణువు అంతరంగాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని, జీవులను సృష్టించడమే నా విధి. ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనది కేవలం పరమమైన బ్రహ్మమే!’.

బ్రహ్మ ముగింపుగా మరికొన్ని విషయాలను చెప్పాడు నారదుడికి ఇలా: ‘ఆదిపురుషుడి తోలి అవతారం నుండి కాలం, కర్మం, స్వభావం అనే మూడు శక్తులు పుట్టాయి. వీటిల్లో నుండి ప్రక్రుతి ఏర్పాటైంది. దాన్నుండి మహత్తు అనే తత్త్వం కలిగింది. దాన్నుండి పుట్టిన రాజసాహంకారం నుండి ఇంద్రియాలు, సాత్త్వికాహంకారం నుండి అధిష్టాన దేవతలు, తామసాహంకారం నుండి పంచభూతాలకు కారణమైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం జనించాయి. వీటి నుండి ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనే పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. వీటి నుండి జ్ఞానేంద్రియాలైన చర్మం, నేత్రం, చెవి, నాలుక, ముక్కు; కర్మేంద్రియాలైన మాట, చెయ్యి, కాలు, మలావయవం, మూత్రావయం, మనస్సు ఉదయించాయి. వీటన్నిటి నుండి ఆ విరాట్పురుషుడు జన్మించాడు తనకు తానే. అతడి నుండి ఈ లోకం పుట్టింది. దాంట్లో నుండి సత్త్వరజస్తమోగుణాత్మక రూపాలలో విష్ణువు, నేను, శివుడు పుట్టాం. అందులో నుండి సమస్త లోకం, అందులో జీవించే వారు పుట్టారు. ఇలాంటి విశ్వం మొదటి పుట్టుకను “మహాత్తత్త్వ సృష్టి” అంటారు. రెండోది అండంతో కలిగిన సృష్టి. మూడోది సమస్త ప్రాణులకు చెందిన సృష్టి. అలా, ఆ పద్మాక్షుడి లీలావతారాలు అనంతం’.        

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Friday, January 31, 2025

 పథకాల కొనసాగింపులో ఏదీ హేతుబద్ధత? 

పథకాల సమీక్ష, సవరణ, స్వస్తిలో మృగ్యమవుతున్న హేతుబద్ధత 

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ దినపత్రిక (01-02-2025)

రెండు పర్యాయాల తన పదవీకాలంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేసి, అమలుపరచిన కొన్ని విధానపరమైన (అసంబద్ధ) నిర్ణయాలు, స్వస్తి పలికిన ఆయనకు ముందున్న యూపీఏ ప్రభుత్వం అమలుచేసిన కొన్ని పథకాలు, కార్యక్రమాలు, ఆచరణలో సారూప్యతలు, అభద్రతా భావాన్ని కలిగించిన కేంద్రప్రభుత్వ వ్యవస్థల తీరుతెన్నులు, పాలనాపరమైన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన మరికొన్ని అంశాలు, ఎనిమిది నెలల క్రితం జరిగిన 18వ లోక్ సభ ఎన్నికలలో, బహుశా బీజేపీకి, ఎన్డీఏకి సంఖ్యాపరంగా సభ్యులు తగ్గడానికి కారణమని కొందరు రాజకీయ, సామాజిక విశ్లేషకుల భావన.

ఉదాహరణకు, ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణయం, ‘జీఎస్టీ’ గందరగోళం, ‘అగ్నిపథ్’ పథకం, జమిలి ఎన్నికల నినాదం (‘వన్ నేషన్ వన్ పోల్స్’), ఇవన్నీ దీర్ఘకాలిక లాభాలను కలిగిస్తాయని మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది. ప్రజా సంక్షేమానికి, దేశీయ సమస్యలకు’ ప్రాధాన్యత తగ్గించి, అంతర్జాతీయ వ్యవహారాల మీద అమితమైన దృష్టి పెట్టడం, సాంప్రదాయేతర హిందూత్వ రాజకీయ భావజాలం’ లాంటివి కూడా ప్రతికూలతాంశాలుగా విశ్లేషకులు భావించారు. సాక్షాత్తూ అయోధ్యలో ఓటమి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సగానికి సగం స్థానాలు ఓడిపోవడం, మోదీకి వారణాసి నియోజక వర్గంలోనే మెజారిటీ బాగా తగ్గడం, హిందుత్వ సిద్దాంతం పూర్తిగా పనిచేయలేదని స్పష్టంగా చెప్పడానికి కారణాలు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాల్సిన స్థానాలమీద ప్రతికూల ప్రభావం చూపింది. 

సంఖ్యాపరంగా ప్రధాని మోదీకి, బీజేపీకి, ఎన్డీఏకి ఓటర్లు ‘విద్యుత్ షాక్’ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్థానాలు ఇండియా (యూపీఏ) కూటమి స్థానాలు పెరిగాయి. మోదీ మూడవ పర్యాయం పదవీకాలంలో తీసుకునే విధాన నిర్ణయాలు, పథకాల, కార్యక్రమాల రూపకల్పనలో సరిదిద్దు చర్యలు ప్రారంభించమని ఓటర్లు సున్నితంగా హెచ్చరించారు. నరేంద్ర మోదీజీ అజేయుడు అనడానికి అంగీకరించకుండా, ఆయన నాయకత్వం మరికొంత కాలం తప్పనిసరిగా అవసరమే’ అని ఓటర్లు తెలివిగా, స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తరువాత వినయ విధేయతలతో ప్రసంగించిన మోదీ, ఓటర్ల నిర్ణయాన్ని స్వీకరిస్తున్నాని, శిరసా వహిస్తున్నానని, స్వీయ-ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం తమ పార్టీకి వుందని చెప్పిన మాటలలో, ఓటర్ల పరోక్ష, నిర్మాణాత్మక, సున్నితమైన హెచ్చరిక సారాంశసారం స్పష్టంగా ప్రతిబింబించింది. కాకపోతే అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో మార్పు ఏమేరకు వచ్చిందో అనే విషయంలో స్పష్టత ఇంకా రాలేదు. 

ఇదిలా వుంటే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పది సంవత్సరాల పరిపాలనలో అమలుపరచిన విధానాలను, పథకాలను, కార్యక్రమాలను, పాక్షికంగానో, పూర్తిగానో రద్దు చేసే దిశగానో, లేదా పేర్లను మార్చే దిశగానో, ఏడాదికి పైగా అధికారంలో వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఆలోచనలో వున్నదని బీఆర్‌ఎస్ నేతల అనుమానం, ఆందోళన. ‘కాంగ్రెస్ పార్టీ మార్క్’ను, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లను, పార్టీ చిహ్నాన్ని ప్రతిబింబించేలా, పథకాల పేర్లలో మార్పులు జరుగున్నాయని వారి ప్రధానమైన ఆరోపణ. అలాగే అటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన పథకాలను చంద్రబాబునాయుడు మారుస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యంలో, నిత్యం మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా, రాజకీయ పార్టీలు, ఎన్నికల సమయంలో, అప్పటికే అమల్లో వున్న విధానాలను, పథకాలను, కార్యక్రమాలను మారుస్తామనో, పునర్వ్యవస్థీకరణ చేస్తామనో, అదనపు ఆర్ధిక ప్రయోజనాలను చేకూర్చే విధంగా సరికొత్త (ఉచిత) పథకాలకు శ్రీకారం చుట్తామనో వాగ్దానాలు చేయడం సర్వ సాధారణం. అందులో తప్పేమీ లేదు. తప్పల్లా గత ప్రభుత్వం చేసిన ప్రతిదాన్నీ హేతుబద్ధత లేకుండా విమర్శించడమే!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, వ్యూహాత్మకంగా, తెలివిగా, బహుళ ప్రచారం చేసి, తమ పథకాలకు ఓటర్ల విశ్వశనీయత పొందింది. మెజారిటీ అత్యంత స్వల్పమే అయినప్పటికీ, పదేళ్లపాటు సుపరిపాలన చేసిన బీఆర్ఎస్ ను ఓడించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది  కాంగ్రెస్ పార్టీ. అలాగే చంద్రబాబునాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ పథకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి, ఓటర్ల విశ్వసనీయత పొంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ఓడించి, రాష్ట్రం విడిపోయిన తరువాత రెండవ పర్యాయం అధికారంలోకి రావడం జరిగింది.   

ప్రపంచవ్యాప్తంగా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, అధికారంలోకి రాగానే, తమకు పూర్వం అధికారంలో వున్న ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను, అభివృద్ధి-సంక్షేమ పథకాలను, ఇతర కార్యక్రమాలను, కొనసాగించే, లేదా, తాత్కాలికంగానో, శాస్వతంగానో స్వస్తి పలికే పద్ధతులు విభిన్నంగా ఉంటాయి. ఇవన్నీ, అధికారంలోకి వచ్చిన పార్టీ, దాని నాయకుడి  వ్యక్తిగత ప్రాధాన్యతల వల్ల స్పష్టంగా ప్రభావితమవుతాయి. ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం, పథకాల అమల్లో స్థిరత్వం, సంక్షేమ ఫలాలు అందుతాయన్న ప్రజల విశ్వాసం కొరకు, విధానాల, పథకాల కొనసాగింపు అభిలషణీయం. దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల, సామాజిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాల విషయంలో, చౌకబారు రాజకీయ ప్రాధాన్యతలకన్నా, శాస్త్రీయ పద్ధతిలో ‘విధాన సమీక్ష’ జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోవడం సముచితం. ప్రజాస్వామ్యాల్లో ప్రభుత్వం మారినప్పుడు, ఎన్నికల హామీలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి, దాని నాయకుడికి తప్పనిసరి. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల నుండి వీటికి సంబంధించిన ఉదాహరణలు మార్గదర్శకంగా వుంటాయి. 

‘ఉక్కు మహిళ’ గా పిలువబడ్డ కన్సర్వేటివ్ పార్టీ మార్గరెట్ థాచర్, బ్రిటన్ ప్రధానిగా తన 11 సంవత్సరాల పదవీకాలంలో, అమలుపరచిన (థాచరిజం) పిలువబడిన ఆర్థికసంస్కరణలను, ప్రపంచవ్యాప్తంగా ఆమోద యోగ్యమైన ప్రభుత్వరంగ సంస్కరణలను, ఆమె వారసుడు, లేబర్ పార్టీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, స్వల్ప మార్పులతో (థర్డ్ వే అప్రోచ్) కొనసాగించారు. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన మరో ప్రధాని డేవిడ్ కామెరాన్ శ్రీకారం చుట్టిన, యూరోపియన్ యూనియన్ నుండి యునైటెడ్ కింగ్‌డమ్ ఉపసంహరణకు సంబంధించిన ‘బ్రెగ్జిట్ రెఫరెండం,’ నాయకత్వాలు మారినప్పటికీ, ప్రధానులు థెరిసా మే, బోరిస్ జాన్సన్ లు కొనసాగించారు. 

అమెరికాలో, ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం, ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించబడి, బహుళ ప్రాచుర్యం పొందిన ‘ఫుడ్ కూపన్ కార్యక్రమం’ (ఇప్పటి ‘సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ కార్యక్రమం’) అనేకానేక విమర్శలను అధిగమించి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, మారుతున్న ఆర్థిక పరిస్థితుల, విధాన ప్రాధాన్యతలకు అనుగుణంగా కొనసాగుతూ, అమెరికన్ సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక మూలస్తంభంగా నిలిచి పోయింది. ‘ఒబామా సరసమైన ఆరోగ్య సంరక్షణ విధానం‘తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నప్పటికీ, ట్రంప్ పరిపాలనలో తగు సవరణలతో కొనసాగించడం జరిగింది. 

ఒకనాటి కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్‌లో, బోల్షవిక్ విప్లవ నాయకుడు, సోవియట్ యూనియన్‌ ఆవిర్భావానికి కారకుడు, లెనిన్‌ మహాశయుడిని, స్టాలిన్ విమర్శించడమే కాకుండా, సోవియట్ ఆర్థిక వ్యూహంలో గణనీయమైన సంస్కరణగా, భావజాలంగా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన, ఆయన ‘నూతన ఆర్ధిక విధానాన్ని’ వ్యతిరేకించాడు. కేంద్రికృత, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, శీఘ్ర పారిశ్రామికీకరణ, సమూహీకరణ పాలనకు స్టాలిన్ ప్రాధాన్యమిచ్చాడు. ‘డీస్టాలినైజేషన్’ లో భాగంగా, స్టాలిన్ అనుసరించిన వ్యక్తి పూజను ఖండించి, సోవియట్ విధానాలలో సరళీకృతకు ప్రాధాన్యం ఇచ్చాడు స్టాలిన వారసుడు కృశ్చేవ్.

భారతదేశం ప్రథమ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామికీకరణ, ప్రభుత్వ రంగసంస్థల ఆవిర్భావం, అలీనోద్యమాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. లాల్ బహదూర్ శాస్త్రి వాటిని కొనసాగిస్తూ, ‘హరిత విప్లవం’ నినాదంతో ఆహార ఉత్పత్తి పెరుగుదలకు బాటలు వేశారు. అవి కొనసాగిస్తూ, ఇందిరా గాంధీ, బాంకులను జాతీయం చేసింది. జనతాపార్టీ ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయి, ఇందిరాగాంధీ ‘ప్రాథమిక ఆర్థిక వ్యవస్థను’ కొనసాగించారు. ఐటి, టెలికాం విప్లవ విధానాలకు ఆద్యుడు రాజీవ్ గాంధీ, విపి సింగ్ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేశారు. పీవీ నరసింహారావు తన నవీన ‘ఆర్థిక సంస్కరణల’ ద్వారా, ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ దిశగా దేశాన్ని అభ్యుదయంలో నడపడం, నూతన పారిశ్రామిక విధానం ద్వారా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం భారీ విధాన మార్పు అనాలి.  అటల్ బిహారీ వాజ్ పేయి సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగించి, మౌలిక సదుపాయాలు, టెలికాం, బీమారంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగిస్తూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం తెచ్చారు. నరేంద్ర మోదీ సరళీకృత ఆర్ధిక విధానాలను, నరేగా పథకాన్ని కొనసాగించి, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ లను తీసుకు వచ్చారు.

విడిపోక ముందు, ఆ తరువాత కూడా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో, ఎన్ని మౌలిక విభేదాలున్నా, అత్యంత ప్రజాదరణ పొందిన 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ పథకం లాంటివి కొనసాగాయి. ‘వ్యూహాత్మక రాజకీయ నాయకులుగా, టీం వర్క్ కు ప్రాధాన్యం ఇస్తున్నవారిగా’ భావించే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఏపి సిఎం చంద్రబాబునాయుడు కూడా, ఇటు కేంద్రంలోనూ, అటు బ్రిటన్, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలలోనూ, పాటిస్తూ వస్తున్న ‘సత్సంప్రదాయాలకు’ అనుగుణంగా, ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించే గత ప్రభుత్వాల ‘పథకాల, విధానాల సమీక్ష, సవరణ, స్వస్తి’ అంశాలలో హేతుబద్ధత మృగ్యమవ్వడం సమంజసమా?! 

Wednesday, January 29, 2025

భాగవతంలో శివుడు : వనం జ్వాలా నరసింహారావు

 భాగవతంలో శివుడు 

వనం జ్వాలా నరసింహారావు

భక్తిపత్రిక (ఫిబ్రవరి, 2025) 

పోతన భాగవతంలో వివిధ సందర్భాలలో శివుడి ప్రస్తావన సందర్భోచితంగా, కనిపిస్తుంది. దక్షయజ్ఞాన్ని శివుడు ధ్వంసం చేయడం; త్రిపురాసుర సంహారం; క్షీరసాగర మథనంలో పాల సముద్ర్తం నుండి పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగడం; వృకాసురుడి శివద్రోహం; శివకేశవుల జీవాయుధ పోరాటం మొదలైనవి ముఖ్యమైనవి.  

బాణాసురుడి కథ అత్యంత కమనీయంగా ఉంటుంది భాగవతంలో. బలి చక్రవర్తి కుమారుడైన గొప్ప శివ భక్తుడు. అతడు కోరిన వరం ప్రకారం శివుడు అతడి కోట వాకిటి ముందు కావలిగా ఉన్నాడు. పరివారంతో సహా బాణుడి శోణపురానికి రక్షకుడయ్యాడు.  

బాణుడి కూతురు పేరు ఉష. ఒకరాత్రి నిద్రలో రుక్మిణీ, శ్రీకృష్ణుల మనుమడు, ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్ధుడిని ఆమె కలిసి సుఖించినట్లు కలకన్నది. అప్పటి నుంచి అతడి కోసం తపించ సాగింది. ఆమె బాధ చూడలేని స్నేహితురాలు చిత్రరేఖ అనిరుద్ధుడి చిత్రాన్ని వేసి చూపించగా గుర్తుపట్టింది ఉషాకన్య. చిత్రరేఖ తనకు తెలిసిన విద్యతో అతడి గురించిన వివరాలన్నీ సేకరించి, స్నేహితురాలికి చెప్పింది. అనిరుద్ధుడుని యోగమహిమతో ఎత్తుకుని వచ్చి, ఉషాకన్యతో కలిపింది. వారి ప్రేమకు చిహ్నంగా ఉషాకన్య గర్భం దాల్చింది. 

బాణాసురుడికి ఈ విషయం తెలిసింది. అనిరుద్ధుడిని నాగపాశంతో బంధించాడు. కారాగారంలో పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద సుడిగాలి వీచి బాణుడి విశాలమైన ధ్వజం కూలి నేలమీద పడింది. శివుడు తనకు చెప్పినట్లు తనకు సరైన జోడీతో యుద్ధం జరగ బోతున్నదని బాణుడు సంతోషించాడు. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణుడు బాణాసురుడి మీదికి దండయాత్రకు బయల్దేరాడు. యాదవ సైన్యం బాణుడి నగరాన్ని ధ్వంసం చేశారు. యుద్ధం మొదలైంది. నగరానికి రక్షకుడుగా వున్న పరమ శివుడు బాణుడికి సహాయంగా రణరంగానికి వెళ్లాడు. 

శివకేశవుల యుద్ధం 

శివుడు, కృష్ణుడు ఒకరితో మరొకరు తలపడ్డారు. కృష్ణుడి శౌర్యప్రతాపాలను శివుడు సహించలేకపోయాడు. బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు శివుడు. దాన్ని శ్రీకృష్ణుడు అద్భుతంగా ఉపశమింప చేశాడు. శివుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని పర్వతాస్త్రంతో తుంచి వేశాడు కృష్ణుడు. ఆగ్నేయాస్త్రాన్ని ఐంద్ర బాణంతో రూపుమాపాడు. మహేశ్వరుడు శ్రీకృష్ణుడి మీద పాశుపతాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. నారాయణాస్త్రాన్ని వేసి దాన్ని వెనుకకు మరలించాడు శ్రీకృష్ణుడు. ఉత్సాహాన్ని కోల్పోయిన శివుడి మీద సమ్మోహనాస్త్రాన్ని వదలడంతో ఆయన సోలిపోయాడు. 

తక్షణమే శ్రీకృష్ణుడు వీరవిహారం చేస్తూ బాణాసురుడి సమస్త సైన్యాన్ని పరిమార్చాడు. కృష్ణుడి అఖండ పరాక్రమానికి బాణాసురుడు భయపడి రాచనగరులోకి పారిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే శివ-కేశవుల మధ్య ‘జీవాయుథ యుద్ధం’ చోటు చేసుకుంది. మూడు తలలు, మూడు పాదాలు, భయంకరాకారం కలిగి, కోపావేశంతో ‘శివజ్వరం’ (శివుడి జీవాయుథం) కృష్ణుడి దగ్గరకు వచ్చింది. అలా వచ్చిన దాన్ని చూసిన కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు. వెంటనే (తన జీవాయుథమైన) ‘వైష్ణవజ్వరాన్ని’ ‘శివజ్వరం’ మీదికి ప్రయోగించాడు. ‘శివవైష్ణవ జ్వరాలు’ రెండూ తమ బలాన్ని, శక్తిని, శౌర్యాన్ని, ప్రతాపాన్నీ ప్రదర్శిస్తూ ఘోరంగా యుద్ధం చేశాయి. చివరకు వైష్ణవజ్వరం ముందు శైవజ్వరం ఓడిపోయింది. ప్రాణభీతి పట్టుకుని, శివజ్వరం, కృష్ణుడి పాదాలమీద పడి, అనేక విధాల స్తుతించి ‘నీవే శరణు నాకు’ అని వేడుకుంది. వైష్ణవజ్వరం దాన్ని బాధించదని శ్రీకృష్ణుడు చెప్పగానే శివజ్వరం పరమానందంతో పరమాత్ముడికి సాష్టాంగ నమస్కారం చేసి  వెళ్లిపోయింది.  

యజుర్వేదం ‘శివాయ విష్ణురూపాయ’ అనే మాట శివకేశవుల అభేదాన్ని తెలియచేస్తుంది. ‘శివ’ శబ్దానికి త్రిగుణాతీతుడు, శుభస్వరూపుడు అనే అర్థాలున్నాయి. ‘విష్ణు’ అంటే వ్యాపించినవాడు. త్రిగుణాతీతమైన, మంగళకరమైన ఈశ్వర చైతన్యం ‘శివుడు’ కాగా, విశ్వమంతా వ్యాపించితే ‘విష్ణువు’ అవుతుంది. అదే ‘శివాయ విష్ణురూపాయ’. శివకేశవులకు, ‘శివపురాణం, విష్ణుపురాణం’ అనే ప్రత్యేక పురాణాలు ఉన్నప్పటికీ వాటి అర్థం తెలుసుకుంటే భేదభావం కనిపించదు. భగవంతుడు కలహించడు. కలహం మతవాదుల మధ్యనే. ‘చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని’ అని అంటారు. చేతులారా శివుని పూజించి, నోటితో హరికీర్తన చేయమంటూ పోతన పద్యకవితలోని అంతరార్థం ఇదే. శివుడు శ్రీరామనామరసికుడు, విష్ణు వల్లభుడు. ఒకరినొకరు గౌరవించుకున్నారంటే అర్థం, ఒకరికంటే ఇంకొకరు తక్కువనీ, ఎక్కువనీ కాదు. ఇద్దరూ సమానమేననీ, లోక నిర్వహణ కోసం రెండుగా వ్యక్తమైన ఒకే తత్త్వమని అర్థం.     

పారిపోయిన బాణాసురుడు మళ్లీ కదన రంగానికి వచ్చాడు రెండో సారి. కృష్ణుడు సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు. అది బాణుడు వేయి చేతులలో నాలుగు మాత్రం మిగిల్చి మిగిలిన వాటన్నింటినీ నరికి వేసింది. అతడి మీద వాత్సల్యం వున్న పరమేశ్వరుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, ఆయన్ను స్తోత్రం చేశాడు. శివుడి ప్రియ భక్తుడైన బాణుడిని చంపడం లేదన్నాడు శ్రీకృష్ణుడు. బాణాసురుడు శోణపురానికి పోయి తన కుమార్తె ఉషాకన్యకు, అనిరుద్ధుడికి బంగారు ఆభరణాలు ఇచ్చి, తీసుకువచ్చి శ్రీకృష్ణుడికి అప్పగించాడు.  ఇదే ‘ఉషాపరిణయం’ నేపధ్యం. 

దక్షయజ్ఞ గాథ 

దక్ష ప్రజాపతి ఒక పర్యాయం, పెద్దలు నిర్వహిస్తున్న ఒక సత్రయాగం చూడడానికి దక్షుడు రాగా బ్రహ్మ, మహేశ్వరులు మినహా, సభాసదులందరూ మర్యాద పూర్వకంగా లేచి నిల్చున్నారు. దక్షుడు తనకు తండ్రైన బ్రహ్మకు నమస్కరించి, ఉచితాసనం మీద కూర్చున్నాడు. తనను చూసి ఆసనం మీద నుండి దిగని శివుడి వైపు కోపంగా చూస్తూ, అక్కడున్న దేవతలను, ఇతరులను ఉద్దేశించి శివుడిని పరిపరి విధాల దూషించాడు. శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అతడిని శపిస్తానని జలాన్ని స్వీకరించాడు. 

కోపంతో దక్షుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. దక్షుడికి, ఈశ్వరుడికి మధ్య పరస్పర విరోధం కొనసాగింది. ఈ నేపధ్యంలో రుద్రహీనమైన ‘వాజపేయం’ అనే యజ్ఞాన్ని చేసిన దక్షుడు, ‘బృహస్పతి సవనం’ అనే యజ్ఞం చేయడానికి ఉపక్రమించాడు. ఇది తెలుసుకున్న ఈశ్వరుడి భార్య సతీదేవి తామిద్దరం కూడా వెళ్దామని భర్తతో అన్నది. సత్రయాగంలో జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ శివుడు, వద్దని వారించాడు. ఒకవేళ ఆమె వెళ్లితే, పరాభవం కలుగుతుందని హెచ్చరించాడు. తండ్రిని చూడాలన్న కోరికతో సతీదేవి పుట్టింటికి వెళ్లింది. యజ్ఞశాల దగ్గర తల్లి, తోబుట్టువులు తప్ప మిగిలిన వారెవ్వరూ పలకరించలేదు. 

తండ్రి పలకరించనందుకు మౌనంగా వుండిపోయిందామె. తండ్రి అనాదరణకు గురైన ఆమె బాధను చూసి, కోపంతో, భూత గణాలు ఆవేశపడ్డాయి. దక్షుడిని హతమారుస్తామంటూ లేచిన గణాలను సతీదేవి వారించింది. తన రోషాన్ని వ్యక్తం చేస్తూ, దుష్టబుద్ధితో ఈశ్వరుడిని నిందించిన దక్షుడి వల్ల సంప్రాప్తించిన తన శరీరాన్ని విడిచి పరిశుద్ధురాలినవుతానని అన్నది. యజ్ఞసభా మధ్యలో నిలబడి, శరీర త్యాగం చెయ్యాలని భావించింది. యోగాగ్నిని రగుల్కొలిపి, అగ్నిలో ఆ క్షణమే దగ్ధమైపోయింది సతీదేవి. 

శివుడికి పట్టరాని కోపం వచ్చి, జటాజూటం నుండి ఒక జడను పెరికి భూమ్మీద విసిరికొట్టాడు. అందులోనుండి వీరభద్రుడు రుద్రుడి ప్రతిబింబంలాగా ఉద్భవించాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, దక్షుడిని సంహరించమని చెప్పాడు శివుడు. ఆయన యజ్ఞవాటికకు చేరుతుంటే, భయంకరమైన కారుచీకటి కమ్మింది. ధూళి పుట్టింది. ప్రభంజనం వీచింది. వీరభద్రుడు సాటిలేని మహాదర్పంతో చెలరేగి దక్షుడిని పడతోసి, కంఠాన్ని నులిమి, శిరస్సును తుంచి, మహాకోపంతో దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఇలా వీరభద్రుడు శివుడి ఆజ్ఞానుసారం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి కైలాసానికి వెళ్లిపోయాడు.

ఇదంతా దేవతలు బ్రహ్మదేవుడికి చెప్పి ఆయనకు మొరపెట్టుకున్నారు. వారంతా కలిసి కైలాసాన్ని దర్శించారు. ధర్భాసనం మీద కూర్చున్న ఈశ్వరుడిని చూశారు. ‘యజ్ఞభాగాన్ని పొందే అర్హతగల నీకు యజ్ఞభాగాన్ని సమర్పించక పోవడం వల్ల, నీవల్ల ధ్వంసం చేయబడి, అసంపూర్ణంగా మిగిలిపోయిన ఈ దక్షుడి యాగాన్ని మళ్లీ ఉద్ధరించి, దక్షుడిని పునఃజీవితుడిని చెయ్యాలని ప్రార్థన. మిగిలిన యజ్ఞాన్ని పరిపూర్తి చేసి ఈ యాగాన్ని నీ యజ్ఞ భాగంగా స్వీకరించు’ అని వేడుకున్నారు. 

ఇంద్రాది దేవతలు, ఋషులు వెంటరాగా బ్రహ్మ దేవుడు రుద్రుడిని తీసుకుని దక్షయజ్ఞ వాటికకు వచ్చాడు. దక్షుడిని గొర్రెతల వాడిగా చేయడంతో, అతడు నిద్ర నుండి లేచినవాడిలాగా లేచి సంతోషించాడు. రుద్రుడిని ద్వేషించడం వల్ల కలిగిన పాపాల నుండి విముక్తి పొందాడు. శివుడిని స్తుతించాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. యజ్ఞకార్యాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. యజ్ఞపరిసమాప్తి అవుతుంటే, శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. రుద్రుడు ఆటంకపరచిన దక్షుడి యజ్ఞాన్ని శ్రీహరి పూర్తి చేశాడు. దక్షుడిని చూసి తాను తృప్తి చెందానని అన్నాడు. దక్షుడు శ్రీహరిని పూజించాడు. సతీదేవి పూర్వదేహాన్ని వదిలి, హిమవంతుడి పుత్రికగా మేనకకు జన్మించి, ఈశ్వరుడిని వరించింది. 

Monday, January 27, 2025

LA Fires Akin to ‘Khandava Dahana’ : Vanam Jwala Narasimha Rao

 LA Fires Akin to ‘Khandava Dahana’ 

FOR NOW, THE ANSWER TO WHAT CAUSED 

LOS ANGELES WILDFIRES IS ELUSIVE

Vanam Jwala Narasimha Rao

The Hans India (28-01-2025)

{According to Mahabharata, the Vast Forest ‘Khandava’ inhabited by many creatures as well as ‘Maya, the Architect of the Demons’ was set on fire deliberately through ‘Fire God Agni’ who was ‘Hungry for the Forest’ due to a curse, by Arjuna and Krishna, with the divine purpose and mission of clearing forest land. It was part of a cosmic plan that led to the destruction of the forest, but simultaneously cleared the land for creation of ‘Maya City.’}-Editor Note

The ‘Los Angeles wildfires’ raging from January 7, 2025 or named as ‘Hughes Fire’ later, resulted in 28 fatalities, destruction of structures, and displacement of about ‘Two Lakhs People’ directly or indirectly, may be symbolically, with significant differences compared to the ‘Mythological Story Khandava (Fire) Dahana.’ The massive catastrophic fire affecting large portion of Khandava Forest represented ‘End of one Era and Beginning of Another’ as part of Destruction and Creation Cycle as mentioned in ‘Great Literature Mahabharata.’ The process involved divine powers. Likewise, ‘Modern Wildfires’ lead to ecological recovery, and tend to be more destructive without the accompanying divine or purposeful creation. Both events highlight the ‘Power of Fire’ as a force. 

In the ‘Los Angeles wildfires’ several famous Hollywood Celebrities lost their priceless homes in the ‘Pacific Palisades Area’ which is their favored location. The Palisades and Eaton fires burned more than 23,700 acres and 14,100 acres respectively. Los Angeles Home, where ‘The Doors Guitarist Robby Krieger’ penned the Band’s Hit Song, intoxicating rock single ‘Light My Fire’ was destroyed. Significant landmarks, including the J Paul Getty Museum and University of California were damaged. 

Wildfires are driven by a combination of natural and human-induced factors. Global Warming causing Rising Temperatures; Prolonged Droughts turning it into highly flammable fuel; Heatwaves and Reduced Rainfall susceptible to ignition; Strong Hot and Dry Winds that spread wildfires; Windborne Sparks causing new fires in unburned areas; Overgrown Forests increasing fire intensity; Flammable Plant Species: Wildland-Urban Interface; Untold Human and Natural Causes; Lightning as an ignition source; Constructions in high-risk fire zones; Terrain causing spread of Fires faster; Narrow Canyons and Valleys etc. are among them.

Satellites, drones, and fire tracking technologies allow for better monitoring and predicting of wildfire risks. However, meteorologists may not be able to predict the precise timing of the break of wildfires, and path of a fire, which is an annual occurrence in California, especially during the dry summer and fall months. This is partly due to the complexity of weather and terrain factors. This time, the scale and intensity of the fires were exacerbated beyond prediction. Strong, unpredictable winds caused fires to spread much faster than anticipated. 

The ‘Crisis Management’ during the Los Angeles wildfire required a comprehensive approach, involving ‘State and Federal Government Agencies’ which jumped in to action through ‘Immediate Firefighting Efforts.’ Thousands of firefighters comprising specialized teams were deployed, to take situation under control. State of emergency was declared. National Guard was deployed and ‘Evacuation Shelters’ were established. Hundreds of Federal Personnel and Aircraft pressed in to service to support firefighting efforts, which however, were significantly hampered by water shortages due to century old pipelines. Fire hydrants ran dry, forcing firefighters to rely heavily on aerial water drops. Relief centers provided every temporary support.  

‘Mandatory Evacuation Orders’ were issued promptly to protect residents. Wireless Emergency Alert system, Social Media, and Local Broadcasts to issue real-time updates were pressed in to action. ‘Preventive Power Shutoffs’ to reduce risk of electrical equipment sparking new fires was done. ‘Major Disaster Declaration’ was made enabling ‘Federal Emergency Management Agency (FEMA)’ assistance. ‘National Interagency Fire Center (NIFC)’ coordinated firefighting efforts across state. ‘Environmental Protection Agency (EPA)’ monitored Hazardous Air Quality that was causing respiratory and cardiovascular problems. Severe air pollution, smoke and ash blanketed large areas of Los Angeles. 

Social and Non-Governmental Organizations (NGOs) played a crucial role in wildfire response, relief, and recovery. Their involvement ranged from immediate relief efforts (shelters, food, and water) to mental health support, animal rescue, advocacy, and rebuilding efforts. Limited resources, communication gaps, and uneven recovery highlighted the need for better coordination between NGOs, government agencies, and local communities. American Red Cross and other local (California) Volunteers provided critical disaster relief services during the wildfires. 

According to Mahabharata, the Vast Forest ‘Khandava’ inhabited by many creatures as well as ‘Maya, the Architect of the Demons’ was set on fire deliberately through ‘Fire God Agni’ who was ‘Hungry for the Forest’ due to a curse, by Arjuna and Krishna, with the divine purpose and mission of clearing forest land. It was part of a cosmic plan that led to the destruction of the forest, but simultaneously cleared the land for creation of ‘Maya City.’ This symbolized transformation of the environment, where destruction eventually paved way to construction. 

Modern wildfires, like those in California, do not have the divine or purposeful elements of Khandava Dahana, though there are symbolic parallels. Much like the destruction of Khandava, modern wildfires can devastate forests, wildlife, and human settlements. In both cases, life is lost, and the landscape is dramatically altered. Just as the burning of Khandava led to the creation of new city, Post-fire recovery of modern wildfires can lead to new development and an eventual return of wildlife, and sometimes may result in ecological transformation, and eventually coming up of a new city. However, the land can also face long-term challenges like soil erosion or loss of biodiversity. 

In the ultimate analysis, in the Mahabharata’s Khandava Dahana, the fire was part of a larger moral and ethical battle, with the heroes (Krishna and Arjuna) being part of a divine plan. Modern Wildfires invariably lead to human suffering, loss of property, and environmental damage. They are typically seen in the context of disaster management rather than cosmic or divine action. Praying to Hindu Gods for total normalcy or recovery from wildfires, which is deeply spiritual and cultural, and which many people in ‘Hindu Traditions’ find meaningful, could be an answer for early salvage. 

In Hinduism, there are specific prayers and rituals that may be offered to seek divine intervention for protection, recovery, and restoration of normalcy. These include Prayers to Lord Agni, Maha Mrityunjay Mantras, and Prayers to Protectors like Goddess Durga or Lord Shiva etc. While spiritual prayers and rituals offer important emotional and cultural support, bringing about long-term restoration may also require ‘Pragmatic Disaster Management.’ Combination of ‘Spiritual Resilience and Scientific Action’ ensures not only the recovery of affected communities but also the prevention of future wildfires. Ultimately, addressing the wildfire crisis requires multi-faceted and multipronged approach, balancing ‘Spiritual Support, Governmental Action, Community Efforts, and Environmental Sustainability’ to rebuild and prepare for a future where such wildfires are less devastating.

Authorities investigating the cause of the fire revealed that, the Palisades wildfire had inadvertent ‘Human Origins’ as a ‘Likely Cause’ which was started by someone. According to New York Times, Palisades fire ignited near a ‘Hiking Trail’ and an area that had burned six days earlier. A ‘Red Flame Retardant’ was dropped from overhead to battle the blaze and smoke billowing from all sides of the scar. The area known as ‘Skull Rock on the Temescal Ridge Trail’ is popular with hikers as a hangout by local teens. Officials are investigating whether that fire could have had any connection. For now, the answer to what caused Los Angeles Wildfire is elusive. 

At least two law suits have been filed against Southern California Edison Power Company, on the speculation that faulty power lines may have sparked the Eaton Fire. Meanwhile, 31000 flee as new blaze threatened Los Angeles County, and thus the Fire-weary southern California is in crisis again in the face of another fast-moving wildfire and the threat of mudslides. A new wildfire, the ‘Hughes Fire’ named so, erupted on January 22 morning in the rugged mountains north of Los Angeles, rapidly spreading through dry vegetation and sending thick plumes of smoke into the sky, as per a Reuters report. Firefighters have halted the spread of this ‘Hughes Fire’ which rapidly burned over 10000 acres and led to 31000 evacuations. Containment has increased to 24%. Relief Package worth 2.5 Billion Dollars is being used to handle the crisis.

(Sources: USA Media Reports and Mahabharata)

Sunday, January 26, 2025

యోగీశ్వరుడైన భరతుడి తత్త్వజ్ఞానోపదేశం ..... శ్రీ మహాభాగవత కథ-20 : వనం జ్వాలా నరసింహారావు

 యోగీశ్వరుడైన భరతుడి తత్త్వజ్ఞానోపదేశం 

శ్రీ మహాభాగవత కథ-20

వనం జ్వాలా నరసింహారావు 

సూర్యదినపత్రిక (27-01-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

ఋషభుడి అనంతరం ఆయన పెద్ద కుమారుడైన భరతుడు ఈ భూమండలానికి రాజయ్యాడు. విశ్వరూపుడి కుమార్తె పంచజని అనే కన్యను వివాహమాడాడు. వారికి సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే ఐదుగురు, అహంకారం నుండి పంచతన్మాత్రలు జన్మించిన విధంగా పుట్టారు. గతంలో అజనాభం అని పిలవబడే ఈ భూభాగం భరతుడు పాలించడం మొదలైన తరువాత ’భరత వర్షం’ అన్న పేరు సార్థకమైంది. భరతుడి పాలనను దేవతలు సహితం మెచ్చుకున్నారు. ఆయన ఎన్నో యజ్ఞాలను, పూజలను ఆచరించాడు. యజ్ఞకర్మలను ఆచరిస్తూనే రాజ్యపాలనలో గొప్ప ఖ్యాతి గడించాడు భరతుడు. పవిత్రమైన అంతఃకరణతో, పవిత్ర చిత్తంతో, ఆ రాకుమారుడు ధర్మనిష్టతో ఈ భూమిని పరిపాలించాడు. ఇలా ఏభైలక్షల వేల సంవత్సరాలపాటు భరతుడు రాజ్యాన్ని పాలించాడు. తండ్రి-తాతల ఆస్తైన రాజ్యాన్ని అర్హతకు తగ్గ విధంగా కొడుకులకు పంచాడు. తరువాత పులహాశ్రమ సమీపంలో గందకీ నది దగ్గర, ఇంద్రియ నిగ్రహంతో, భరతుడు విష్ణువును సేవించేవాడు. పూర్తిగా భక్తిలో మునిగి పరమేశ్వరుడిని హిరణ్మయమూర్తిగా తలుస్తూ స్తుతించేవాడు అనేక విధాలుగా.   

ఒకనాడు భరతుడు ఆ మహానదీతీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు, గర్భిణైన ఒక లేడి నీరుతాగుతుండగా ఒక సింహం దాన్ని చూసి గర్జించింది. భయంతో లేడి గర్భం విచ్చిన్నమై, కడుపులో వున్న పిల్ల జారి నీళ్లలో పడిపోయింది. తల్లి చనిపోయింది. నీళ్లలో జారి, ప్రవాహంలో తేలుతున్న లేడిపిల్లను భరతుడు చూశాడు. దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. దాన్ని పెంచుతూ, దానిమీద మమకారాన్ని కూడా పెంచుకున్నాడు. చివరకు పరమేశ్వరుడిని కూడా మర్చిపోయాడు. ఆత్మలో యోగనిష్టకు బదులు లేడిపిల్లమీద ప్రేమ స్థిరపడిపోయింది. దానితో ఆటపాటలతోనే జీవితం గడిచిపోయేది. ఒకనాడు ఆ లేడిపిల్ల ఎటో పారిపోయింది. రాజర్షయిన భరతుడు మనస్సులో దానికోసం ఆరాటపడ్డాడు. దాని కారణంగా బహువిధాల కోరికలతో సతమతమయ్యాడు. భగవత్ ధ్యాస మానేశాడు. అతడికి దానిమీద మోహం మరింత తీవ్రమైంది. 

ఇలా వుండగా, భరతుడికి అవసానదశ వచ్చింది. లేడిపిల్లనే ఆత్మలో నిలుపుకుని దేహాన్ని విడిచి పెట్టాడు. ఆ కారణాన, గతస్మృతితో, ఒక లేడి గర్భంలో పడి లేడిపిల్లగా జన్మించాడు. తానెందుకు లేడిపిల్లగా పుట్టాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నాడు. శ్రీహరినే అనునిత్యం ధ్యానం చేస్తూ, పులహాశ్రమానికి వచ్చి, చక్రనదీ తీర్థంలో స్నానం చేస్తూ, అవసాన సమయం కోసం ఎదురు చూస్తూ, చివరకు లేడి శరీరాన్ని విడిచి పెట్టాడు. ఆ తరువాత అంగిరసుడి వంశంలోని  ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మించాడు. ఎల్లప్పుడూ శ్రీహరి పాదాలనే ధ్యానం చేసుకునేవాడు. 

అంగిరసుడికి ఇద్దరు భార్యలు. ఆయనది పరిశుద్ధ స్వభావమే. స్వాధ్యాయ అధ్యయనపరుడు. మొదటి భార్యకు తొమ్మిదిమంది కొడుకులున్నారు. చిన్నభార్యకు ఇతడు కాక ఇంకొక ఆడపిల్ల పుట్టారు. భరతుడికి పూర్వజన్మ జ్ఞాపకం వుండేది. భరతుడు తండ్రి చెప్పడం వల్ల గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. వేదాలను అధ్యయనం చేశాడు. అంగిరసుడు చనిపోయిన తరువాత తల్లి ఆయనతో సహగమనం చెసింది. సవతి తల్లి కొడుకులు ఇతడిని వేదాద్యయనం చెయ్యనీయకుండా ఇంటి పనులకు నియమించారు. వారు చెప్పిన పనులు చేస్తూ, వాళ్ల బరువులు మోస్తూ, కూలిపని చేస్తూ, బిచ్చమెత్తుకునేవాడు. మాసిన గుడ్దలు కట్టుకునేవాడు. అతడి యజ్ఞోపవీతాన్ని చూసి ఇతడెవరో పిచ్చివాడనుకునే వారు. అలా కాలం గడిపేవాడు.     

ఒకనాడు ఒక శూద్రజాతి నాయకుడు తనకు సంతానం కలగడానికి కాళికాదేవికి బలి ఇవ్వడానికి ఒకడిని పట్టుకుని తీసుకుపోతున్నారు. వాడు వీళ్లనుండి తప్పించుకుని పారిపోగా, అతడిని వెతుకుతుంటే, భరతుడు దొరికాడు. పారిపోయినవాడి స్థానంలో ఇతడిని బలి ఇవ్వడానికి నిశ్చయించుకుని దానికి అవసరమైన సంస్కారాలు చేసారు భరతుడికి. కాళికాదేవి ఎదుటికి తెచ్చి కూచోబెట్టారు. ఆ సమయంలో ఈ బ్రాహ్మణ బాలుడి తేజస్సు సాక్షాత్తు కాళికాదేవినే ఆశ్చరపరిచింది, భయం కొలిపింది. హుంకారం చేసి బలివ్వాలనుకున్న శూద్రనాయకుడిని బలి తీసుకుంది. భరతుడు ఇదేమీ పట్టనట్లు వాసుదేవుడిని హృదయంలో స్మరిస్తూ నిర్వికారంగా వున్నాడు. తరువాత భరతుడు ఆలయం నుండి బయటకొచ్చి ఎప్పటిలాగే చేనుకు కాపలా కాయసాగాడు.   

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇదిలా వుండగా, సింధు దేశాన్ని పాలిస్తున్న రహుగణుడనే రాజు కపిల మహర్షి దగ్గర నుండి తత్త్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న కోరికతో ఒకనాడు రాచఠీవితో పల్లకి ఎక్కి బయల్దేరాడు. పల్లకి బోయీలలో ఒకడు సరిగ్గా నడవలేకపోవడంతో వాడి స్థానంలో దారిలో కనిపించిన భరతుడికి ఆపని ఆప్పగించారు. ఏమాత్రం చింతపడకుండా పల్లకిని మోయసాగాడు భరతుడు. అలవాటు లేనందున అతడు మోస్తుంటే పల్లకి కుదుపులకు లోనైంది. రహుగణుడికి భరతుడి మీద కోపం వచ్చింది. నిష్టూరంగా అతడిని మందలిస్తూ వేళాకోళంగా మాట్లాడాడు. భరతుడు మాత్రం జవాబివ్వకుందా పల్లకి మోయసాగాడు. అతడికి అహంకార మమకారాలు లేవు తన శరీరం మీద. సాక్షాత్తు పరబ్రహ్మం మీదే చూపు కలిగి అప్పగించిన పని చేస్తున్నాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. తన ఆజ్ఞ పాటించకుండా తప్పుగా నడుస్తున్న వాడిని సరిగ్గా నడిపిస్తానని రాజు గర్వంతో, హద్దూ-అదుపూ లేకుండా మాట్లాడ సాగాడు. 

బ్రాహ్మణుడీ (భరతుడు) మాటలను విన్నాడు. జవాబుగా: "రాజా! బరువు ఈ శరీరానికి కాని నాకు కలగదు. ఆకలిదప్పులు, మనోవ్యాధులు, మమకారం, అహంకారం, రోగాలు, రోషం....ఇత్యాదులు శరీరంతో పుట్టేవేకాని నాకు ఏర్పడేవి కావు. అందరూ జీవన్మృతులే. బంధాలన్నీ శరీరానికి వుంటాయి కానీ జీవుడికి వుండవు. జడునిలా వుంటూ బ్రహ్మాత్మస్వభావంతో వున్న నామీద నువ్వు విధించే శిక్షవల్ల ఏం లాభం చేకూరుతుంది? నేను శరీరభావం లేని స్తబ్దుడిని, మత్తుడిని. అలాంటి నాకు నువ్వు విధించే శిక్ష వ్యర్థం", అని, ఇలా ఏవేవో ప్రాపంచిక విషయాలు చెప్పసాగాడు. రహుగణుడు ఈ మాటలను విన్నాడు. కపిలముని దగ్గరికి తత్త్వ జ్ఞానం కోసం పోతున్న అతడికి భరతుడి మాటలు హృదయగ్రంథిని విడదీశాయి. వెంటనే రాజు పల్లకి లోనుండి దిగాడు. భరతుడికి సాష్టాంగదండ ప్రమాణం చేశాడు. గర్వాన్ని విడిచి, చేతులు జోడించి ఆయనెవరని అడిగాడు. ఆయనే కపిల మునీంద్రుడా అని ప్రశ్నించాడు. జవాబుగా భరతుడనే ఆ బ్రాహ్మణుడు, ఈ సంసారం ఒక ఘటం లాంటిదనీ, దానికి శిక్షణను, రక్షణను కలిగించేవాడు రాజనీ, అతడు చెడు కర్మలను మాని వాసుదేవుడిని సేవిస్తే మళ్లీ జన్మ ఎత్తకుండా, సంసారంలో చిక్కకుండా వుంటాడనీ అన్నాడు. 

భరతుడి మాటలు విన్నాక రహుగణుడిలో మార్పు వచ్చింది. అతడిని వినయంతో ప్రస్తుతించాడు. తను రాజుననే దురభిమానంతో గుడ్డిగా ప్రవర్తించాననీ క్షమించమనీ అన్నాడు. తనకు తెలిస్న తత్త్వాన్ని మరికొంత బోధించాడు భరతుడు. అతడు కారణజన్ముడని, నిత్యమూ పరమాత్మానుభవంలోనే వున్నవాడని,  అనుభవ విహారి అని, సాటిలేని పరమ శాంతిని పొంది వున్నాడని, మహాజ్ఞానియైన ఆయనకు మళ్లీ-మళ్లీ నమస్కరిస్తున్నానని అన్నాడు రాజు రహుగణుడు. తన సంశయాలన్నింటినీ భరతుడిని అడిగి నివృత్తి చేసుకోవలనుకుంటున్నానని, ఆధ్యాత్మయోగాన్ని తనకు యోగ్యమైన పద్ధతిలో చెప్పమని అడిగాడు. జవాబుగా పరమార్థమై జ్ఞానరూపమైనట్టి పరబ్రహ్మమొక్కటే సత్యమైనదని, జగత్తు అసత్యమైనదని, పరమ భాగవతుల పాదసేవ చేయడం వల్ల బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందని, మహాభాగవతులను సేవిస్తే మోక్షసాధనకు పద్మాక్షుడైన శ్రీహరి మీదే మనస్సు నిలిచి వుంటుందని చెప్పాడు భరతుడు. తన పూర్వజన్మల గురించి, అలా ఎత్తడానికి కారణం గురించీ చెప్పాడు. రాజుకు సంసారమనే అడవి తీరు ఎలా వుంటుందో వివరించాడు. రాజు అనే భావాన్ని విడిచి, సకల చరాచర ప్రపంచంతో స్నేహితుడిగా వుండమనీ, ఇంద్రియాలను జయించమనీ, జ్ఞానం అనే ఖడ్గంతో మాయా పాశాన్ని తెగనరికి జీవిత గమ్యస్థానాన్ని చేరుకోమనీ బోధించాడు. అలా యోగీశ్వరుడైన భరతుడు రాజుమీద కరుణతో తత్త్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆయన బోధనలు విన్న రాజు ఆయనకు తనివితీరా నమస్కరించాడు. రాజు నమస్కారాన్ని అందుకుని భరతుడు దయ కలిగిన మనస్సుతో భూమ్మీద సంచరించాడు.          

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 

Thursday, January 23, 2025

లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ : వనం జ్వాలా నరసింహారావు

 లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ దినపత్రిక (24-01-2025)

2025 జనవరి 7 నుండి ప్రారంభమైన ‘లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ’ 24 మంది ప్రాణాలు కోల్పోవడానికి, అనేక భవనాలు ధ్వంసమవ్వడానికి, సుమారు రెండు లక్షల మంది వారి నివాసాల నుండి ఖాళీ చేయడం లేదా ఖాళీ చేయించమని హెచ్చరికలు అందుకోవడానికి కారణమైంది. బహుశా ఈ దావాగ్నిని మహాభారత ఇతిహాసంలోని ఖాండవ దహన కథతో సమీపంగా పోల్చవచ్చునేమో! ఖాండవ దహనం కథలో చోటుచేసుకున్న ‘విధ్వంసం’ సృష్టి ఆదిమధ్యాంతాలను ప్రతిబింబిస్తుంది. ద్వాపర యుగాంత ఆరంభానికి, కలియుగ మొదలుకాబోవడానికి సంకేతమని భావించవచ్చు. మహాకావ్యం మహాభారతంలో, ఖాండవ అరణ్యం భగవత్సరూపులుగా ప్రసిద్ధికెక్కిన శ్రీకృష్ణార్జున శక్తి-యుక్తులతో అగ్నికి ఆహుతైనట్లు వివరించడం జరిగింది. మానవుల అలక్ష్యం కారణానో, మెరుపుల దాటికో, లేదా అగ్ని పర్వతాల ప్రభావం వల్లో, అడవులలో సంభవించి, అతి త్వరగా వ్యాపించే ఆధునిక దావాగ్నుల ప్రమాదాలలో ఒకటైన ‘లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ’ కూడా ఖాండవ దహన విధ్వంసంలాంటి ప్రభావాన్ని చూపించాయి. రెండింటిలోనూ ‘అగ్ని (దేవత) శక్తి’ మార్పుకు సంకేతం. 

లాస్ ఏంజెల్స్ అగ్నికాండలో హాలీవుడ్ ప్రముఖులు అంతోనీ హాప్కిన్స్, బిల్లీ క్రిస్టల్, పారిస్ హిల్టన్, జెఫ్ బ్రిడ్జెస్, మండీ మూర్, మిలో వెంటిమిగ్లియా, టీనా నోల్స్ తదితరుల విలువకట్టలేని గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. చిత్ర పరిశ్రమకు ప్రీతిపాత్రమైన ‘పసిఫిక్ ప్యాలిసేడ్’ ప్రాంతంలో దావాగ్ని ఉధృతంగా కొనసాగింది. ప్యాలిసేడ్ ప్రాంతంలో 23,700 ఎకరాలు, ఈటన్ ప్రాంతంలో 14,100 ఎకరాల పైగా భూభాగం దగ్ధమైంది. ‘ది డోర్స్’ బ్యాండ్‌కు చెందిన ప్రముఖ గిటారిస్ట్ రాబీ క్రీగర్ తన బృందానికి హిట్ సాంగ్ ‘లైట్ మై ఫైర్’ను రాసిన లాస్ ఏంజెల్స్ నివాసం కూడా అగ్నికి బలైంది. జెపాల్ గెట్టి మ్యూజియం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ ప్రదేశాలు ఈ అగ్నిప్రమాదంలో నష్టపోయాయి.

అడవి అగ్నిప్రమాదాలు సాధారణంగా ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల సంభవిస్తాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, దీర్ఘకాలిక వర్షాభావం వల్ల అడవులు అగ్ని ప్రమాదానికి గురయ్యేలా మారడం, ఎండల వల్ల తేమ తగ్గడం, వేడి-పొడిబారిన గాలులు అగ్నిని వేగంగా వ్యాపింపజేయడం, మళ్లీ మళ్లీ చెలరేగే అగ్ని చినుకులతో కొత్త ప్రాంతాల్లో మంటలు రావడం, దట్టమైన అడవులు అగ్ని తీవ్రతను పెంచడం, ప్రాణాంతకమైన కొన్ని అటవీ మొక్కలు, పర్వత ప్రాంతాలు మంట వ్యాప్తికి కారణమవుతాయి.

దురదృష్టవశాత్తూ, కాలిఫోర్నియాలో ప్రతీఏటా వేసవి, శరదృతువులలో అగ్నిప్రమాదాలు సాధారణంగా సంభవించినప్పటికీ, వాతావరణ శాస్త్రవేత్తలు వాటిని ముందుగా అంచనా వేయడం సాధ్యపడడం లేదు. ఉపగ్రహాలు, డ్రోన్లు, అగ్ని ట్రాకింగ్ సాంకేతికతలు ఉన్నప్పటికీ, దావాగ్నిప్రమాదం ఏ సమయంలో, ఎక్కడ విస్తరిస్తుందో, ఎలా ముంచుకొస్తున్నదో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఈసారి ప్రబల గాలులు అగ్ని వేగాన్ని ఊహించలేనంతగా పెంచాయి. లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదాన్ని నివారించేందుకు సమగ్ర చర్యలు అవసరం. అలాగే ఇప్పుడు సంభవించిన లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదంలో ‘సంక్షోభ నిర్వహణ’ అత్యంత అవశ్యం. 

ఇదే జరుగుతున్నది ఇప్పుడక్కడ. లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాద నేపధ్యంలో ‘రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు’ త్వరితగతిన స్పందించి ‘తక్షణ అగ్నిమాపక చర్యలు’ చేపట్టాయి. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది, ప్రత్యేక బృందాలతో కలిసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో పాటు, నేషనల్ గార్డ్‌ను మోహరించి, ‘సరయిన సురక్షిత స్థలాలను’ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా నిబద్ధతగల ఫెడరల్ అగ్నిమాపక సిబ్బంది విమానాలను కూడా రక్షణ చర్యలకు వినియోగించారు. అయితే, శతాబ్దం నాటి పాత పైపులైన్‌ల వల్ల నీటి కొరత తలెత్తింది. ఫైర్ హైడ్రెంట్లు నీటికొరతవల్ల వృధా కాగా, అగ్నిమాపక దళాలు ప్రధానంగా గగనతల నీటి వర్షంపై ఆధారపడాల్సి వచ్చింది. సహాయ కేంద్రాలు అవసరమైన అన్ని తాత్కాలిక సదుపాయాలను కల్పించాయి. 

ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ‘తక్షణ ఖాళీ చేయించాల్సిన ఉత్తర్వులు’ (Mandatory Evacuation Orders) జారీ చేసింది. వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్, సామాజిక మాధ్యమాలు, స్థానిక ప్రసార సంస్థలు సరైన  సమయంలో క్షణ-క్షణం చోటుచేసుకున్న సమాచారాన్ని అందించేందుకు వినియోగించబడ్డాయి. కొత్త అగ్నిప్రమాదాలను నివారించేందుకు ‘ముందస్తు విద్యుత్ సరఫరా నిలిపివేతలు’ చేపట్టారు. కాలిఫోర్నియాను ‘ప్రధాన విపత్తు ప్రాంతంగా ప్రకటించాలి’ అనే అభ్యర్థనను ఫెడరల్ ప్రభుత్వం ఆమోదించింది. తద్వారా ‘ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA)’ సహాయం అందుబాటులోకి వచ్చింది. ‘నేషనల్ ఇంటర్ ఏజెన్సీ ఫైర్ సెంటర్ (NIFC)’ వివిధ రాష్ట్రాలలో అగ్నిమాపక చర్యలను సమన్వయం చేసింది. ‘పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA)’ వాయు నాణ్యతను పర్యవేక్షించింది. అయితే, అధిక కాలుష్యం, పొగ, బూడిద, లాస్ ఏంజెల్స్ అంతటా వ్యాపించి, ప్రజల్లో శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారి తీసింది. 

లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో అగ్నిప్రమాద నివారణ, సహాయ కార్యక్రమాలు, పునరావాసంలో సామాజిక, స్వచ్ఛంద సంస్థలు (NGOs) కీలక భూమిక పోషించాయి. తక్షణ సాయంగా తిండి, నీరు, ఆశ్రయం కల్పించడం, మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడం, జంతు రక్షణ, పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. అయితే, పరిమిత వనరులు, సమాచార లోపాలు, సమగ్ర సమన్వయం లోపించడం వంటి సవాళ్లు ముందుకొచ్చాయి. ‘అమెరికన్ రెడ్ క్రాస్, కాలిఫోర్నియా వాలంటీర్స్’ వంటి స్వచ్ఛంద సంస్థలు అత్యవసర సహాయ సేవలను అందించాయి.

ఈ నేపధ్యంలో మరొక్కమారు ఖాండవ దహనం, దాని విధ్వంసం ద్వారా సృష్టి ఆరంభ, అంతాలు చోటుచేసుకున్న వివరాలు ఆసక్తికరంగా వుంటాయి. అధిక సంఖ్యలో లక్షలాది జీవుల నివాసంగా ఉన్న ఖాండవ అరణ్యాన్ని, ‘దానవుల శిల్పి మాయ’ నివాసంగా ఉన్న దాన్ని, అర్జునుడు, శ్రీకృష్ణుడు ‘అగ్ని దేవుడి’ సహాయంతో సదుద్దేశంతో తగలబెట్టారు. అగ్ని దేవుడి ఆకలిని తీర్చేందుకు, ఆయన కోరికను నెరవేర్చేందుకు చేపట్టిన ఈ కార్యం యాదృచ్ఛిక ఘటన కాదు, దైవకల్పిత ఆదేశం. అరణ్యం నాశనమైనప్పటికీ, ఆ ప్రదేశంలో ‘మయ నగరం’ నిర్మితమైంది. దీనిని ఆధునిక విధ్వంస, పునర్నిర్మాణ సైకిల్ తోపోల్చవచ్చు. అంటే ఒక వినాశనం ఎప్పటికైనా మరొక నూతన సృష్టికి మార్గం సుగమం చేస్తుంది.

ఆధునిక అగ్ని ప్రమాదాలకు, ఖాండవ దహనానికి సారూప్యతలున్నాయి. కాలిఫోర్నియాలోని ఆధునిక అగ్ని ప్రమాదాలు సహజంగా లేదా మానవ అనాలోచన తప్పిదాలవల్ల సంభవించి విస్తృత స్థాయిలో నాశనానికి కారణమౌతాయి. ఖాండవ దహనంలో లాగా దేవతాప్రేరిత లేదా ప్రత్యేక ఉద్దేశాలు వీటికి నేపధ్యంలో లేకపోయినా, ఒకవేళ వున్నా తెలియక పోయినా, కొంతవరకు సామీప్య-సారూప్యతలు కనిపిస్తాయి. ఖాండవ దహనం లాగే, ఆధునిక అగ్ని ప్రమాదాలు అడవులను, వన్యప్రాణులను, మానవ నివాసాలను నాశనం చేయగల శక్తి కలవి. ఇరు సందర్భాల్లోనూ ప్రాణ నష్టం జరుగుతుంది. భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఖాండవ దహనం తర్వాత ‘మయనగరం’ నిర్మాణం జరిగినట్లే, ఆధునిక అగ్ని ప్రమాదాల తర్వాత పునరుద్ధరణ క్రమంలో కొత్త అభివృద్ధి, వన్యప్రాణుల పునరాగమనానికి అవకాశం ఉంటుంది. అయితే, దీర్ఘకాలంలో విలువైన మట్టిని కోల్పోవడం, జీవ వైవిధ్యం తగ్గిపోవడం వంటి సవాళ్లు ఏర్పడతాయి.

దావాగ్ని ప్రమాదాలపై ఆధ్యాత్మికత, యథార్థవాదం తెలుసుకోవడం అవశ్యం. మహాభారతంలోని ఖాండవ దహనం ఒక నైతిక, ధార్మిక యుద్ధంలో భాగంగా జరిగిందని చెబుతారు. కృష్ణుడు, అర్జునుడు దైవ సంకల్పాన్ని నెరవేర్చడంలో పాత్ర వహించారు. అయితే, ఆధునిక అగ్ని ప్రమాదాలు ప్రధానంగా మానవ తప్పిదాలు, సహజ కారణాల వల్ల ఏర్పడి, విపత్తు నిర్వహణ కోణంలో చూడబడతాయి. అగ్ని ప్రమాదాల తర్వాత పూర్తి పునరుద్ధరణ కోసం హిందూమత సంప్రదాయరీతిలో సంబంధిత దేవుళ్లను ప్రార్థించడం, పూజలు చేయడం సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరంగా ప్రజలకు మేలు కలిగించవచ్చు. హిందూమత గ్రంథాలలో సూచించిన విధంగా అగ్ని దేవునికి ప్రార్థనలు, మహా మృత్యుంజయ మంత్రం, దుర్గాదేవి, శివుని పూజలు జరిపించడం వల్ల రక్షణ, పునరుద్ధరణ సులభతరం కావచ్చని ఒక నమ్మకం. అది నమ్మేవారిమీద ఆధారపడి వుంటుంది. 

కానీ, దీర్ఘకాల పునరుద్ధరణకు ఆధ్యాత్మికతతో పాటు యథార్థవాద దృక్పథంతో విపత్తు నిర్వహణ చర్యలు సహితం అత్యంతమౌలికమైన అవసరం. ‘ఆధ్యాత్మిక స్థైర్యం, శాస్త్రీయ చర్యల’ సహజ సాంకేతిక, మానసిక కలయిక ద్వారా మాత్రమే బాధిత సమాజం పూర్తిగా కోలుకోవడమే కాక, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించగలాడం సాధ్యం. దావాగ్నులపై దీర్ఘకాలిక సమగ్ర పోరాటం చేయడం అంటే ఆధ్యాత్మిక మద్దతు, ప్రభుత్వ చర్యలు, సామాజిక భాగస్వామ్యం, పర్యావరణ స్థిరత్వాన్ని సమతుల్యంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయడమే!

లాస్ ఏంజెల్స్‌లోని పాలిసేడ్స్ అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ప్రధాన కారణం మానవ ప్రమేయం కావచ్చని అధికారులు చెపుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, యువతీ యువకులకు ఆహ్లాదం కలిగించే ‘స్కల్ రాక్’ అనే ప్రదేశం దగ్గరిలో మొదలైంది. ఈటన్ అగ్ని ప్రమాదానికి పవర్ లైన్లలోని లోపాలని మరో కథనం. ఖాండవ దహనం ఒక దివ్య సంకల్పంగా పరిణమిస్తే, ఆధునిక అగ్ని ప్రమాదాలు మానవ తప్పిదాలు, సహజ విపత్తుల రూపంలో సమాజాన్ని పరీక్షిస్తున్నాయి. ధైర్యం, సామూహిక ప్రేరణ, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ఇలాంటి విపత్తుల ను అధిగమించవచ్చు. అగ్ని నిర్ఘాతం భవిష్యత్తును మార్చినా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం మన చేతిలో ఉంది.

(యూఎస్ఏ మీడియా నివేదికలు, మహాభారతం ఆధారంగా)

Wednesday, January 22, 2025

కలిసి నిర్ణయం తీసుకున్నాక కప్పదాట్లు తగవు! ...... వనం జ్వాలా నరసింహారావు

 కలిసి నిర్ణయం తీసుకున్నాక కప్పదాట్లు తగవు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (23-01-2025)

{మంత్రిని మెప్పించడానికి సివిల్ సర్వెంట్లు చట్టపరమైన, విధివిధానాలకు భిన్నంగా అత్యుత్సాహం ప్రదర్శించి, మంత్రితో కలిసి నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఆ నిర్ణయం విషయంలో పదవి కోల్పోయిన మంత్రిని తప్పుబట్టడం సరైంది కాదు. ఒకసారి మంత్రితో కలిసి సివిల్ సర్వెంట్ నిర్ణయం తీసుకున్న తరువాత వారిద్దరూ తత్సంబంధమైన విషయంలో తప్పొప్పులకు పూర్తి బాధ్యత వహించాలి. తమ పాత్రను అంగీకరించాలి. అధికారి పూర్తిగా మంత్రిని తప్పు పట్టడం లేదా మంత్రి అధికారిని తప్పు పట్టడం సరైనది కాదు} – సంపాదకుడి వ్యాఖ్య  

‘ఫార్ములా-ఈ రేస్ కేసు’కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణ చేసిన  తెలంగాణ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ, ఈ అంశంలో మాజీ మంత్రి కేటీ రామారావు, సివిల్ సర్వెంట్ అర్వింద్ కుమార్‌ ల పై కేసు నమోదు చేసింది. సరైన విధివిధానాలను పాటించకుండా, రేసింగ్ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందనీ, ఆ వివరాలను ఏసీబీ దర్యాప్తులో అర్వింద్ కుమార్ బైటపెట్టారనీ, మీడియా వెల్లడించింది. అంతే కాకుండా, ‘మాజీ మంత్రి కేటీ రామారావు’ ప్రభుత్వ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా హెచ్‌ఎండీఏ నుంచి నిధులను విడుదల చేయమని తనను ఆదేశించినట్లు కూడా అర్వింద్ కుమార్ తెలిపారట. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక మంత్రి-సివిల్ సర్వెంట్ ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, ఆ నిర్ణయానికి తనవంతు బాధ్యతను సివిల్ సర్వెంట్ పూర్తిగా విస్మరించి, తనకు ఏమీ సంబంధం లేదని చెప్పడం అంటే  సివిల్ సర్వెంట్ తన ‘భుజాలపై వేసుకోవాల్సిన గురుతర బాధ్యతను’ విస్మరించాడనే అనుకోవాలి. ఇది సబబా, కాదా, అనే అంశం మీద కూలంకశంగా చర్చ జరగాల్సిన అవసరం వున్నది.

 ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన నిజానిజాల, వాస్తవాల, మంచి-చెడుల విషయానికి పోకుండా, ఇలాంటి సందర్భాలలో, సంబంధిత మంత్రి, ఉన్నత స్థాయి ప్రభుత్వ పదవిలో ఉన్న సివిల్ సర్వెంట్ (ఐఏస్ అధికారి) కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల నేపధ్యంలో, ఆ మంత్రులు కానీ, అఖిలభారత సర్వీసులకు చెందిన ఉన్నతాధికారులు (బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్లు) కానీ, లేదా ఇద్దరు ఉమ్మడిగాకానీ తీసుకునే పాలనాపరమైన ప్రతి ప్రభుత్వ నిర్ణయం, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సాక్ష్యాధారాలతో సహా ఇద్దరూ సమర్థించాలి, లేదా చేసిన తప్పు ఒప్పుకోవాలే కాని, ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా తమకు దాంతో సంబంధం లేదన్నట్లు బాధ్యాతారాహిత్యంగా మాట్లాడడం సరైనదికాదు. మంత్రి అధికారి మీదకానీ, అధికారి మంత్రి మీదకానీ బాధ్యత నెట్టివేయడం అనైతికం.  ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరమైనది కాదు. 

మంత్రులతో మాట్లాడే సందర్భంలో, ప్రతి చిన్న విషయంలో ‘అవును సార్’ అనే అలవాటు కొందరు ఐఏఎస్ అధికారులకు వుంటుంది. మంత్రితో అవసరం తీరిన తరువాత ఇలాంటివారు ‘బ్లేమ్ గేమ్’ ఆడడం మొదలుపెడతారు. తప్పంతా మంత్రిదేనని, తాము పరిశుభ్రంగా వున్నామని వాపోతారు. పాలనాపరమైన సద్బావనకు, బాధ్యత లేని దృక్పథానికి ఇది ఒక దుష్టసంకేతం. ఈ ప్రవర్తన సివిల్ సర్వీస్‌కు చెందిన ప్రాధమిక నీతిసూత్రాలకు దూరంకావడం, బాధ్యత విస్మరించడం, అవకాశవాదం అనే వాటిని ప్రతిబింబిస్తుంది. మంత్రి ఏదైనా నిర్ణయం తీసుకున్న సమయంలో, తామిస్తున్న సలహా చేదుమాత్రలాగా వున్నప్పటికీ, సరైన సలహా ఇవ్వడంలో సివిల్ సర్వెంట్ విఫలమై, ఆ తర్వాత మంత్రి తప్పు చేశారని నిందించడం తగనేతగదు. సమయ, సందర్భాలకు అనుగుణంగా ఉత్తమమైన, ఆచరణాత్మకమైన సలహాలు ఇవ్వడం కొందరు సివిల్ సర్వెంట్లకు చేతకాకపోవచ్చు. అయితే, అలా ఇవ్వడానికి ఏమాత్రం భయపడని పలువురు సివిల్ సర్వెంట్లు గతంలోనూ, ఇప్పటికీ ఉన్నారు. ఇక ముందూ వుంటారు. 

ఉదాహరణకు, పీవీ నరసింహారావు ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సమయంలో, అప్పుడు రాళ్లదాడులు జరుగుతున్న విజయవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, అక్కడ చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఆపర్యటనను విరమించుకోవాలని నాటి కలెక్టర్, ఎస్పీ సలహా ఇచ్చారు. కానీ, రాజకీయ పరిణామాల దృష్ట్యా పీవీ వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐసీఎస్ అధికారి, వల్లూరి కామేశ్వర (వీకే) రావు కూడా కలెక్టర్, ఎస్పీ సలహా వినడమే మంచిదని సూచించారు. కానీ పీవీ ‘మీరు నా క్రింద పనిచేసే ఉద్యోగి. దయచేసి నా ఆదేశాలను అమలుచేయండి. నేను వెళ్లడానికి ఏర్పాట్లు చేయండి’ అన్నారు. 

అలా అంటూనే ప్రయాణానికి సిద్ధమై వాహనం తయారుగా వుంచమని ఆదేశించారు. ఆశ్చర్యకరంగా, ప్రధాన కార్యదర్శి వీకే రావు డ్రైవర్ను కారు తీసుకురావద్దని ఆదేశించినట్లు పీవీకి తెలిసింది. అదేమని అడిగితే- ‘అవును సార్, నేను మీ కింద పనిచేసే ఉద్యోగినే. అలాగే,  డ్రైవర్ నా కింద పనిచేసే ఉద్యోగి. అతను నా ఆదేశాలను పాటిస్తాడు. అందుకే రాలేదు’ అని ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి సవినయంగా, నిశ్చయంగా తెలియచేశారు. పీవీ ఆ ప్రయాణాన్ని మానుకున్నారు. మరుసటి రోజు పీవీ వల్లూరిని ప్రశంసిస్తూ, ‘నేను నిన్న వెళ్ళి ఉంటే, ఉద్రిక్తతలు మరింత పెరిగేవి. మీరు నన్ను ఆపడం ద్వారా మంచి పని చేసారు’ అన్నారు. ఆదర్శప్రాయమైన సివిల్ సర్వెంట్ల నిబద్ధతకు, ముఖ్యమంత్రుల వినయానికి ఇది ప్రతీక అని ఈ విషయం నాతో చెప్పిన భండారు శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వీకే రావు 104 సంవత్సరాల వయసులో మరణించారు. 

అలాగే, నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, చిత్తూరు పర్యటనలో భాగంగా, అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఉండాలనుకున్న గదిని, ఇంచుమించు అదే సమయంలో రావాల్సిన మాజీ గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారికి కేటాయించడంతో, సంజీవరెడ్డిని వేరే గదిలో వుండమని  కలెక్టర్ బీకే రావు చెప్పారు. ఒకవేళ ఆ గదిలో వున్నప్పటికీ, రాజాజీ రాగానే, ప్రోటోకాల్ ప్రకారం, సీఎం ఖాళీ చేయాల్సి ఉంటుందని మర్యాదపూర్వకంగా చెప్పారు. ఆరోజు రాజాజీకి స్వాగతం చెప్పేందుకు కొంచెం ముందుగానే బీకే రావు ఎస్పీ గురునాథ రావుతో కలిసి అతిథి గృహానికి చేరుకున్నారు. పాత్రికేయుడు జీ కృష్ణ కథనం ప్రకారం - బీకే రావుతో ముఖ్యమంత్రి సంజీవరెడ్డి సరదాగా, ‘ఓహ్! నన్ను ఖాళీ చేయించడానికి మీరు పోలీసు అధికారితో వచ్చారా!’ అని అన్నారట. అందరూ నవ్వుకున్నారు. ముఖ్యమంత్రి తనకు కేటాయించిన గదికే మారిపోయారు. ఇది కలెక్టర్ సలహా ఇచ్చే విధానం, అది ముఖ్యమంత్రి దాన్ని స్వీకరించిన విధానం. బీకే రావు ఇటీవల 93 ఏళ్ల వయస్సులో మరణించారు.

ఎస్ఆర్ శంకరన్, భూ సంస్కరణలు, గిరిజన హక్కుల రక్షణను బలంగా సమర్థించడానికి, ఉద్దండ రాజకీయ నేతలతో, ప్రజాప్రతినిధులతో ఢీకొనాల్సి వచ్చింది. చివరకు ఆయన ఆలోచనలు విజయం సాధించి, రాష్ట్రంలోని గ్రామీణ అభివృద్ధికి పునాదిగా నిలిచాయి. టీఎన్ శేషన్, భారత ఎన్నికల ప్రక్రియను సంస్కరించడానికి రాజకీయ నాయకులను ధీటుగా ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో నిధుల దుర్వినియోగాలను తగ్గించడం, బల ప్రదర్శన, నల్లధన వినియోగాన్ని నిరోధించడం వంటి చర్యలతో ఆయన ఎన్నికల సంఘాన్ని బలపరిచారు, అయితే ఈ నిర్ణయాలు రాజకీయ నాయకుల వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. హర్యానాలో రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ మధ్య భూమి ఒప్పందాన్ని అశోక్ కేమ్కా ధైర్యంగా రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యమునా, హిండాన్ నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి దుర్గ శక్తి నాగపాల్, ధైర్యంగా, నిబద్ధతతో పనిచేశారు. ఆమె చర్యలు శక్తివంతమైన రాజకీయ సంబంధాలున్న తవ్వకాల మాఫియాను ప్రభావితం చేశాయి. కర్ణాటకలో భూముల కేటాయింపుల్లో, ఆక్రమణలలో అక్రమాలను రోహిణి సింధూరి బహిర్గతం చేశారు. ఆమె పట్టుదల ప్రజా భూముల పునరుద్ధరణకు, ప్రాజెక్ట్ సంస్కరణలకు దారి తీసింది. ఆమె పారదర్శకత ఆర్థిక బాధ్యతాత్మకతకు చిహ్నంగా నిలిచింది.

ఈ కొద్ది ఉదాహరణలు, కొందరు ఐఏస్ అధికారుల ధైర్యానికి, నిబద్ధతకు, పారదర్శకతకు, దూరదృష్టికి, నైతిక ప్రమాణాలను నిలబెట్టడానికి, ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనం. ‘దేశానికి ఉక్కు చట్రం’ అని వల్లభభాయ్ పటేల్ పేర్కొన్నట్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏస్), స్వతంత్ర్యానంతరం ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) స్థానంలోకి వచ్చింది. ఐఏస్ కి ఎంపిక కాబడ్డవారు వివిధ రంగాలలో, అద్భుతమైన ప్రతిభాశాలులుగా, సమాజంలోని ఇతరులకంటే అత్యంత విజ్ఞానవంతులుగా ఉంటారు. వీరి ఎంపిక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, వివిధ రకాల వడపోతల అనంతరం జరుగుతుంది. ఈ అధికారులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. సర్దార్ పటేల్ చెప్పినట్లు, ఐఏస్ అధికారులు తమ బాధ్యతలను నిర్వహించడంలో, కర్తవ్య నిర్వహణలో, అనుభవపూర్వకంగా సలహాలు, సూచనలు ఇవ్వడంలో, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దేశ భవిష్యత్తు వీరిపైనే ఆధారపడి ఉంటుంది. 

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత సివిల్ సర్వెంట్లపై వున్నది. ముఖ్యమంత్రి లేదా మంత్రి ఏపార్టీకి చెందిన వారైనప్పటికీ, వారి పట్ల వీరి పాలనాపరమైన దృక్పథం ఒకేరీతిలో వుండాలి. వారు తమ అనుభవానికి అనుగుణంగా, సాంప్రదాయ-చట్టబద్ధంగా ఏర్పాటైన విధి విధానాలకు కట్టుబడి సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి, లేదా ప్రధాన పంత్రికి, తగుసమయంలో విలువైన సూచనలు అందించాలి. సివిల్ సర్వెంట్ సరైన సందర్భంలో, సరైన సమాచారం అందించడంలో విఫలమైనా, లేదా తప్పు సలహా ఇచ్చినా, నిర్ణయ విధాన ప్రక్రియ తెలిసినా ఆ విషయం వివరించకపోయినా, మంత్రి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కలిగించినా, అది వారి బాధ్యతారాహిత్యాన్ని, పనితీరులో వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, సివిల్ సర్వెంట్ ఇచ్చిన సలహా ఆధారంగా (రాతపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి) మంత్రి తనదైన పద్ధతిలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, సివిల్ సర్వెంట్ దాన్ని అమలు చేయాలి. బాధ్యతను ఇరువురు సరిసమానంగా పంచుకోవాలి.  

మంత్రిని మెప్పించడానికి సివిల్ సర్వెంట్లు చట్టపరమైన, అనాదిగా వస్తున్న ఆచారాలకు, స్థాపిత విధివిధానాలకు భిన్నంగా, అత్యుత్సాహం ప్రదర్శించి, మంత్రితో కలిసి నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఆ నిర్ణయం విషయంలో పదవి కోల్పోయిన మంత్రిని తప్పుబట్టడం సరైంది కాదు. అలా చేస్తే, సివిల్ సర్వెంట్‌గా ఉండటం అర్ధరహితమవుతుంది. పాలనాపరమైన ప్రభుత్వ నిర్ణయాల విషయంలో, ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన విషయాలలో, ఒకసారి మంత్రితో కలిసి సివిల్ సర్వెంట్ నిర్ణయం తీసుకున్న తరువాత వారిద్దరూ తత్సంబంధమైన విషయంలో తప్పొప్పులకు పూర్తి బాధ్యత వహించాలి. తమ పాత్రను అంగీకరించాలి. అధికారి పూర్తిగా మంత్రిని తప్పు పట్టడం లేదా మంత్రి అధికారిని తప్పు పట్టడం సరైనది కాదు. తమతమ పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను నిబద్ధతతో అంగీకరించి, వాటిని తీసుకున్న నేపధ్యాన్ని సాక్ష్యాధారంగా సమర్థించే ధైర్యం అవసరం. ఆర్థిక లావాదేవీ చట్టబద్ధంగా జరిగినట్లయితే ఆ విధానాన్ని ఆత్మవిశ్వాసంతో తెలియజేయాలి. ఉమ్మడి బాధ్యత, పవిత్రమైనదిగా భావించాలి. సివిల్ సర్వెంట్లు బాధ్యతనుండి తప్పించుకోవడం నైతికతను దెబ్బతీస్తుంది. ‘ఉక్కు చట్రాన్ని’ బలహీనపరుస్తుంది.’

సివిల్ సర్వెంట్లు దేశ పాలనా వ్యవస్థకు మౌలిక స్థంభాలు. వారు నైతికత, నిబద్ధత, ప్రజా సేవకు అంకితమవుతేనే పాలనకు మంచి రూపం వస్తుంది. సివిల్ సర్వెంట్ల లక్ష్యం ప్రజల మేలు కోసం పనిచేయడం మాత్రమే కాక, పరిపాలనా వ్యవస్థలో పారదర్శకతను, విశ్వసనీయతను, సమర్థతను ప్రోత్సహించడంగా ఉండాలి. ప్రజాస్వామ్యానికి వీరి ఉక్కు చట్రం ఎంత బలంగా ఉంటే, ప్రజల విశ్వాసం అంత దృఢంగా నిలుస్తుంది. వీరి ప్రతి నిర్ణయం, ప్రతి చర్య, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి, వీరు తమ శక్తితో, నిబద్ధతతో, సత్యనిష్టతో పని చేస్తూ, సమాజాన్ని ముందుకు నడిపించే మార్గదర్శకులు కావాలి. నిజాయితీతో వీరు వేసే ప్రతి అడుగు ప్రజాస్వామ్యానికి శాశ్వతమైన బలం చేకూరుస్తుంది.

మంత్రిది తుది నిర్ణయం కావచ్చు, కానీ సివిల్ సర్వెంట్ మంత్రికి ఇచ్చిన తన సలహాను, మంత్రి స్పందనను, దరిమిలా ఇచ్చిన ఆదేశాలను, ఆ నిర్ణయం అమలుకు ముందు రికార్డు చేయాలి. ఇది సివిల్ సర్వెంట్ ప్రత్యేక బాధ్యత. సివిల్ సర్వెంట్లు తమ విధుల పరిధిలో నిజాయితీగా, వృత్తిపరంగా అభిప్రాయాలను వ్యక్తపరచాలి. సివిల్ సర్వెంట్లు ‘ఉమ్మడి బాధ్యతల విషయంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా సలహా’’ ఇచ్చి, తప్పును తప్పని, ఒప్పును ఒప్పని స్పష్టంగా సంబంధిత మంత్రికి తెలియచెప్పి, భారత ప్రజాస్వామ్యంలోని ఐఏస్ అనే ‘స్టీల్ ఫ్రేమ్‌’ (ఉక్కు చట్రం) సమర్ధవంతంగా పనిచేయడానికి తోడ్పడాలి. వారు విఫలమైతే, ప్రజలకు ‘ప్రభుత్వ పాలనపై నమ్మకం’ సన్నగిల్లుతుంది.