Saturday, November 26, 2016

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-7 : వనం జ్వాలా నరసింహారావు

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-7
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (27-11-2016)

అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, వేడుకను జరిపిస్తుండవచ్చు.

అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు.


అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.


హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది

Fidel Castro…Cuba Revolutionary Leader : Vanam Jwala Narasimha Rao

Fidel Castro…
Cuba Revolutionary Leader
Vanam Jwala Narasimha Rao

Fidel Castro, Cuba’s revolutionary leader, died at the age of 90 bringing an end to an epoch-making era for the country, Latin America and world. People all over the world who loved and adored him in several ways particularly in India mourn his death as the world has lost a revolutionary, a communist and a leader who pioneered many movements. Castro held power longer than any national leader other than Queen Elizabeth. His personal control over a Communist revolution made him perhaps the most important leader in Latin America since its 19th century wars of independence.

 Love him or hate him, most Cubans will not be able to conceive of life without Fidel. Though he stepped down from power, he continued to pull the strings behind closed doors. Fidel, the ideologue, quietly opposed anything that looked like a weakening of Cuba's socialist system almost until his death.

Fidel Castro, born in Cuba on August 13, 1926 was a rebellious boy and at the age of thirteen helped to organize a strike of sugar workers on his own father's plantation. After he had finished his education Castro became a lawyer in Havana. His experience as a lawyer made him extremely critical of the great inequalities in wealth that existed in Cuba. In 1947 at the age of 21, Castro joined the Cuban People's Party. In 1952 Fidel Castro became a candidate for Congress for the Cuban People's Party. When the party was all set to win the election General Fulgencio Batista, who was in power then, with the support of the armed forces, took control of the country.

Castro came to the conclusion that revolution was the only way that the Cuban People's Party would gain power. In 1953, Castro, with an armed group of 123 men and women, attacked the Moncada Army Barracks. The plan to overthrow Batista ended in disaster. He was jailed and was released after two years. He then left for Mexico where he began to plan another attempt to overthrow the Cuban government.

Castro, Chi Guevara, Juan Almeida, and eighty other rebels arrived in Cuba in 1956. This group became known as the July 26 Movement (the date that Castro had attacked the Moncada barracks). For the next few months Castro's guerrilla army raided isolated army garrisons and were gradually able to build-up their stock of weapons. Castro's guerrillas were able to inflict defeat after defeat on the government's troops.

The United States supplied Batista with planes, ships and tanks, but the advantage of using the latest technology such as napalm failed to win them victory against the guerrillas. Castro was now confident that he could beat Batista in a head-on battle and began marching to the main towns. After consultations with the United States government, Batista decided to flee Cuba. Castro marched into Havana on January 9, 1959, and became Cuba's new leader.

A day before Castro in his early 30s entered Havana the jubilant capital city, Washington was one of the first nations to formally recognize the new rebel government, stating that it "appears free from Communist taint," and "intends to pursue friendly relations with the United States." However, when he confiscated land and property owned by Americans, public opinion in the United States turned sharply against him.

President Dwight Eisenhower attempted to punish Castro and in the process Castro became closer to the Soviet Union. In 1961 Eisenhower retired and the problem of dealing with Castro was passed on to the new president, John F. Kennedy. At one point of time the Cuban Missile Crisis that was the first and only nuclear confrontation between the United States and the Soviet Union appeared like leading to a world war. The event appeared to frighten both sides and it marked a change in the development of the Cold War. Castro remained dependent on the support of the Soviet Union. Nikita Khrushchev was ousted from power on 15th October, 1964, but his successors, including Leonid Brezhnev, Yuri Andropov, Konstantin Cherenkov and Mikhail Gorbachev provided aid to his government. However, after the fall of communism in the Soviet Union in 1989 this economic help came to an end.


Thus the relations between the U.S. and Cuba were always strained. Castro had proven to be a master of imagery, a complex strategist who managed to turn U.S. attempts against him and his country to his own advantage again and again. Presidents Ford, Carter and Clinton all thought they would be able to get through to Castro, and took steps to ease relations while opening a window for discussions. In each case, Castro responded aggressively.  Castro embraced Communism and rabid anti-Americanism, and used both to hold onto power. He saw himself as Cuba's messiah, and he governed with an ideological fervor that bordered on self-destructive. Fidel Castro had many supporters both at home and in the United States.

On 31st July, 2006, Fidel Castro transferred his political responsibilities to his younger brother Rahul Castro. On 19th February, 2008, Fidel Castro announced he would neither seek nor accept a new term as either president or commander-in-chief of Cuba.

Fidel Castro and India had a special relationship. When once Castro was denied stay in New York five star hotels when he attended UN General Assembly at the age of just 34 years, the owner of Theresa Hotel, came and invited him and his delegation to stay there. The first person who came to see Castro then was Indian Prime Minister Nehru. The friendship that was first established with Nehru was later on developed with his daughter, Indira Gandhi, for whom the Cubans, particularly Fidel, had great affection. Whenever this bond of friendship is highlighted, the unforgettable image that comes to everybody’s mind is that of Fidel embracing Indira Gandhi while handing over the NAM chairmanship to her in 1983.

Another landmark of those friendly ties happened in August 1985, when Prime Minister Rajiv Gandhi visited Cuba accompanied by Sonia Gandhi and held extensive discussions with Fidel Castro, who was so gladly impressed that he organized a farewell for Rajiv Gandhi by half a million people until he reached the plane.

Again, another non-aligned summit took one statesman to the other nation. This time it was Prime Minister Manmohan Singh who attended the XIV NAM Summit in Havana. Although Fidel was recovering from a difficult surgery and could not attend the proceedings, he did have time for India, and spent time with Manmohan Singh. After 40 minutes of discussions, Fidel requested him to have a photograph taken, “so that one billion people would see them together”.


In multilateral fora, India and Cuba have been stalwarts of the Third World and have played leading roles in NAM, a vision that is still nurtured by both nations. Cuba was one of the first countries to extend open support to the right of India to be a permanent member of the Security Council, which was announced by Fidel Castro at the Earth Summit of 1992. Both countries maintain that their friendship will stand any challenge regardless of changing circumstances in the present world. End

Tuesday, November 22, 2016

సముద్రాన్ని లంఘించి లంక చేరిన హనుమ .... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 20 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

సముద్రాన్ని లంఘించి లంక చేరిన హనుమ
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
20 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (21-11-2016)

          ఆంధ్ర వాల్మీకి రామాయణంలో అందమైన కాండ "సుందర కాండ". ఆద్యంతాలు హనుమంతుడు ఆచార్యుడుగా దర్శనమిచ్చే అద్భుతమైన "సుందర కాండ"లో, మంత్ర పూతమైన రస సౌందర్యం, ఉద్యానవన సౌందర్యం, లంకా నగర సౌందర్యం, కామినీ-భోగినీ జన సౌందర్యం, వీర సౌందర్యం, హనుమ సాధనా సౌందర్యం, కవితా శిల్ప సౌందర్యం రాశీ భూతమైంది. సీతా దేవిని వెతుక్కుంటూ కిష్కింధ చేరిన శ్రీరాముడు వాలిని చంపి, సుగ్రీవుడిని వానర రాజ్యానికి రాజును చేశాడు. బదులుగా సీతా దేవిని వెతికించి పెట్తానని సుగ్రీవుడు వాగ్దానం చేసి వానరులను నలు దిక్కులకు పంపాడు. ఆ తర్వాత కథే సుందర కాండ. ఈ కాండలోని వృత్తాంతమంతా కేవలం ఒకటిన్నర రోజుల్లోనే జరిగింది.

          నలు దిక్కులకూ పోయిన వానర బృందంలో ఒకటి, అంగదుడి నేతృత్వంలో, దక్షిణ దిక్కుకు పోయింది. జాంబవంతుడి ప్రేరణతో, మహేంద్ర పర్వతాన్ని ఎక్కి, అక్కడినుంచి, లంకకు వెళ్లాలన్న సంకల్పంతో సిద్ధపడ్డ హనుమంతుడి ఉత్సాహంతో మొదలవుతుందీ కాండ. హనుమంతుడి విక్రమానికి చీకాకు పడుతుంది మహేంద్రాది. ఆకాశానికి ఎగిరి కపుల వద్ద శెలవు తీసుకుంటాడు హనుమంతుడు. మైనాకుడికి సర్ది చెప్పి ముందుకు సాగుతున్న తనను అడ్డుకున్న సురస నోట్లో దూరి బయటపడ్తాడు హనుమంతుడు. సింహికను వధించాడు. లంకా తీరాన్ని చూసిన హనుమంతుడికి అమితమైన ఉత్సాహం కలిగింది. ఆ సందర్భంలో, హనుమంతుడి ఉత్సాహాన్ని తెలిపేందుకు, వాసు దాసు గారు ఒక పద్యాన్ని "ఉత్సాహం" వృత్తంలోను, రామ కార్యార్థియై సముద్ర లంఘనం చేస్తున్నందున, ఆ మహానుభావుడికి పంచ చామర సేవ చేసేందుకు "పంచ చామరం" వృత్తంలో మరో పద్యాన్ని రాశారీవిధంగా.

ఉత్సాహము:           చారువివిధరూపధారి సాగరప్రతీరము౯(న్)
                        జేరి దుర్జయుండు పూల నైజరూపుఁ గార్యము౯(న్)
                        సారె దలఁ చి తనదురూపుఁ జక్కఁ జూచి కేత కే
                        లారుహాళి సొంపు నింపు లంబభూధరంబున౯(న్) -82

పంచచామరము:      సుకూటవాటికాగ్రసీమ జూచి దూఁ కి యొడ్డున౯(న్)
                        ద్రికూటభూధరాగ్రసీమ దేవతాధి రాట్పురీ
                        నికాశమైన లంకను౯(న్) వ నీసమూహరాజి పా
                        వకాత్మ మిత్రపుత్రుఁ డప్డు పారఁ జూచెఁ జక్కఁ గ౯(న్) -83

తాత్పర్యం:    
మనోహరమైన అనేక రూపాలను ధరించగలిగే హనుమంతుడు సముద్రం ఆవలి ఒడ్డును చూశాడు. మంచి శిఖర ప్రదేశాల కొనను చూసిన హనుమంతుడు, ఒడ్డుకు దూకి, త్రికూట పర్వత కొనలో, దేవేంద్రుడి పట్టణంతో సరితూగుతూ - వన సమూహాలతో ప్రకాశిస్తున్న లంకా నగరాన్ని తేరిపార చూశాడు.

ఛందస్సు:      ఉత్సాహం వృత్తానికి ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి. పంచ చామరం వృత్తానికి  "జ" "ర" "జ" "ర" "జ" "జ" "గ" గణాలు, తొమ్మిదింట యతి వుంటాయి.


హనుమంతుడు లంకా పురి వెలుపల వున్న ఉద్యానవనంలో విహరించాడు కొంత సేపు. లంకను పరికించి చూశాడు. చూసి, దాని అందానికి నివ్వెర పోయాడు. లంకలోకి ప్రవేశించే ఉపాయాన్ని ఆలోచించాడు. దుర్భేద్యమై, ప్రవేశించనలవి కాని లంకా నగరాన్ని మరికొంత సేపు రెప్ప వాల్చకుండా చూశాడు. చీకటి పడే వరకు అక్కడే దాక్కొని, తర్వాత చిన్న ఆకారంలో, లంకలో దూరాలను కుంటాడు. సూర్యాస్తమయం కాగానే చిన్న పిల్లి ఆకారంతో, కొండ దిగకుండానే, ఒకే ఒక్క గంతుతో, లంకలో ప్రవేశించాడు హనుమంతుడు. తక్షణమే, లంకా పురి అద్భుతానికి మరో సారి ఆశ్చర్య పడతాడు. నాటి రాత్రి, ఫాల్గుణ శుద్ధ త్రయోదశీ తిథిన, చుక్కల నడుమనున్న చంద్రుడిని చూసినప్పుడు, హనుమంతుడికి కలిగిన సంతోషాన్ని, కవి తరలము వృత్తంలో వర్ణించారీ విధంగా: (ఆశ్వయుజ శుద్ధ త్రయోదశీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో, "నిర్మలంగా కనిపించిన చంద్రబింబాన్ని, శుభ్రంగా వున్న వెన్నెల" ను చూస్తూ ఈ వ్యాఖ్య రాశారు వాసు దాసు గారు)

తరలము:      జలజకాంతియుఁ బాలడాలు బి సంబుడంబును నింబుగాఁ
                గలికిరూపునఁ గాన వచ్చి ప్ర కాశమానుఁ డు నౌశశి౯(న్)
                వలిముఖాగ్రణి సారసాకర వారిఁ గ్రీడఁ జరించునా
                జలజసంభవు తేజి యట్టులు సంతసంబునఁ గన్గొనె౯(న్) -84
తాత్పర్యం:     శంఖం, పాలు, తామరతూడుల మాదిరి తెల్లటి కాంతితో, మనోహర రూపంతో కనిపిస్తూ ప్రకాశిస్తున్న చంద్రుడిని, తామర కొలనులోని నీటిలో క్రీడించే హంసలాగా సంతోషంతో చూశాడు హనుమంతుడు.
ఛందస్సు:      తరలము నకు "న" "భ" "ర" "స" "జ" "జ" "గ" గణాలు. పన్నెండో ఇంట యతి.


ప్రాకారం చేరి తిరిగి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. వానర సైన్యం లంకలోకెలా రాగలదని యోచించాడు. రామ లక్ష్మణుల బల పరాక్రమాలను బేరీజు వేసుకుని, ధైర్యం తెచ్చుకుంటాడు. లంకా నగరంలో ప్రవేశిస్తున్న హనుమంతుడిని అడ్డుకున్న లంకాధి దేవత లంకిణిని, తన ఎడమ చేతి పిడికిలితో పొడిచాడు హనుమంతుడు. తనను రక్షించమని వేడుకున్న లంకిణి, లంకా నాశనానికి సమయం వచ్చిందని అంటుంది. లంకలో తిరగమంటుంది. 

Saturday, November 19, 2016

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-6 : వనం జ్వాలా నరసింహారావు

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-6
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (20-11-2016)

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, " చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది.

వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి.

సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక.


ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు.


భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది

Monday, November 14, 2016

Brahman Welfare is Bliss to Supreme Being : Vanam Jwala Narasimha Rao

Brahman Welfare is Bliss to Supreme Being
Vanam Jwala Narasimha Rao

The first ever Brahman Welfare meeting anywhere in the country chaired by a Chief Minister of the state and attended by more than 80 from a cross section of the community was held on Sunday the 26th of October in Hyderabad. Chief Minister K Chandrasekhar Rao spoke eloquently on various hardships, issues and problems faced by Brahman Community. In this context, KCR suggested that a well conceived strategy and comprehensive plan of action should be evolved for the overall well being of Brahmins in Telangana State. To begin with, CM suggested that a building complex to be known as Brahman Sadan with all facilities would be built in Hyderabad by Government. A Board of Trustees will oversee the administration and management of the complex. All the traditional ceremonies, celebrations and other community activities of the Brahmans should be held under one roof, suggested CM.

The meeting observed that Brahmans primarily are engaged in the service to humanity, from helping the individuals to get over their day-to-day obstacles through offering Vedic remedies and performing rituals and ceremonies from birth to death. They have been also rendering help to spread the ancient wisdom, spiritual teachings and imparting Vedic knowledge.

During the discussion, several interesting points emerged about the origin of the Brahminical traditions from the beginning of the civilization. It was pointed out that there is an underlying relationship between Srushti-the Creation of universe and Brahmans. Telangana State Vigilance Commissioner K R Nandan who participated in the meeting, made several interesting observations which gives a clue about the genesis, origins, need, evolution and ever-changing role and status of Brahman community.

If we analyze the invasions that took place thousands of years ago all over the World, we will come to know that the Invaders not only looted the natives but also replaced the existing native culture, religion, traditions and customs with that of the Invaders’. For instance, Persia (now Iran), Turkey, Egypt which were non-Islamic countries have become Islamic after the invasions. Historically, it took them little time for the Invaders to change the culture, religion and customs of these countries. Persia (Iran) where people used to worship the Fire God (Zoroastrians) was turned into an Islamic country within two decades and so also Turkey and Egypt.

But, as far as India was concerned, despite the rule by Moguls for over 800 years and the British Colonial rule of about 200 years, none could dare change the religion, culture, traditions, Santhana Dharma till date. The entire credit for protecting, preserving and defending the Santhana Hindu Dharma, its traditions and customs goes entirely to the Brahman community who could withstand the might of the invaders! More over our Santhana Hindu Dharma is all-encompassing inclusive in its nature and that of the invaders was restricted exclusive one!

Thus the Indic culture has been passed on by Brahmans to the generations after generation to come. Our ancient culture and wisdom have given equal importance to the values, ethics, and organized life not only to the individuals but also to the entire society, where as other religions like the Christian, Islam as well as political philosophies like Communism was either Individual centric or Society centric but not both. Our tradition, culture and value system are all aimed at universal welfare. Ancient Great Rishis enabled the Brahmans in acquiring this knowledge of the ancient wisdom and to keep it under their protection. These Great Rishis were called “Karya Brahmas”. The four headed-faced Brahma is also known as “Karana Brahma” (Brahma of Reason) created and appointed Karya Brahmas. He made the blue print of the creation and the Karya Brahmas-the Rishis were given the task of implementing it. The God Almighty-the Supreme Being or the Lord Vishnu is known as Karana-Karana Brahma who is all in all.

The Rishis living in Tapolokams just below the Trimurthy mandals in the Universe were created by the Brahma even before the Devatas. One of the Karya Brahms is Maricha and he had a son called Kashyap Rishi. His children are Devas-Gods and Asuras-demons. The children of Rishi Kashyap and one wife Diti are called Devatas and the children of Rishi Kashyap with his another wife Aditi are called Asuras. Rishi Kashyap was appointed as Prajapati and it was he who created the earth. Hence it was called Kasyapi, daughter of Rishi Kashyap. After the Earth, Rishi Kashyap created people. On the instructions of The Supreme Being Rishis living in Tapolokams were asked to take birth on the Earth to guide people to live in a righteous way. They were told to teach the human beings about the Atman, Jeevatma, and Paramatma, the importance of the human form, Creation, the essence of life and the cycle of existence. Accordingly, the Rishis took birth here, married human beings, gave birth to children and completed their tasks and then left for the Tapolokams-the original abode of them.

The Rishis, while on earth, did penance and established the culture and traditions, which are called Rishi Proktam or the Arsha Samskruthi. They have also left behind a rich wisdom through the literary wealth preserved in several scriptures, traditions and customs. The Rishis passed on their knowledge, wisdom to Brahmans to protect, preserve, defend and propagate to generations after generations to come by. Thus the descents of these great Rishis are the Brahmans in this land. The Brahmans as teachers, Gurus, Purohits are acting as the guardians of the ancient wisdom and transmitting it through the ages till date.

The life of a Brahman is full of sacrifices and selfless in all aspects. Take for instance the life of Sage Agatsya. He had sacrificed his entire Tapo Shakhty that he had accumulated for over hundreds of years to eradicate famine from a kingdom! Having offered his entire Tapo Shakhty, Sage Agatsya went back to forest to start his Tapas right from the scratch! The same sage Agatsya for his own daughter’s marriage did not use his Tapo Shakhty to get the expenses covered. He went on begging to collect money for his daughter’s marriage. This is called “Voluntary Poverty”. This is what Brahmans of all the ages have been doing till date.

Leading a life with voluntary poverty, a Brahman would never sell his knowledge. He would lead an austere life often end up in begging. Saint-Composer Tyaga Raja did the same two hundred years ago while rejecting riches from the King. The Brahmans are expected to lead the society in a selfless manner without expecting anything.

The imitative taken by CM KCR had brought to light the true essence of Brahmans existence and the need of the society to preserve and protect them for the larger interest of the society in general, country in particular. The meeting chaired by him paves way for their welfare and for drawing a strategy for it. It also leads to encouragement to Vedic studies, financial assistance to spiritual thinkers, provision for education, health, skill development, encouragement to entrepreneurs etc. The Complex that is being planned in Hyderabad will be a platform for development of Brahman community and provides for a traditional accommodation to Peetaadhipathis and scholars coming from outside. This is in way an all-round development plan of the Brahman community.

Welfare of this nature of Brahmans will be bliss to the Supreme Being.


(M) 8008137012….jwala99@gmail.com